Political News

బీఆర్ఎస్‌ను చూసి సంబర పడుతున్న బీజేపీ

కేంద్రంలో మోదీని గద్దె దించుతానంటూ కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి దేశవ్యాప్తంగా పోటీ చేస్తానంటున్నారు. ఈ రోజు దిల్లీలో పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించబోతున్నారు. తాను ఒక్కో స్టెప్ వేస్తుంటే బీజేపీ భయపడుతుందని కేసీఆర్ అనుకుంటుంటే.. బీజేపీ పెద్దలు మాత్రం కేసీఆర్ ఒక్కో అడుగు చూసి సంబరపడుతున్నారు. తెలంగాణ దాటి కేసీఆర్ వేసే ప్రతి అడుగూ తమకు లాభదాయకమేనని వారు లోలోన సంతోషిస్తున్నారు. కేసీఆర్ అంటే ఎన్నికల …

Read More »

కేసీఆర్ ఏపీకి వ‌స్తే.. వీటికి స‌మాధానం ఏంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌.. త‌న జాతీయ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డం ఖాయం. ఎందుకంటే.. ప్ర‌స్తుతం డిల్లీలో ఈ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం కాగానే 2024 సార్వ‌త్రిక స‌మరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న అన్ని రాష్ట్రాల్లోనూ క‌లియదిరుగుతారు. ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. అక్క‌డ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ముందుగా ఈ జాబితాలో ఏపీ ఉంద‌ని అంటున్నారు. పొరుగునే ఉన్న‌రాష్ట్రం.. పైగా త‌న‌కు తెలిసిన …

Read More »

ఏపీకో దండం… ఇక మేం పోతాం…

విశాఖను ఎగ్జిక్యుటివ్ కేపిటల్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. త్వరలో పాలనను సాగర నగరం నుంచి ప్రారంభిస్తానని చాలా రోజులుగా చెబుతున్నారు. ఆ నగరాన్ని అందమైన నందనవనంగా మార్చే ప్రయత్నం ఒక వంతయితే.. అన్ని రకాల వసతులు, కార్యాలయాలు, విద్యా సంస్థలు పెంచడం మరో వంతు అని వైసీపీ వర్గాలు బాకా ఊదుకుంటున్నాయి. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని తాజా పరిస్థితులు చెబుతూనే ఉన్నాయి. ఎంత దాచినా …

Read More »

పీఏసీకి పొగ‌.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతే గురూ!!

పీఏసీ.. ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ.. ఇది ఏ రాష్ట్రంలో అయినా.. ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, వ్య‌యాల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు నిశితంగా ప‌రిశీలిస్తూ.. హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం.. ప్ర‌జ‌లు ప‌న్నుల ద్వారా క‌డుతున్న సొమ్మును ప్ర‌భుత్వాలు ఎలా ఖ‌ర్చు చేస్తున్నాయో.. లెక్క‌లు కోర‌డం.. దానిని మదింపు చేయ‌డం, శాస‌న స‌భ‌కు వివ‌రించ‌డం.. ముఖ్యంగా స్పీక‌ర్‌కు నివేదిక అందించ‌డం అనేది పీఏసీ ప‌ని. ఇదేమీ.. ఊరికేనే ప‌నిలేక ఏర్పాటు చేసిన క‌మిటీ కాదు. …

Read More »

ఆ మినిస్ట‌ర్ మ‌ళ్లీ క్యామెడీ అయిపోయాడుగా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను తిట్ట‌డానికే మంత్రుల్లో కొంద‌రిని కేటాయించి త‌ర‌చుగా వారితో ప్రెస్ మీట్లు పెట్టించ‌డం చూస్తూనే ఉన్నాం. తొలి రెండున్న‌రేళ్లు ఈ బాధ్య‌త‌ను ప్ర‌ధానంగా కొడాలి నాని, పేర్ని నాని లాంటి వాళ్లు చూశారు. వారి ప‌ద‌వులు ఊడిపోయాక ప్ర‌తిప‌క్షాల‌ను అదే ప‌నిగా విమ‌ర్శించే బాధ్య‌త‌ను తీసుకున్న మంత్రుల్లో గుడివాడ అమ‌ర్నాథ్ ఒక‌రు. ప్ర‌ధానంగా ఆయ‌న జ‌న‌సేన అధినేత …

Read More »

కేసీఆర్ కు మైండ్ బ్లాక్ చేసిన ఆ ఇద్దరు

తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్‌కు జాతీయ రాజ‌కీయాల‌పై చాలానే ఉత్సాహం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌చ్చే మూడు నాలుగు నెల్ల‌లోనే దేశ‌వ్యాప్తంగా చుట్టేసి.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బీఆర్ ఎస్ జాతీయ భ‌వనాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేశారు. అయితే..ఇక్క‌డ ఆదిలో అనుకున్నంత ఈజీగా ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే, ఇప్పుడు కేసీఆర్‌కు పోటీగా ఇద్ద‌రు నాయ‌కులు కేంద్రంలో …

Read More »

దేశ రాజ‌ధానికి ‘ఏపీ రాజ‌ధాని’ సెగ.. రైతుల మ‌రో యాత్ర‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు మ‌రో యాత్ర‌కు రెడీ అయ్యారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిగానే ఉంచాల‌ని డిమాండ్ చేస్తూ.. ఇప్ప‌టికే రెండు సార్లు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు, అమ‌రావ‌తి నుంచి అర‌స‌వల్లి(ఇది మ‌ధ్య‌లోనే ఆగింది) వ‌ర‌కు పాద‌యాత్ర చేసిన రైతులు.. ఇప్పుడు తాజాగా.. ఈనెల‌ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీ వేదికగా త‌మ గ‌ళం వినిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి జేఏసీ …

Read More »

జగన్ ఇంకో 250 పెంచేసాడుగా

Jagan to pick 50 new candidates for 2024 elections

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళ వారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్‌ పెంపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2,500గా ఉన్న సామాజిక పింఛ‌న్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా …

Read More »

జ‌గ‌న్‌కు ఇష్ట‌మైన అధికారికి షాక్‌.. జైలు శిక్ష విధించిన హైకోర్టు

ఇటీవ‌ల కాలంలో ఏపీలోని ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌పై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తున్న విష‌యం తెలిసిందే. వారు చేస్తున్న వ్య‌వ‌హారాలు కూడా అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం. కొన్నికొన్ని కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కూడా అధికారులు పాటించ‌డం లేదు. క‌నీసం.. కోర్టు అనే గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేద‌ని న్యాయస్థాన‌మే ప‌లు సంద‌ర్భాల్లో తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది దీంతో అలాంటి అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు కూడా న్యాయ‌స్థానం వెనుకాడ‌డం లేదు. ఇక‌, ఈ …

Read More »

ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీల‌ను తొల‌గించేశారు!

భార‌త రాష్ట్ర‌స‌మితి పేరుతో జాతీయ స్థాయిలో గ‌ళం వినిపించి.. ప్ర‌ధాని మోడీకి చుక్క‌లు చూపించాల‌ని అనుకున్న సీఎం కేసీఆర్‌.. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో బీఆర్ ఎస్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ప్రారంభించా రు. అత్యంత అట్ట‌హాసంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి ప‌లువురు కీల‌క రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, మాజీ ముఖ్య‌మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఢిల్లీలోని ప్ర‌ధాన మార్గాల్లో కేసీఆర్ చిత్రంతో కూడిన భారీ ఫ్లెక్సీల ను ఏర్పాటు …

Read More »

ఏపీ కేబినెట్ సంచ‌ల‌న ఆమోదం.. సీఎంవో త‌ర‌లింపున‌కు ఓకే!

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు పడ్డాయా? విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించే ప్ర‌క్రియ‌లో భాగంగా.. ముందుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యాన్ని త‌ర‌లించేందుకు ప్ర‌తిపాద‌న‌లు ఓకే అయ్యాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా .. రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.ముఖ్యమంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో మూడు రాజ‌ధానుల అంశంపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ఘర్ వాపసీ అంత సులభమా..

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమై చాలా రోజులైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఘరంగా ఓడిపోయింది. ఒక్క సారి కూడా కాదు.. రెండు సార్లు ఆ పని జరిగింది. అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అది. హేమాహేమలైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. హర్షకుమార్, కేవీపీ, పల్లంరాజు లాంటి నేతలు ఎటూ వెళ్లలేక పార్టీలోనే టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే …

Read More »