Political News

జనసేనలో చేరనున్న వైసీపీ నేత

తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేత జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు తొందరలోనే జనసేనలో చేరబోతున్నారట. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఒక పార్టీకి రాజీనామా చేసిన నేత మరోపార్టీలో చేరటం సహజమే కదా. పైగా ఎన్నికలకు ముందు చేరితే కచ్చితంగా నియోజకవర్గంలో టికెట్ హామీ తీసుకునే రాజీనామా చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజోలులో సమస్య ఏమిటంటే 2019 ఎన్నికల్లో జనసేన తరపున …

Read More »

జ‌గ‌న్ పార్టీలో మంట పెట్టిన చంద్ర‌బాబు!

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్‌తీసుకుంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. నిన్నటి వ‌ర‌కు ఇక‌, అయిపో యిందనుకున్న పార్టీలు.. నాయ‌కులు కూడా పుంజుకుంటున్న ప‌రిస్థితి దేశంలోనే క‌నిపిస్తోంది. ఇక‌, ఏపీలో నూ.. వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా.. ఎప్పుడూ.. ఎలాంటి స‌వాళ్లు ..ప్ర‌తిస‌వాళ్లు చేయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. అధికార పార్టీ వైసీపీకి .. గ‌ట్టి స‌వాలే విసిరారు. తొలి రోజు అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఆయ‌న వైసీపీని ఉద్దేశించి ఘాటుగానే …

Read More »

ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌లు హ‌డ‌లి పోతున్నారే ?

ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కులు.. హ‌డ‌లి పోతున్నారట‌. త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఎక్క‌డ విముఖత వ‌స్తుందో.. రేపు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌కు బెడిసికొట్టే ప‌రిస్థితి ఉందేమో.. అనివారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఏపీ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి యాత్రే న‌ని.. పార్టీ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వ‌చ్చింది. రైతులు చేప‌ట్టిన రాజ‌ధాని ఉద్య‌మానికి …

Read More »

త్వ‌ర‌లోనే ఏపీ మంత్రి వ‌ర్గ మార్పు.. లాబీల్లో ఇదే ముచ్చ‌ట‌!

ఏపీ మంత్రి వ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే.. విస్త‌రించ‌నున్నారా.. మంత్రులు ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో లాబీల్లో కొంద‌రు నాయ‌కులు.. ముచ్చ‌ట్లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా వ్యూహంతో జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకున్నారు. త్వ‌ర‌లోనే.. మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే …

Read More »

లోకేశ్ పై రోజా ఫైర్: అమ్మతో.. భార్యతో బెదిరించి పదవిలోకి..

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తన మాటలకు పదును పెంచిన నారా లోకేష్ పై విమర్శల బాణాల్ని ఎక్కు పెట్టారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా రియాక్టు అయ్యారు. మూడు రాజధానులపై ఇటీవల కాలంలో లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. ఆయనపై మండిపాటుతో వార్తల్లోకి వచ్చారీ లేడీ ఫైర్ బ్రాండ్. లోకేశ్ ఒక పిల్లి పిత్రే అంటూ ఎటకారం ఆడేసిన రోజా.. …

Read More »

బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందా ?

రాజధాని అంశంలో ఏమి మాట్లాడాలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో బీజేపీకి అర్థం కాక బుర్ర తిరిగిపోతున్నట్లుంది. ఒకసారేమో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోసారేమో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటారు. ఈ మధ్యేమో అమరావతి డిమాండుకే కమలనాథులు జై కొడుతున్నారు. న్యాయస్థానం టు దేవస్ధానం యాత్ర సందర్భంగా అమరావతికే బీజేపీకి జై కొట్టింది. తాజాగా అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్రకు …

Read More »

షర్మిల కోరిక తీరినట్లేనా ?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేల‌ను సొంత పార్టీ నేత‌లే ఓడిస్తారా…!

ఎక్క‌డైనా ఏ పార్టీ నేత‌లైనా.. త‌మ పార్టీని.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇది స‌హ‌జం కూడా. అధిష్టానం ఆదేశాలు ఉన్నా..లేకున్నా.. పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు నిల‌బడ్డా.. త‌మ‌కు ఉపయోగ‌ప‌డతారు.. గెలిపిస్తే.. పోలా! అనేలా వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే.. వైసీపీ విష‌యంలో మాత్రం ఈ ప‌రిస్థితి రివ‌ర్స్ అవుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల‌ను ఓడించేందుకు సొంత పార్టీ …

Read More »

జాతీయ పార్టీ కాదు.. కేసీఆర్ ‘వ్యూహం’ వేరే ఉందా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. త్వర లోనే జాతీయ స్థాయిలో ఉద్య‌మిస్తానని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌) పేరుతో జాతీయ పార్టీ కూడా పెడుతున్న‌ట్టు.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు మీడి యాకు క్లూలు ఇచ్చాయి. దీంతో ఇంకేముంది.. కేసీఆర్ .. జాతీయ పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అయితే.. …

Read More »

చిన్న‌బోతున్న చిన్న‌మ్మ‌.. ఆశ‌లు తీర‌వా?

పొలిటిక‌ల్‌గా ఎంత దూకుడు పెంచినా.. ఏం చేసినా.. కోరుకున్న యోగం కోసమే క‌దా! నాయ‌కుల వ్య‌వ‌హా రం ఎప్పుడూ కూడా.. ఏదో ఒక‌టి ఆశించే ఉంటుంది. అలానే.. గ‌తంలో వైఎస్ ఆశీర్వాదంతో(తెర‌చాటున‌) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అన్న‌గారి కుమార్తె.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. ఉర‌ఫ్ చిన్న‌మ్మ కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చీ రాగానే.. ఆమె విశాఖ నుంచి గెలుపు గుర్రం ఎక్క‌డం.. ఆవెంట‌నే అతి పెద్ద కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా …

Read More »

మూడు ముచ్చ‌ట ఇక లేన‌ట్టే.. మంత్రి మాటల్లో చెప్పేశారుగా…!

మూడు రాజ‌ధానుల ముచ్చ‌ట లేన‌ట్టేనా? ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాల‌నా కాలంలో మూడు రాజ‌ధానులు పూర్తి అయ్యే ప‌రిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చేసిన వ్యాఖ్య‌లను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి.. ఏపీ ప్ర‌భుత్వం 2020 నుంచి కూడా మూడు రాజ‌ధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదిక‌గానే మూడు రాజ‌ధానుల ప్ర‌స్తావ‌న చేసిన జ‌గ‌న్‌.. అమ‌రావ‌తిని కేవలం శాస‌న రాజ‌ధానిగానే ఉంచుతామ‌న్నారు. ఇక‌, దీనిపై న్యాయ వివాదాలు …

Read More »

మాజీ ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత దంప‌తుల‌ అరెస్టు

ఫైర్ బ్రాండ్ రాజ‌కీయ నాయ‌కురాలిగా గుర్తింపు పొందిన‌.. ఏపీలోని అరకు గిరిజ‌న పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కురాలు.. కొత్తపల్లి గీత, ఆమె భ‌ర్త‌ను సైతం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వారిని మంగ‌ళ‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లోని నివాసంలోనే అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. ఆ వెంట‌నే వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి ఆమెను తరలించారు. …

Read More »