అమెరికాలో శరవేగంగా దూసుకుపోతోన్న ప్రముఖ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ చైన్ “గోదావరి” ఇప్పుడు మిన్నియాపోలిస్ నగరంలోకి అడుగుపెట్టబోతోంది. భారతీయ వంటకాలు, గోదావరి రుచులు, ప్రత్యేకమైన వంటకాలు, అత్యుత్తమైన ఆహ్లాదకర వాతావరణం, సమ్మోహనపరిచే విందు భోజనాల వేదికతో మిన్నియాపోలిస్ లోని భోజనప్రియులను అలరించేందుకు గోదావరి సిద్ధమైంది. ఈ వారాంతంలో వినాయక చవితి సందర్భంగా ఈడెన్ ప్రైరీ లో ప్రారంభించబోతున్న “గోదావరి మిన్నియాపోలిస్” ప్రారంభోత్సవానికి మీ అందరినీ సగర్వంగా “గోదావరి” యాజమాన్యం మనస్ఫూర్తిగా …
Read More »వర్క్ఫ్రంహోం పై టెక్కీల బాధ మీకు అర్థమవుతోందా?
వర్క్ ఫ్రం హోం… గతంలో టెక్కీలకు మాత్రమే ఉన్న సౌలభ్యం కాగా కరోనా పుణ్యమా అని ఉద్యోగాలు చేసే అందరికీ అది దాదాపుగా భాగమైపోయింది. అప్పటిదాకా ఆఫీస్ లకు వెళ్లి విసిగిపోయిన వాళ్లకు మొదట్లో ఇది బాగానే ఉంది. పనితో పాటు ఫ్యామిలీకి టైం కేటాయించొచ్చని సంబరపడ్డారు. ఇప్పుడు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్.. అంటే వామ్మో అంటున్నారు. టార్చర్ అయిందని వాపోతున్నారు. ముఖ్యంగా టెక్కీలైతే తమ బాధ చెప్పనలవి …
Read More »ఆమె గురించి తెలిస్తే.. సలాం చేయకుండా ఉండలేరు
ఆమెది చాలా సాదాసీదా జీవితం. కానీ.. ఆమెలోని మానవత్వం.. నలుగురికి సాయం చేయాలన్న తపన.. కరోనా లాంటి సంక్షోభ సమయంలో తన గురించి కాకుండా.. అందరి గురించి ఆలోచించే ఆమె తత్త్వం ఎందరికో స్ఫూర్తినిస్తుందని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో తాజాగా వెలుగు చూసిన ఒక స్ఫూర్తి కిరణంగా రత్నమాలను చెప్పాలి. నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. కరోనాలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వీలైనంత మేర సాయం చేయాలన్న తలంపు ఆ ల్యాబ్ టెక్నిషియన్ …
Read More »హిస్టరీ క్రియేట్ చేసిన యాపిల్..
నాజులైన ఉత్పత్తులతో తనకు సాటి మరెవరూ రానట్లుగా ఉండే యాపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీ అయిన ఈ సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసింది. తాజగా ఆ కంపెనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అమెరికాలో 2లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీగా అవతరించింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండేళ్ల క్రితం యాపిల్ లక్ష …
Read More »సచిన్ ఒక్కడికే ఆ గౌరవం
ఒక దిగ్గజ క్రికెటర్ రిటైరవుతున్నాడంటే.. అతడికి ఫేర్వెల్ మ్యాచ్ ఉండాలని.. మైదానంలో అభిమానుల మధ్య చివరి మ్యాచ్ ఆడి ఘనంగా, గౌరవంగా తప్పుకునే అవకాశం ఉండాలని అభిమానులు ఆశించడం సహజం. క్రికెట్ను కేవలం ఒక ఆటలాగే చూసే విదేశాల్లోనూ క్రికెటర్లకు ఇలాగే వీడ్కోలు ఇస్తుంటారు. అలాంటిది క్రికెట్ను ఒక మతంలా భావించి, క్రికెటర్లను పిచ్చిగా ఆరాధించే మన దేశంలో తమ ఆరాధ్య క్రికెటర్లకు అలాంటి వీడ్కోలు ఉండాలని కోరుకోవడంలో ఆశ్చర్యం …
Read More »2020 – గణేష్ మండపాల్లేని వినాయక చవితి
వినాయకచవితి సమీపిస్తున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ సారి వినాయక చవితి ఉత్సవాలు ఉంటాయా లేదా? అని పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. హైదరాబాదీలకు వెరీవెరీ స్పెషల్ అయిన వినాయకచవితి… కళను కూడా కరోనా పోగొట్టేసింది. గణేష్ పండగ వస్తే పదిరోజుల పాటు గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినలేం. ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ…. ప్రభుత్వం అధికారికంగా చెప్పేసింది. కరోనా …
Read More »పేదలకు అండగా నిలిచే రూ.5డాక్టర్ ఇక లేరు
కొద్దిరోజుల క్రితం తమిళ హీరో నటించిన డబ్బింగ్ మూవీ ‘‘ఆదిరింది’’ (తమిళంలో మెర్సెల్) గుర్తుందా? అందులో రూ.5లకే వైద్యం అందించే పాత్ర ఉంది.. గుర్తుకు వచ్చిందా? రీల్ లో కనిపించే ఆ పాత్ర..రియల్ లైఫ్ లోని తిరువేంకటం అనే పెద్దాయన స్ఫూర్తిగా తీసుకున్నారు. అవకాశం లభిస్తే చాలు.. లక్షలకు లక్షలకు దండుకునే వైద్యులు మన చుట్టు ఉన్న రోజుల్లోనే కేవలం రూ.5లకే వైద్యాన్ని అందించే ఆయన తాజాగా కన్నుమూశారు. చెన్నైలోని …
Read More »వాట్ నెక్స్ట్ మిస్టర్ ధోనీ
మొత్తానికి ఏడాదికి పైగా సాగుతున్న చర్చకు తెరపడింది. మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైపోయాడు. తన భవిష్యత్ మీద జనాలు ఏవేవో ఊహాగానాల్లో ఉండగా.. చడీచప్పుడు లేకుండా స్వాంతంత్ర్య దినోత్సవాన రిటైర్మెంట్ కబురు చెప్పేశాడు. దీంతో ధోనీని మళ్లీ టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో చూస్తామని ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. అలాగే అతడి రిటైర్మెంట్ కోసం డిమాండ్లు చేస్తున్న వాళ్లు చల్లబడ్డారు. సచిన్ టెండుల్కర్ …
Read More »ఐపీఎల్ ముచ్చట.. రూ.300 కోట్లు వస్తే చాలట
ఈ ఏడాది దుబాయ్ లో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీ స్పాన్సర్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వివో.. టైటిల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి బయటకు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వివో ప్రతి ఏటా …
Read More »సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్.. కారణమేంటో తెలుసా?
కేరళలోని ఇడుక్కి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ జయలక్ష్మిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇందుకు కారణం ఆమె ఓ రిజిస్ట్రేషన్ విషయంలో అమానవీయంగా వ్యవహరించడమే. ఈ నెల 6వ తేదీని జయలక్ష్మి ఓ క్యాన్సర్ బాధితుడితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే. డ్రైవర్గా పని చేసే సనీష్ అనే వ్యక్తి కొంత కాలం కిందట క్యాన్సర్ బారిన పడ్డాడు. …
Read More »టిక్ టాక్ మళ్లీ రానుందా?
చైనా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా జూన్ 29న సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. టిక్ టాక్ సహా 59 చైనా యాప్లను ఒకేసారి నిషేధించి వాటి యాజమాన్యాలకు, యూజర్లకు ఒకేసారి పెద్ద షాకే ఇచ్చింది కేంద్రం. రెండు వైపులా ఆవేదన స్వరాలు వినిపించినా మోడీ సర్కారు పట్టించుకోలేదు. తమ నిర్ణయానికి కట్టుబడే ఉంది. మిగతా యాప్ల మాటేమో కానీ.. టిక్ టాక్ నిషేధంతో మాత్రం కోట్లాది మంది గగ్గోలు …
Read More »సంజుకు క్యాన్సర్.. కేజీఎఫ్ సంగతేంటి?
కరోనా టైంలో అనేక షాకులు తింది బాలీవుడ్. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి దిగ్గజ నటులు అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. కరోనా వల్ల సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ ప్రాణాలు వదిలాడు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇంకా మరికొన్ని విషాదాలు చోటు చేసుకున్నాయి. అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడటమూ ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ ఆయన కోలుకుని …
Read More »