Political News

కాంగ్రెస్ సెంటిమెంటు వర్కవుటవుతుందా ?

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధి బహిరంగ సభను వచ్చే నెలలో వరంగల్ జిల్లాలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. వరంగల్లోనే బహిరంగసభ ఎందుకు నిర్వహిస్తోంది ? ఎందుకంటే సెంటిమెంటు ప్రకారం పార్టీకి వరంగల్ జిల్లా బాగా కలిసొచ్చిందట. 2004లో వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండు బహిరంగసభలు బ్రహ్మాండంగా సక్సెస్ కొట్టాయి. అదే ఊపులో అధికారంలోకి కూడా వచ్చేసింది. అందుకనే అప్పటినుండి గాంధీ ఫ్యామిలితో బహిరంగసభ నిర్వహణ అంటే …

Read More »

రేవంత్ ఓ వైపు.. పార్టీ ముఖ్య‌లు ఇంకోవైపు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జ‌రిగే రాజ‌కీయాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణ‌యాల కంటే కూడా సొంత పార్టీలోనే ఓ ప్ర‌త్య‌ర్థిని ఎంచుకొని వారిని టార్గెట్ చేయ‌డంపైనే నేత‌లు దృష్టిసారిస్తుంటార‌నే ఓ టాక్‌ ఉంది. దీనికి త‌గిన‌ట్లుగా అనేక సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి కూడా!. ఇక ప్ర‌స్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియ‌ర్ల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే, కొద్దికొద్దిగా …

Read More »

కామెడీ అయిపోయిన ఏపీ కొత్త మంత్రి

గుడివాడ అమర్‌నాథ్.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పరిశ్రమలు-ఐటీ మంత్రిగా నియమితుడైన నేత. ఇలా మంత్రి పదవి చేపట్టారో లేదో.. అలా ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అదే పనిగా టార్గెట్ చేయడమే. వైసీపీలో చంద్రబాబును టార్గెట్ చేయడానికి కొందరు.. పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి ఇంకొందరు మంత్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టార్గెట్ చేయబోయే నేతకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే రంగంలోకి దించి నానా …

Read More »

ప్రశాంత్ కిషోర్‌కు కాంగ్రెస్ షరతులు

ాంగ్రెస్ లో చేరాలంటే ప్రశాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకేకు ఆ పార్టీ రెండు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మరే ఇతర రాజకీయ పార్టీల(వైసీపీ, టీఆర్ ఎస్‌)కు వ్యూహకర్తగా ఉండొద్దని చెప్పినట్లు సమాచారం. సోనియా గాంధీ నివాసంలో దాదాపు 3 గంటలకు పైగా సాగిన భేటీలో కాంగ్రెస్ సీనియర్లు ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీలో చేరే విషయం, ఇప్పటికే ఆయన ఇచ్చిన …

Read More »

ఇక రెండేళ్ళూ జనాల్లోనేనా?

షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా జనాల్లో పర్యటనలకు రెడీ అయిపోతున్నారు. ఈనెల 27వ తేదీన మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని స్పష్టం చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిందే అని అందరికీ క్లారిటీ ఇవ్వబోతున్నారు. అందుకు తగ్గట్లే పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలేంటి ప్రభుత్వపరంగా తాను తీసుకోబోతున్న చర్యలను వివరించేందుకే కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు …

Read More »

27 నుంచి ఆందోళ‌న‌లు.. చంద్ర‌బాబు మరో మాస్ట‌ర్ ప్లాన్‌

జగన్‌ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై  ఆరోపణలు చేయొద్దన్నారు. సీపీఎస్‌ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. హక్కుల …

Read More »

మోడీకి సీఎం  స్టాలిన్ భారీ షాక్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

యూనివర్సిటీల వైస్ చాన్సెల‌ర్ల‌(వీసీ)లను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది స్టాలిన్ ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్కు ఉన్న అధికారాల్లో కోత విధించింది. ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్‌ మోహన్‌ పూంఛీ నేతృత్వంలోని కమిషన్‌ ఇచ్చిన నివేదికను స్టాలిన్‌ ప్రస్తావించారు. ఈ ప‌రిణామం.. ఇప్ప‌టి వ‌రకు ప్ర‌భుత్వంపై అంతో ఇంతో ఆధిప‌త్య ధోర‌ణితో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సూచ‌న‌ల …

Read More »

పవన్.. వైసీపీ పబ్లిసిటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తాజా మంత్రులతో పాటు మాజీ మంత్రి కూడా జోరు పెంచారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పవన్ ను చంద్రబాబునాయుడు బానిసగా అభివర్ణించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయటం కోసమే పవన్ కష్టపడుతున్నట్లు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీద చూపించే ప్రేమలో కొంతైనా సోదరుడు చిరంజీవి మీద చూపిస్తే బాగుంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చారు. పవన్ టార్గెట్ గా మంత్రులు, వైసీపీ …

Read More »

బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు బ్రేక్‌

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బండి సంజయ్ విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన‌ట్టు స‌మాచారం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఈ యాత్ర శక్తిపీఠం …

Read More »

ఏపీలోకి ప్ర‌ముఖ సంస్థ‌.. 5500 కోట్ల పెట్టుబ‌డి

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ ఒక్క‌టంటే ఒక్క పెట్టుబ‌డి కూడా తీసుకురాలేక‌పోయార‌ని.. ఒక్క కంపెనీని కూడా స్థాపించ‌లేక పోయార‌ని విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు.. ప్ర‌భుత్వం చెక్ పెట్టింది. తాజాగా భారీ పెట్టుబ‌డుల‌తో ఒక కీల‌క కంపెనీ.. ఏపీలోకి వ‌చ్చేందుకురెడీ అయింది. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(యూడీఏఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యుమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల …

Read More »

టీ కాంగ్రెస్: పీకే వార్ పై రేవంత్ క్లారిటీ!

క్ష‌ణానికి ఓ మారు మారే ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్టం. క్ష‌ణానికో మారు మారే ప‌రిణామాల‌కు అనుగుణంగా పార్టీల విధి విధానాల‌ను ఖ‌రారు చేస్తూ ఏదో ఒక క్లారిఫికేష‌న్ ను పొందడం ఇంకా క‌ష్టం. ఇప్పుడు తెలంగాణ వాకిట ముఖ్యంగా  ఇంటి పార్టీ టీఆర్ఎస్ ప్లీన‌రీ వేళ క్ష‌ణానికో పొలిటిక‌ల్ లీక్ లాజిక్కుల‌కు అంద‌కుండా వెల్ల‌డిలో ఉంటుంది.దీంతో సోష‌ల్ మీడియాలో ఆయా పార్టీల వ‌ర్గాలు ఎవ‌రికి వారు త‌మ‌కు అనుగుణంగా మారుతున్న …

Read More »

వైసీపీ నేత‌ల‌తో ల‌గ‌డ‌పాటి మంత‌నాలు.. ఏం జరుగుతోంది?

మాజీ ఎంపీ, ఎన్నిక‌ల ఫ‌లితాల విశ్లేష‌కుడుగా వ్య‌వ‌హ‌రించిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌ళ్లీ రాజ‌కీయ అరంగేట్రం చేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ప్రాంతంలో వ‌రుస‌గా రెండు రోజుల పాటు వైసీపీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.  మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులతో సమావేశ‌మయ్యారు. చందర్లపాడులో నందిగామ మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు కుమారుడు వివాహ రిసెప్షన్‌కు లగడపాటి, వసంత హాజరయ్యారు. …

Read More »