Political News

మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు లేదు ?

ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల మాట మాట్లాడినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగుతోంది. ఎవరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా వైసీపీలో ఎవరోకరు రోజూ మూడు రాజధానుల ప్రస్తావన చేస్తునే ఉంటారు. త్వరలోనే పాలన విశాఖకు మారుతుందని జగన్ కూడా తరచూ చెబుతుంటారు. అసలు మూడు రాజధానులే లేవని, విశాఖ మాత్రమే ఏకైక రాజధాని అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త వాదనను తెరపైకి …

Read More »

IPS ఆఫీసర్ ప్రేమలో మంత్రిగారు !

గతానికి భిన్నమైన పరిస్థితులు కొన్ని వర్తమానంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో రాజకీయం.. పాలనా వ్యవస్థలు రెండు రెండు దారులుగా ఉండటం తెలిసిందే. ఈ రెండు రంగాలకు చెందిన వారు పెళ్లాడటం అన్నది చాలా చాలా అరుదుగా చోటు చేసుకునే పరిస్థితి. దీనికి భిన్నంగా ఇటీవల కాలంలో ఇలాంటి కాంబనేషన్లో కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుందని చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర విద్యా …

Read More »

ఏమిటా ఉరవకొండ సెంటిమెంట్ !

ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయాల్లో మామూలు విషయమే. నువ్వు ఐరన్ లెగ్.. అంటే నువ్వు ఐరెన్ లెగ్ అని తిట్టుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. ఎవరికి వాళ్లు తాము గోల్డెన్ హ్యాండ్ అని.. పక్కనోడు ఐరెన్ లెగ్ అని చెప్పుకుంటుంటారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చి సరదాగా గడుపుతున్నారు. అసెంబ్లీ లాబీలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని …

Read More »

జనసేనకు బిగ్ డే- బిగ్ డెసిషన్ తీసుకుంటారా?

Pawan kalyan

మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపేందుకు అన్నీ ఏర్పాట్లు అయిపోయాయి. అధినేత పవన్ కల్యాణ్ సభంటే జనాలకు కొదవేమీ ఉండదు. అయితే సమస్యంతా పవన్లోనే ఉంది. అదేమిటంటే ఎంతకాలమైనా విషయాన్ని తేల్చటం లేదు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే పొత్తులు. పొత్తులపై పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. అందుకనే పార్టీ నేతలు, మిత్ర, ప్రత్యర్ధి పార్టీలతో పాటు మామూలు జనాల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే …

Read More »

కాంగ్రెస్ సీనియర్లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్ళీ బాగా కెలికేశారు. పార్టీలోని కొందరు పెద్ద రెడ్లు కేసీయార్ కు అమ్ముడుపోయారంటు ఆరోపణలు గుప్పించారు. రేవంత్ చేసిన తాజా ఆరోపణ చాలా పెద్దదనే చెప్పాలి. కొందరు సీనియర్లంటే కత వేరే విధంగా ఉండేది. కానీ పర్టిక్యులర్ గా కొందరు పెదరెడ్లన్నారు. దాంతోనే రెడ్లందరిలో ఇపుడు మంట మొదలైంది. తాను రెడ్డి అయ్యుండి కొందరు సీనియర్ రెడ్లని చెప్పటంలో అర్ధమేంటో …

Read More »

ఔత్సాహికులు ఎక్కువ.. అనుభవజ్ఞులు తక్కువ.. అదే పవన్ ఫెయిల్యూర్

పవన్ కల్యాణ్ జనసేన పదో ఏట అడుగుపెట్టేసింది. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం మచిలీపట్నంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు పవన్. జనసేన ప్రస్థానం, నాయకుడిగా పవన్ తీరు, రాజకీయాలకు బయట పవన్‌కు ఉన్న బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సొంత సామాజికవర్గం కాపుల రూపంలో ఉన్న కోట్లాది ఓట్ బ్యాంక్ వంటివన్నీ చూసినప్పుడు జనసేన పార్టీ రేంజ్‌కు ఇప్పుడున్న పరిస్థితికి ఏమాత్రం మ్యాచ్ కావడం లేదని అర్థమవుతుంది …

Read More »

ఎంపీ టికెట్ కోస‌మే మా నాన్న‌ను చంపేశారు: సునీత

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సోద‌రుడు వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాశ్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2017లో జ‌రిగిన‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే …

Read More »

ఎందుకింక ఎన్నిక‌లు.. వైసీపీపై నెటిజ‌న్ల ఫైర్‌

ఏపీలో తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన తీరుపైస‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా నెటిజ‌న్లు ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డార‌ని.. వ‌చ్చిన వార్త‌ల‌పై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్ర‌ధానంగా తిరుప‌తి, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ జ‌రిగిన తీరు, చివ‌రి రెండు గంట‌ల్లో వైసీపీ నేత‌లు.. విజృంభించిన తీరు పై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. నేత‌లు దౌర్జ‌న్యానికి దిగార‌ని.. దొంగ ఓట్లు వేసుకున్నార‌ని.. ప్ర‌ధాన మీడియాల్లో వార్త‌లు వ‌చ్చాయి. …

Read More »

కవితను కాపీ కొడుతున్న షర్మిల

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండాలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అనుకుంటున్నారు. నిత్యం ఎవరోకరి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో కొనసాగేందుకు వైస్సార్ బిడ్డ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలోని అన్ని పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు మహిళామణుల మధ్య నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది. లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను …

Read More »

పవన్ మాటతో డిష్యుం డిష్యుం

జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు నేతల సమావేశం సందర్భంగా ఏపీలో కాపులందరూ ఏకతాటిపైకి రావాలని.. జనసేనకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునివ్వడం.. మునుపెన్నడూ లేని విధంగా కాపులకు చేరువ అయ్యేలా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకే తావిచ్చాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు విషయమై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని …

Read More »

రాబిన్ టీం టీడీపీని ఇంత ముంచేస్తుందా!

రాజ‌కీయాల్లో వ్యూహ‌క‌ర్త‌ల కాలం న‌డుస్తోంది. ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. ప్ర‌స్తుతం వ్యూహ‌క‌ర్త‌లే కీల‌కంగా మారారు. గ‌త 2014 త‌ర్వాత‌.. రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగా.. వ్యూహ‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఉత్త‌రాది నుంచి దిగుమ‌తి చేసుకుని మ‌రీ..ఏపీలో రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆదిలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిశోర్ బృందాన్ని తెచ్చుకుని.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యానికి బాటలు వేసుకున్నారు. ఇక‌, జ‌గ‌న్ విష‌యంలో పీకే వ‌చ్చాక‌.. పీకేకి ముందు.. అన్న‌ట్టుగా …

Read More »

యూత్ ఫార్ములానే కాంగ్రెస్ నమ్ముకున్నదా ?

Revanth Reddy

రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ యూత్ ఫార్ములాను నమ్ముకున్నట్లుంది. 25 శాతం టికెట్లను యూత్ కే కేటాయించాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ప్రపోజల్ పంపారట. దానికి ఖర్గే కూడా ఓకే చెప్పారని పార్టీవర్గాల సమాచారం. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న నేతల్లో చాలామంది గుదిబండలుగా మారారనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నదే. పార్టీలోకి కొత్త నీటిని ఆహ్వానించాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎంతసేపూ …

Read More »