Political News

బ్రేకింగ్.. సచివాలయం కూల్చివేతకు బ్రేక్

కరోనా విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్రటేరియట్ భవనాల కూల్చివేత పనుల్లో నిమగ్నం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికప్పుడు అత్యవసరంగా ఈ పని చేపట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్షేపించాయి. ఐతే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా సీరియస్‌గా సెక్రటేరియట్ కూల్చివేత పనులు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఐతే శుక్రవారం హైకోర్టు.. తెలంగాణ …

Read More »

ఎవరీ స్వప్న సురేశ్? ఆ రాష్ట్ర సీఎంకే చుక్కలు చూపించింది

గడిచిన కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో భారీగా కవర్ అవుతున్న ఒక ఉదంతం తెలుగు మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా పెద్దగా వార్తలు రాని పరిస్థితి. కరోనా ఎపిసోడ్ లో దేశంలోనే అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును సొంతం చేసుకున్నారు. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు కేరళలోనే. ఆ తర్వాత కూడా వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. అలాంటిది.. వైరస్ …

Read More »

కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కారు మరో వినూత్న ప్రయోగం

కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది. కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత …

Read More »

జగన్ చేసిన పని పవన్ ఎందుకు చేయరు?

2019 ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకైనా మంచిదని…ఒకటికి రెండు చోట్ల పోటీ చేశారు జనసేనాని పవన్. అయితే, ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పవన్ ఫ్యాన్స్ గాలి జనసేన గెలుపునకు సరిపోలేదు. జనసేనకు ఘోర పరాభవవం తప్పదేమో అన్న తరుణంలో చీకట్లో చిరుదివ్వెలా జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్….అనూహ్య విజయం సాధించి …

Read More »

ట్విట్టర్ ట్రెండ్: మంత్రిగారూ అడ్మిషన్ ప్లీజ్

తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో …

Read More »

భారత్‌లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్

రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని …

Read More »

రఘురామకృష్ణంరాజుతో మైండ్ గేమ్ మొదలు పెట్టిన జగన్

పార్టీలో ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైయస్ జగన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. రఘురామ గత కొంతకాలంగా చాలా వ్యూహాత్మకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఓ వైపు అధినేతను ప్రశంసిస్తూనే, పార్టీలో నేతలపై, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై జగన్ చర్యలు తీసుకోని విధంగా ముందుకు కదిలారు. దీంతో ఇప్పుడు జగన్ రివర్స్ స్ట్రాటజీలో వచ్చారు. రఘురామకృష్ణంరాజుపై నర్సాపురం నియోజకవర్గంలో వరుసగా …

Read More »

బీజేపీ చీలిపోతోందా..వైసీపీ చీల్చుతోందా?

ఏపీ బీజేపీ ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆ పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏకంగా వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు స్పంద‌న ఓ ర‌కంగా ఉంటే మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీరు భిన్నంగా ఉంద‌ని ప్ర‌స్తావించారు. త‌ద్వారా …

Read More »

కేసీఆర్ పాలన పై సై అంటోన్న తమిళ`సై

తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ల మధ్య సత్సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక విషయాలకు వీరిద్దరూ ప్రాధాన్యతనివ్వడ కావచ్చు….పాలన పరంగా కేసీఆర్ తో నరసింహన్ ఎప్పుడూ విభేదించకపోవడం కావచ్చు…ఏదైనా కానీ, వారిద్దరి మధ్య పెద్దగా విభేదాలు వచ్చినట్లు కనబడలేదు. అయితే, ప్రస్తుత గవర్నర్ తమిళ సైతో కేసీఆర్ కు పెద్దగా పొసగలేదన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ప్రధాని మోడీపై కేసీఆర్ కామెంట్స్ చేసిన తర్వాత ఏరికోరి …

Read More »

తెలంగాణలో ఎప్పటికి లాక్ డౌన్ ఉండనట్లే.. !

పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు నమోదయ్యే వందలు కాస్తా పదిహేనువందలకు చేరుకున్నపరిస్థితి. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ పుణ్యమా అని.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వీయ లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పలు వాణిజ్య సంస్థలు తమకు తాముగా స్వీయ నియంత్రణ విధించుకొని షాపుల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లాక్ డౌన్ విధించేందుకు సిద్ధమవుతుందన్న వాదన జోరుగా వినిపించింది. అందరి అంచనాల్ని …

Read More »

#sukanyarapistrahulgandhi.. ఎందుకు ట్రెండ్ అవుతోంది?

రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. కానీ అది మంచి కారణంతో కాదు. ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. #sukanyarapistrahulgandhi.. ఇదీ ఆ హ్యాష్ ట్యాగ్. రాహుల్ గాంధీ ఏంటి.. రేప్ కేసు ఏంటి అనిపిస్తోందా? ఆయన మీద ఒక రేప్ కేసు ఉన్న మాట వాస్తవం. ఒకప్పుడు ఆ కేసు సంచలనం రేపింది. 13 …

Read More »

కరోనాపై అవగాహన పెంచి.. చివరికి కరోనాకే బలై

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులే చివరికి ఆ వైరస్ బారిన పడి ప్రాణాలు వదులుతున్న విషాదాంతాలూ చూస్తున్నాం. కరోనాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పిన వాళ్లు సైతం చివరికి ఆ వైరస్ బాధితులుగా మారుతున్నారు. తాజాగా అలా కరోనా బాధితుడిగా మారిన ఓ రచయిత, గాయకుడు ప్రాణాలు వదిలిన విషాదాంతం హైదరాబాద్‌లోనే చోటు చేసుకుంది. సామాజిక అంశాల మీద గద్దర్ తరహాలో పాటలు రాసి, పాడటం ద్వారా నయా …

Read More »