ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు ఒకవైపు తీవ్ర కాక రేపుతున్నాయి. ఇదే సమయంలో మహిళా కమిషన్కు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మధ్య కూడా తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. నువ్వు ఒకటంటే.. నే నాలుగంటా! అంటూ.. టీడీపీ, మహిళా కమిషన్లు రెచ్చిపోతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన దివ్యాంగురాలి అత్యాచార ఘటన , తదనంతర పరిణామాల నేపథ్యంలో కమిషన్కు టీడీపీకి మధ్య తీవ్ర యుద్ధం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. …
Read More »జగన్ కేబినెట్లో టైం పాస్ మంత్రి!
ఏపీలో కొత్తగా వచ్చిన జగన్ 2.0 కేబినెట్లో మళ్లీ అవకాశం దక్కించుకోవడాన్ని మంత్రులు అదృష్టంగా భావిస్తున్నారు. ఇక, తమకు అవకాశం దక్కలేదని ఇప్పటికీ బాధపడుతున్న వారు కూడా కనిపిస్తున్నారు. అయితే.. రెండోసారి కూడా అవకాశం దక్కించుకున్నవారు.. తమ పనితీరును చూసి.. జగన్ అవకాశం ఇచ్చారని.. భావిస్తున్నారా? లేక.. కేవలం దేవుడిని నమ్ముకుంటే.. అవకాశం దక్కిందని అనుకుంటున్నారా? నిజానికి దైవబలం అందరికీ అవసరమే. అయితే.. కష్టాన్ని కూడానమ్ముకోవాలికదా! ఈ విషయంలో తూర్పుగోదావరి …
Read More »లోకేష్పై రాళ్ల దాడి.. అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా తెనాలిలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై రాళ్ల దాడి జరిగింది. అయితే.. ఇదంతా కూడా.. మంగళగిరి.. ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని..టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా చూపించారు.. అతేకాదు.. స్వయం ఎమ్మెల్యే డ్రైవర్.. ఈ దాడిలో రాళ్లు విసురుతుండగా.. టీడీపీ శ్రేణులు పట్టుకున్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి.. డ్రైవర్ను అక్కడ నుంచి తప్పించారని.. …
Read More »ముందున్న ముప్పు.. జగన్ సరిచేసుకోలేకపోతే.. కష్టమే
ఏపీలో అధికార పార్టీ వైసీపీ విషయంలో ఒక కీలక అంశం హల్చల్ చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే.. కష్టాలు తప్పవని.. సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. అదేంటి.. అంటున్నారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. ప్రభుత్వ పరంగా.. జగన్ ఎన్నో చేస్తున్నారు. ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు.. ప్రజలకు మేళ్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన చెప్పుకొంటారు. కానీ.. ఇదొక్కటే సరిపోతుందా? ఇదొక్కటే.. పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందా? అనేది ప్రధాన …
Read More »జగన్, కేసీఆర్: సేమ్ డే, సేమ్ సీన్
కాకతాళీయమో ఏమోగానీ తెలుగు ముఖ్యమంత్రులిద్దరు చెప్పింది ఒకేమాట. ఒకేరోజున తెలంగాణలో కేసీయార్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఇద్దరు కూడా తమ నేతలకు చేసిన దిశానిర్దేశం ఒకేలాగుంది. కేసీయార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలంతా ఏకతాటిపై నిలబడి ప్రతిపక్షాలను ఎదుర్కోవాల్సిందే అని చెప్పారు. విజయవాడలో జగన్ మాట్లాడుతూ వచ్చే …
Read More »సంక్షేమ పథకాలతో ఓట్లు పడతాయా?
