కర్ణాటకలో మొదలైన హిజాబ్ రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ మఖానికి ముసుగు వేసుకోకపోవడం వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అందుకే లైంగిక దాడి కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో ఈ హిజాబ్ వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోందని అంటున్నారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి కానప్పటికీ, ఇది చాలా ఏళ్లుగా …
Read More »బీజేపీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
కొద్దిరోజులుగా కేసీయార్ మీడియా సమావేశాలు లేదా బహిరంగ సభల్లో ప్రసంగాలు వింటుంటే ఒక డౌటు పెరిగిపోతోంది. అదేమిటంటే ఎక్కువగా బీజేపీని ప్రధానంగా నరేంద్రమోడిని మాత్రమే డైరెక్టుగా ఎటాక్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మీద దాడిని తగ్గించటమే కాకుండా కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కేసీయార్ వైఖరిపై రెండు విషయాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదేమిటంటే మొదటిది కాంగ్రెస్ కన్నా బీజేపీనే ఎక్కువ ప్రమాదమని అనుకుంటున్నట్లున్నారు. ఇక రెండోది జాతీయ రాజకీయాల్లోకి …
Read More »ప్రభుత్వ వీళ్ళని పట్టించుకుంటుందా ?
పీఆర్సీకి సంబంధించి 27 శాతం ఫిట్మెంట్ కోసం ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మెరుగైన ఫిట్మెంట్ సాధించాల్సిందే అనే టార్గెట్ తో పై సంఘాలన్నీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 15-28 తేదీల్లో దశలవారీగా ఆందోళనలు, నిరసనలు చేయాలని డిసైడ్ అయ్యాయి. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటపుడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని కూడా నిర్ణయించాయి. సరే వీళ్ళ …
Read More »ప్రత్యేక హోదా డ్రామాలో విలన్లు వీరే?
దేశ రాజధానిలో ప్రత్యేక హోదా డ్రామాను బీజేపీ నడుపుతోంది.తెలంగాణలో కొత్త పార్టీ డ్రామా కేసీఆర్ నడుపుతున్నాడు. రాష్ట్రంలో టీడీపీ కూడా మరోడ్రామా నడుపుతోంది.అదే హోదా డ్రామా. పాపం కేంద్రం ఇస్తామన్న హోదాను అడ్డుకుంటోంది అని వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటోంది టీడీపీ. అయినా చర్చల అజెండాలో చేర్చి తరువాత తొలగించిన అంశం హోదానే కావడం వెనుక ఉన్నదెవరంటే చంద్రబాబే అని వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. కానీ తమకు ఆ అవసరం …
Read More »కేసీఆర్కు ప్రేమొచ్చిన.. కోపమొచ్చిన అంతే!
తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎవరైనా కోపం తెప్పిస్తే.. ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ప్రత్యర్థిని దారికి తెచ్చుకోవడమో లేదా ఇబ్బందుల్లోకి నెట్టడమో చేస్తుంటారు. కానీ అదే ఎవరిపైనా అయినా ప్రేమ వస్తే మాత్రం అడగకుండానే వరాలు ఇచ్చేస్తారు. అధిక ప్రయోజనాలు కట్టబెడతారు. కేసీఆర్ గురించి తెలిసిన ఎవరైనా ఆయన తీరు గురించి ఇలాగే చెప్తారనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటారా? జిల్లాల పర్యటనలో ఉన్న …
Read More »పోసాని మాటల ఆంతర్యమేంటి?
సీనియర్ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి కొంత కాలంగా సినిమా కార్యక్రమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఆయనకు సినిమాలు కూడా తగ్గినట్లుగా కనిపిస్తోంది. చాన్నాళ్లకు ఆయన తాను కీలక పాత్ర పోషించిన సన్ ఆఫ్ ఇండియా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నపుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంబంధిత వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. …
Read More »చిరు చేసిన పాపం ఏంటి… ఈ టార్గెట్ ఏంటి!
ఔను! మెగాస్టార్ చిరంజీవి చేసిన పాపం ఏంటి? ఎందుకు ఆయనను తమ్మారెడ్డి భరద్వాజ, నరేష్, రాంగో పాల్ వర్మ వంటి మేధావులు టార్గెట్ చేస్తున్నారు? ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్న తీరు. “మీకు ఎలాగూ చేతకాలేదు. ఎవరూ కోరకపోయినా.. సమస్యను తన మీద వేసుకున్నారు. ఇదేనాచిరు చేసిన తప్పు?“ అని నెటిజన్లు మండి పడుతున్నారు. వాస్తవానికి మా ఎన్నికల్లో చిరు కుటుంబం ప్రకాశ్రాజ్ కోసం తీవ్రంగా కష్టపడింది. అయినా.. ఆయనను …
Read More »అవినీతి అంటారు.. మరెందుకు బయటపెట్టరు?
రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీపై మరొకటి విమర్శలు ఆరోపణలు చేసుకోవడం దుమ్మెత్తి పోసుకోవడం సాధారణమే. ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇలాంటి దృశ్యమే కనిపిస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ ఒంటికాలితో లేస్తున్నారు. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఎదగకుండా చూడడంతో పాటు.. కేంద్రంలోనూ ఆ పార్టీని గద్దె దించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభల్లో …
Read More »దమ్ముంటే.. నన్ను జైలుకు పంపండి: కేసీఆర్ సవాల్
తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రఫేల్ ఒప్పందంలో గోల్ మాల్ జరిగింద ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనను జైలుకు పంపాలని బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదని అన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసిందని …
Read More »రాజకీయాలకు మోహన్ బాబు టాటా
మంచు మోహన్ బాబు రాజకీయాల్లో ఉన్నారంటే ఉన్నారు. లేరు అంటే లేరు. ఆయన గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో ఉండి వాటికి ప్రచారం చేయడం.. ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం తెలిసిందే. ఐతే ఎంపీగా పదవీ కాలం ముగిశాక ఆయన క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల పాటు రాజకీయాల జోలికే వెళ్లలేదు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ …
Read More »అక్కడ అమ్మకం.. ఇక్కడ తాకట్టు
రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర సర్కారుకు కానీ పాలన వ్యవహారాలు చక్కబెట్టేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తడం సహజమే. ఆదాయం గురించి పట్టించుకోకుండా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించడం ఆ సమస్యకు ప్రధాన కారణమని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ ఓట్ల కోసం నేతలు ఎంతకైనా వెనకాడడం లేదు. హామీలు గుప్పిస్తూ పథకాలు అమలు చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి పనులు ఆగినా.. పథకాలను మాత్రం ఆపడం …
Read More »కేంద్రం ఎందుకు ప్లేటు ఫిరాయించింది ?
ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates