కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ప్రపంచదేశాలు కొత్తరకం పాస్ పోర్టును తీసుకు రాబోతున్నాయా ? అవునే సమాధానం వినిపిస్తోంది. ఈ కొత్తరకం పాస్ పోర్టే వ్యాక్సిన్ పాస్ పోర్టట. మామూలుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యెమెంట్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇపుడు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లతో పాటు వ్యాక్సిన్ పాస్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది. ఇంతకీ వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏమిటంటే …
Read More »మగాళ్ళపైనే పగపట్టిన కరోనా వైరస్
కరోనా వైరస్ ముఖ్యంగా మగాళ్ళపైనే పగబట్టినట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే రెండు విడతల్లోను కరోనా తీవ్రత మగాళ్ళపైనే ఎక్కువగా కనబడుతోంది. రోగుల్లో గానీ మరణాల్లో కానీ మగాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏదో అవసరాల వల్ల ఇంట్లో నుండి బయటకు వస్తున్న మగాళ్ళు వైరస్ దాడికి తీవ్రంగా గురవుతున్నట్లు సమాచారం. దీనికి అదనంగా ఊబకాయం, దురలవాట్లు, నిర్లక్ష్యం, అనారోగ్యాల వల్లే మగాళ్ళు ఎక్కువగా కరోనా …
Read More »డేంజన్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత నుండి డేంజర్ జోన్లో నుండి సేఫ్ జోన్లోకి ఓ రాష్ట్రం చేరుకున్నదంటే మామూలు విషయం కాదు. డేంజర్ జోన్లోకి వెళ్ళినందుకు ప్రభుత్వ యంత్రంగాన్ని, జనాలను ఇద్దరినీ తప్పు పట్టాల్సిందే. ఇదే సమయంలో సేఫ్ జోన్లోకి చేరుకున్నదంటే కూడా ప్రభుత్వం+జనాలను అభినందించాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయిన ఢిల్లీ మళ్ళీ సేఫ్ జోన్లోకి చేరుకోవటమే. ఢిల్లీలో ఏప్రిల్ నెలకు ముందు రోజుకు …
Read More »నెల్లూరు కరోనా మందు.. రచ్చ రచ్చ
నెల్లూరు జిల్లాలోని కృష్ణంపట్నం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక్కడ ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు.. కరోనాకు ఇస్తున్న మందు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ముందు దీని గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడారు. జనాల మూఢత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారని.. శాస్త్రీయత లేని మందు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ మందు కోసం జనాలు క్యూలు కట్టిన ఫొటోలు, వీడియోలు చూపించి ఇదేం వెర్రితనం అంటూ …
Read More »వైట్ ఫంగస్ కలకలం..బ్లాక్ కంటే డేంజరట
అసలే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ సోకటం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసులతోనే కరోనా వైరస్ రోగులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా దానికన్నా ప్రమాధకరమైన వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడటంతో డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. వీరిలో కరోనా వైరస్ లక్షణాలు …
Read More »టీకాలను తగ్గించేస్తున్న కేంద్రం
ఒకవైపేమో అందరికీ తొందరగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని నరేంద్రమోడి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన టీకాలను కేంద్రం తగ్గించేస్తోంది. ఒకవైపే వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాలని చెబుతునే మరోవైపు టీకాలను తగ్గించేయటం నరేంద్రమోడి సర్కార్ కే చెల్లింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత మొదలైన దగ్గర నుండి మోడి డబల్ గేమ్ స్పష్టంగా బయటపడిపోతోంది. మేనెలలో రెండు విడతలు, జూన్ మొదటి విడతలో మొత్తం మీద 50 …
Read More »హ్యాపీ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి నేపధ్యంలో శాస్త్రవేత్తలు హ్యాపీన్యూస్ చెప్పారు. ప్రస్తుత తీవ్రత జూలై నెలలో బాగా తగ్గిపోతుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ మొదటి వేవ్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ యావత్ దేశాన్ని వణికించేస్తు సంక్షోభంలోకి నెట్టేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. చాలా రాష్ట్రాలు సెకెండ్ వేవ్ ను ఎలా ఎదుర్కోవాలో అర్ధంకాక కుదేలైపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు కరోనా సెకెండ్ వేవ్ కట్టడిలో …
Read More »హైదరాబాద్ క్రికెటర్ను ఆదుకున్న కోహ్లి
స్రవంతి నాయుడు అని హైదరాబాద్ మహిళా క్రికెటర్. ప్రస్తుతం ఆమె వయసు 34 ఏళ్లు. క్రికెట్ నుంచి కొన్నేళ్ల కిందటే రిటైరైంది. భారత జట్టు తరఫున ఆమె ఒక టెస్టు మ్యాచ్, నాలుగు వన్డేలు, ఆరు టీ20లు ఆడింది. హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో స్రవంతి పేరు బాగానే పాపులర్. ఇప్పుడు ఆమెకు పెద్ద కష్టం వచ్చింది. స్రవంతి తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. తల్లి పరిస్థితి విషమంగా తయారైంది. …
Read More »కవలలను బలిగొన్న కరోనా
కరోనా చేస్తున్న కలకలం.. కొన్ని కుటుంబాల్లో అది మిగులుస్తున్న విషాదం అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ కు భిన్నంగా సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద వయస్కులు.. జీవితాన్ని చూసిన వారి మరణాల్ని ఒకలా అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా ఎంతో జీవితం ఉండి.. సరదాగా నవ్వుతూ తుళ్లుతూ ఉండే వారు ఉన్నట్లుండి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్న వైనం తీరని శోకాన్ని …
Read More »బ్లాక్ఫంగస్ రాకుండా ఉండాలంటే..
బ్లాక్ ఫంగస్.. కొవిడ్ కల్లోల సమయంలో జనాలను కొత్తగా భయపడుతున్న మాట. కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల్లో తలెత్తుతున్న ఈ కొత్త సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. కళ్లు సహా ఒంట్లోని కొన్ని ముఖ్య అవయవాలను దెబ్బ తీయడంతో ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తున్న ఈ జబ్బు జనాల్లో తీవ్ర ఆందోళన పెంచుతోంది. క్రమంగా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కంగారు పడిపోతున్నారు. దీన్నుంచి తప్పించుకోవడానికి …
Read More »2 డీజీ మందు గురించి కొన్ని నిజాలు
2 డియాక్సీ డి క్లూకోజ్.. షార్ట్గా చెప్పాలంటే 2 డీజీ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మందు. కరోనా నియంత్రణకు ఈ మందు చాలా ఉపయోగపడుతుందంటూ పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా ఈ మందును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేయడం.. త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండటం తెలిసిన సంగతే. ఈ మందు గురించి జనాలు ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. వివిధ మార్గాల్లో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. …
Read More »గేట్స్ లీలలపై మైక్రోసాఫ్ట్ ప్రైవేటు విచారణ
బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైనం ఎంతటి సంచలనానికి తెర తీసిందో తెలిసిందే. వీరి విడాకుల ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి బిల్ గేట్స్ కు సంబంధించి బోలెడన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని అచ్చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది. తమ కంపెనీకి చెందిన ఒక మహిళా …
Read More »