తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ కానున్నాయా..? ఇప్పుడిప్పుడే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీకి మోదీ వ్యాఖ్యలు ఆశనిపాతంలా మారనున్నాయా..? పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా మోదీ ప్రవర్తిస్తున్నారా..? బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గొడవ ఉత్తుత్తిదేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై …
Read More »మంత్రి కేటీఆర్ పిలుపు.. మోడీపై విరుచుకుపడ్డ నేతలు
పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. తెలంగాణలోని అధాకారపార్టీ టీఆర్ ఎస్, కాంగ్రెస్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ ఎస్ శ్రేణులు ట్విటర్ లో పెట్టిన “మోడీ ఎనిమీ ఆఫ్ తెలంగాణ” అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. టీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం …
Read More »మోదీ కాళ్లపై పడి.. జగన్ అలా చేస్తే..
ఆంధ్రప్రదేశ్ విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందంటూ సాక్ష్యాత్తూ మోడీ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం ..అసలు తనది ఏపీనే కాదన్నట్టుగా నో కామెంట్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే జగన్ వైఖరిపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ …
Read More »సమతామూర్తి విగ్రహంపై కొత్త వివాదం రాజేసిన రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహంపై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గత శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. రామానుజాచార్యుల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆత్మనిర్భర్ భారత్ గురించి కామెంట్లు చేశారు. …
Read More »అన్యాయం చేసిన వాళ్లే అన్యాయమని అరుస్తున్నారు : ఉండవల్లి
ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఇప్పుడు అన్యాయం జరిగిందని అరుస్తుందని ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శలు కురిపించారు. పార్లమెంట్లో మోడీ ప్రసంగానికి కౌంటర్గా ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. “కాంగ్రెస్ను విమర్శించాలంటే మోడీ మొట్టమొదటిగా ఆంధ్రకు జరిగిన అన్యాయన్నే ఎత్తుకుంటారు. కానీ బీజేపీ కూడా చట్ట విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్కు మద్దతునిచ్చింది. మీ పార్టీకి చెందిన సుష్మాస్వరాజే చెప్పారు.. ఈ చిన్నమ్మ సహకరించింది కాబట్టే తెలంగాణ వచ్చిందని …
Read More »అసలు విషయం చెప్పేసిన తలసాని
అవును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఉద్దేశ్యపూర్వకంగానే కేసీయార్ స్వాగతం పలకలేదు అయితే ఏమిటి ? అంటూ డైరెక్టుగానే మంత్రి తలసాని ప్రశ్నించారు. ప్రధాని-కేసీయార్ వివాదంలో ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. అందుకనే మీడియా సమావేశంలో బహిరంగంగానే కేసీయార్ ఉద్దేశ్యాన్ని చెప్పేశారు. తెలంగాణాకు నరేంద్ర మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయానికి నిరసనగానే ప్రధానమంత్రికి కేసీయార్ స్వాగతం పలకలేదని తలసాని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. ప్రధానికి స్వాగతం పలకటానికి కేసీయార్ …
Read More »ఎంఎల్ఏకే జగన్ అపాయిట్మెంట్ ఇవ్వలేదా ?
వినటానికే విచిత్రంగా ఉంది వ్యవహారం. సొంతపార్టీ ఎంఎల్ఏనే కలవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడటం లేదట. కారణం ఏమిటంటే జిల్లాల పునర్వ్యస్ధీకరణ నేపధ్యమే అని సమాచారం. విషయం ఏమిటంటే 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కడప జిల్లాని రెండుగా విభజించింది ప్రభుత్వం. కడప జిల్లా యథాతథంగా ఉండగా రెండోది రాయచోటి నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటయ్యింది. దీన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం …
Read More »PRC: చంద్రబాబే బెటర్… అని ఇపుడంటున్నారట
ఆంధ్రావనిలో కొత్త పీఆర్సీకి సంబంధించి వివాదం నడుస్తోంది.ఉద్యోగులు,ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదన వినిపిస్తున్నారు.మంత్రుల కమిటీతో చర్చలు జరిగిన అనంతరం పరస్పర ఒప్పందం మేరకు మినిట్స్ రూపొందించాక కూడా ఉపాధ్యాయులు శాంతించడం లేదు..సరికదా ఉద్యమ తీవ్రతను పెంచారు.తాము పీఆర్సీ సాధన సమితి నుంచి బయటకు వచ్చేశామని యూటీఎఫ్,ఎస్టీయూ,ఏపీటీఎఫ్ (1938) లాంటి ఉద్యమ సంఘాలు నిన్నటి వేళ ప్రకటించాయి.ఇదే సమయంలో జగన్ తరఫు పెద్దలు మాత్రం ఇప్పటికీ తాము ఆ …
Read More »బీజేపీని వెనకేసుకు రావాలంటే జీవీఎల్ తర్వాతే ఎవరైనా!
జీవీఎల్ నరసింహారావు… బీజేపీ ఏపీ నేత. పార్టీ తరఫున బలంగా గలం వినిపించడంలో ఆయన ముందుంటారు. కొన్ని సార్లు జీవీఎల్ తీరు చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే రీతిలో వైరల్ అయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా సరైన పరిష్కారం కాదని తెలిపారు. …
Read More »27 వేల కోట్లు అప్పు.. ఢిల్లీ వెళ్లి జగన్ చేసిందిదే
ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చర్చలు కామన్. తన కేసుల పరిష్కారం కోసమే ఆయన వెళ్లాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లారని మరికొందరు అంటుంటారు. అయితే.. తాజాగా జగన్ పర్యటనకు సంబంధించిన విషయాల్లో కీలక మైన అంశాన్ని కేంద్రమే ఇప్పుడు బయట పెట్టింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానినరేంద్ర మోడీని, అమిత్షాను కూడా కలుసుకున్నారు. ఈ సమయంలో …
Read More »మోడీ కామెంట్లకు హరీష్ రావు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదని ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని కామెంట్లపై తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ప్రధాని కామెంట్లపై టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు తక్షణమే స్పందించారు. రాజ్యసభలో ప్రధాని మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని మండిపడ్డారు. తెలంగాణపై మోడీ …
Read More »ఉచిత పథకాలలో.. విద్యుత్, పెట్రోల్, గ్యాస్
ఉచిత పథకాలతో పేరుతో ఇప్పటికే అమలు అవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా వాటన్నింటినీ తలదన్నేలా మరో భారీ మేనిఫెస్టో విడుదల అయింది. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అయిన సమాజ్ వాదీ తరఫున సంచలన హామీలు ఇచ్చారు ఆ పార్టీ రథసారథి అఖిలేశ్ యాదవ్. విద్యుత్, పెట్రోల్, గ్యాస్, ఎరువులు ఇలా కీలక అవసరాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు అఖిలేశ్ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలో వెల్లడించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates