Political News

జ‌గ‌న్ నిర్ల‌క్ష్యం.. ఓట‌ర్ల‌కు లాఠీ దెబ్బ‌లు!

ఓట్లు కావాలి-సీట్లు కావాలి.. త‌మ‌దే పైచేయి అని చెప్పుకోవాలి! ఇదే సూత్రంగా ఎన్నిక‌ల‌కు వెళ్తున్న వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా పార్టీ అదిష్టానం.. సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ముఖ్యంగా ఓట‌ర్ల‌కు అను కూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. లేదనే చెప్పాలి. జ‌గ‌న్ నిర్వాకంతో.. ఓట‌ర్లు.. పోలీసుల లాఠీ దెబ్బ‌లు తింటున్నారు. ఓటు వేయాల‌ని ప‌దే ప‌దే ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కులు.. మ‌రి ఓట‌ర్ల‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌డంలోను, వారికి …

Read More »

అన్నీ అనుకున్న‌ట్టు లేదు.. జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం వెన‌క ?

తిరుప‌తి నేత‌ల విష‌యంలో జ‌గ‌న్ ప‌రేషాన్ అవుతున్నారా ?  తాను వేసుకున్న అంచ‌నాల మేర‌కు నేత‌లు ప‌నిచేయ‌డం లేద‌ని.. స్ప‌‌ష్ట‌మైందా ?  లేక‌.. ఇప్పుడు పెరిగిన తిరుపతి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి సెగ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక వేడి.. వైసీపీకి బాగానే ఉంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. టీడీపీ ఒక‌వైపు.. బీజేపీ మ‌రో వైపు.. …

Read More »

టీఆర్ఎస్‌లో కేటీఆర్ డ్రాప్‌… ఇదే హాట్ టాపిక్ ?

ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాకుండా… అధికార టీఆర్ఎస్‌లోనే ఇదే అంశంపై విస్తృత‌మైన చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. గ‌త కొన్నేళ్లుగా తెలంగాణ‌లో ఏ ఎన్నిక జ‌రిగినా.. ఉప ఎన్నిక జ‌రిగినా యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ హంగామానే క‌న‌ప‌డేది. ఎన్నిక‌ల్లో కారు పార్టీ గెలుపులో కేటీఆర్ వ్యూహాలే కీల‌కంగా ఉండేవి. అయితే దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఆయ‌న పాత్ర నామ‌మాత్ర‌మ‌వుతోందా ?అన్న సందేహాలు ఉన్నాయి. దుబ్బాక మెద‌క్ జిల్లాలో ఉండ‌డం..ఆ జిల్లా …

Read More »

దీక్షితులు ఎఫెక్ట్‌: ప్ల‌స్ క‌న్నా మైన‌స్ ఎక్కువా ?

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను నారాయ‌ణ‌మూర్తిగా అభివ‌ర్ణిస్తూ.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం మాజీ ప్ర‌ధాన అర్చుకుడు ర‌మ‌ణ దీక్షితులు చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీకి ప్ల‌స్ క‌న్నా మైన‌స్‌గానే ఎక్కువ‌గా మారాయి. ఆ పార్టీ నేత‌లు.. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేక పోతున్నారు.. మ‌రోవైపు.. సొంత పార్టీకి చెందిన అస‌మ్మ‌తి ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఈ వ్యాఖ్య‌లను దుయ్య‌బ‌ట్టారు. దీంతో ర‌మ‌ణ దీక్షితులు త‌న‌కు తాను వైసీపీకి మైలేజీ ఇచ్చుకున్నాన‌ని చెప్పుకొనే …

Read More »

తిరుప‌తిలో జ‌గ‌న్ ఆశ‌లు ఆవిరేనా… వైసీపీలో చ‌ర్చ..‌!

తిరుప‌తిలో ఏం జరుగుతుంది ? వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు భారీ మెజారిటీ.. అంటే 3-4 ల‌క్ష‌ల ఓట్ల ఆధిక్యం ఉంటుందా ? ఆ దిశ‌గా పార్టీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయా? ఇప్పుడు ఇదే విష‌యంపై వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి భారీ ఎత్తున అభ్య‌ర్థులు పోటీ చేస్తుండ‌డం. మ‌రోవైపు.. బీజేపీ త‌ర‌ఫున కేంద్రంలోని పెద్ద‌లు ఇక్క‌డ‌కు …

Read More »

సాగ‌ర్లో సీన్ మారుతోంది…!

తెలంగాణ‌లో ఉప ఎన్నిక జ‌రుగుతోన్న నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ స్థానంలో విజ‌యం ఎవ‌రిది ? అన్న‌ది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ‌గా మారింది. మామూలుగా అయితే ఇక్క‌డ ఏ ఉప ఎన్నిక జ‌రిగినా టీఆర్ఎస్‌కు తిరుగు ఉండ‌ద‌న్న అభిప్రాయ‌మే నిన్న‌టి వ‌ర‌కు ఉంది. ఎప్పుడు అయితే దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ? ఆ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఊహించ‌ని విధంగా కార్పోరేట‌ర్ …

Read More »

అమ్మకానికి విశాఖ సర్కారీ భూములు.. రూ.1500 కోట్లే లక్ష్యం

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడికుల్లో ఉన్న ఏపీ రాష్ట్ర సర్కారు.. ఆదాయ వనరు కోసం విపరీతంగా గాలిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టటం లేదు. రానున్న రోజుల్లో పరిపాలనా రాజధానిగా భావిస్తున్న వివాఖపట్నంలో ఖరీదైన ప్రభుత్వ భూముల్ని అమ్మకానికి పెట్టేసింది. బీచ్ రోడ్డు లోని 13.59 ఎకరాలతోపాటు.. మొత్తం 18 ఆస్తుల్ని అమ్మకానికి సిద్ధమైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా …

Read More »

ఏపీ సర్కారు ఎంత అప్పు చేయాలో డిసైడ్ చేసిన కేంద్రం

జింక వేగంతో పరుగు పెడుతున్న ఏపీ అప్పులపై కేంద్రం ఒక కన్నేసి ఉంచింది. కొత్త నియంత్రణ పెట్టేసింది. ఏపీ రాష్ట్రం ఇప్పటి నుంచి తనకు అవసరమైనంత అప్పు చేయలేని పరిస్థితి. తాజాగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రుణాలు తీసుకొని ఖర్చులు చేసే వీలు లేని పరిస్థితి. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నెట్ బారోయింగ్ సీలింగ్ ఎంతన్నది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఇందులోనే అన్ని రకాల …

Read More »

హై కోర్టు ఎందుకు బ్రేకులు వేసింది ?

పరిషత్ ఎన్నికలకు హైకోర్టు ఎందుకు బ్రేకులు వేసిందో అధికారపార్టీ నేతలకు అర్ధం కావటంలేదు. ప్రతిపక్షాలేమో రెండు అంశాలపై కోర్టులో కేసులు వేశాయి. ఏడాది క్రితం నోటిఫికేషన్ను రద్దుచేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలన్నది మొదటి అంశం. ఇక రెండోదేమో ఎన్నికల నోటిఫికేషన్ కు నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలన్న సుప్రింకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్నది. అయితే ఈ రెండు అంశాలను పరిశీలించిన హైకోర్టు పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని …

Read More »

కేసీఆర్ ‘ఫ్యామిలీ’ని టచ్ చేసిన షర్మిల

పార్టీ పెట్టలేదు కానీ.. రోజుకో కార్యక్రమాన్నిపక్కాగా నిర్వహిస్తూ.. ఏదో ఒక రీతిలో మీడియాలో తన పేరు వినపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. అయితే జిల్లాల నుంచి.. లేదంటే హైదరాబాద్ కు చెందిన ఎవరో ఒకరు తనతో భేటీ అయ్యేలా ఆమె చేస్తున్న ప్లానింగ్ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. తాజాగా ఆమెను మాజీ డీజీపీ సర్వరణ్ జీత్ సేన్ భేటీ అయ్యారు. తన భార్యతో కలిసి ఆయన.. లోటస్ పాండ్ …

Read More »

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా? ఎంపీ పిటిష‌న్‌తో హీటెక్కిన పాలిటిక్స్‌

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్ద‌వుతుందా?– ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అస‌మ్మ‌తి నాయ‌కుడు.. న‌ర‌సాపురం ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. హైకోర్టులో పిటిష‌న్ వేశారు. సీబీఐ కోర్టులో ఉన్న అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఏ-1గా ఉన్న సీఎం జగన్‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని కోర్టును అభ్య‌ర్థించారు. ఇప్ప‌టికే జ‌గ‌న్‌పై 11 సీబీఐ ఛార్జిషీట్లు వేసింద‌ని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో జ‌గ‌న్‌ …

Read More »

టీడీపీలో స్పష్టంగా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా ?

తెలుగుదేశంపార్టీలో కూడా కాంగ్రెస్ లాంటి పూర్తి ప్రజాస్వామ్యం లక్షణాలు వచ్చేసినట్లుంది. కాంగ్రెస్ లో అంటే పై స్ధాయిలో ఒకటి చెబితే ఇష్టముంటే పాటిస్తారు లేకపోతే తమిష్టం వచ్చింది చేసుకుపోతారు. కాంగ్రెస్ లో అంటే ఏమి చేసినా చెల్లిపోతుంది. ఎందుకంటే అది జాతీయపార్టీ కాబట్టి. కానీ ప్రైవేటు ప్రాపర్టీ లాంటి ప్రాంతీయపార్టీ టీడీపీలో కూడా అలాంటి లక్షణాలు బాగా వచ్చేసినట్లు అర్ధమవుతోంది. అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలను, ప్రకటనలను కొందరు సీనియర్లు దిక్కరిస్తున్నారంటే …

Read More »