తెలుగు మీడియా రంగంలో మరో సంచలనం. తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు గ్రూపు నుంచీ మరో పత్రిక మూతపడింది. దాదాపు 50 ఏళ్లకుపైగా సుదీర్ఘ కాలం తెలుగు నేలపై రైతులకు విశిష్టమైన సమాచార సేవలు అందిస్తూ వస్తున్న మాసపత్రిక అన్నదాత మూతపడింది. అన్నదాత పత్రికను మూసివేస్తున్నట్లు ఆ పత్రిక సంపాదకుడు అమిర్నేని హరికృష్ణ పేరుతో విడుదలైన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీడియా ఈ నిర్ణయం ఒక షాక్లా …
Read More »జగన్తో, ఆ రాష్ట్రంతో మనకెందుకు-విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయమ్మ స్వయానా తల్లి. కొన్ని నెలల ముందు వరకు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కూడా. పది సంవత్సరాలకు పైగా ఆమె ఆ హోదాలో ఉన్నారు. వైకాపా తరఫున ఆమె ఎంపీగా పోటీ చేశారు. కొన్నేళ్ల పాటు ఆమె రాజకీయం ఏపీలోనే సాగింది. గత ఎన్నికలకు ముందు ఆమె జగన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని …
Read More »ఒక్క సీటు లేని పవన్.. జగన్ను ఓడిస్తాడా? : సజ్జల
తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్.. తన ప్రసంగంలో పదే పదే సజ్జల పేరును పలికారు. ఆయన డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇప్పటం కూల్చివేతలు జరిగాయని వ్యాఖ్యానించారు. సజ్జల అంటే తనకు గౌరవం ఉందని, ఆయన సీనియర్ జర్నలిస్టుగా పనిచేశారని …
Read More »ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా కార్యకర్తలను, నేతలను హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే… దీనిపై వైసీపీ నాయకులు అబ్బే ఇప్పుడేం లేవు.. అంటూ కామెంట్లు చేస్తున్న విషయం కూడా తరచుగా చర్చకు వస్తోంది. అయితే, వైసీపీ అధినేత జగన్ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు వంటివి గమనిస్తే మాత్రం రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతూనే …
Read More »సీఎం జగన్ తల్లి విజయమ్మ గృహ నిర్బంధం..
ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మను తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలోనే పోలీసులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మంగళవారం ఉదయం వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. ప్రగతి భవన్వైపు తనే కారు నడుపుతూ వచ్చిన క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం షర్మిలను ఎస్ ఆర్. …
Read More »ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీం కోర్టు బదిలీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్రెడ్డీ?’’ అని చంద్రబాబు నిలదీశారు. దీనిపై ఏమాత్రం సిగ్గున్నా.. సీఎం పదవికి జగన్ వెంటనే రాజీ నామా చేయాలని …
Read More »షర్మిల మళ్లీ అరెస్టు.. ఈ సారి కారుతో సహా!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హల్చల్ ఏమాత్రం ఆగడం లేదు. తాజగా మరోసారి ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ సారి ఆమెను కారుతో పాటు టోయింగ్(వాహనాలను తీసుకువెళ్లే క్రెయిన్) వాహనంతో స్టేషన్కు తరలించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏం జరిగింది? తెలంగాణ పోలీసులు సోమవారం సాయంత్రం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్న విషయం …
Read More »వివేకా హత్య కేసులో జగన్ కు షాక్
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీం కోర్టు తెలంగాణ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. వివేకా కుమార్తె.. డాక్టర్ సునీత అభ్యర్థన.. ఏపీ ప్రభుత్వ అంగీకారం నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణను తెలంగాణలోని కోర్టుకు బదిలీ చేస్తున్నామని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించిం …
Read More »నిజమే కదా.. ఈ విషయాన్ని పవన్ చెప్పాలేమో..!
కొన్ని కొన్ని విషయాలను రాజకీయ నేతలు స్కిప్ చేసేందుకు వీలు కాదు. ఇప్పుడు కాకపోతే..రేపయినా.. వారు వాటిని ప్రస్తావించాలి.. నిజాలు ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి జనసేన అధినేత పవన్కు కూడా వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఎలాగంటే.. ఇప్పుడు అసలు.. ఆయన చేతిలో ఉన్న నాయకులు ఎంతమంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలకు బెల్ మోగితే.. పవన్ ఏం చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది. ఎందుకు ఈ చర్చ ఇప్పుడు తెరమీదికి …
Read More »వాట్ నెక్ట్స్.. రాజధాని పై వైసీపీ తర్జన భర్జన
ఇప్పుడు ఏం చేద్దాం.. సుప్రీం తీర్పు పై వైసీపీ డోలాయమానం! రాష్ట్రంలో మూడు రాజధానులను నిర్మించడమో.. లేక ఉన్న వాటినే డెవలప్ చేయడమో చేసి… ఎన్నికల కు ముందు ప్రజల మనసు దోచాలని అనుకుంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు పాలుపోని పరిస్థితి వచ్చింది. మూడు రాజధానులు అని ప్రకటించి వచ్చే ఏడాది మార్చి నాటికి మూడేళ్లు పూర్తవుతు న్నాయి. 2020 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం …
Read More »జగన్ ఆస్తుల కేసు.. ఆ ఇద్దరు అధికారులు ఇరుక్కుపోయారు!
ఏపీలో సీఎం జగన్ ఆస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, అరబిందో-హెటిరో ఛార్జ్షీట్లో బీపీ ఆచార్యపై సీబీఐ కోర్టు అవినీతి నిరోధక చట్టం అభియోగాలను పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్థించింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్ కొట్టివేయాలన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం అభ్యర్థననూ తోసిపుచ్చింది. ప్రస్తుత దశలో సీబీఐ కోర్టు నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. …
Read More »బీజేపీలో పవన్ కలవరం.. ఢిల్లీకి కీలక నాయకుడు?
ఏపీ బీజేపీలో జనసేన పార్టీ విషయంపై కలవరం ప్రారంభమైందా? వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి ముందుకు సాగాలన్న రాష్ట్ర కమలనాథులు..ఎందుకు మథనపడుతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అంతేకాదు, తాజాగా ఓ కీలక నాయకుడు హుటాహుటిన ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లిపోయారు. అయితే, అక్కడ నాయకులు అందరూ గుజరాత్ ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్నారు. అయినా, ఈయన మాత్రం అర్జంట్ చర్చించాల్సిన విషయం ఉందని పేర్కొంటూ ఫ్లైటెక్కడం గమనార్హం. ఇంతకీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates