Political News

జగన్ తప్పు చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్లే ఉంది. ఉద్యోగులతో అనవసరంగా గోక్కుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందంటే అందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. అలాంటి ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం కోరి ఎందుకని గోక్కుంటున్నదో అర్థం కావటంలేదు. బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నట్లు నోటీసిచ్చారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ల సాధనకై తాము సమ్మె చేయాలని డిసైడ్ అయినట్లు ఉద్యోగ సంఘాల …

Read More »

మెల్లిగా దిగొస్తున్న మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెల్లి మెల్లిగా దిగొస్తున్నారు. గడచిన ఏడాదిగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న రైతుల డిమాండ్లకు మోడి తలొంచుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో ఉద్యమం ప్రారంభమైంది. ముందు పంజాబ్ లో మొదలైన ఆందోళన తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత …

Read More »

భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వంశీ

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. గతంలో భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వంశీ ప్రకటించారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, పొరపాటున ఓ మాట దొర్లానని తెలిపారు. అలా మాట్లాడటం తప్పేనని, భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. తనకు అందరికన్నా ఎక్కువ పరిచయం భువనేశ్వరితో ఉందని పేర్కొన్నారు. …

Read More »

నోటి దురుసుతో ఆ మంత్రి అడ్డంగా బుక్క‌య్యాడే!

అధికారంలో ఉన్న‌వారికి ఉండ‌కూడంది ఏదైనా ఉంటే.. అది నోటి దురుసే!  కానీ. ఏపీలోని వైసీపీ మంత్రుల‌కు ఉన్న‌దే అది! అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఎవ‌రిని క‌దిలించినా….వైసీపీ నేతల నోటి దురుసు కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాళ్లే.. సోష‌ల్ మీడియాకు అడ్డంగా దొరికిపోతున్నారు. స‌ద‌రు మంత్రుల నోటి దురుసును బాగానే ఎండ‌గ‌డుతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఏపీకి జీవ నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో.. వైసీపీ ప్ర‌భుత్వం రాగానే.. …

Read More »

ఆ వ్యాఖ్యలకు వంశీ కౌంటర్…చంద్రబాబుపై షాకింగ్ కామెంట్లు

మంత్రి కొడాలి నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీల‌పై ఖ‌మ్మం జిల్లా మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌, టీఆర్ఎస్ నేత మ‌ల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొడాలి నాని, వంశీలను చంపితే 50 ల‌క్ష‌ల రూపాయ‌ల నజరానా ఇస్తాన‌ని వాసు చేసిన ప్రకటన పెను దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. కొడాలి నానిని, తనను కమ్మ సామాజిక …

Read More »

కొడాలి, వంశీలను చంపండి.. 50 ల‌క్ష‌లిస్తా: తెలంగాణ నేత వ్యాఖ్య‌లు

ఏపీకి చెందిన వైసీపీ నాయ‌కులు, కీల‌క మంత్రి కొడాలి నాని, కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భనేని వంశీల‌ను చంపితే.. 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాన‌ని తెలంగాణ‌కు చెందిన కీల‌క నేత ఒక‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌మ్మం జిల్లా మ‌ధిర మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఉన్న మ‌ల్లాది వాసు.. చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్ప‌దంగా మారాయి. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై మంత్రి కొడాలి, ఎమ్మెల్యే వంశీలు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు …

Read More »

ఓటీఎస్…రూ.4800 కోట్లకు జగన్ స్కెచ్ వేశారంటోన్న టీడీపీ నేత

ఏపీలో ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 1983-2011 మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వ హౌసింగ్‌ కార్పొరేషన్ ద్వారా ఇళ్లు నిర్మించుకొని బకాయి ఉన్నవారిని ప్రబుత్వం గుర్తించింది. వారంతా వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) ద్వారా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. కానీ, తమ ఇళ్లకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పట్టాలున్నాయని, మరోసారి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ …

Read More »

ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట

ఏపీ ఆర్థిక స్థితి నానాటికి దిగజారిపోతోందని, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ కావడంతో ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం నానా తిప్పలు పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, లేటైనా సరే జీతాలిస్తున్నాం కదా అంటూ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వంపై …

Read More »

కేసీఆర్ సవాలుకు ఓకే చెప్పి.. భలే కండీషన్ పెట్టిన కిషన్ రెడ్డి

సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆవేశంతో మాట్లాడారో తెలిసిందే. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాటల మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ.. బూతులు తిట్టేస్తే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి తనతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన సవాలుకు …

Read More »

మెడపై కత్తిపెడితే నీ సీఎం పదవి, ఫాంహౌస్‌ రాసిస్తవా?

మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ధాన్యం కొనుగోలు విషయం మీద గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రంపై పెద్ద ఎత్తున విరుచుకుపడటం తెలిసిందే. తమ మెడపై కత్తి పెట్టి రాయించుకున్నారంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సూటి ప్రశ్నతో కేసీఆర్ మాటల్లోని డొల్లతనాన్ని తేల్చేశారు. మెడపై కత్తి పెట్టి రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారన్న …

Read More »

6 నెల్ల‌ల్లో కొత్త జిల్లాలే టార్గెట్‌.. జ‌గ‌న్ వ్యూహం ఇదేనా..?

రాజ‌కీయాల్లో ఏం చేసినా.. వ్యూహాలు లేకుండా ఎవ‌రూ అడుగులు వేయ‌రు. ఇప్పుడు.. కూడా అధికార పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి. ఖ‌చ్చితంగా.. జిల్లాల ఏర్పాటును చేప‌ట్టాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేశారు. అదేస‌మ‌యంలో వేల కోట్ల రూపాయ‌లు.. ప్ర‌జ‌ల‌కు ఆయా కార్య‌క్ర‌మాల కింద పంచారు. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డో తేడా కొడుతున్న ప‌రిస్థితి …

Read More »

వాన‌దేవుడిదే త‌ప్పు.. ఆయ‌న‌పైనే కేసుపెట్టాలి: ఏపీ మంత్రి

ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి? అంటే.. ఠ‌క్కున చెప్పే స‌మాధానం.. మ‌హా ద‌రిద్రంగా ఉన్నాయ‌నే. ఎక్క‌డ ఏమూల‌కు వెళ్లినా.. ఏ చిన్న రోడ్డునుచూసినా.. గుంత‌లు ప‌డి క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌ధాన రోడ్ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప్ర‌భుత్వం ఆయా రోడ్ల‌ను ప‌ట్టించుకుని.. బాగు చేయాల్సిన అవ‌స‌రం ఉన్నా.. నిధులు లేక‌.. ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క ఆపశోపాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో …

Read More »