Political News

ఆమెతో విభేదాలు.. ఆయ‌న‌కు నో ఎమ్మెల్సీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్‌.. సొంత పార్టీకే చెందిన కీల‌క నేత‌కు మాత్రం విస్మ‌రించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. సీఎంకు విధేయుడిగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఎమ్మెల్సీ ఆశ మాత్రం తీర‌లేద‌ని చెప్తున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌ణంగా ఓ మహిళా ఎమ్మెల్యే అనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇంత‌కీ ఆ నేత ఎవ‌రంటే.. మ‌ర్రి రాజశేఖ‌ర్‌. గుంటూరు జిల్లాకు చెందిన ఈ సీనియ‌ర్ నేత‌కు ఈ సారి …

Read More »

సోలోగానే కాంగ్రెస్.. అయ్యేనా స‌క్సెస్‌

వ‌చ్చే ఏడాది దేశంలో జ‌రిగే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టి నుంచి దృష్టి సారించాయి. అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌తో పాటు ఉత్త‌రాఖండ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్ రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో స‌ర్కారు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాట‌డం పార్టీల‌కు కీల‌కం. అందుకే కేంద్రంలో అధికారంలో …

Read More »

ప్రపంచకప్‌కు విలువ లేకుండా పోయిందే

భారత జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్ సెమీస్ కూడా చేరకపోవడం టోర్నీ ముందే కళ తప్పింది. అయినా సరే.. సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడంతో మళ్లీ కొంతమేర టోర్నీ మీద ఆసక్తి కలిగింది. కానీ ఫైనల్‌ ఏకపక్షంగా సాగడంతో ఆసక్తి సన్నగిల్లిపోయింది. మ్యాచ్ చప్పగా మారిపోయింది. ముగింపులో ఉత్కంఠే లేదు. ఏ ఎగ్జైట్మెంట్ లేకుండా ప్రపంచకప్ ముగిసిపోయింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్పుల్లో ఫైనల్ దాకా వచ్చి చివరి మెట్టుపై …

Read More »

అమరావతిపై బీజేపీలో గందరగోళం

అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే విషయంలో బీజేపీలో గందరగోళం మొదలైందా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యూ చేయాలనే డిమాండ్ తో రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం నుంచి తిరుమలకు మహా పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. ఈ మహాపాదయాత్రలో రైతులు, వివిధ పార్టీల నేతలు, మద్దతుదారులు పాల్గొంటున్నారు. ఈ యాత్రలో బీజేపీ స్ధానిక …

Read More »

సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రింత పెరిగిన మోడీ ‘అధికారం’

దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లుగా పేరున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ)ల‌పై ఇటీవ‌ల కాలం లో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేంద్రం చెప్పుచేతుల్లో ఉన్నాయ‌నే వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా త‌మ‌కు ఇష్టంలేని నాయ‌కుల‌పైనా.. త‌మ‌కు ఎదురు మాట్లాడే రాష్ట్రాల‌పైనా.. ఈ సంస్థ‌ల‌ను ప్ర‌యోగిస్తు న్నార‌నే వాద‌న కూడా ఉంది. గ‌తంలో కాంగ్రెస్ హ‌యాం నుంచే ఈ రెండు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌నే వాద‌న కోర్టులు సైతం వ్య‌క్తం చేశాయి. అంతేకాదు.,. …

Read More »

అబ్బా… పవన్ ఏం ట్వీటావయ్యా..!

జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్రలేచింది మొదలుకుని పడుకునే విమర్శించడమే పనిగా పెట్టుకుని అటు బహిరంగ సభల్లో.. ఇటు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే.. అదేదో సినిమా డైలాగ్‌ లో లాగే మాకు కనపడవ్.. వినపడవ్ సార్ అన్నట్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా ఉన్న ‘ఎయిడెడ్ స్కూల్’ వ్యవహారంపై పవన్ స్పందిస్తూ …

Read More »

మిమ్మ‌ల్ని వ‌దులుకోం.. జ‌గ‌న్‌కు షా హామీ..

“మిమ్మ‌ల్ని మేం వ‌దులుకోం! మీ స‌మ‌స్య‌లు మీవి కాదు.. మావి!” .. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్రంలో నెంబ‌ర్ 2 నాయ‌కుడు.. అమిత్ షా. అది కూడా ఎవ‌రి గురించో కాదు.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురించే. ప్ర‌స్తుతం తిరుప‌తి కేంద్రంగా జ‌రిగిన ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశం ముగిసింది. అయితే.. ఈ స‌మావేశానికి సీఎం హోదాలో.. జ‌గ‌న్ నాయ‌క‌త్వం …

Read More »

‘మ‌త్తు’ను క‌ట్ట‌డి చేద్దాం.. అమిత్ షా.. స్ప‌ష్టం

తిరుప‌తి వేదిక‌గా .. ఈ రోజు జ‌రిగిన‌.. ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశంలో రాష్ట్రాలు లేవ‌నెత్తిన 50 ప్ర‌ధాన అంశాల్లో 41 అంశాల‌కు ప‌రిష్కారం చూపిస్తామ‌ని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ఆయ‌న అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, పుదుచ్చేరి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల.. సీఎంలు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న …

Read More »

క‌విత‌క్క ఏ కోటాలో?

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌ల కోలాహలం మొద‌లైంది. ఎమ్మెల్యేల‌ కోటాతో పాటు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌డంతో రాజ‌కీయ చ‌ర్చ జోరందుకుంది. ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆశిస్తున్న ఆశావ‌హులు.. నాయ‌కులంద‌రూ కేసీఆర్ నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయ‌న క‌టాక్షం కోసం ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ డిసైడ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇక ఇప్పుడు ఆయ‌న దృష్టి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప‌డింది. …

Read More »

జగన్ అండ్ కో.. దీనికేం సమాధానం చెబుతారు?

అది 2019 మార్చి 15వ తేదీ.. ఇంకో నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అలాంటి టైంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలొచ్చాయి. ఆ వార్తను ముందుగా రిపోర్ట్ చేసింది సాక్షి మీడియానే. కానీ కాసేపటి తర్వాత వివేకా చనిపోయింది గుండెపోటుతో కాదు.. ఆయన్ని ఎవరో దారుణంగా హత్య …

Read More »

కేసీయార్ ను నమ్మచ్చా ?

కేసీయార్ వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఏ విషయంలోను చివరివరకు గట్టిగా ఒకేమాటపై నిలబడుతారని అనుకునేందుకు లేదు. ఇపుడు ధాన్యం కొనుగోళ్ళ వివాదంకు సంబంధించి కేంద్రప్రభుత్వంపై కేసీయార్ ఒంటికాలి మీద లేస్తున్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయిన దగ్గర నుండి కేంద్రప్రభుత్వం అంటేనే అంతెత్తున లేస్తున్నారు. ఉపఎన్నికలో ఎలాగైనా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను ఓడించాలని …

Read More »

పాపం..మర్రి రాజశేఖర్

మర్రి రాజశేఖర్ వైసీపీలోని సీనియర్ నేతల్లో ఒకరు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేతల్లో ముందు వరసలో ఉంటారు. ఇంతకీ ఆయన్ను వెంటాడుతున్న దురదృష్టం ఏమిటంటే ఎంఎల్సీ పదవి అందని ద్రాక్ష పండులా తయారైపోయింది. నిజానికి 2019లోనే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట ఎంఎల్ఏ టికెట్ రావాల్సింది. అయితే చివరి నిముషంలో టికెట్ దక్కలేదు. దాంతో ఎంఎల్ఏ టికెట్ ఇవ్వలేకపోయినందుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్వయంగా …

Read More »