టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తమ్ముళ్లతో సమీక్షలు పూర్తి చేశారు. సంఖ్యాబలం బాగానే ఉంది. మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే ఆయన సమీక్షలు పూర్తి చేయడం చరిత్రలోనే తొలిసారి. గతంలో ఎప్పుడూ కూడా ఈ రేంజ్లో చంద్రబాబు సమీక్షలు చేసింది లేదు. సో.. ఇప్పుడు ఆయన క్షేత్రస్థాయిపై దృష్టి పెట్టారు. దీనిని అందరూ స్వాగతిస్తున్నారు. అయితే, పాడిందే పాట …
Read More »AP లో అంతే.. కోడిగుడ్లు కాకులు ఎత్తుకెళ్లాయట..
వైసిపి నేత, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన వ్యాఖ్యలతో ప్రసన్నకుమార్ రెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన విమర్శలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించిన ప్రసన్నకుమార్ రెడ్డికి వింత అనుభవం ఎదురయింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు …
Read More »హైదరాబాద్.. ఐటీ.. అదే పాట పాడిన చంద్రబాబు
దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ -1గా ఎదగడానికి పునాది వేసింది టీడీపీనేనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లెయిమ్ చేసుకున్నారు. తెలంగాణను శాసించే స్థాయికి టీడీపీ ఎదగాలని ఆకాంక్షించారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీలో చూస్తే తెలుగువాళ్లు బాగా రాణిస్తున్నారని కొనియాడారు. నాయకత్వాన్ని పెంచిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు. వెనుకబడిన తెలంగాణ ఒక్క నిర్ణయంతో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో …
Read More »జగన్-పవన్-మోడీ.. ముహూర్తం ఖరారు?!
ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఫస్ట్టైం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్-సీఎం జగన్లు ఒకే వేదికను పంచుకోనున్నారు. రాజకీయంగా కత్తులు నూరుకునే ఈ ఇద్దరు కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విశాఖలో జరగనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇది అధికారిక కార్యక్రమమే అయినప్పటికీ.. పవన్కు ‘ప్రత్యేక ఆహ్వానం’ అందినట్టు తెలుస్తోంది. దీంతో ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాలని.. కేంద్రం నుంచి పవన్కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో …
Read More »అనంతలో మరో చిచ్చు.. టీడీపీని బాగుచేసేవారేరీ..?
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అనేక మంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన నేతలు కూడా ఇప్పుడు అనంతపురంలోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు వారివల్ల ఏం ప్రయోజనం అనే మాట వినిపిస్తోంది. తాజాగా కళ్యాణ దుర్గంలో తమ్ముళ్లు కొట్టుకున్నారు. ఆధిపత్య రాజకీయాలు.. మా మాటే నెగ్గాలనే పంతాలు వంటివి ఇక్కడ టీడీపీని బజారున పడేస్తున్నాయి. …
Read More »ఇప్పటంలో విచిత్రమైన ఫ్లెక్సీలు
ఇప్పటం.. ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా 200 ఇళ్లున్న చిన్న గ్రామం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఈ గ్రామం వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జనసేన పార్టీ ప్లీనరీకి తమ పొలాలు ఇచ్చారన్న కారణంతో ఆ పార్టీ మద్దతుదారుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో వాటిని కూలగొట్టారన్న ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో …
Read More »జనసేన మౌనం.. ఛాన్స్ మిస్ చేసుకుంటోందా..?
రాజకీయాల్లో పార్టీలకు కానీ, నాయకులకు కానీ అసలు అవకాశం రావడమే కష్టం. అవకాశం వచ్చిందా.. వెంటనే దానిని అందిపుచ్చుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నించిన సందర్భాలు అనేకం. మరీ ముఖ్యంగా అంకురంగా ఉన్న పార్టీలు.. అయితే ఎప్పుడెప్పు డు చాన్స్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాయి. ఇప్పుడు ఏపీలో జనసేన పార్టీకి కూడా గొప్ప ఛాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి …
Read More »లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు అరెస్ట్
కొద్ది నెలల క్రితం వెలుగు చూసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆప్ మంత్రి మనీష్ సిసోడియా చుట్టూ అల్లుకున్న ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు వైసిపి కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన బంధువుల పేర్లు కూడా వినిపించాయి. విజయ్ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి …
Read More »రేపు వచ్చేది నేనే.. కట్టిస్తా చూడు-నారా లోకేష్
కొన్నేళ్ల ముందు వరకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మీద జనాల్లో ఏమంత సానుకూల అభిప్రాయం ఉండేది కాదు. తండ్రి పేరు చెప్పుకుని పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు సంపాదించాడని, సొంత సత్తా లేదని అతడి మీద విమర్శలు వెల్లువెత్తుతుండేవి. పప్పు పప్పు అంటూ రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ను బాగా ట్రోల్ చేసేవాళ్లు. కానీ గత రెండు మూడేళ్లలో లోకేష్ చాలా కష్టపడి నాయకుడిగా …
Read More »నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. కానీ, తాజాగా రాజ్భవన్లో ఆమె ప్రెస్మీట్ పెట్టారు. అంతేకాదు.. సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే సందేహం ఉందన్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు కోట్లు ఇచ్చి.. కొనుగోలు చేసే ప్రయత్నం చేశారన్న.. ఫామ్హౌజ్ ఇష్యూలోనూ తనను ఇరికించాలని చూశారని.. సంచలన కామెంట్లు కుమ్మరించారు. రాజ్భవన్.. ప్రగతి భవన్ …
Read More »మోడీ విజిట్.. వైసీపీ ప్లాన్ ఏంటి..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 11న విశాఖకు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. విశాఖలో ఏర్పాట్లను సైతం దగ్గరుండిమరీ చూసుకుంటున్నారు. అదే సమయంలో మోడీ విశాఖలోని ఏయూలో పాల్గొనే బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలించాలని కూడా వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన బాధ్యలను విశాఖ ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విశాఖ వైసీపీ నాయకులు అందరూ కూడా …
Read More »మీవల్లే మాపై వ్యతిరేకత.. అధికారులపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఏపీ అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి సంచలనంగా మారింది. ఏపీ ప్రభుత్వ విధానాలు ఏ మాత్రం సరిగా లేవని.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న మాట వినిపిస్తుంటే.. అలాంటిదేమీ లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు జగన్ అండ్ కోకు మింగుడుపడనివిగా మారాయి. అధికారుల తీరుపై ఆగ్రహం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates