అనంతపురానికి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు.. పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ..సంచలనంగా మారాయి. పార్టీ తరపున ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ ఆదేశాల మేరకు నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల మధ్య ఉంటున్నారు. దీనిని చాలా సీరియస్గా తీసుకున్న సీఎం జగన్.. ఎట్టి పరిస్థితిలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి తీరాలని.. దీనిని బట్టే మార్కులు ఉంటాయని.. టికెట్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. …
Read More »కేసీఆర్.. తర్వాత స్టెప్పేంటి?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వేసిన అడుగులు.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో జరిగిన మార్పులు.. తెరవెనుక..జరుగుతున్న, జరిగిన పరిణామాలు.. వంటివి.. ఆయనకు షాక్ కొట్టించాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలోని మోడీకి భారీ షాక్ ఇవ్వాలని.. కేసీఆర్ అనుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి గెలిచినా..గెలవకపోయినా.. ఆయన గట్టి పోటీ ఇచ్చేలా చేసి.. బీజేపీ ఉమ్మడి అభర్థికి తక్కువ మెజారిటీతో విజయం సాధించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని …
Read More »కేంద్రం దూకుడును ఎలా అడ్డుకుందాం.. జగన్ అంతర్మథనం
తాజాగా రెండు రోజుల కింద నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తోంది. అత్యంత కీలకమైన రెండు విషయాల్లో కేంద్రం రాష్ట్రంపై ఫైర్ అయింది. అంతేకాదు.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేసింది. ఇదే సమయంలో జాతీయ మీడియా కూడా పలు వ్యతిరేక కథనాలను ప్రచారం చేసింది. వీటిలో ప్రధానంగా ఏపీ అప్పుల కుప్పగా మారిపోతోందని.. కేంద్రం గణాంకాల సయితంగా వెల్లడించింది. దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అధికంగా అప్పులు …
Read More »బ్రాండ్ హైదరాబాద్.. ఎప్పటికీ చంద్రబాబుదే: మాంటెక్ సింగ్
ఇటీవల కాలంలో బ్రాండ్ హైదరాబాద్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఆ మాటకు వస్తే హైదరాబాద్ ను మరో లెవల్ కు తీసుకెళ్లిన ఘనత తమ సొంతమన్నట్లుగా కల్వకుంట్ల ఫ్యామిలీ తెగ మాటలు చెబుతున్న పరిస్థితి. హైదరాబాద్ కు అసలు సిసలు బ్రాండ్ తీసుకొచ్చిన నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అన్న మాట ఎవరి నోటి నుంచైనా వస్తే చాలు.. …
Read More »ఉపరాష్ట్రపతి సినిమా కూడా అట్టర్ ఫ్లాపేనా ?
నాన్ ఎన్డీయే పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఎలా ఓడిపోయారో అందరు చూసిందే. నామినేషన్ వేసేంతవరకు ఒకటిగా ఉన్న ప్రతిపక్షాల్లో తర్వాత చాలావరకు యశ్వంత్ కు హ్యాండిచ్చాయి. యూపీఏలో భాగస్వామి అయిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా సీఎం హేమంత్ సోరేన్ అధికారికంగానే ఎన్డీయే అభ్యర్ధిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. తర్వాత చాలామంది ఏదో కారణం చెప్పి ముర్ముకే మద్దతుగా నిలిచారు. చివరకు ముర్ము …
Read More »సీఎం టూరుకు నో చెప్పడం ఏంటి?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగా సరికొత్త పంచాయతీ మొదలైంది. ఆగష్టు 1వ తేదీ సింగపూర్లో ప్రపంచ నగరాల సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కేజ్రీవాల్ కు ఆహ్వానం అందింది. సరే ఢిల్లీకి రాష్ట్ర హోదానే ఉన్నా పరిమితిమైన అధికారాలే ఉన్న విషయం తెలిసిందే. అయినా ఏ ముఖ్యమంత్రయినా విదేశీ పర్యటనలకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. అయితే ఇక్కడ కేజ్రీవాల్ కు ఒక సమస్యుంది. అవేమిటంటే …
Read More »ఏందీ రచ్చ నాని గారు?
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటలు, పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చీల్చేస్తారంటు ఎంపీ మీడియాతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీలో ఎంపీ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతుండగానే తాజాగా తన ఫెస్ బుక్ వాల్ పై మరో పోస్టు పెట్టారు. ‘యధార్ధవాది లోకవిరోధి’ అని …
Read More »#APHopeCBN ట్విట్టర్ ట్రెండింగ్లో సెకండ్ ప్లేస్
ఐటీడీపీ ప్రారంభించిన #APHopeCBN పేరిట హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్లో రెండో స్థానంలో నిలిచిం ది. వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. రాష్ట్రం.. చంద్రబాబు వైపు చూస్తోందంటూ ఐటీడీ పీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. వరదల్లో చిక్కుకున్న వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందలేదని చాలా మంది బాధితులు, వారి బంధువులు తీవ్ర ఆగ్రహం …
Read More »ఏపీకి కేంద్ర మంత్రి వార్నింగ్
ఉచిత బియ్యం పంపిణీకి ధాన్యం సేకరణకు కేంద్ర మంత్రి లింకుపెట్టారు. పేదలకు ప్రధానమంత్రి పేరుతో పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అందించకపోతే ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బియ్యం, వడ్లు సేకరణను వెంటనే నిలిపేస్తామంటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయెల్ తీవ్రంగా హెచ్చరించారు. పీఎంజీకేఏవై 6వ దశలో ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని పీయూష్ గుర్తుచేశారు. ప్రభుత్వ …
Read More »వీళ్ళని జగన్ పట్టించుకోవటం లేదా ?
పార్టీలోని కొందరు ప్రజా ప్రతినిధులను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదా ? అవుననే చెబుతున్నారు పార్టీ నేతలు. కారణాలు ఏవైనా కొందరు ప్రజాప్రతినిధులు జగన్ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో సదరు ప్రజా ప్రతినిదుల వైఖరి నచ్చక జగన్ కూడా వాళ్ళని దూరంగా పెట్టేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే జగన్ కు సదరు ప్రజాప్రతినిదులకు బాగా గ్యాప్ వచ్చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీళ్ళలో ఎంతమందికి జగన్ …
Read More »యోగికి భారీ షాక్.. సొంత మంత్రి రాజీనామా!
దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలకు షాకుల మీద షాకులు ఇవ్వటంతో మోడీ అండ్ కో టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది డబుల్ ఇంజిన్ సర్కారుతో దేశ ముఖచిత్రాన్ని మార్చేయొచ్చన్నట్లుగా గొప్పలు చెప్పే స్థానే.. తాజాగా అలాంటి డబుల్ ఇంజిన్ సర్కారులో కీలకమైన యూపీలోని యోగి ప్రభుత్వానికి పంచ్ పడింది. సొంత పార్టీకి చెందిన నీటిపారుదల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్న దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. …
Read More »మోడీ: తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు
రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. అది కూడా.. ప్రాంతీయ పార్టీలు.. విపక్ష కాంగ్రెస్, కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. ఇక, ఆయా రాష్ట్రాలు సర్దుబాటు చేసుకోకపోతే.. అక్కడ ప్రజలు తిరగబడతారు.. ముఖ్యమంత్రులను తరిమి కొడతారు.. అంటూ.. కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఓకే.. ఈ హెచ్చరికలు బాగానే ఉన్నాయి. అయితే.. అదే సమయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న అప్పులు మాత్రం ఎందుకు చెప్పలేదు? ఇదీ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates