కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరో చెప్పినవి కావు.. స్వయంగా రాజగోపాల్రెడ్డి పరోక్షంగా తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయన బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిసిపోయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్తో గట్టిగా కొట్లాడే పార్టీతోనే కలిసి ప్రయాణిస్తానని తాజాగా రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. అంటే తెలంగాణలో …
Read More »రాజ్య సభకు ఆ వివాదాస్పద క్రికెటర్
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సిక్కుల కోటలో కాంగ్రెస్, బీజీపీ సీట్లను చీపురు పెట్టి క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. భగవంత్ మాన్ వంటి యువనేతను పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. పంజాబ్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్…మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో, …
Read More »టీఢీపీ: హమ్మయ్య ! టాప్ క్లాస్ టాపిక్ దొరికిందోచ్ !
చాలా రోజులకు టీడీపీకి టాప్ క్లాస్ టాపిక్ ఒకటి దొరికింది.అదే జంగారెడ్డి గూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) సారా మరణాలు.దీనిపై నారా లోకేశ్ మొదలుకుని మిగతా నాయకులంతా అదే పనిగా మాట్లాడుతున్నారు.నిన్నటివేళ లోకేశ్ ఇంకాస్త గొంతు కూడా పెంచారు.పార్లమెంట్ వేదికగా కూడా టీడీపీ సభ్యులు ఇదే విషయాన్న ప్రస్తావించారు. యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం ఆ రోజు నడుచుకున్న తీరు ఇప్పటి …
Read More »తూచ్… పవన్ మీనింగ్ టీడీపీతో పొత్తు కాదట
‘రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సభలో బహిరంగంగానే పవన్ ప్రకటించారు. ఇపుడా ప్రకటనను కవర్ చేసుకోలేక జనసేన సీనియర్ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనవ్వను అని ఎవరైనా అంటే ఏమిటర్ధం ? పైగా అంతకుముందే వైసీపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు రెడీ అన్నట్లుగా ఒకమాట వదిలారు. దాంతో అందరూ …
Read More »రాజకీయాలొద్దు.. బ్రదర్ అనిల్ కు వార్నింగ్
వైసీపీ ప్రభుత్వంపై బ్రదర్ అనిల్ కుమార్ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనపై క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, ఎస్టీలు సంతోషంగా లేరని, అందుకే ఆయా సంఘాల ప్రతినిధులతో తాను భేటీలు నిర్వహిస్తున్నానని బ్రదర్ అనిల్ చెబుతున్నారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదంటూనే…ఏపీకి బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ సంచలన …
Read More »అప్పటి దేవత, ఇప్పటి దెయ్యమా?
కాంగ్రెస్ పార్టీ రాజకీయం విచిత్రంగా తయారవుతోంది. తాడే పామై కరుస్తుంది అనే సామెత కాంగ్రెస్ పార్టీని గమనిస్తే సరిగ్గా సరిపోతుంది. దశాబ్దాల పాటు గాంధీ ఫ్యామిలీయే పార్టీ నాయకత్వానికి శరణ్యమని బతిమలాడుకున్న నేతలే ఇపుడు గాంధీ ఫ్యామిలిని టార్గెట్ చేస్తున్నారు. సీనియర్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ నాయకత్వ బాధ్యతలనుండి గాంధీ ఫ్యామిలీ స్వచ్చంధంగా పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. మీరు తప్ప అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు …
Read More »వైసీపీపై ‘జనసేన’ ఎఫెక్ట్
అధికార పార్టీ వైసీపీ పై జనసేన ఎఫెక్ట్ పడిందా? సీఎం జగన్ యుద్ధప్రాతిపదిక కదిలారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే.. అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. కొమ్ములు విరిచేస్తాం.. అధికారంలోంచి దింపేస్తాం.. అంటూ.. వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా.. జాగ్రత్తలు పడతామని చెప్పారు. ఇవే వ్యాఖ్యలు అధికార …
Read More »జగన్ ఇగో ఇంకా చల్లారలేదా?
గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన సమస్యను మొదలుపెట్టిందే ప్రభుత్వం. ఏడాది పాటు ఆ సమస్యను సాగదీసి, సినీ ప్రముఖులను తమ వెంట తిప్పించుకుని, చివరికి చిరు లాంటి వాళ్లు చేతులు జోడించి వేడుకునేలా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలదే. ఐతే చిరు సహా కొందరు ప్రముఖులు పరిశ్రమ బాగు కోసమని ఎంత తగ్గాలో అంతా తగ్గారు. చివరికి నెల కిందట టికెట్ల రేట్ల పెంపుతో పాటు …
Read More »రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు
ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద ఇస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి ఖాతాల్లో ఆ ఎమౌంట్ పడుతుందని తెలిపారు. ఈ మేరకు వైసీపీ శాసనసభా పక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు కోట్ల రూపాయల నిధులను వాడుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నామన్నారు. “మీరు గ్రామాలకు వెళ్లినప్పుడు మరో రెండు మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్కమిటీలు.., ఎంపీటీసీలు… వీరంతా …
Read More »సర్వేలో మార్కులు పడితేనే టికెట్లు: సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? అనే విషయంపై సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాజాగా జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ఆయన మొహమాటంలేకుండా వెల్లడించారు. “ఒక్కమాట స్పష్టం చెప్తున్నాను. ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ చేయకపోతే.. సర్వేల్లో మీ పేర్లు రావు. సర్వేలలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు నిరాకరిస్తాను. మనం గెలవాలి.. అది మరిచిపోవద్దు. …
Read More »మీరే ప్రజల ఇళ్లకు వెళ్లాలి.. ఎమ్మెల్యేకు జగన్ క్లాస్
“మీ ఇంటికి ప్రజలు కాదు.. మీరే ప్రజల ఇళ్లకు వెళ్లాలి.. “ అని వైసీపీ ఎమ్మెల్యేకు పార్టీ అదినేత, సీఎం జగన్ క్లాస్ ఇచ్చారు. అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్ శాసనసభాపక్షనేత, ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోందన్నారు. ఇక నుంచి పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే …
Read More »మార్చి 27..మంత్రులకు జగన్ డెడ్ లైన్?
ఏపీ మంత్రివర్గ విస్తరణపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందుగా అనుకున్నట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ స్వయంగా ప్రకటించడంతో ఈ విషయంపై వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నేడు జరిగిన వైసీఎల్పీ సమావేశంలో జగన్ మంత్రి వర్గ విస్తరణ అంశంపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్యేలకు జగన్ షాకింగ్ విషయాలు వెల్లడించినట్లు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates