Political News

స‌హనం కోల్పోతున్న ధ‌ర్మాన‌.. మ‌హిళ‌ల‌పై విసుర్లు

ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ఆస‌రా నిధుల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారుతున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. తాజాగా శ్రీకాకుళంలోని రాగోలులో ‘జగనన్న ఆసరా’ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి ధ‌ర్మాన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌పై విరుచుకుప‌డ్డారు. …

Read More »

ఢిల్లీ ఎందుకు వచ్చాడో చప్పేసిన పవన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌ర‌సుగా ఆయ‌న బీజేపీ పెద్ద‌ల‌ను అక్క‌డ క‌లుస్తున్నా రు. రెండో రోజు మంగ‌ళ‌వారం స్వ‌యంగా మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. ఢిల్లీకి ఎందుకు వ‌చ్చిందీ వివ‌రించారు. ఏపీలో వైసీపీ పాల‌న‌కు విముక్తి క‌లిగించ‌డ‌మే అజెండాగా తాను డిల్లీలో ప‌ర్య‌టిస్తున్న‌ట్టు చెప్పారు. వైసీపీ పాల‌న‌లో ఏపీ భ్ర‌ష్టు ప‌ట్టిపోయింద న్నారు. ఏపీలో అన్ని వ్య‌వ‌స్థ‌లు నాశ‌నం అయ్యాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజ‌ధాని లేదు. …

Read More »

Hyderabad అభివృద్ధి పై రీల్‌ కాన్టెస్ట్‌.. ప్రైజ్ మ‌నీ ల‌క్ష‌!

అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ రాజ‌ధాని Hyderabad పై 60 సెకన్ల నిడివితో రీల్‌ తీస్తే.. చాలు.. రూ.ల‌క్ష గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించింది తెలంగాణ ప్ర‌భుత్వం. హైదరాబాద్‌ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌ రీల్స్‌ కాంటెస్ట్‌’ నిర్వహిస్తోంది. ప్రైజ్‌ మనీ కింద విజేతకు రూ.50,000, ఫస్ట్‌ రన్నరప్‌ రూ.25,000, సెకండ్‌ రన్నరప్‌ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్‌ ప్రైజ్‌ రూ.5వేలు చొప్పున.. మొత్తంగా రూ.ల‌క్ష‌ ఇవ్వనున్నట్టు తెలంగాణ …

Read More »

కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని బండకు బాదేసినట్లుగా బండి మాటలు

నోటి మాటకు ఎంత దురుసు ఉంటే.. అంత త్వరగా రాజకీయాల్లో పాపులర్ కావొచ్చు. ఎదుటోడు ఎంతటి తోపు అయితే మాత్రం.. లెక్క చేయకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడినంతనే.. అతడి మాటల్లోని మాటల కంటే కూడా సదరు నేత తెగింపునకు ముచ్చటపడే రోజులు వచ్చేశాయి. అదే ధోరణి.. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది. తాను టార్గెట్ చేసినోళ్లు ఎంతటోళ్లైనా ఏ మాత్రం కనికరం లేకుండా …

Read More »

ప‌వ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా?

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వ‌రుస‌గా రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమ‌యంలో కేంద్రలోని కీల‌క నేత‌లు, కేంద్ర మంత్రుల‌తో ఆయ‌న‌ వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌తో సమావేశమైన ఆయన.. మంగ‌ళ‌వారం మరికొంద‌రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌.. రాజస్థాన్‌లోని …

Read More »

ఇక్కడ ప్రత్యర్ధులు ఫైనలైపోయారా ?

చంద్రగిరిలో ప్రత్యర్ధులు ఫైనల్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. తనకు బదులు కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చాలాకాలంగా కోరుతున్నారు. ఇంతకాలం ఏమీ చెప్పని జగన్మోహన్ రెడ్డి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏనే ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంఎల్ఏ …

Read More »

బాపట్ల ఎమ్మెల్యేకు కష్టకాలం

కోన రఘుపతి. ఒకప్పటి కాంగ్రెస్ స్ట్రాంగ్ మేన్, మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు కుమారుడు. జగన్ వైసీపీని పెట్టినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు. వరుసగా రెండో సారి బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఇంకొకరు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగా చెప్పుకోవాలి. ఇప్పుడు కోన రఘుపతికి కష్టకాలం వచ్చిందంటున్నారు. బాపట్ల గడ్డ, కోన రఘుపతి …

Read More »

ధర్మానతో డ్యామేజీ జరుగుతోందా ?

ధర్మాన ప్రసాదరావు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సీనియర్ రాజకీయ నేత. ఏ అంశంమీద అయినా అనర్ఘళంగా మాట్లాడగలిగిన కెపాసిటి ఉంది. మాటలు కూడా జాగ్రత్తగా బ్యాలెన్సుడుగానే ఉంటాయి. అయితే ఈ మధ్య మాట్లాడుతున్న తీరే కాస్త వివాదాస్పదంగా ఉంటోంది. తాను ఏమి మాట్లాడుతున్నారో తనకు అర్ధమవుతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సమయంలో ధర్మాన మాట్లాడుతూ తమ ప్రభుత్వం …

Read More »

జగన్ లో మార్పు… ఎమ్మెల్యేలు హ్యాపీ

గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. నాలుగు ఎంఎల్సీ ఎన్నికల ఓటమితో జగన్ దూకుడు తగ్గిందనే అనుకోవాలి. ఇంతకుముందు వర్క్ షాపులు ఎప్పుడు నిర్వహించినా గడపగడపకు వైసీపీ ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ రిజల్టును చదివి వినిపించేవారు. కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎంఎల్ఏల పేర్లు చదవి గట్టిగా మందలించేవారు. టికెట్ల విషయంలో సీరియస్ వార్నింగులిచ్చేవారు. కానీ తాజా మీటింగులో అలాంటి వార్నింగులేవీ లేవు. బుజ్జగింపులు, కర్తవ్యబోధ, టార్గెట్ చేరుకోవటానికి అవసరమైన మార్గనిర్దేశకత్వంతోనే …

Read More »

విజయవాడ కాదు వైజాగ్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా…

2022 డిసెంబరు 9న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుంచి కేసీఆర్ పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ 12 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ఆశలు వదులుకున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. జనవరి 2న కొందరు …

Read More »

ఎన్నికలొచ్చాయి.. స్వామీజీ మళ్లీ యాక్టివ్

భారత దేశంలో పౌరుల జీవితానికి మతానికి విడదీయరాని సంబంధం ఉంది. రోజూవారీ కార్యక్రమాల్లో కూడా మతాచారాలను పాటిస్తూనే ఉంటారు.మతం కోసం యుద్ధాలకు కూడా సిద్ధపడే వారున్నారు. అందుకే స్వామీజీలకు మంచి డిమాండ్ ఉంటుంది.నిజానికి జనంలో మంచిని బోధించే స్వామీజీలు చాలా మంది ఉన్నారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద కూడా జనంలో సత్ ప్రవర్తన ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కాకపోతే ఆయన తర్వాతి కాలంలోనే కొంత రాజకీయం …

Read More »

ఏపీలో ముంద‌స్తు ఫ‌లించేనా… గ‌తం ఏం చెబుతోంది…?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ముంద‌స్తు ఎన్నిక‌లు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఈ ఏడాది అక్టోబ‌రులో జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని తెలంగాణ‌తో స‌మానంగా ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. న‌వంబ‌రులో నే నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌ని.. డిసెంబ‌రు నాటికి ఎన్నిక‌లు కూడా పూర్త‌యి.. అదే నెల‌లో ప్ర‌భుత్వం కూడా ఏర్ప‌డుతుంద‌ని.. సోష‌ల్ మీడియాలో డేట్ల వారీగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మ‌ని …

Read More »