ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలూకు ఆనవాళ్లను, సాక్ష్యాలను.. ఎవరు చెరిపేశారో.. ఎవరెవరు చేతులు కలిపారో.. పూస గుచ్చినట్టు సీఐబీ వివరించింది. వివేకా హత్య ఆనవాళ్లను.. ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రితో కలిసి ఉదయ్ చెరిపేశాడని సీబీఐ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట గజ్జల ఉదయ్కుమార్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను …
Read More »దిగజారుతోన్న వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్…!
జారుడు బల్లలపై వైసీపీ నేతల విన్యాసాలు ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఏంటనేది తెలుసు కోకుండానే నాయకులు వ్యవహరిస్తున్న తీరు.. పార్టీకి..వ్యక్తిగతంగా నేతలకు కూడా ఇబ్బందిగానే మారు తోందని అంటున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం, విజయవాడ సెంట్రల్, పాణ్యం, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, కొవ్వూరు ఇలా.. అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తుల పరంగా మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నిజానికి పార్టీపరంగా వ్యతిరేకత ఉంటే.. అది …
Read More »ప్రకాశ్ అంబేడ్కర్ మాట నిజమవుతుందా.. ?
ఆ మాట చాలా మంది చెప్పారు.. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలని పెద్దలు చాలా మంది ఆకాంక్షించారు. అది మాటయినా, కోరికైనా, డిమాండ్ అయినా ఇప్పటి దాకా కోల్డ్ స్టోరీజీలోనే ఉండిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ లో బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ సభలో ప్రకాశ్ అంబేడ్కర్, హైదరాబాద్ రాజధాని అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఆయన స్వయంగా బాబా సాహెబ్ మనుమడు. రాజకీయా వారసత్వాన్ని, …
Read More »నాగబాబుకు పదవితో నాదెండ్లకు కష్టకాలమేనా ?
ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జనసేనలో అనూహ్య మార్పు జరిగింది. ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అన్నయ్య నాగబాబును ప్రధాన కార్యదర్శిని చేశారు. ఇప్పటి వరకు ఆయన రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా మాత్రమే ఉండేవారు. ఇప్పటి వరకు లేని ఒక పదవిని సృష్టించి మరీ నాగబాబుకు అప్పగించడంతో పాటు ఆయనకు ఎలివేషన్ ఇచ్చామనే సందేశమిచ్చే ఫోటోను కూడా విడుదల చేశారు. ఆయనే నెంబర్ …
Read More »ప్రకాశం గరం..గరం..
జగనన్న పాలన భేషుగ్గా ఉందని వైసీపీలో కొందరు నేతలు బాకా ఊదుతుంటారు. కేడర్ ఐకమత్యంగా పనిచేస్తోందని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎక్కడా అసంతృప్తి లేదని, అందరూ సంతోషంగా ఉన్నారని ప్రకటనలిస్తుంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ద్వితీయ శ్రేణి నేతలపై ఆగ్రహంతో వైసీపీ కేడర్ ఊగిపోతోంది. ఇంఛార్జ్ గా ఉన్న వాళ్ల ఏకపక్ష ధోరణితో ఇబ్బంది పడుతున్నామని వెంటనే వాళ్లను మార్చేయ్యాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో …
Read More »వైసీపీకి మరో ఉచ్చు.. పదునెక్కిన ‘కోడికత్తి’!!
ఏపీలో మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీకి ఒకదానిపై ఒకటి ఉచ్చులు పెరుగుతున్నాయి. ఒకవైపు.. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కత్తి వైసీ పీపై వేలాడుతూనే ఉంది. దీనిని గత ఎన్నికల్లో సింపతీకి వాడుకున్నారు. చంద్రబాబే చంపించారని పెద్ద ఎత్తున యాగీ చేశారు. మొత్తానికి ఎన్నికల్లో లబ్ది పొందారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తూనే ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు …
Read More »కేంద్రం బీఆర్ఎస్, పవన్ గాలి తీసేసిందా ?
ఒకేసారి బీఆర్ఎస్ నేతలతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాలిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అత్యుత్సాహం చూపిన ఫలితంగా వీళ్ళు పరువు పోగుట్టుకోవాల్సొచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయమై ముందుకెళ్ళటం లేదని చెప్పారు. రాష్ట్రీయ ఇస్పాత్ …
Read More »సీఎం జగన్కు కొత్తపేరు పెట్టిన నారా లోకేష్!
ఏపీ సీఎం జగన్పై తరచుగా విరుచుకుపడే టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. ప్రస్తుతం యువగళం పాదయాత్రలో దూకుడుగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక, రాజకీయం పరంగా చూస్తే.. సీఎం జగన్కు ఆయన పలు పేర్లు పెడుతున్నారు. ఇప్పటికే.. ఎడుగూరి సందింటి ఇంటి పేరును.. ‘ఎడుగూరి దొంగింటి రెడ్డి’ అని ఒక సందర్భంలో లోకేష్ వ్యాఖ్యానించారు. ఇది బాగా పాపులర్ అయింది. తర్వాత కాలంలో కరోనాతో …
Read More »ఎన్నికల ముందు బీజేపీకి షాక్
సరిగ్గా ఎన్నికల ముందు రిజర్వేషన్ల అమలు విషయంలో కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద షాకిచ్చింది. లింగాయతులు, ఒక్కలిగలకు బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యాన్ని పక్కనపెట్టేసింది. కర్నాటకలో ఓబీసీ ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దుచేసింది. అలా రద్దుచేయగా మిగిలిపోయిన 4 శాతం రిజర్వేషన్లో 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం ఒక్కలిగలకు సర్దుబాటుచేసింది. బొమ్మై ప్రభుత్వం చేసిన ఈ చర్య …
Read More »మళ్లీ అదే సమస్య.. క్లారిటీ ఇవ్వని చంద్రబాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే నిమ్మకూరు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన వరుసగా సభలు పెట్టారు. అదేవిధంగా మచిలీపట్నంలోనూ పర్యటించారు. అయితే.. చంద్రబాబు పర్యటనలో తమకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని.. తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు చూసీ చూడనట్టే వ్యవహరించారు. ముఖ్యంగా నాలుగు నియోజకవ ర్గాల్లో నేతల మధ్య సమస్యలు ఉన్నాయి. గుడివాడ, నూజివీడు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకుల …
Read More »వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ గద్దె మనదే: కేసీఆర్
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో(2024) బీఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విజయం అందుకుని.. ఢిల్లీ గద్దెనెక్కడం ఖాయమని చెప్పారు. ఇది కొందరికి నచ్చకపోవచ్చని.. అయినా.. జరిగేది ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికే దిక్సూచిలా, సమానత్వ స్ఫూర్తిని నిత్యం రగిలించేలా… హైదరాబాద్ సాగర తీరాన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం కొలువుదీరిందన్నారు. అంబేద్కర్ కాంస్య ప్రతిమను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్య …
Read More »రామానాయుడు స్టూడియోకు ఎసరొచ్చిందా?
ఏపీ అధికార పార్టీ వైసీపీ నాయకులు చెబుతున్నట్టు.. తమ పాలనా రాజధాని విశాఖలో మరో సంచలన వివాదం తెరమీదికి వచ్చింది. ఇక్కడ ఎప్పుడో మూడు దశాబ్దాల కిందటే ముందుచూపుతో.. మెగా నిర్మాత.. దగ్గుబాటి రామానాయుడు ఒకస్టూడియోను నిర్మించారు. అప్పుడప్పుడు.. ఇక్కడ చిన్న సినిమాలు రూపు దిద్దుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ స్టూడియో కేంద్రంగా వివాదం తెరమీదికి వచ్చింది. దీనిని ఆక్రమించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates