చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే ఆయన అక్కడకు చేరుకున్నారు. అయితే.. ఈ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. కుప్పం నుంచి వెళ్లాల్సిన ప్రచార రథం, ఇతర వాహనాలను నిలిపివేశారు. దీంతో శాంతిపురం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్.గొల్లపల్లి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కనీస హెచ్చరికలు …
Read More »సీతక్క వారసుడు సిద్ధం.. పోటీకి రెడీ అవుతున్న సూర్య
తెలంగాణలో ఎమ్మెల్యే సీతక్కకు ఉన్న పాపులారిటీ చాలా ప్రత్యేకం. ఆమె విప్లవ నేపథ్యం, నిత్యం ప్రజల్లో ఉండే నైజం, నిరాడంబరత.. రాజకీయాలలోకి వచ్చిన తరువాత వేసిన ఎత్తుగడలు… సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో తెలియడం.. ఒకటేమిటి.. తెలంగాణలో పార్టీలకు అతీతంగా సీతక్క పాపులర్. అలాంటి సీతక్క ఇప్పుడు తన రాజకీయ వారసుడిని బరిలో దించడానికి సిద్ధమవుతోంది. ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తన కుమారుడు సూర్యను పినపాక నుంచి పోటీ …
Read More »ఉయ్యూరు నాకు మంచి మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే సంచనల వ్యాఖ్యలు
ఇటీవల గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ అనే సంస్థ పేదలకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి.. ముగ్గురు మహిళలు చనిపోయారు. అదేసమయంలో మరికొందరు కూడా గాయపడ్డారు. అయితే.. ఈ విషయంపై రాజకీయ దుమారం రేగింది. వైసీపీ నేతలు.. చంద్రబాబు, టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక, పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఉయ్యూరు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, …
Read More »కుప్పంలో నువ్వానేనా? సవాల్ విసరనున్న చంద్రబాబు
ఏపీలో రోడ్ షోలపై ఆంక్షల నిర్ణయంతో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో ప్రకారం చంద్రబాబు కుప్పం సభ, రోడ్ షోకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కానీ, టీడీపీ కుప్పం నాయకులు మాత్రం చంద్రబాబు పర్యటన జరిగి తీరుతుంది అంటూ పట్టుపడుతున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సీరియస్గా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో పాల్గొనేవారికి ఇబ్బందులు …
Read More »ట్రోల్ అవ్వడం తప్ప కేసీఆర్ ఏం సాధిస్తున్నట్లు?
ఏ ముహూర్తాన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను కాస్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చాడో కానీ.. ఈ మార్పు వల్ల ఆయన కొత్తగా ఏం సాధిస్తున్నది లేకపోగా.. పార్టీకి ఎక్కువ డ్యామేజే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పుట్టిందే విభజన రాజకీయం మీద. అలాంటిది దేశం మొత్తాన్ని కలుపుకుపోతాం.. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తాం అంటుంటే జనాలకు కామెడీగా అనిపిస్తోంది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏదైనా కార్యక్రమాలు …
Read More »ఉద్యోగులకు జీతాల్లేవు కానీ జగన్కు 19 హైఎండ్ కొత్త కార్లు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరినడిగినా చెప్పేది ఒకటే… ఉద్యోగులకు జీతాలు లేవు.. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు లేవు.. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు… అభివృద్ధి పనులకు నిధులు లేవు.. సంక్షేమ పథకాలలో కోతలు.. అంటూ పెద్ద లిస్టే వినిపిస్తున్నారు. అంత ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి మాత్రం ఇప్పుడు కొత్తగా 19 అధునాతన కార్లు కొంటున్నారని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ఏపీ ప్రభుత్వం టయోటా ఫార్చ్యూనర్ …
Read More »చంద్రబాబువి.. ఫొటో షూట్-డ్రోన్ షాట్ రాజకీయాలు: జగన్
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. చంద్రబాబు రాజకీయాలు కేవలం .. ఫొటో షూట్-డ్రోన్ షాట్ పాలిటిక్స్ అని విమర్శలు గుప్పించారు. బాబు చేసేవి శవరాజకీయాలేనని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీ రామారావును అడ్డుపెట్టుకుని శవరాజకీయాలు చేశారని మండిపడ్డారు. రాజమండ్రిలో పెరిగిన పింఛను 2750 పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై రుసరుసలాడారు. ‘‘ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచింది …
Read More »ఎవరా సిట్టింగులు? ఏంటా కథ? కేసీఆర్ వ్యూహమేంటి?
ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఏపీలో సిట్టింగు ఎమ్మెల్యేలు అంటే.. మెజారిటీగా ఉన్నది వైసీపీలోనే. బహుశ వీరిని కార్నర్ చేస్తూనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది రాజకీయ వర్గాల అనుమానం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అనేది చర్చకు వస్తున్న అంశం. …
Read More »ఆయన ఔట్.. ఈయనకు లాస్ట్ వార్నింగ్
సింహపురి శిరోభారాన్ని వదిలించుకునేందుకు సీఎం జగన్ కొత్త ప్లాన్ రెడీ చేశారు. అలిగి, అవస్థల పాలు చేస్తున్న సొంత పార్టీ నేతలను దారికి తెచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. తమలో తాము కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొందరు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుంటే… మరి కొందరు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంత కాలం తర్వాత దారికి వస్తారులే అని వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. వారి వైఖరి …
Read More »రోడ్షోలపై నిషేధం.. లోకేశ్, పవన్ యాత్రలు ఆపేందుకేనా?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్ షోలు, రోడ్లపై సభలు.. ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు వేటిపైన కానీ… రోడ్ మార్జిన్లలో కానీ సభలు, ర్యాలీలకు అనుమతించరాదని ఆ ఉత్తర్వులలో స్పష్టం చేసింది. అయితే… ప్రత్యేక సందర్భాలలో జిల్లా ఎస్పీలు కానీ పోలీస్ కమిషనర్లు కానీ షరతులతో అనుమతులు ఇవ్వొచ్చంటూ మినహాయింపులు ఇచ్చింది. …
Read More »తోట, రావెల.. వీరి ప్రభావం ఎంత?
ఏపీలో రాజకీయ సంచలనం అని కొందరు అంటున్నా.. అంతటి రేంజ్ అయితే.. కాకపోయినా.. కొందరు మాత్రం వెళ్లి భారత రాష్ట్ర సమితి.. బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడం మాత్రం సహజంగానే రాజకీయాలను వేడెక్కించింది. తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్బాబులు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షం లో బీఆర్ఎస్ గూటికి చేరుకున్న దరిమిలా..ఏపీలో ఏదో జరిగిపోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు …
Read More »తెలంగాణ మంత్రులు కరెంటు దొంగలు : పేర్ని నాని
తెలంగాణ మంత్రుల పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏపీకి వచ్చి.. ఇక్కడ ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి దొంగ కరెంట్ తీసుకుంటున్న దొంగలు.. అని సంచలన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేయడంలో తప్పు లేదని.. కేఏ పాల్ కూడా 175 స్థానాల్లో పోటీ చేశాడని.. వీరి పరిస్థితి కూడా అంతేనని ఎద్దేవా చేశారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates