విశాఖ వేదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం చెప్తోంది. అంబానీ, జీఎంఆర్, జిందాల్ వంటి దేశ పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరై జగన్ పరువు నిలబెట్టారు. అయితే… అదేసమయంలో ఇతర చిన్నాచితకా ఇన్వెస్టర్లుగా హాజరైనవారిలో అత్యధికులు ఐప్యాక్ ప్రతినిధులేనన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఐప్యాక్లో పనిచేసేవారిలో చాలామంది ఎంబీఏలు చేసినవారు, సాఫ్ట్వేర్ కోర్సులు …
Read More »ప్రతిష్ట పెరుగుతుందనుకుంటే పరువు పోతోందే..
ఆంధ్రప్రదేశ్లో నాలుగేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన దగ్గర్నుంచి పారిశ్రామిక విధానం విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పరిశ్రమలను బెదరగొట్టి తరలిపోయేలా చేయడం.. చెప్పుకోదగ్గ కొత్త పరిశ్రమలు ఏవీ తీసుకురాకపోవడం పట్ల ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. ప్రతిపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని సింపుల్గా వైసీపీ నేతలు ఈ విషయంలో దాటవేయడానికి కూడా వీల్లేకపోతోంది. కళ్ల ముందు ఏం జరుగుతోందో జనాలకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో నెగెటివిటీ …
Read More »లోకేష్ తీరుపై తిరుపతి టీడీపీ అసంతృప్తి
జనవరి 27న ప్రారంభమైన నారా లోకేష్, యువగళం పాదయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. నేడో రేపో 500 కిలోమీటర్ల మైలురాయిని దాటుతున్న తరుణంలో ఆయన రోజుకో హామీ ఇస్తున్నారు. తన హామీలను అమలు చేస్తానని భరోసా కల్పించే దిశగా అక్కడక్కడా శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానితో సామాన్య జనానికి లోకేష్ పై విశ్వాసం పెరుగుతోంది. లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాల పర్యటనలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. …
Read More »పార్టీ మారతా.. పదవి ఇస్తారా?
ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక మహిళా నాయకురాలు. పైగా ఫైర్ బ్రాండ్. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్లో ఆమె చేసే కామెంట్లు రాజకీయంగా చర్చకు వస్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు.. సుంకర పద్మశ్రీ. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు. పైగా, రాజధాని అమరావతిని …
Read More »వేడెక్కిన స్టేషన్ఘన్పూర్ రాజకీయం..
తెలంగాణలో మరో 10 మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ అన్ని అస్త్ర శస్త్రాలతో రెడీ అవుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహం. అయితే.. ఆయనఅనుకుంటున్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా బీఆర్ ఎస్ పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఈ సీటును ఇద్దరు …
Read More »ఏం జరిగింది : ప్రముఖులతో ప్రత్యేక విందుకు సీఎం జగన్ డుమ్మా
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేళలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సదస్సుల సందర్భంగా ఏర్పాటు చేసే విందునకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రత్యేక విందునకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం …
Read More »వైసీపీకి 157 పక్కా.. మిగిలిన 18 లోనే పోటీ..
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వచ్చే ఎన్నికలకు సంబంధించి తనదైన శైలిలో సర్వే రిపోర్టు ను ఆవిష్కరించారు.(జాబితా కాదులేండి). వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజాబాట పడుతున్నారు. గడపగడ పకు కార్యక్రమంలో తిరుగుతున్నారు. అయితే.. ఎవరూ కూడా తమకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ, …
Read More »పెట్టుబడుల సదస్సులో ‘పట్టెడన్నం’ కోసం కొట్టుకున్నారా?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జగన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఇక, ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చారు. అయితే.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించినప్పటికీ.. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా సమ్మిట్ కు వచ్చిన వారికి ఇచ్చేందుకు కిట్లు …
Read More »60 మంది వైసీపీ నేతలు జంపేనా?!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. అంతేకాదు.. ఎప్పు డు ఎవరు ఏపార్టీలోకి జంప్ చేస్తారో చెప్పలేని పరిస్థితి నేటి ప్రజాస్వామ్యానిది. అవసరం-అవకాశం అనే రెం డు పట్టాలపైనే నాయకులు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక, తాజా విషయానికి వస్తే.. వైసీపీలో ఉన్న 150 (జగన్ మినహా) మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేతలు తమకు టచ్లో ఉన్నారని.. టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు …
Read More »ఏపీ ఖజానాకు ఎసరుపెట్టిన ఆఫీసర్ వెనుక ఉన్న మంత్రి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు ప్రభుత్వంలో, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అఫీషియల్ వైబ్సైట్కు సమాంతరంగా ప్రభుత్వ వైబ్సైటే అని అనుకునేలా మరో వెబ్సైట్ రూపొందించి కోట్ల కొద్దీ డబ్బును కాజేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ (ట్రైబ్యునల్) శ్రీనివాసరావుపై దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లో అంతర్గతంగా జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం బయటపడిందని …
Read More »ధనిక రాష్ట్రం కూడా ఇంత అప్పుల్లో కూరుకుపోయిందా ?
రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ధనిక రాష్ట్రమైంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు ఘనంగా చాటుకున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాష్ట్రం తమదే అని ఎన్నో వేదికలమీద ప్రకటించారు. అలాంటి ధనిక రాష్ట్రం ఇపుడు అప్పులు చేయందే గడిచేట్లుగా కనబడటంలేదు. ఇప్పటికే ఈ ఉపోద్ఘాతమంతా తెలంగాణా గురించే అని తెలిసిపోయుంటుంది. అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయార్ చెప్పుకున్న కాలం నుంచి అప్పులు చేయందే ఉద్యోగులకు జీతాలు …
Read More »ఈ ‘తొందర’ కూడా ప్రమాదమే జగన్ సర్!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ తొందర చూస్తే.. ఇది మరింత ఇబ్బందిగా మారడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. న్యాయవ్యవస్థ పరిశీలనలో ఉన్న విషయంపై జగన్ చాలా తొందరపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొందర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెలలో వచ్చే నూతన తెలుగు సంవత్సరాది నుంచి వాటిని లైన్లో పెట్టేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates