బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది అలియా. ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ సినిమా కోసం అలియాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంపై అలియా స్పందించింది కూడా. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు …
Read More »ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ఎర
చలో విజయవాడ విజయంతం కావడంతో ఉద్యోగుల ఆందోళన అధికార వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కార్యక్రమం సక్సెస్తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మె విషయంలోనూ ఇదే వేగంతో సాగేలా కనిపిస్తున్నారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ సమ్మె కానీ ఆరంభమైందంటే సీఎం జగన్కు ప్రభుత్వానికి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. అందుకే …
Read More »అసదుద్దీన్కు జడ్ కేటగిరీ భద్రత.. కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించింది. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై …
Read More »రాజీనామాకు రెడీ: బాలయ్య సంచలన ప్రకటన
హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీలక నాయకుడు, నటుడు బాలకృష్ణ.. సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న హిందూపురం ప్రాంతాన్ని కొత్తగా ఏర్పటు చేయనున్న శ్రీసత్యసాయి జిల్లాకు కేంద్రంగా చేయాలని కోరుతూ.. తాజాగా బాలయ్య రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మౌన దీక్ష చేపట్టారు. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం మౌన దీక్ష చేపట్టారు. దీక్షా స్థలానికి బాలయ్య …
Read More »జగన్ పీఆర్సీ చిక్కుముడిలో చిక్కుకుపోయారెలా?
ముడులు వేయటం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ.. వేసిన ముడులను విప్పదీయటం అంత సులువు కాదు. అలాంటిది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నమని చెబుతారు. ఒక సమస్య మీద పడినప్పుడు.. మరో సమస్యను తెర మీదకు తీసుకురావటం.. కొత్త సమస్య ముడిని వేసి.. పాత సమస్య ముడిని విప్పే విచిత్రమైన టాలెంట్ ఆయన సొంతం. సాధారణంగా ఒక సమస్య మీద పడినప్పుడు.. దాని నుంచి …
Read More »కాపుల కోరిక తీర్చిన జగన్
కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది. తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు …
Read More »మోడీ వెనకుడుగు చూసిన తర్వాత.. ఈ మాటలేంది సజ్జల?
పీఆర్సీ ఎపిసోడ్ లో ఇప్పటికే ఏపీ సర్కారుకు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేమీ ఫలించక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు లక్షలాదిగా విజయవాడకు చేరుకోవటం.. నిరసన ర్యాలీ సందర్భంగా లక్షల మంది ఒక చోటుకు చేరుకోవటానికి మించిన డ్యామేజీ మరేం ఉంటుంది? ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆచితూచి మాట్లాడం మానేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం వల్ల రచ్చ మరింత పెద్దది …
Read More »వారిద్దరి మౌనమే జగన్ కు శాపమైందా?
ఇష్యూ ఏదైనా సరే.. తనకు తగ్గట్లుగా మార్చుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మించినోళ్లు కనిపించరు. విపక్ష నేత చంద్రబాబు మాట్లాడినంతనే.. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని.. లోకేశ్ మాట్లాడే ఫారిన్ చదువుల గురించి.. జనసేన అధినేత పవన్ మాట్లాడితే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితోనూ.. సినిమా వాళ్లతోనై కౌంటర్ ఇచ్చేయటం.. డోసు సరిపోలేదంటే.. ఆయన పెళ్లిళ్ల మీద నానాయాగీ చేసేటోళ్లు జగన్ పరివారంలో సదా సిద్ధమన్నట్లుగా ఉంటారు. …
Read More »జగన్ అంతలా భయపడిపోయాడా ?
గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకిక ఎదురే లేదనుకున్నట్లే ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఎంత వ్యతిరేకత వచ్చినా ఇందులో ఒక 50 సీట్లు తగ్గి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన ధీమాతో ఉండి ఉండొచ్చు. తన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని.. వీటిని అందుకునే పేదలు తనతో ఉంటే చాలని, ఇంకెవరు ఏమైపోయినా పర్వాలేదని …
Read More »బండి సంజయ్ తో రేవంత్ భేటీ
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రధాన పాత్ర అయితే మిగతా కీలక పాత్రలో ఉండేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ , మరొకరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు ఎంపీలు కం జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ సీఎం పై విరుచుకుపడుతుంటారు. జాతీయ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తెలంగాణ సమస్యలను తమదైన శైలిలో వివరిస్తుంటారు. …
Read More »జగన్ హయాంలో అతి పెద్ద నిరసన
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు.. ఇసుక వేస్తే రాలనంతగా జనం. ఆకాశం బద్దలై ఉడిపడ్డరా.. నేల ఈనిందా అన్నట్లుగా కనుచూపు మేర ప్రజలే. ఎవరు వీళ్లంతా అనుకోవద్దు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులు. ఆ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలనే ఇవ్వాలనే డిమాండ్తో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని …
Read More »అండర్ గ్రౌండ్లోకి ఉద్యోగ నేతలు
ఛలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటంలో భాగంగా ఉద్యోగుల నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయటానికి పోలీసులు ఉద్యోగుల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవటంలో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్ రెడ్డి తదితరులు అండర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates