Political News

అమెరికాలో కడుపు కాలిపోతోందట.. నిరసనలతో రోడ్లెక్కారే

ప్రపంచాన్ని కనుసైగతో కమాండ్ చేసే అగ్రరాజ్యం అమెరికాను దారుణంగా దెబ్బ తీసింది కంటికి కనిపించని కరోనా వైరస్. సంపన్నదేశంలా చెప్పుకునే ఆ దేశానికి దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. సరైన దెబ్బ తగిలితే అగ్రరాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయం కోవిడ్ 19 ఎపిసోడ్ తో ప్రపంచానికి అర్థమైపోయింది. యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుకు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించిందని …

Read More »

మీ అకౌంట్లోకి 50 వేలు..ఇది స్కీం కాదు స్కాం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ కేంద్రంగా ఊహించ‌ని ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది. పైకి ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగానే ఉన్న‌ప్ప‌టికీ…లోలోప‌ల ప్ర‌మాద‌క‌ర‌మైన స్కీం కావ‌డం గ‌మ‌నార్హం. ఇంకా చెప్పాలంటే స్కీం పేరుతో జ‌రుగుతున్న స్కాం. లాక్ డౌన్ కార‌ణంగా నిరుపేద‌ల‌కు ఎటువంటి ప‌నులు దొర‌క్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం రాష్ట్రీయ శిక్షిత్ బెరోజ్గార్ యోజ‌న పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించిందంటూ ఓ మెసేజ్ స‌ర్క్యులేట్ అవుతోంది. పైల‌ట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన …

Read More »

హైకోర్టును జగన్ సర్కారు లైట్ తీసుకుంటోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హైకోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను చాలా లైట్ తీసుకుంటోందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జగన్ సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఇప్పటికే హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పీపీఏల పున:సమీక్ష, సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తదితర అంశాల్లో జగన్ సర్కారు …

Read More »

వెంక్నన దర్శనం..కరోనాకు ముందు..కరోనా తర్వాత

కలియుగ దైవం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు….తమ బాలాజీకి మొక్కులు చెల్లించుకునేందుకు వెంకన్న సన్నిధికి వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే లక్షలాది మంది భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడుతుంటుంది. అయితే, కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ గత 40 రోజులుగా తిరుమలతో పాటు దేశంలోని అన్ని …

Read More »

‘క్రిక్ ఇన్ఫో’పై కోహ్లి అభిమానుల ఫైర్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో …

Read More »

దూరం ఎంతైనా ట్రైన్ టికెట్ 50 రూపాయలే

లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండి లేక వాళ్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పెట్టే బేడా సర్దుకుని.. సామానంతా నెత్తిన పెట్టుకుని.. చిన్న పిల్లల్ని ఎండలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఒక చిన్న పాప ఇలా మూడు రోజులు ఎండలో నడిచి స్వస్థలానికి …

Read More »

అర్థరాత్రి వేళ మోడీకి ఫోన్ చేసిన ఆ ముఖ్యమంత్రి

అర్థరాత్రి పన్నెండు గంటలు దాటి కాసేపైంది. అలాంటివేళ.. ప్రధానమంత్రిని కాంటాక్టు చేయటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధ్యమా? అందునా.. బీజేపీయేతర పార్టీకి చెందిన సీఎం అయితే మరింత కష్టం కదా? ఇలాంటి సందేహాలకు చెక్ చెబుతూ.. సదరు సీఎం కాంటాక్టు చేసిన వెంటనే ప్రధాని లైన్లోకి వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ప్రధాని మోడీకి అర్థరాత్రి వేళ ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? ఆయన …

Read More »

టీడీపీ మాజీ మంత్రి సైలెంట్ వెనుక‌.. ఏం జ‌రిగింది..?

క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు. నిజానికి ఆమె రాజకీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు.. త‌ర్వాత రాజ‌కీయాలు చేసిన‌ప్పుడు కూడా ఎంతో సైలెంట్‌గా ఉండేవారు. త‌న తండ్రి అడుగు జాడ‌ల్లో న‌డిచారు. అయితే, నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆమె ఒక్క సారిగా పుంజుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఈమెకు రాజ‌కీయాలు ఏం తెలుసు అనుకున్న‌వారు కూడా ముక్కున వేలేసుకునేలా వ్య‌వ‌హ‌రించి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర …

Read More »

డేంజ‌ర్ జోన్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడ‌లో వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు. అలాంటి రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ …

Read More »

లాక్ డౌన్ పొడిగింపున‌కు అస‌లు కార‌ణం?

మే 3 తర్వాత అయినా కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విష‌యంలో ఊర‌టిస్తుందేమో అని ఆశ‌గా చూసిన జ‌నాల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. ఇంకో రెండు వారాలు లాక్ డౌన్‌ను కొన‌సాగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. శ‌నివారం ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఈసారి లాక్ డౌన్ అమ‌లులో ష‌ర‌తులు ఎలా ఉంటాయో.. మిన‌హాయింపులేమైనా …

Read More »

కుప్పంలో చంద్రబాబు పీఏ భారీ కుంభకోణం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు నమోదైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల వ్యవహారంలో మనోహర్ అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ఆ డిపాజిట్లపై మనోహర్ రూ. 12 లక్షల లోన్ తీసుకొని…ఆ డబ్బును స్వాహా చేసినట్లు వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు….మనోహర్ పై కేసు …

Read More »

రేవంత్ వ‌ర్సెస్ కేటీఆర్ మ‌ధ్య‌లో బీజేపీ

గ‌త కొద్దికాలంగా మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం అన్న‌ట్లుగా సాగుతున్న ఫైర్‌బ్రాండ్ నేత‌, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వ‌చ్చి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఫార్మా కంపెనీకి రూ. 140 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. ఆయ‌న డైరెక్టర్‌గా చేరిన ల‌క్సాయ్ …

Read More »