Political News

రైతుల పాద‌యాత్ర‌ పై ఏపీ స‌ర్కారు వితండ వాద‌న‌

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం స‌హా ఇక్క‌డ భూములు ఇచ్చిన రైతుల విష‌యంలో వైసీపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న ధోర‌ణి ఆద్యంతం వివాదంగానే మారుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా వారి పాద‌యాత్ర‌పై ఎంపీలు, మంత్రులే వ్యాఖ్య‌లు, భౌతిక దాడులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా రైతుల పాద‌యాత్ర‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది ఏపీ స‌ర్కారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును …

Read More »

జగన్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పడానికి కుప్పం చాలు: చంద్ర‌బాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే వైసీపీ ప్రభుత్వం కుప్పంలో చేస్తున్న అరాచకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ది రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు వైసీపీ అరాచక రాజకీయం కొత్తగా ఉందని ఆయన విమ‌ర్శించారు. కుప్పంను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని.. హింసను, విద్వేష రాజకీయాలను ఇక్కడి ప్రజలు అనుమతించరని చంద్రబాబు అన్నారు. పార్టీ …

Read More »

ఆలీ.. కక్కలేడు మింగలేడు

కమెడియన్ ఆలీకి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఫ్రెండో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌తో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న ఆలీ.. తన మిత్రుడు జనసేన పేరుతో కొత్త పార్టీ పెడితే.. పార్టీ ఆఫీసుకు వచ్చి ఖురాన్ చదివి ఆ పార్టీకి అంతా మంచి జరగాలని కోరుకున్నాడు. అప్పటి ఆలీ తీరు చూస్తే జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ …

Read More »

మ‌రింత ముదిరిన ఫామ్ హౌజ్ ఇష్యూ.. హైకోర్టుకు బీజేపీ!

తెలంగాణ‌లో వెలుగు చూసిన ఫామ్ హౌజ్ ఇష్యూ కీల‌క ట‌ర్న్ తీసుకుంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విష‌యంపై అధికార టీఆర్ఎస్‌, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ …

Read More »

అలీకి ప‌ద‌విచ్చిన‌ సీఎం జ‌గ‌న్‌..

వైసీపీ నాయ‌కుడు న‌టుడు, క‌మెడియ‌న్ మ‌హ‌మ్మ‌ద్ అలీకి.. ఏపీ ప్ర‌భుత్వం ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. ఆయ‌న‌ను ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా.. నియ‌మిస్తూ.. తాజాగా ప్ర‌భుత్వం జీవో ఇష్యూ చేసింది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల కు ముందు నుంచి అలీ.. వైసీపీలోనే ఉన్నారు అప్ప‌ట్లో రాజ‌మండ్రి ఎంపీ టికెట్‌ను ఆయ‌న ఆశించారు. కానీ, ఇవ్వ‌లేదు. అదేస‌మయంలో గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇవ్వ‌మ‌ని కోరారు. అది కూడా సాధ్యం కాలేదు. ప్ర‌భుత్వంలోకి …

Read More »

జ‌గ‌న్‌తో వ‌ర్మ భేటీ.. ఇదిగో క్లారిటీ..

RGV Meets Jagan Mohan Reddy

వివాదాస్ప‌ద సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. సుమారు రెండుగంట‌ల పాటు ఇద్ద‌రు చ‌ర్చించుకున్నారు. అయితే..ఆ చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగింద‌నేది ఎవ‌రికీ తెలియదు.. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. అయితే.. తాజాగా వ‌ర్మ‌.. ఈ ఉత్కంఠ‌కు తెర దించేశారు. తాను త్వ‌ర‌లోనే వ్యూహం అనే సీక్వెల్ చిత్రాన్ని తీయ‌నున్న‌ట్టు చెప్పారు. అది కూడా ఫ‌క్తు రాజకీయ మూవీ అని తేల్చి చెప్పేశారు. ఎన్నికలే …

Read More »

జగన్-వర్మ.. ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా 40 నిమిషాలకు పైగా భేటీ అయ్యారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. తమ రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేంశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే విషయమై వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రోత్సాహంతో వర్మ మూడు సినిమాలు తీయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ …

Read More »

పీకే పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ సాయం చేస్తున్నారా?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరిట ఓ వేదికను స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. పీకే వెనుక ఎవరు ఉన్నారు? ఆయన ‘రాజకీయం’ కోసం నిధులు ఎవరు ఇస్తున్నారు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రశ్నలకు స్వయంగా జవాబు ఇచ్చారు ప్రశాంత్ కిశోర్. తాను చేస్తున్న పాద‌యాత్ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ డ‌బ్బులు స‌ర్దు …

Read More »

ఫామ్‌హౌజ్ ఘ‌ట‌న‌: ఉల్లిక్కి పడిన బీజేపీ

Bandi Sanjay

రూ.400 కోట్ల‌ను న‌లుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు ఇచ్చి.. వారిని త‌మ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేసింద‌ని.. టీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి.. పోలీసులు కూడా.. దాడులు చేసి.. మ‌ధ్య‌వ‌ర్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం.. రాష్ట్రాన్ని ఒక్క‌సారిగా కుదిపేసింది. దీనికి మూలాలు ఢిల్లీలో ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ బుధ‌వారం అర్ధ‌రాత్రి మీడియాతో మాట్లాడారు.ఈ ఫామ్‌హౌజ్ అంశంపై ఆసాంతం ఆయ‌న కామెడీగా మాట్లాడ‌డం …

Read More »

వైసీపీ ఓటు బ్యాంకు పై జ‌న‌సేన క‌న్ను..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎన్ని ఓట్లు వ‌స్తాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు టీడీపీతో చేతులు క‌లిపిన ద‌రిమిలా.. ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌ పై దృష్టి పెట్టిన జ‌న‌సేన‌.. జిల్లాల వారీగా.. ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో ఉభ‌య‌గోదావ‌రి, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల‌పై పెద్ద‌గానే ఆశ‌లు …

Read More »

ఎమ్మెల్యేల‌కు వ‌ల‌.. డ‌బ్బుల ఎర‌.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి..

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇది పెను రాజ‌కీయ దుమారానికి తెర‌దీసింది. టీఆర్ ఎస్ బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించ‌గా.. బీజేపీ నేత‌లు.. టీఆర్ …

Read More »

‘జనసేన జెండాలు చంద్రబాబు పెట్టించాడు’

Somu Veerraju

విశాఖలో పరిణామాల అనంతరం వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై పవన్ బూతులతో విరుచుకుపడ్డారు. ఇక అదే సందర్భంలో బిజెపికి ఊడిగం చేయబోమంటూ పవన్ చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో బీజేపీ నేతలను ఆలోచనలో పడేసింది. బిజెపి అంటే తమకు గౌరవం ఉందని, అలా అని బిజెపి చెప్పిందే చేయడం సాధ్యం కాదని పవన్ చెప్పడంతో …

Read More »