దేశం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం ఇప్పటి వరకు ఒక్క మంచి పనిచేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు దేశంలో ఎందుకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంతో పాటు దేశం బాగుండాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాల్సిన ప్రధాని మోడీయే రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఇవాళ …
Read More »బాబు పర్యటన.. భయంలో వైసీపీ?
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు అధికార పార్టీ వైసీపీ నేతలు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు.. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించాలని.. షెడ్యూల్ ఖరారు చేసుకుని.. వచ్చిన చంద్రబాబుకు తొలిరోజు బుధవారం.. రాళ్ల దాడిఎదురైంది. వైసీపీ నాయకులు.. కార్యకర్తలు.. టీడీపీ శ్రేణులపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, రెండో రోజు కూడా చంద్రబాబు …
Read More »మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి.. ఆ నలుగురిలో ఒకరు
హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలు.. ప్రధాన రాజకీయ పార్టీలకు పెను పరీక్షగా మారిన వైనం తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్లిపోవటంతో.. ఆ పార్టీకి అభ్యర్థి సమస్య లేదన్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో.. సరైన అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. …
Read More »వైసీపీలో కొత్త చిచ్చు..
జిల్లాల స్థాయిలో వైసీపీ ఇప్పటికే కష్టాల్లో ఉంది. అనేక జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని.. నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని.. పార్టీ అధిష్టానం ఇప్పటికే తల్లడిల్లుతోంది. అయినప్పటికీ.. నాయకులు మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఎవరికి వారు తమ ఇష్టం వచ్చిన విధానంలో ముందుకుసాగుతున్నారు. తాజాగాఅనకాపల్లి జిల్లాలో వైసీపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యేగా కన్నబాబు రాజుకు జిల్లాకు చెందిన యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ వర్గం పొగపెడుతోందనే …
Read More »ఉచితాలతో దేశాన్ని నాశనం చేస్తారా?: సుప్రీం కోర్టు
రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని సుప్రీం కోర్టు సీరియస్గా స్పందించింది. దీనిపై చర్చ జరగాల్సిందేనని అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని హెచ్చరించింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది. …
Read More »కుప్పంలో హైటెన్షన్ .. బాబుకు చుక్కలు చూపించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైసీపీ నాయకులు.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తున్నారు. రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైసీపీ నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు.. చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు …
Read More »చెత్తపన్ను కోసం.. ఇంత పీడించాలా..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం డబ్బుల కోసం.. ఏదైనా చేస్తుందనే వాదన జోరుగా వినిపిస్తోంది. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గో.. లేక.. ఖజానాలో సొమ్ము లేకపోవడంతోనో.. ప్రజలపై వివిధ రూపాల్లో ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వస్తోందనే వాదన అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అయినా.. కూడా ఎక్కడా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ప్రజల ముక్కు పిండి అయినా.. చెత్తపన్నును వసూలు చేయాలని.. అధికారులు భావిస్తున్నారు. వారికి పైనుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు …
Read More »ఫొటో టాక్: ఏపీలో వైసీపీ గణపతి..
ఏ మాటకు ఆమాటే చెప్పుకోవాలి. వైసీపీలో ఉన్నంత మంది స్వామి భక్తులు ఇతర పార్టీలో మనకు కనిపిం చడం లేదు. అదా.. ఇదా.. అనే తేడా లేదు. ఎవరో చూస్తారు.. ఏదో అంటారు. కలడో లేడో అనే సంశయం లేకుండా.. అధినేత మనసు మెప్పించేలా.. నాయకులు.. వేస్తున్న కలర్స్ అన్నీ ఇన్నీ కావు. సృష్టి ఆది యందు అన్నట్టుగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో తనంతట తనే పాఠశాలలు, పంచాయతీ …
Read More »ప్రాజెక్టు పూర్తయ్యాకే ఎన్నికలు
ఏపీ సీఎం జగన్ చెప్పాడంటే.. చేస్తాడంటే! అని వైసీపీ నాయకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఆయ న ఎన్నో చెప్పినా.. కొన్ని మాత్రమే చేశారనే విమర్శలు ఉన్నాయి. అయితే.. అవి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూడా సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మరి ఇది ఏం చేస్తారో చూడాలి. 2023 సెప్టెంబరులో వెలి గొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించాకే …
Read More »ఏపీ సర్కారుపై హైకోర్టు ఫైర్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం లెక్కలేని విధంగా నియమిస్తున్న సలహాదారుల విషయంపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు సలహాదారులు ఎందుకు? అని ప్రశ్నించింది. సలహాదారులు కేవలం సలహాలకే పరిమితం కావడం లేదని.. రాజ్యాంగేతర శక్తులుగా మారిపోతున్నారని.. తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. సలహాదారులను నియమించేందుకు అధికారుల కొరతేమైనా ఉందా అని న్యాయమూర్తుల ధర్మాసనం నిలదీసింది. మంత్రులకు సలహాదారులు ఉంటే అర్థం ఉందిగానీ.. శాఖలకు సలహాదారు ఏమిటని ప్రశ్నించింది. ఇలానే వదిలేస్తే …
Read More »వైసీపీ వ్యూహాలు అంతుచిక్కడం లేదే
వైసీపీ అధిష్టానం చేస్తున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఎస్సీలకు అండగా ఉంటామని పదే పదే చెప్పే పార్టీ.. ఇప్పుడు అదే ఎస్సీ నేతల మధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీలో రాజకీయా లు వేగంగా మారుతున్నాయి. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమిస్తున్నట్లు.. వైసీపీ …
Read More »కుప్పం.. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లదాడి
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు .. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించడాన్ని సహించలేక పోయారు. వ్యూహాత్మకంగా.. చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నేతలు రాళ్లదాడితో చెలరేగిపోయారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు కుప్పం చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు రాష్ట్ర సరిహద్దు కొంగనపల్లెలో వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఇక్కడ నుంచి చంద్రబాబు రామకుప్పం చేరుకోవాల్సి ఉంది. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో ఆయన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates