హాథ్రస్లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రాత్రికిరాత్రికి పోలీసులు దహనం చేసిన తరువాత యోగి ప్రభుత్వంపై ముందెన్నడూ లేనంత విమర్శలు వచ్చాయి. ఈ దేశంలో మోదీకి, యోగి ఆదిత్యనాథ్కు విమర్శలు కొత్తేమీ కానప్పటికీ ఈసారి రాహుల్ గాంధీకి కాస్త మైలేజ్ రావడం.. నిన్న రాహుల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొద్ది నిమిషాలకే యోగి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాహుల్ ప్రభావం కనిపించింది. …
Read More »ఢిల్లీ చేరిన జల జగడం.. కేంద్రం మొగ్గు ఎటు?!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కత్తులు నూరుతున్న జల వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. మంగళవారం (ఈ నెల 6) కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు .. జగన్, కేసీఆర్లతో చర్చలు జరపనున్నారు. నిజానికి ఇది ఏపీలోనో.. తెలంగాణలోనో.. జరిగితే.. ఇంపాక్ట్ వేరేగా ఉండేది. కానీ, నేరుగా ఢిల్లాలోనే వెబినార్లో నిర్వహిస్తున్నారు. దీంతో ఆసక్తి మరింత పెరిగింది. ఏపీ ప్రభుత్వం కరువు పీడిత …
Read More »మోస్ట్ వాంటెడ్ పీకే
పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో పార్టీలను గెలిపించి….మరెందరినో గెలుపు గుర్రాలెక్కించారు. తన టీం 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, 2015లో బిహార్లో మహా ఘట్ బంధన్, 2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఏపీ ఎన్నికల్లో వైసీపీ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్…ఇవన్నీ పీకే విజయగాథలు. 2017లో …
Read More »ఎన్డీఏకి ఎల్జేపీ షాక్…పాశ్వాన్ వేరు కుంపటి
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏకి ఎల్జేపీ పెద్ద షాకే ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమితో కలిసి పోటి చేయటానికి తమకు ఇష్టం లేదని లోక్ జనశక్తిపార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చిరాగ్ తండ్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్న సమయంలో చిరాగ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 243 అసెబ్లీ …
Read More »చైనా, పాకిస్దాన్ దుస్సాహసం..భారత్ కు ఇబ్బందులే
మనదేశాన్ని ఇబ్బందులు పెట్టటానికి డ్రాగన్, పాకిస్ధాన్ దేశాలు సంయుక్తంగా భారీ కుట్ర మొదలుపెట్టాయి. ఇండియా-చైనా-పాకిస్దాన్ మధ్య ఉన్న ఎవరికీ చెందని ప్రాంతం(నో మ్యాన్స్ ల్యాండ్) గిల్గిత్-బాల్టిస్ధాన్ ప్రాంతాన్ని పాకిస్ధాన్ లోని భూభాగంగా కలిపేసుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి. వేలాది కిలోమీటర్లలో విస్తరించున్న ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకోవటానికి పాకిస్ధాన్ లాంఛనంగా పనులు మొదలుపెట్టింది. ఇది జరిగితే మనదేశానికి ఇబ్బందులు తప్పవని కేంద్రప్రభుత్వంతో పాటు రక్షణ రంగంలోని నిపుణులు కూడా తీవ్ర ఆందోళన …
Read More »ఫైర్ బ్రాండ్లు.. సైలెంట్.. టీడీపీలోనే ఎందుకిలా?
రాజకీయాలన్నాక.. వివాదాలకు దూరంగా.. నిర్మాణాత్మకంగా ఉండే రోజులు పోయాయి. ఇప్పుడంతా.. నువ్వు ఒకటంటే.. నేరెండెంటా? అనే నాయకులు పెరిగిపోయారు. ప్రజల్లో చాలా మంది కూడా ఇదే తరహా రాజకీయాలకు అలవాటు పడ్డారు. ఫైర్ బ్రాండ్లు చేసే వ్యాఖ్యలకు, వేసే కౌంటర్లకు సాధారణ ప్రజల నుంచి రాజకీయ పరిశీలకుల వరకు కూడా ఫాలోయింగ్ ఎక్కువ. ఆన్లైన్, యూట్యూబ్, సోషల్ మీడియాల్లోనూ వీరికి రేటింగ్ ఎక్కువ. అందుకే.. ఎప్పుడు ఏ పార్టీలో అయినా …
Read More »క్షమాపణ చెప్పిన సబ్బం : రియలైజేషన్ మంచిదే
రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా కనుమరుగైపోతోంది. ప్రస్తుత రాజకీయాలు ఎలాగున్నాయంటే ప్రత్యర్ధులపై దుమ్మెత్తిపోయటం, నోటికొచ్చినట్లు బూతులు తిట్టేయటం, ఎక్కడైనా డిబేట్ జరుగుతోందంటే ప్రత్యర్ధుల నోళ్ళను మూయించే ప్రయత్నం చేయటం అన్నట్లే ఉంది. రెండు రోజుల క్రితం వైజాగ్ లో మాజీ ఎంపి సబ్బంహరి చేసింది కూడా ఇదే. తనింటి కాంపౌండ్ వాల్ ను కూల్చేసినందుకు జీవీఎంసి ఉన్నతాధికారులతో కలిపి జగన్మోహన్ రెడ్డిని కూడా నోటికొచ్చినట్లు తిట్టేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులను సబ్బం …
Read More »పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలి.. ఏం చేస్తారో తెలీదు.. టీడీపీ మాస్టర్ ప్లాన్
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎప్పుడు ఎలా తెరమీదికి వస్తారో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ విషయంలో చంద్రబాబు అదే వైఖరిని అవలంబిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కాలంలో టీడీపీ ప్రధానంగా టార్గెట్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో జరిగిన రెండు ఘటనలను రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు వాటి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు, వైసీపీ …
Read More »జగన్ కేసుల పై నవంబర్ నుండి విచారణ?
సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధులు, మాజీలపై నమోదైన కేసుల విచారణ ఇక నుంచి స్పీడందుకోనుంది. పరిస్దితులన్నీ అనుకూలిస్తే బహుశా నవంబర్ నుంచి ప్రత్యేకకోర్టులో విచారణలు మొదలు అయ్యే అవకాశాలున్నాయి. కేసులు నమోదైన వాళ్ళందరికీ వెంటనే సమన్లు పంపాలని హైకోర్టు దిగువ కోర్టులతో పాటు ఏసిబి, సిబిఐ తదితర కోర్టులను ఆదేశించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు 118 మందిపై అనేక కేసులు వివిధ …
Read More »హథ్రస్… అనుకున్నదొకటి, అయినదొకటి
ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ జిల్లాలోని బుల్ గడి గ్రామంలో యువతిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్రత తగ్గించడానికి ప్రయత్నించి విఫలమైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దిగొచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాల ఒత్తిడికి తలొంచిన యోగి ప్రభుత్వం ఘటనపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న యువతిపై నలుగురు యువకులు దాడిచేసి గాయపరిచారు. అంతేకాకుండా యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అభియోగాలున్నాయి. ఘటన …
Read More »మంత్రులే సహనం కోల్పోతే.. వైసీపీలో చర్చ
రాజకీయాలంటే.. వ్యూహం.. ప్రతివ్యూహమేకాదు.. సహనం చాలా అవసరం. ప్రత్యర్థి పక్షాల నుంచి ఎదురయ్యే ప్రతి విషయంలోనూ నాయకులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఈ విషయంలో ప్రస్తుతం అదికార పార్టీ వైసీపీ మంత్రులు అనుసరిస్తున్న తీరు.. కోల్పోతున్న సహనం.. రాజకీయంగా అటు వారికి , పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అనేక రూపాల్లో వ్యతిరేకత వస్తున్న …
Read More »ట్రంప్ మద్దతుదారుల్లో పెరిగిపోతున్న టెన్షన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వైరస్ ప్రభావం వల్ల 74 ఏళ్ళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు జ్వరం పెరిగిపోవటంతో మిలిటరీ ఆసుపత్రిలో చేరారు. ట్రంప్ ఆరోగ్య పరిస్దితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రెండోసారి గెలిచి స్వేత సౌధంలో కంటిన్యు అవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ …
Read More »