హిందువులు అన్నంతనే గుర్తుకు వచ్చే దైవం శ్రీరాముడు. అందులో నిజం ఎంతన్న దానిపై ఎవరూ ఇప్పటివరకు అధ్యయనం చేయలేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక సంస్థ చేసిన సర్వే ఫలితం షాకిచ్చేలా ఉంది. హిందువులు ఎక్కువగా కొలిచే దేవుడు ఎవరన్న అంశంపై పీవ్ రీసర్చ్ సెంటర్ సర్వే నిర్వహించింది. హిందువులు అన్నంతనే శ్రీరాముడి పేరు వినిపించటం.. దాని చుట్టూ కొన్నేళ్లుగా బోలెడంత రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజకీయం …
Read More »కరోనా దెబ్బ.. జట్టు జట్టునే మార్చేశారు
కరోనా కాలంలో క్రీడా రంగంలో ఎన్నెన్నో చిత్రాలు చూశాం. బయో బబుల్ అంటూ కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి.. అందులోనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులను ఉంచి.. వాళ్లు బయటికి రాకుండా, బయటివాళ్లు లోపలికి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యాచ్లు నిర్వహించడం ఏడాది కిందట్నుంచే చూస్తున్నాం. వివిధ క్రీడల్లో లీగ్స్, టోర్నీలు, సిరీస్లు ఇలాగే నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే ఈ బబుల్ను పకడ్బందీగా నిర్వహించకుంటే ఏం జరుగుతుందో …
Read More »పోలీసు ఇంటికి కన్నం.. సారీ ఫ్రెండ్ అంటూ దొంగ లెటర్..!
తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడటం.. ఆ ఇంట్లో దొరికినదంతా దోచుకెళ్లడం చాలా సహజం. ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ.. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి.. దర్జాగా లో లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా..వెళ్లే ముందు… ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అందులో.. తాను కావాలని దొంగతనం చేయలేదని.. …
Read More »చేతులెత్తేసిన అపర కుబేరుడు.. సాధ్యం కాదని తేల్చేశాడు
చేతి నిండా డబ్బులు ఉండాలే కానీ కొండ మీద కోతినైనా తేవొచ్చన్న నమ్మకం చాలామందికి ఉంటుంది. ఊహకు వాస్తవానికి మధ్య అంతరాన్ని చాలామంది మిస్ అవుతారు. టెక్నాలజీతో ఏదైనా సాధ్యమని నమ్మేవారికి.. కాలమే వారికి సరైన అవగాహన కల్పిస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది అపర కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ కు. తన ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆయనకు తీరని కలల్లో …
Read More »ఫేస్ బుక్ కొత్త రూల్స్..!
ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న కంటెంట్స్ పై ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్ బుక్ చర్యలకు రెడీ అయ్యింది. ఈ ఏడాది మే 15 నుండి జూన్ 15 మధ్య నిబంధనలకు విరుద్దంగా ఉన్న మూడు కోట్ల కంటెంట్స్ పై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మూడు కోట్లలో కొన్నింటిని తొలగించగా… మరికొన్నింటిని కవర్ చేశామని …
Read More »టీ20 చరిత్రలోనే అరుదైన రికార్డ్..!
టీ20 చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ టీ20 ఫార్మాట్ లో క్రికెటర్లు సెంచరీలు చేయడానికే చాలా కష్టపడుతుంటారు. అలాంటిది ఓ క్రికెటర్ డబుల్ సెంచరీ చేశాడు. అది కూడా మన దేశ క్రికెటర్ కావడం విశేషం. టీ 20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం గమనార్హం. 79 బంతుల్లో 205 పరుగులు చేసి ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర …
Read More »పెళ్లైన అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు..
చూసేందుకు అమాయకంగా కనిపిస్తాడు. మాటలు కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. టార్గెట్ పెట్టుకొని మరీ మోసం చేయటంలో దిట్ట. దొంగతనం.. చైన్ స్నాచింగ్.. దొమ్మీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేరాలు ఇతగాడి ఖాతాలో కనిపిస్తాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ.. అతడి బుద్ది మారలేదు. పెళ్లై.. ఒంటరిగా ఉండే డబ్బులున్న అమ్మాయిల్ని వెతికి పట్టుకొని మరీ మోసం చేయటంలో సిద్ధహస్తుడు. అతగాడి నేరాల చిట్టాను చూసి పోలీసులే …
Read More »వ్యాక్సిన్ తో కంటిచూపు..!
కరోనా కి మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. కరోనా సోకినా కూడా.. దానిపై పోరాడేందుకు సహాయం చేస్తుంది. అయితే.. ఓ మహిళ విషయంలో మాత్రం.. ఈ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది. వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ …
Read More »అత్తారింటి నుంచి పారిపోయిందని..
ఇది దారుణం. దారుణాతి దారుణం. తన కూతురికి బలవంతపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ తండ్రి.. అక్కడ ఉండలేక తన కూతురు పారిపోయిందని తెలిసి ఆమె పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై తన కొడుకులు, ఇతర బంధువులతో కలిసి పాశవిక దాడికి పాల్పడ్డాడు. కన్న బిడ్డ అని కనికరం లేకుండా ఆ అమ్మాయిని ఆ తండ్రి హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన …
Read More »మన మిథాలీ ఖాతాలో అద్భుత రికార్డు
ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ అయిన షెఫాలి వర్మ వయసు 17 ఏళ్లు. జట్టులో మరో కీలక సభ్యురాలైన జెమీమా రోడ్రిగ్స్ వయసేమో 20 ఏళ్లు. వీళ్లిద్దరే కాదు.. మరికొందరు భారత యువ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ ఆరంభించే సమయానికి ఇంకా పుట్టనే లేదు. ఎప్పుడో 1999లో ఆమె తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. అప్పట్నుంచి 22 ఏళ్లుగా అలుపూ సొలుపూ లేకుండా …
Read More »నిమ్మరసంతో కరోనా పాజిటివ్.. ఇదో పెద్ద హ్యాక్..!
కరోనా మహమ్మారి మన దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అతలాకుతలం చేసేసింది. ఈ వైరస్ పేరు చెబితేనే చాలా మంది భయపడిపోయారు. అయితే.. ఇప్పుడు అదే కరోనా మహమ్మారిని ఉపయోగించుకొని కొందరు టీనేజర్లు.. ఎంజాయ్ చేస్తున్నారట. ఏంటి అర్థం కాలేదా..? వారికి కరోనా రాకున్నా.. వచ్చినట్లు ఫేక్ రిజల్ట్ చూపించి.. అది కూడా నిమ్మరసం ఉపయోగించి హ్యాక్ చేసి.. స్కూళ్లు, కాలేజీలు ఎగ్గొడుతున్నారు. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకోగా.. దీనికి …
Read More »కోవాగ్జిన్ సామర్థ్యం 77శాతం…వారికి కరోనా భయం తగ్గినట్లే..!
కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభించిందో అందరికీ తెలిసిందే. దీనిని తరిమికొట్టేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. తాజాగా..కోవాగ్జిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్ ఫైనల్ రిజల్ట్ ను కంపెనీ ప్రకటించింది. తీవ్రమైన, మధ్యస్థ కేసుల్లో వ్యాక్సిన్ 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ ప్రకటించింది. తీవ్రమైన కేసుల్లో 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించామంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని భారత్ …
Read More »