అనారోగ్య కారణాల వల్ల కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధి ఢిల్లీ మకాం ను తాత్కాలికంగా గోవాకు తరలించారు. చాలా కాలంగా సోనియా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన తీవ్రమైనపోయిన నేపధ్యంలో అర్జంటుగా ఆమెను తాత్కాలికంగా ఢిల్లీ నుండి షిఫ్టు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల తీవ్రత. ఇక రెండోదేమో ఢిల్లీలో పెరిగిపోతున్న వాయుకాలుష్యం. …
Read More »బీజేపీ వ్యూహం: టీడీపీ నేతలే టార్గెట్.. రీజన్ ఇదే!
రాజకీయాల్లో జంపింగులు షరా మామూలే! ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా.. కండువా కప్పేయడం పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. ఎంత మంది నేతలను గుంజేసుకుంటే.. అంత మంచిదనే ధోరణి అన్ని పార్టీల్లోనూ వ్యక్తం అవుతోంది. గెలుపు ఓటములతోనూ సంబంధం లేదు. బలాబలాలతోనూ సంబంధం లేదు. నాయకుడు వస్తానంటే.. చేర్చేసుకోవడమే అన్న ధోరణి అన్ని పార్టీల్లోనూ ఉంది. అయితే, దీనికి భిన్నంగా.. ఇప్పుడు ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఎంచుకున్న పార్టీల నుంచి …
Read More »ఆ ఎంఎల్ఏపై క్యాడరంతా మండిపోతున్నారా ?
నియోజకవర్గంలో ఇపుడీ అంశంపైనే చర్చ జరుగుతోంది. మొదటిసారి గెలిచిన ఎంఎల్ఏకి నేతలు, క్యాడర్ తో బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటి ? ఎంఎల్ఏ ఎవరు ? అనేదే కదా మీ డౌటు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గం ఎంఎల్ఏ బుర్రా మదుసూధన యాదవ్ గురించే ఇదంతా. 2014లో పోటీ చేసి ఓడిపోయిన యాదవ్ 2019 ఎన్నికల్లో 30 వేల ఓట్లకు పైగా మెజారిటి గెలిచారు. …
Read More »అభిమానించే వాళ్ళ నుండి జగన్ పై విమర్శలు మొదలయ్యాయా ?
జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళ నుండే విమర్శలు మొదలయ్యాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషన్ మధ్య అగాధం రోజురోజుకు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి మధ్య నడుస్తున్న లేఖల యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఈ నేపధ్యంలో మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ బాగా …
Read More »తిరుపతి లోక్ సభ గెలుపు కోసం పక్కా వ్యూహం
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశంపార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తోంది. అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించేసిన చంద్రబాబునాయుడు తాజాగా మరో 97 మందితో జంబో టీంను కూడా నియమించేశారు. ఈ 97 మంది బృందంలో పార్టీ నేతలే ఉంటారు. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, రాష్ట్ర కమిటి సభ్యులు మొత్తం మీద సీనియర్ నేతలనే చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ …
Read More »మండలి రద్దుపై జగన్ వెనక్కు తగ్గాడా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరిని శాసనమండలికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. మరికొందరకి ఎంఎల్సీ పదవులను ఇస్తానని హామీ ఇస్తున్నారు. అంటే జరుగుతున్నది చూస్తుంటే మండలి రద్దు సిఫారసుపై జగన్ వెనక్కు తగ్గినట్లేనా అనే డౌటు పెరిగిపోతోంది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే మండలిలో మాత్రం బిల్లులు వీగిపోయాయి. మండలిలో తమకే …
Read More »ఉపేంద్ర రాజకీయం.. ఇలా ఎలా సాధ్యం?
భ్రష్టుపట్టిపోయిన రాజకీయాల్ని మార్చేయాలని.. మార్చేస్తామని చాలామంది వినూత్న మార్గాల్లో ప్రయత్నించి విఫలమైన వాళ్లే. గత కొన్ని దశాబ్దాల్లో కొత్త తరహా రాజకీయం అంటూ వచ్చిన పార్టీల్లో ఆమ్ ఆద్మీ మినహాయిస్తే ఏదీ నిలబడలేదు. ఆ పార్టీ కూడా అర్బన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న ఢిల్లీలో మాత్రమే విజయవంతమైంది. కొన్నిసార్లు సంప్రదాయ రాజకీయాల్ని అనుసరించినప్పటికీ ఉన్నంతలో ఆ పార్టీలకు భిన్నంగానే కనిపిస్తోంది ఆమ్ ఆద్మీ. ఐతే ఆమ్ ఆద్మీ తరహాలో రాజకీయాల్ని …
Read More »ఎన్నికలు జరపకుండానే నిమ్మగడ్డ రిటైర్ అయిపోతారా ?
స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్ సంచలనంగా మారింది. నిమ్మగడ్డ గురించి జేసీ మాట్లాడుతూ వాయిదా పడిన ఎన్నికలను నిర్వహించకుండానే రిటైర్ అయిపోతారంటు తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ సహకారం లేకుండా నిమ్మగడ్డ ఒక్కరే ఎన్నికలను నిర్వహించగలరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ మళ్ళీ కోర్టుకెళితే తాను రిటైర్ అయ్యేలోగా కోర్టులో తీర్పు …
Read More »మంత్రి అయిన గంట లోనే రాజీనామా
మంత్రిగా బాద్యతలు తీసుకున్న గంటల్లోనే నితీష్ కుమార్ మంత్రివర్గ సహచరుడు మేవాలాల్ చౌదరి రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ మంత్రివర్గంలో జేడీయు ఎంఎల్ఏ, విద్యాశాఖ మేవాలాల్ చౌదరి కూడా ఒకరు. ఈయన గురువారం బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే తన పదవికి రాజీనామా చేయటం సంచలనంగా మారింది. మంత్రిగా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు ? తీసుకున్న గంటల వ్యవధిలోనే ఎందుకు రాజీనామా చేశారు అన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ …
Read More »జీహెచ్ఎంసి ఎన్నికలపై పవన్లో గందరగోళం ఎందుకు ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య ఏం జరుగుతోది ? ఇపుడిదే అంశం అందరిలోను చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామంటు జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించేశారు. ప్రకటనతో ఆగకుండా అభ్యర్ధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ కూడా అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసేసింది. ఇంతలో హఠాత్తుగా గురువారం ఓ ప్రచారం మొదలైంది. అదేమంటే బీజేపీ, జనసేనల …
Read More »బీజేపీ అధ్యక్షుడి నోట ఇవేం మాటలు?
రాజకీయ నాయకులు దూకుడుగా ఉండటం, ఆవేశంగా ఉండటం ఈ రోజుల్లో అవసరమే. పార్టీని నడిపించే వాళ్లు అలా ఉంటేనే జనాలకు నచ్చుతున్నారు. అందులోనూ అధికారంలో ఉన్న ఓ పెద్ద పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలని ప్రయత్నిస్తున్న పార్టీని నడిపిస్తున్న నాయకుడు అగ్రెసివ్గా ఉండటం అవసరమే. కానీ అగ్రెషన్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తే.. అర్థరహితమైన కామెంట్లు చేస్తే మాత్రం ఇబ్బందే. అప్పుడు అసలుకే మోసం వచ్చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ …
Read More »బీజేపీ గెలుపు సరే..వాస్తవ పరిస్ధితేంటో తెలుసా ?
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహారమే చాలా విచిత్రంగా మారిపోయింది. మరి ఏమి చూసుకుని రెచ్చిపోతున్నారో తెలీదు కానీ తిరుపతి పార్లమెంటు ఉఫఎన్నికలో గెలుపు తమదే అంటు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది 2024లో రాష్ట్రంలో అధికారంలోకి కూడా వచ్చేస్తున్నామంటూ భీకర ప్రకటనలు చేసేస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. గెలుపు సంగతి పక్కనపెట్టేస్తే అసలు బీజేపీకి తన ప్రత్యర్ధి ఎవరో అయినా తెలుసా అనే …
Read More »