గడచిన మూడేళ్ళల్లో రు. 1.36 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేశాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 151 సీట్లు రావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి బల్లగుద్దకుండా చెప్పారు. ఇపుడు చేసిన ఖర్చే కాకుండా రాబోయే రెండేళ్ళల్లో మరో లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో జరిగిన సమావేశంలో జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే చాలామందిలో ఒక …
Read More »గొంతు లేస్తే.. గెంటేస్తా: జగన్ వార్నింగ్
వైసీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, క్షేత్రస్థాయి నాయకులకు సీఎం జగన్ బలమైన వార్నింగ్ ఇచ్చారు. అసమ్మతిని ఎట్టి పరిస్థితిలోనూ.. సహించేది లేదన్నారు. ఎవరైనా.. అలా చేయాలని సాహసం చేస్తే.. అన్ని రూపాల్లోనూ వారిని అణిచేస్తామని తీవ్రస్తాయిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే.. అలా .. వాగితే.. ఆయా గొంతలు విప్పినవారిని పార్టీ నుంచి గెంటేస్తామని.. వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో అసమ్మతి స్వరాలు, వర్గ విభేదాలను ఎట్టిపరిస్థితిలోనూ సహించేదిలేదన్నారు. …
Read More »జగన్ రెడ్డీ.. వడ్డీ వ్యాపారం చేస్తున్నావా?: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల నుంచి నీటి తీరువా వసూలును పవన్ కళ్యాణ్ ఖండించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామిక విధానమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి మరీ నీటి పన్నులు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం …
Read More »వైద్య రంగంలో మంచి మార్పు? వెరీ గుడ్ కేసీఆర్
విద్య మరియు వైద్య రంగాలకు ఊతం ఇవ్వడం ఇవాళ అత్యావశ్యకం. మునుపటి కన్నా వేగంగా నిర్ణయాల అమలు కేసీఆర్ ముందున్న ఏకైక సవాలు. పరిణామాలు మారుతున్నందున తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు కేసీఆర్ చేయాల్సిన కృషి ఎంతో ! తెలంగాణలో నిన్నటి వేళ మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులు ఆరంభం అయ్యాయి. టిమ్స్ పేరిట భాగ్యనగరిలో ఉప్పల్, అల్వాల్, ఎర్రగడ్డలో ఇవి శంకుస్థాపనకు నోచుకున్నాయి. ఓ విధంగా ఇప్పుడున్న …
Read More »నా గ్రాఫ్ 65 శాతం.. ఏపీ సీఎం
ఏపీ సీఎం జగన్.. సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, క్షేత్రస్థాయి నేతలతో ఆయన నిర్వహించిన సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా తన గ్రాఫ్ 65 శాతం ఉందని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేల్లో చాలామందికి 40 నుంచి 45 శాతమే గ్రాఫ్ ఉందని, ఎన్నికల నాటికి గ్రాఫ్ పెరగకపోతే మార్పులు తప్పవని జగన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ …
Read More »తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రాన్ని సాధించలేమా?
తెలంగాణ సాధించినోళ్లం.. కేంద్రంలో పాగా వేయలేమా? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిం చారు. టీఆర్ ఎస్ ప్లీనరీ ని ఉద్దేశించిన మాట్లాడిన ఆయన గతంలో తెలంగాణ కోసం.. పడిన కష్టాలను వివరించారు. ఇంతకన్నా కష్టపడాలా..? కేంద్రం కోసం.. అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను సాధించిన ఉత్తేజంతో కేంద్రంలోనూ పాగా వేయాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం.. తాను ఒక్కడిని అడుగు వేస్తే.. ఎన్నో అవమానాలు వచ్చాయనితెలిపారు. ఇప్పుడు కూడా …
Read More »పెట్రోల్ ధరలు మీ ఇష్టమేనా?: ప్రధాని ప్రశ్న
తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా భేటీ అయ్యారు. అయితే.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. ఆయన టీఆర్ ఎస్ ప్లీనరీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు ఏపీ, ఇటు తెలంగాణలకు ప్రధాని మోడీ గట్టి ప్రశ్న సంధించారు. ముఖ్యమంత్రుల సమావేశంలో పెట్రో ధరల అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని. సామాన్యులకు ఊరట కలిగించేలా గతేడాది నవంబర్లో కేంద్రం పెట్రో ఉత్పత్తులపై రూ.10 చొప్పున …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates