కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమర శంఖం పూరించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయమే చేస్తుందని పదునైన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసి తమ అసంతృప్తిని పార్లమెంట్ సాక్షిగా వ్యక్తపరచాలని.. రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని టీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ మేరకు తమ పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవహరంచాల్సిన వైఖరిపై మార్గనిర్దేశనం చేశారు. అధినేత …
Read More »బడ్జెట్పై వైసీపీ మౌనం: అంగీకరించినట్టేనా?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్లో పసలేదని.. ఎవరికీ ఏమీ లాభం లేదని.. మాటల గారడీ తప్ప.. కేంద్రం చేసింది కనిపించలేదని.. ఈ బడ్జెట్ ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దుమ్మెత్తిపోసింది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజల ఉపాధులు, ఆరోగ్యం దెబ్బతిన్నాయని.. వీటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు గుప్పించింది. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ బడ్జెట్ను అధర్మ బడ్జెట్గా, సొల్లు కబుర్ల బడ్జెట్గా …
Read More »కేంద్ర బడ్జెట్పై జనసేనాని పవన్ రియాక్షన్
కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దేశ ప్రగతికి ఈ బడ్జెట్ నాంది పలుకుతుందని తెలిపారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమని పేర్కొన్నారు. అయితే.. ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత …
Read More »కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. చంద్రబాబు
కేంద్రం ప్రవేశ పెట్టిన 2022-23 బడ్జెట్ ఆశానకంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు పెదవి విరాచారు. రైతులకు ఈ బడ్జెట్ ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం అన్నారు. పేద వర్గాలు, కోవిడ్ తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూతనిస్తారో కూడా బడ్జెట్ లో చెప్పలేదు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత …
Read More »గోవాను కూడా చెడగొట్టేశారే!
ఎన్నికలు వచ్చాయంటే ఏ పరిస్థితులు ఎలాంటి దారి తీసుకుంటాయో ఊహించడం కష్టం. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో పార్టీలు వివిధ పరిణామాలకు తెరతీస్తాయి. సామాజిక వర్గం, మతం, కులం.. ఇలా అన్ని రకాలుగా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తాయి. దేశ రాజకీయాల్లో ఈ వ్యవహారం ఎప్పటినుంచో కొనసాగుతోంది. కానీ దేశంలోని గోవా రాష్ట్రంలో మాత్రం ఈ ఎన్నికల్లోనే సరికొత్తగా కుల రాజకీయాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుల సమీకరణాల …
Read More »బస్సు కదల్లేదా.. జగన్కు కష్టమే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారుతున్నా సంక్షేమ పథకాల పేరుతో జనాలకు ఆయన డబ్బులు పంచుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించి పీఆర్సీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎస్కు సమ్మె నోటీసు కూడా అందజేశారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు జగన్ …
Read More »చంద్రబాబు కూడా తప్పులు చేశారు.. చింతమనేని
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై ముఖ్యమంత్రి జగన్ కావాలనే కేసులు పెడుతున్నారని.. అదేసమయంలో మీడియా కూడా తనపై లేనిపోనివి ప్రచారం చేసి…తనను క్రిమినల్ మాదిరిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని.. దీంతో తను పెద్ద తప్పుడు నాయకుడినని.. ప్రజలు భావించేలా చేశారని అన్నారు.అయితే..తనేమిటో.. తెలియని వారు ఇలా చేస్తే.. బాధ ఉండేది …
Read More »ఉద్యోగులకు హైకోర్టులో ఊరట.. జీతం తగ్గించొద్దన్న కోర్టు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో తమకు నష్టం వస్తుందని.. తమ జీతాలు తగ్గుతాయని… ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగుల వేతనాలను తగ్గించవద్దని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచీ రికవరీ చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు …
Read More »బడ్జెట్లో ఏపీకి ఇచ్చిందేంటి?
తాజాగా ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు జరిగాయా? కేంద్ర ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించిందా? అంటే.. లేదనే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఏపీకి సంబంధించి.. కేంద్రం నెరవేర్చాల్సిన అనేక అంశాల్లో కీలకమైన అంశం.. ప్రత్యేక హోదా. 2012లో విభజన నేపథ్యంలో ఇచ్చిన ఈ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు.. వైసీపీ ప్రభుత్వం ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. హోదాపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే …
Read More »చింతమనేని ఇంట్లో ఉచిత భోజనం !!
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అనేక కేసులు ఉన్నాయి. వీటి లోనూ ప్రధానంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం14 అట్రాసిటీ కేసులు ఉన్నాయ ని.. ఆయనే స్వయంగా చెప్పారు. అంతేకాదు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన ఒక ఎస్సీ కాలనీకి వెళ్లి.. “దళితులు మీకెందుకురా.. రాజకీయాలు` అని కామెంట్ చేసినట్టు అప్పట్లో ప్రత్యర్థి పక్షం సహా మీడియా పెద్ద ఎత్తున ప్రచారం …
Read More »ఎక్స్గ్రేషియా వద్దు.. వాడ్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలి
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య ఉదంతం.. విన్న వారందరి కంట కన్నీరు కార్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా.. అపార్ట్ మెంట్ పెద్ద మనిషిగా వ్యవహరించే వినోద్ జైన్ అనే కామపిశాచి దాహానికి పద్నాలుగేళ్ల చిన్నారి బలైంది. ఈ దారుణం షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి నీచుడ్ని అంత తేలికగా వదలకూడదన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా …
Read More »టీడీపీ ఈ నలుగురునే టార్గెట్ చేస్తోందా ?
జగన్మోహన్ రెడ్డిని బలహీన పరచాలంటే ముందు చుట్టూ ఉన్నవారిని దెబ్బ కొట్టాలి. చుట్టూ ఉన్న వారిలో అత్యంత కీలకమైన వారెవరు ? ఆ నలుగురే అని బహుశా తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్లుంది. అందుకనే ఎక్కువగా ఈ నలుగురి మీదే బాగా కాన్సంట్రేట్ చేస్తున్నది ప్రధాన ప్రతిపక్షం. ఇంతకీ ఈ నలుగురు ఎవరంటే ముందుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని. తర్వాత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates