ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసారు. ఈ నెల 4న తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో నిర్వహించ తలపెట్టిన “బాదుడే బాదుడు కార్యక్రమ” …
Read More »హాట్ టాపిక్గా విజయవాడ ఎంపీ టిక్కెట్…!
విజయవాడ ఎంపీ టికెట్ అంటే ప్రస్తుతం ఒక హాట్ సీట్ లెక్క. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజయవాడ లెక్కవేరే అంటున్నారు వైసీపీ నాయకు లు. దీనిని ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొన్నాళ్లు ప్రభుత్వకార్యక్రమాల్లో హల్చల్ చేసినా తర్వాత ఆయన వ్యాపారాలు, వ్యవహారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో …
Read More »మునుగోడు చిత్రం.. ఓటుకు నోటు కోసం గొడవ
ఎన్నికల సమయంలో ఓటు కోసం నోటు పంచడం అన్నది చాలా మామూలు విషయం అయిపోయింది ఇప్పుడు. నిత్యావసరాలు పెరిగినట్లే ఒక ఎన్నిక నుంచి ఇంకో ఎన్నికకు వచ్చేసరికి ఓటు రేటు కూడా పెరిగిపోతోంది. ఈ రేట్ల విషయంలో తెలంగాణ పైపైకి ఎగబాకుతుండడం విశేషం. దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎలా డబ్బు, మద్యం ఏరులై పారింద తెలిసిందే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కొత్త …
Read More »బాలయ్య ‘అన్స్టాపబుల్’లో షర్మిళ?
ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ టాక్ షో ఏది అంటే మరో మాట లేకుండా ‘అన్స్టాపబుల్’ పేరు చెప్పేయొచ్చు. ఓటీటీలో టాక్ షో ఏంటి.. అందులోనూ బాలయ్య హోస్ట్ ఏంటి.. ఎవరు చూస్తారు ఈ షో అన్న వాళ్లంతా కూడా ఇప్పుడు ఆ షోకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా ప్రశ్నించిన వాళ్లు కూడా ఆ షోకు అడిక్ట్ అయిపోతున్నారు. ఆ స్థాయిలో షోకు రెస్పాన్స్ తీసుకొచ్చారు మేకర్స్, …
Read More »తూర్పులో జనం నాడి మారుతోందా… !
రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ పుంజుకుంది. ఇది అనూహ్యమనే మాట వినిపించింది. ఎందుకంటే.. ఇక్కడ చాలా నియోజకవర్గా ల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అయితే.. గత ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిస్తే.. ఉమ్మడి తూర్పులో 12 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక, రాజమండ్రి, కాకినాడ పార్లమెంటు స్థానా్లోనూ వైసీపీ …
Read More »ఏపీలో 3 పార్టీలకూ మహిళా నేతలు కావలెను…!
అవును.. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల్లోనూ మహిళా నాయకులు కావలెను! అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మహిళా నాయకుల కొరత వేధిస్తోందని.. ఇటీవల చూచాయగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకాదు..త్వరలోనే మరింత ప్రక్షాళన చేయనున్న నేపథ్యం లో మహిళా నాయకులు అవసరం అవుతారని..వారిని తయారు చేయాలని పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడుకు సూచించారు. ప్రస్తుతం ఉన్న వారిని చూస్తే.. వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాథ, శ్రీకాకుళం జిల్లాలోని …
Read More »జనసేనలో అన్నీ కొత్తమొఖాలే.. జనం ఆదరిస్తారా?
జనసేన పార్టీని పూర్తిస్థాయిలో పుంజుకునేలా చేయాలనేది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం. ఇదే విషయాన్నితాజాగా ఆయన వెల్లడించారు. పార్టీని అన్ని రూపాల్లోనూ విస్తరిస్తామన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో పవన్ ఇవే వ్యాఖ్యలుచేశారు. అయితే.. పార్టీని బలోపేతం చేయాలంటే.. కొత్తవారిని తీసుకుని తీరాలి. ఈ విషయం ఎప్పటి నుంచో చర్చకు వస్తున్నదే. గత ఏడాది కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఎప్పటికప్పుడు సంకల్పం …
Read More »పవన్ ముందే చెబితే అన్నీ ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటివరకు తమ మీద జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ విషయంపై ఆయన రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ సెలబ్రిటీ కావటం వల్ల.. ఆయన ఎక్కడకు వచ్చినా ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని.. ఆయన రాక కారణంగా ఇతురులకు ఇబ్బందులు కలగనివ్వకుండా …
Read More »వైసీపీ నేత చెప్పాడు.. కుప్పంలో ఓటుకు 5 వేలు
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మీద ఏడాది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించాలని జగన్ చాలా పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. 175కి 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధ్యం కాదంటూ ఆ మధ్య జగన్ పర్యటన సందర్భంగా గోడల మీద పెయింటింగ్స్ రాయించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా …
Read More »వైసీపీ డ్రామా బయటపడిపోయిందే
అమరావతి రాజధాని విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న డ్రామా అంతా తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైకాపా ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామని.. అక్కడి నుంచి రాజధాని ఎక్కడికీ పోదని.. కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయిస్తామని.. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని చెబుతున్నారు. అమరావతిని ఎందుకు …
Read More »అమరావతి కేసు నుంచి తప్పుకున్న సీజే
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయం సంగతి అందరికీ తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అమరావతిని దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతోంది జగన్ సర్కారు. ఐతే తమ నుంచి భూములు సేకరించి, చట్టబద్ధమైన ఒప్పందం చేసుకున్నాక.. ఇలా రాజధానిని తరలించడం ఏం న్యాయమంటూ అమరావతి రైతులు …
Read More »అయ్యో టీ కాంగ్రెస్.. మునుగోడులో ముక్కలు చెక్కలు..!
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందా..? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతి కూడా మిగలని పరిస్థితి నెలకొందా..? కోవర్టులు, సీనియర్ల దొంగదెబ్బతో ఆ పార్టీ విలవిలలాడుతోందా..? రేవంత్ జాకీలు వేసినా లేవడం లేదా..? మునుగోడులో పార్టీ శ్రేణులు ముక్కలు చెక్కలు అయ్యాయా..? అధికారం దేవుడెరుగు.. ఉప ఎన్నికలో కనుక ఓడితే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమేనా..? తమ స్థానాన్ని పువ్వుల్లో పెట్టి పువ్వు పార్టీకి అందించబోతుందా..? అంటే పరిస్థితులు అలాగే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates