Political News

వైన్ షాపు వద్ద డిసిప్లైనా… ఊరుకో గురూ !

వీఐపీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరిగే హీరోని పట్టుకుని ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. నువ్వు ఎవరి దగ్గరకొచ్చి ఏమడుగుతున్నావని హీరో నవ్వుతాడు. అలాగే ఉంది ఏపీ పరిస్థితి. 40 రోజులు తర్వాత వైన్ షాపు ఓపెన్ చేసి… క్యూలో ఉండండి, ఐదుగురే రండి, మాస్కుపెట్టుకోండి, క్రమశిక్షణ తో ఉండండి అంటే… ఎవరి దగ్గరకొచ్చి ఏం చెప్తున్నావు అన్నట్లుంది వారి …

Read More »

మొత్తానికి యామిని శర్మ సాధించింది

గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పని చేసిన సాదినేని యామినీ శర్మ….2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన యామిని….ఆ తర్వాత టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికార ప్రతినిధిగా గట్టి వాయిస్ వినిపించిన యామిని…టీడీపీలో అంతర్గత కలహాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు యామిని బీజేపీలో చేరినట్లు …

Read More »

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు ఇది అతి పెద్ద స‌వాలే…!

రాష్ట్రంలో జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డి ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వైసీపీ స‌ర్కారును టార్గెట్ చేసుకునేందుకు ఎంచుకుంటున్న రంగాల్లో ప్ర‌ధానంగా క‌నిపిస్తోంది విదేశీ పెట్టుబ‌డులు. ఆది నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టుగా.. తాము అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబ‌డులు తెచ్చామ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టామ‌ని, త‌ద్వారా రాష్ట్రంలో ఉపాధి పెరిగింద‌ని, ముఖ్యంగా విశాఖ‌ను ఐటీ …

Read More »

ఏపీ వలస కార్మికులు 2 లక్షలు… అందరూ క్వారంటైన్ కేనట

కరోనా నేపథ్యంలో దేశంలో ఆంక్షలు అమలువుతున్న వేళ… వలస కార్మికులు ఎక్కడికక్కడే చిక్కుబడిపోయారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోవడంతో వారందరినీ వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి చెందిన వలస కార్మికులు ఎందరెన్నారు? ఎక్కడెక్క చిక్కుబడిపోయారు? వారందరినీ రాష్ట్రానికి తరలిస్తే పరిస్థితి ఏమిటి? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వనున్నారు? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తి …

Read More »

కేసీఆర్ టీం మొత్తం అబ‌ద్దాలే చెప్పింద‌ట‌

Bandi Sanjay

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇర‌కాట‌లో ప‌డే ప‌రిస్థితి. ఓ వైపు ఆయ‌న స‌ర్కారు ఆర్భాటంగా ప్ర‌చారం చేసుకుంటున్న విష‌యంలోనూ… మ‌రోవైపు విప‌క్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఏ విష‌యంలో అయితే గులాబీ స‌ర్కారు త‌మ ఘ‌న‌త అని పేర్కొంటుందో అదే విష‌యంలో విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. తెలంగాణ‌లో క‌రోనా కేసులు, అందుతున్న వైద్య సేవ‌లు ఇత‌ర‌త్రా ప‌రిశీలించేందుకు ఇటీవ‌ల రాష్ట్రానికి కేంద్రం ప్ర‌తినిధి బృందం వ‌చ్చింది. అనంత‌రం తెలంగాణ‌పై ప్ర‌శంస‌లు కురి‌పించింది. …

Read More »

చిత్రం భళాలే విచిత్రం.. తెలంగాణలో యాపిల్ తోట

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడా యాపిల్ పండ్లు పెద్దగా కనిపించడం లేదు. అవి పండేది కశ్మీర్ లాంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే. లాక్ డౌన్ కారణంగా అక్కడి నుంచి రవాణా ఆగిపోవడంతో మార్కెట్లో ఈ పండ్లు కనిపించడం లేదు. ఉత్తరాదిన కశ్మీర్‌తో పాటు కొన్ని శీతల ప్రాంతాల్లో.. దక్షిణాదిన ఊటీ లాంటి కొన్ని ప్రదేశాల్లో మాత్రమే యాపిల్ పండుతుంది. తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి ప్రాంతాల నుంచే యాపిల్ వస్తుంది. కానీ ఇప్పుడు …

Read More »

మంత్రి హరీష్ రావు భలే చేశాడే..

తెలంగాణలో టాప్-5 లీడర్లలో ఒకరు హరీష్ రావు. కేటీఆర్‌కు ప్రాధాన్యం పెంచే క్రమంలో హరీష్ రావు స్థాయి తగ్గించడానికి ప్రయత్నం జరిగింది కానీ.. లేదంటే కేసీఆర్‌కు దీటుగా నిలబడగల సత్తా ఉన్నవాడే ఆయన. సిద్ధిపేటలో ఆయనకున్న ఇమేజే వేరు. తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇదొకటి. ఇక హరీష్ రావుకు ఏ మంత్రిత్వ శాఖ అప్పగించిన అద్భుతంగా ఫలితాలు చూపిస్తుంటారు. నీటి పారుదల శాఖ మంత్రిగా …

Read More »

అమెరికాలో కడుపు కాలిపోతోందట.. నిరసనలతో రోడ్లెక్కారే

ప్రపంచాన్ని కనుసైగతో కమాండ్ చేసే అగ్రరాజ్యం అమెరికాను దారుణంగా దెబ్బ తీసింది కంటికి కనిపించని కరోనా వైరస్. సంపన్నదేశంలా చెప్పుకునే ఆ దేశానికి దిమ్మ తిరిగే షాకివ్వటమే కాదు.. సరైన దెబ్బ తగిలితే అగ్రరాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న విషయం కోవిడ్ 19 ఎపిసోడ్ తో ప్రపంచానికి అర్థమైపోయింది. యావత్ దేశాన్ని లాక్ డౌన్ చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుకు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించిందని …

Read More »

మీ అకౌంట్లోకి 50 వేలు..ఇది స్కీం కాదు స్కాం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ కేంద్రంగా ఊహించ‌ని ఆస‌క్తిక‌ర ప్ర‌చారం జ‌రుగుతోంది. పైకి ఇది ఎంతో ఆక‌ర్ష‌ణీయంగానే ఉన్న‌ప్ప‌టికీ…లోలోప‌ల ప్ర‌మాద‌క‌ర‌మైన స్కీం కావ‌డం గ‌మ‌నార్హం. ఇంకా చెప్పాలంటే స్కీం పేరుతో జ‌రుగుతున్న స్కాం. లాక్ డౌన్ కార‌ణంగా నిరుపేద‌ల‌కు ఎటువంటి ప‌నులు దొర‌క్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు కేంద్రం రాష్ట్రీయ శిక్షిత్ బెరోజ్గార్ యోజ‌న పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించిందంటూ ఓ మెసేజ్ స‌ర్క్యులేట్ అవుతోంది. పైల‌ట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన …

Read More »

హైకోర్టును జగన్ సర్కారు లైట్ తీసుకుంటోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హైకోర్టు జారీ చేస్తున్న ఉత్తర్వులను చాలా లైట్ తీసుకుంటోందా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జగన్ సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఇప్పటికే హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. పీపీఏల పున:సమీక్ష, సర్కారీ బడుల్లో ఆంగ్ల మాద్యమం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు తదితర అంశాల్లో జగన్ సర్కారు …

Read More »

వెంక్నన దర్శనం..కరోనాకు ముందు..కరోనా తర్వాత

కలియుగ దైవం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు….తమ బాలాజీకి మొక్కులు చెల్లించుకునేందుకు వెంకన్న సన్నిధికి వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే లక్షలాది మంది భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడుతుంటుంది. అయితే, కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ గత 40 రోజులుగా తిరుమలతో పాటు దేశంలోని అన్ని …

Read More »

‘క్రిక్ ఇన్ఫో’పై కోహ్లి అభిమానుల ఫైర్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ ఎవరంటే మరో మాట లేకుండా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు చెప్పేస్తారు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతడికి భారీగా అభిమానులున్నారు. సోషల్ మీడియాలో ఈ తరం ఉత్తమ క్రికెటర్ ఎవరు అనే పోల్ పెడితే.. కోహ్లీకే ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. ఐతే క్రికెట్ అభిమానుల ఫేవరెట్ వెబ్ సైట్ ‘క్రిక్ ఇన్ఫో’ పెట్టిన ఓ పోల్‌లో …

Read More »