Political News

అరెస్టుకు ముందు వీడియో.. పట్టాభి తెలివే తెలివి

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వ్య‌క్తి.. తెలుగుదేశం నేత ప‌ట్టాభిరామ్. ఆంధ్రా ప్రాంతంలో గంజాయి స్మ‌గ్లింగ్‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేస్తూ ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేప‌డం.. ప్ర‌తిగా మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు చోట్ల వైసీపీ వ‌ర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల మీద‌.. అలాగే పట్టాభిరామ్ ఇంటి మీద తీవ్ర స్థాయిలో దాడికి పాల్ప‌డటం.. దీనిపై జాతీయ …

Read More »

చంద్ర‌బాబుకు కూడా పోలీసుల సెగ‌..

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కూడా పోలీసుల నుంచి షాకులు త‌ప్ప‌లేదు. టీడీ పీ నాయ‌కుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకుంటున్న పోలీసులు.. ఏకంగా.. చంద్ర‌బాబును కూడా ముప్పుతిప్ప‌లు పెట్టారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. చంద్ర‌బా బు.. గురువారం ఉద‌యం 8గంట‌ల నుంచి శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలి సిందే. ఈ క్ర‌మంలో త‌న …

Read More »

స‌ర్వే ఫ‌లితం.. ఊహించిందేనా? వైసీపీలో గుస‌గుస‌!

ఇండో ఏషియ‌న్ న్యూస్ స‌ర్వీస్‌(ఐఏఎన్ ఎస్‌) సీ-ఓట‌ర్ స‌ర్వే తాజాగా వెలువ‌రించిన నివేదిక‌పై వైసీపీలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఫ‌లితాన్ని కొన్నాళ్లుగా అంద‌రూ ఊహించిందే కావ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగాలేద‌ని..వారు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌ని వాద‌న వినిపిస్తోంది. అయితే.. త‌మ‌కు అస‌లు చేసేందుకు ఏమీ లేద‌ని..ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే తాజాగా సీ ఓట‌రు స‌ర్వే ఫ‌లితాలు రావ‌డం.. వైసీపీలో …

Read More »

లోకేష్ ప్రెస్ మీట్ – నోట్ దిస్ పాయింట్ డియర్ ఏపీ !

ఇమేజ్ డ్యామేజ్ చేసే విషయంలో వైసీపీ నేతల తర్వాతే ఎవరైనా అన్న మాట తరచూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. వారు టార్గెట్ చేసిన వారు ఎవరైనా సరే.. వారు కోరుకున్న ఇమేజ్ ను తీసుకురావటంలో అదే పనిగా విజయవంతం అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దూకుడుగా వెళ్లటం.. కింద పడినా పైచేయి తమదేనని బలంగా వాదించటం లాంటివి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అలాంటివి తమలో లేకపోవటాన్ని టీడీపీ జాతీయ ప్రధాన …

Read More »

ఏది విమ‌ర్శ‌-ఏది వివాదం.. పార్టీలు నేర్పుతున్న పాఠం ఏంటి?

ఏపీలో రెండు ప్ర‌ధాన పార్టీలు.. నేర్పుతున్న పాఠం ఏంటి? అస‌లు రాష్ట్రంలో ఏం జ‌రుగుతోంది? అయిన దానికీ .. కానిదానికీ కాలు దువ్వ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం.. రాజ‌కీయంగా చూసుకోవాల్సిన వివాదాల‌ను రాళ్ల దాడుల వ‌ర‌కు తెచ్చుకోవ‌డం ఎందుకు? ఇవీ.. ఏపీ గురించి.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు. రాజ‌కీయాల్లో ఉన్నవారు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోవ‌డం.. ఒక పార్టీ విధానాల‌ను మ‌రో పార్టీ త‌ప్పుబ‌ట్ట‌డం.. అదికారంలో ఉన్న పార్టీ తీసుకునే నిర్ణ‌యాలు …

Read More »

కాశ్మీర్ లోయ: రూటు మార్చిన తీవ్రవాదులు

అవును భూతల స్వర్గంగా పేరున్న జమ్మూ-కాశ్మీర్ లో తీవ్రవాదులు రూటు మార్చారు. మొన్నటి వరకు సైనికులు, సైనిక పోస్టులే టార్గెట్ గా కాల్పులు జరపడం, బాంబు దాడులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి దాడుల వల్ల సైనికులు, స్థానికులు వెంటనే అప్రమత్తమవైపోతున్నారు. దాంతో తీవ్రవాదులు కూడా సైన్యం నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సొస్తోంది. ఫలితంగా తీవ్రవాదులు కూడా చనిపోతున్నారు. అందుకనే తమ రూటు మార్చుకోవాలని తీవ్రవాదులు డిసైడ్ అయ్యారు. …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ళ్లీ రేగిన మంట‌లు.. దీక్ష‌ల‌కు రెడీ!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య రేగిన వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు వ్యాఖ్య‌లు చేసుకోవ‌డంతోపాటు.. పోటా పోటీ కార్య‌క్ర‌మాలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌దానా కార్యాల‌యంపై జ‌రిగిన దాడి ద‌రిమిలా.. చోటు చేసుకున్న ప‌రిణామాల్లో ఇటు టీడీపీ నాయ‌కులు.. అటు వైసీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు కొన‌సాగించారు. అరెయ్‌.. అంటే అరెయ్‌! అంటూ.. నాయ‌కులు దూష‌ణ‌ల …

Read More »

డ్రాగన్ సైన్యంపై త్రిశూలం

India-China

చైనా-భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం చేస్తున్న కంపు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఏదో కారణంగా మన భూభాగంలోకి చొచ్చుకు రావడం మన సైన్యం తో గొడవ పడటం మామూలైపోయింది. కొన్నిసార్లు ఈ గొడవలు శృతిమించి ముష్టిఘాతాలు, ముళ్ళ కర్రలతో కొట్టుకోవడం వరకు వెళిపోతోంది. ఆమధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఇలాంటి ఘటనలోనే రెండువైపుల సైనికులు చనిపోయిన విషయం మనదేశంలో సంచలనంగా మారింది. గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు కావాలనే …

Read More »

లోకేష్ శ‌ప‌థం: వ‌డ్డీతో స‌హా చెల్లిస్తాం..

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. వైసీపీ నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. మంగ‌ళ వారం జ‌రిగిన టీడీపీ కార్యాల‌యంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వైసీపీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌డ్డీతో స‌హా తాము చెల్లిస్తామ‌ని.. దేశం లో ఎక్క‌డ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వ‌దిలిపెట్టేది లేద‌ని.. స్ప‌ష్టం చేశారు. త‌మ ఓర్పు స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తున్నారని అన్న …

Read More »

కాంగ్రెస్ కు కెప్టెన్ షాక్

మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తొందరలోనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలో తొందరలో జరగబోతున్న సమయంలో కెప్టెన్ సొంత పార్టీ పెట్టే విషయాన్ని ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచటం లేదు. తనను అవమానకరమైన రీతిలో ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసిన కాంగ్రెస్ అధిష్టానం మీద కెప్టెన్ మండిపోతున్నారు. అలాగే తన నిష్క్రమణకు కారణమైన పీసీసీ ప్రెసిడెంట్ నవ్ …

Read More »

వైసీపీ.. తప్పు మీద తప్పు

ఆర్నెల్ల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో తర్వాతి ఎన్నికల్లో విజయం ఎవరిది అని అడిగితే.. వైసీపీదే అని ధీమాగా చెప్పే పరిస్థితి ఉండేది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న జనాల్లో జగన్ సర్కారు పట్ల సానుకూలతే ఉందని.. కాబట్టి మరో పర్యాయం జగన్‌కు ఢోకా లేదనే అంటుండేవాళ్లు రాజకీయ విశ్లేషకులు. కానీ గత ఆరు నెలల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయన్నది విశ్లేషకుల …

Read More »

ప్రియాంక ఫార్ములా సక్సెస్ అవుతుందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జనాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయించబోతున్నట్లు ప్రియాంక ప్రకటించారు. ఇపుడు చేసిన ప్రకటనను కనుక ప్రియాంక ఆచరణలో చూపించినట్లయితే సత్ఫలితాలు ఉంటాయనే అనుకోవాలి. ఎందుకంటే మొత్తం సీట్లలో 40 శాతం ఆడ వాళ్ళకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు. …

Read More »