తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సమ్మిళిత వృద్ధి కొనసాగుతోందని అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండలో పర్యటించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో …
Read More »కేసీఆర్ నిర్ణయం సరైందే.. కానీ: బండి
తెలంగాణలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్పై ఎప్పుడూ నిప్పులు చెరిగే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. తాజాగా కూలయ్యారు. అంతేకాదు.. కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు. అయితే.. దీనిలో కొన్ని సవరణలు చేయాలని మాత్రం సూచించారు. తాజాగా బండి సంజయ్ సహా పలువురు నేతలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ గవర్నర్ను కలిశారు. గవర్నర్ తమిళసైకు వినతిపత్రం …
Read More »ప్లాన్ ప్రకారమే పీఆర్సీని నాన్చుతున్నారా?
11వ పీఆర్సీ నివేదికను బయట పెట్టాలని వెంటనే పీఆర్సీ ప్రకటనతో పాటు మిగతా 70 డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొంత కాలం నుంచి పోరాటం చేస్తున్నాయి. మధ్యలో సీఎస్, సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పీఆర్సీపై జగన్ కూడా సమీక్ష నిర్వహించినా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఉద్యోగుల ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం …
Read More »ముంబైలో లాక్ డౌన్ తప్పదా ?
క్షేత్రస్ధాయిలో పరిస్దితులు చూస్తుంటే ఇదే అనుమాన పెరిగిపోతోంది. ఎందుకంటే గడచిన 24 గంటల్లో దేశం మొత్తంమీద అత్యధికంగా మహారాష్ట్రలో 8 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం కేసుల్లో ఒక్క ముంబైలోనే 5300 కేసులు రిజిస్టరయ్యాయి. కరోనా వైరస్ మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన దగ్గర నుండి మహారాష్ట్రనే బాగా ఎఫెక్టవుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా దారావి ముంబైలోనే ఉండటమే కేసుల పెరుగుదలకు కారణాలనే ప్రచారం …
Read More »అమెరికా వణికిపోతోందా ?
మళ్ళీ అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. విజృంభిస్తున్న కరోనా వైరస్ అమెరికాను పూర్తిగా వణికించేస్తోంది. గడచిన 24 గంటల్లో అమెరికా మొత్తంమీద సుమారు 6 లక్షల కేసులు నమోదయ్యాయి. చాల కాలం తర్వాత ఇన్ని లక్షల కేసులు అమెరికాలో నమోద్దవటంతో సంచలనంగా మారింది. వీరిలో సుమారు 1400 మంది చనిపోవటంతో అగ్రరాజ్యంలో కలకలం మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సుమారు 22 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజ రోజుకు పెరిగిపోతున్నాయట. సగటున …
Read More »రఘురామకృష్ణరాజు పై సీబీఐ కోర్టులో చార్జిషీట్..
2021 చివరి రోజున నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నిత్యం తమ పార్టీకే చెందిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు.. ఆరోపణలు చేసే ఆయనే తప్పు చేశారని.. రూ.947 కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు కావటం సంచలనంగా మారింది. ఆర్థిక సంస్థలు.. బ్యాంకులను మోసం చేశారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. తమిళనాడులోని ట్యూటీకొరిన్ లో …
Read More »2021: జగన్ రివర్స్ గేర్.. ఎన్నికల్లో టాప్
ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ సంక్షేమ పాలనతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోన్న నవరత్నాల పేరుతో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల రూపంలో జగన్ ప్రజలకు డబ్బులు పంచుతూనే ఉన్నారు. అధికారంలోకి రాగానే కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం ఆయన తన నిర్ణయాల్లో కొన్నింటిని వెనక్కి తీసుకున్నారు. పాలనపరంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. కానీ రాజకీయాల పరంగా …
Read More »పుణ్యకాలం కాస్త ముగిశాక.. పట్టాభిషేకమా?
ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిని తిరిగి పుంజుకునేందుకు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రస్తుత ఆలోచనా విధానం ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఒక్కొక్కటిగా చేయి జారిపోతున్నాయి. ఇప్పుడు పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కూడా పరిస్థితులు పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయనే టాక్. ఈ నేపథ్యంలో వచ్చే …
Read More »జగ్గారెడ్డి లేఖ వెనక.. ఆ నేత?
రాజకీయా నాయకులంటేనే విభిన్నమైన ముఖాలకు పెట్టింది పేరు. వాళ్లు బయటకు ఒకలా కనిపించినా లోపల మరొకలా ఉంటారు. పైకా ఎలా మాట్లాడుకున్నా లోపల మాత్రం ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉంటాయి. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో అది మరీ ఎక్కువ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విబేధాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డితో పార్టీలోని సీనియర్లకు పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఇటీవల రేవంత్ను …
Read More »2021: బాబును ఏడిపించిన ఏడాది
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంతం. రాజకీయాల్లో ఎన్నో ఒడుదొడుకులు దాటిన ఆయన.. ఎంతో మంది మహామహులతో ఢీ కొట్టారు. కానీ తన రాజకీయ జీవితంలో తొలిసారి ఈ ఏడాదే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో బాబును ఏడిపించిన ఏడాదిగా 2021 నిలిచిపోతుంది. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఏడాదిలో జరిగిన …
Read More »2021: కేసీఆర్కు మిగిలిందేమిటీ?
రాజకీయ చాణక్యుడు అని తెలంగాణ సీఎం కేసీఆర్కు పేరుంది. ఆయన తిమ్మిని బొమ్మిని చేయగలరు. ఆయన వ్యూహాలకు తిరుగుండదనే అంతా చెప్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం సమయంలోనూ.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ప్రణాళికలు సమర్థంగా అమలు చేశారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా నిలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆయనకు సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా ఈ …
Read More »రాహుల్ ఇటలీ వెళితే.. ఇంత రచ్చనా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా ఇటలీకి వెళ్లిన వైనంపై బీజేపీ తప్పు పడుతోంది. బాధ్యత లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది. ఈ వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పడుతోంది. వ్యక్తిగత టూర్ ను ఎందుకింత రాద్దాంతం చేస్తారని ప్రశ్నిస్తోంది. ఇంతకూ ఏమైందంటే..ప్రస్తుతం దేశంలో కరోనా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. విదేశాలకు వెళ్లే వారు.. అక్కడి నుంచి వచ్చే వారు అప్రమత్తంగా ఉంటున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates