Political News

రాయ‌పాటి స్వ‌యంకృతం.. సీటు పాయే..!

రాజ‌కీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండ‌వు. తిరుగులేద‌ని చెప్పుకొన్న నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌న‌సులో చోటు సంపాయించుకోక‌పోతే.. త‌ర్వాత కాలంలో కాల గ‌ర్భంలో క‌లిసిపోయిన ప‌రిస్థితి క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రం.. గుంటూరుజిల్లాలో కీల‌క నాయ‌కుడు.. వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్న‌రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విష‌యంలోనూ జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యోవృద్ధుడు అయిపోయారు. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం లేదు. మరోప‌క్క ఆయ‌న కుమారుడు.. …

Read More »

జ‌గ‌న్ సార్‌.. మూడు జిల్లాల కోసం చూస్తే.. ప‌ది చేజారుతున్నాయే!!

ఔను.. రాజ‌కీయాల్లో ఏం చేసినా.. పార్టీకి మేలు జ‌ర‌గాలి. ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలి. ఏ పార్టీ అయినా.. నాయకుడికైనా.. ఉన్న ఏకైక ల‌క్ష్యం ఇదే. అయితే.. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో ఆయ‌న‌కే పెద్ద మైన‌స్ ఏర్ప‌డుతోంద‌ని మేధావి వ‌ర్గం చెబుతోంది. ఆయ‌న తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది మూడు ప్రాంతాల‌కు సంబంధించిన విష‌యంగా మారిపోతే.. మిగిలిన ప‌ది …

Read More »

ఎమ్మెల్సీ క‌విత‌.. ఈడీ నోటీసులు.. ఖండ‌న‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని మీడియా చానెళ్ల‌లో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. కవితకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. కీల‌క‌మైన మీడియా ఛానెళ్లు అన్నింటిలోనూ.. ఈ వార్త ప్ర‌ముఖంగా బ్రేకింగ్ న్యూస్ రూపంలో …

Read More »

గోవధ నిషేధంపై తొలిబిల్లు కృష్ణంరాజు పెట్టారట

దివంగత సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్…కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి కృష్ణంరాజు నివాసానికి వెళ్లారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, వారి కుమార్తెలతోపాటు, హీరో ప్రభాస్‌ ను రాజ్ …

Read More »

విమోచ‌నమా.. స‌మైక్య‌తా.. తెలంగాణలో స‌రికొత్త పోరు!

తెలంగాణ‌లో మ‌రోస‌రికొత్త వివాదం..తెర‌మీదికి వ‌చ్చింది. సెప్టెంబ‌రు 17, తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చిన రోజు. ఇది రేప‌టికి 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. దీనిని పుర‌స్క‌రించుకుని.. స‌ర్కారు-గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌నాలు.. రెండుగా చీలిపోయాయి. ప్ర‌భుత్వం ఈ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వాలు నిర్వ‌హిస్తోంది. అయితే.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాత్రం దీనిని విమోచ‌నా దినోత్స‌వంగానే నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. దీంతో ఈ ప‌రిణామాలు.. అటు …

Read More »

జనసేనలో చేరనున్న వైసీపీ నేత

తూర్పుగోదావరి జిల్లాలోని అధికార పార్టీ సీనియర్ నేత జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావు తొందరలోనే జనసేనలో చేరబోతున్నారట. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఒక పార్టీకి రాజీనామా చేసిన నేత మరోపార్టీలో చేరటం సహజమే కదా. పైగా ఎన్నికలకు ముందు చేరితే కచ్చితంగా నియోజకవర్గంలో టికెట్ హామీ తీసుకునే రాజీనామా చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజోలులో సమస్య ఏమిటంటే 2019 ఎన్నికల్లో జనసేన తరపున …

Read More »

జ‌గ‌న్ పార్టీలో మంట పెట్టిన చంద్ర‌బాబు!

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలాంటి ట‌ర్న్‌తీసుకుంటాయ‌నేది చెప్ప‌డం క‌ష్టం. నిన్నటి వ‌ర‌కు ఇక‌, అయిపో యిందనుకున్న పార్టీలు.. నాయ‌కులు కూడా పుంజుకుంటున్న ప‌రిస్థితి దేశంలోనే క‌నిపిస్తోంది. ఇక‌, ఏపీలో నూ.. వ్యూహాత్మ‌క రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా.. ఎప్పుడూ.. ఎలాంటి స‌వాళ్లు ..ప్ర‌తిస‌వాళ్లు చేయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. అధికార పార్టీ వైసీపీకి .. గ‌ట్టి స‌వాలే విసిరారు. తొలి రోజు అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా.. ఆయ‌న వైసీపీని ఉద్దేశించి ఘాటుగానే …

Read More »

ఉత్త‌రాంధ్ర వైసీపీ నేత‌లు హ‌డ‌లి పోతున్నారే ?

ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కులు.. హ‌డ‌లి పోతున్నారట‌. త‌మ ప్ర‌తిపాద‌న‌కు ఎక్క‌డ విముఖత వ‌స్తుందో.. రేపు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించినా.. త‌మ‌కు బెడిసికొట్టే ప‌రిస్థితి ఉందేమో.. అనివారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఏపీ రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి యాత్రే న‌ని.. పార్టీ వ‌ర్గాల్లో విస్తృతంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఎందుకంటే.. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ వ‌చ్చింది. రైతులు చేప‌ట్టిన రాజ‌ధాని ఉద్య‌మానికి …

Read More »

త్వ‌ర‌లోనే ఏపీ మంత్రి వ‌ర్గ మార్పు.. లాబీల్లో ఇదే ముచ్చ‌ట‌!

ఏపీ మంత్రి వ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే.. విస్త‌రించ‌నున్నారా.. మంత్రులు ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో లాబీల్లో కొంద‌రు నాయ‌కులు.. ముచ్చ‌ట్లు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప‌క్కా వ్యూహంతో జ‌గ‌న్‌ ముందుకు సాగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యేలు చ‌ర్చించుకున్నారు. త్వ‌ర‌లోనే.. మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించే …

Read More »

లోకేశ్ పై రోజా ఫైర్: అమ్మతో.. భార్యతో బెదిరించి పదవిలోకి..

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో తన మాటలకు పదును పెంచిన నారా లోకేష్ పై విమర్శల బాణాల్ని ఎక్కు పెట్టారు ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఘాటుగా రియాక్టు అయ్యారు. మూడు రాజధానులపై ఇటీవల కాలంలో లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న వేళ.. ఆయనపై మండిపాటుతో వార్తల్లోకి వచ్చారీ లేడీ ఫైర్ బ్రాండ్. లోకేశ్ ఒక పిల్లి పిత్రే అంటూ ఎటకారం ఆడేసిన రోజా.. …

Read More »

బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందా ?

రాజధాని అంశంలో ఏమి మాట్లాడాలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో బీజేపీకి అర్థం కాక బుర్ర తిరిగిపోతున్నట్లుంది. ఒకసారేమో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోసారేమో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటారు. ఈ మధ్యేమో అమరావతి డిమాండుకే కమలనాథులు జై కొడుతున్నారు. న్యాయస్థానం టు దేవస్ధానం యాత్ర సందర్భంగా అమరావతికే బీజేపీకి జై కొట్టింది. తాజాగా అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్రకు …

Read More »

షర్మిల కోరిక తీరినట్లేనా ?

తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టి ఏడాది తర్వాత వైఎస్ షర్మిలకు అధికారికంగా గుర్తింపు లభించినట్లయ్యింది. ఇపుడు వచ్చిన గుర్తింపు ఏమిటాని ఆశ్చర్యపోతున్నారు. షర్మిలపై ఆరుగురు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమెపై సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకునే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. మంత్రుల ఫిర్యాదు, స్పీకర్ హామీ, సభా హక్కుల ఉల్లంఘన కమిటీ పరిశీలనకు సదరు ఫిర్యాదును పంపటంతో ఇపుడు షర్మిల మీద చర్యల …

Read More »