Political News

పంజాబ్ అష్ట‌దిగ్బంధం.. ఎందుకు? ఏమిటి?

ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్రం గురించి విన‌డ‌మే త‌ప్ప‌.. అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియదు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పంజాబ్ పేరు మాత్ర‌మే ప‌రిచ‌యం. అంత‌కుమించి మాత్రం ఆ రాష్ట్రం గురించి తెలియ‌దు. అయితే.. ఇప్పుడు ఇదే పంజాబ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త రెండు రోజులుగా ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. అన్ని రాష్ట్రాల్లోనూ ప్ర‌ధాన వార్త‌లుగా నిలిచాయి. మ‌రి దీనికి …

Read More »

జగనన్నకిది హెచ్చరికా ?

Y S Jagan

వాపును బలుపుగా అనుకుని జగన్ బొక్కబోర్లా పడ్డారు. సాధారణంగా ఎక్కడైనా గెలిస్తే భారీ విజయమంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి భారీ పరాజయమని చెప్పుకోవాలి. మూడింటికి మూడు ఓడిపోవడమంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అదీ జగన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. లేని పక్షంలో ఎంత ఖర్చు చేసిన ఫర్వాలేదు… మునుగోడు తరహాలో విజయం సాధించాలని ఆదేశించి ఉండే వారు.. పెత్తందార్లే సమస్య ప్రస్తుతం వైసీపీలో పెత్తందార్లు …

Read More »

ఏం కావాలో చెప్పండి.. ఎమ్మెల్యేల‌కు వైసీపీ ఆఫ‌ర్లు?!

ఇప్ప‌టి వ‌ర‌కు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను స‌రిగా ప‌ట్టించుకోలేద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఇప్పు డు వారికి భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తోంది. ఇటీవ‌ల త‌మ గోడు వినిపించుకోవ‌డం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం త‌మ‌ను ప‌ట్టించుకో వ‌డం లేద‌ని.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి.. మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ వంటి వారు బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేసి న విష‌యం తెలిసిందే. వీరిలో కోటంరెడ్డి ఏకంగా తిరుగుబావుటా ఎగుర వేశారు. …

Read More »

వైసీపీకి సాయిరెడ్డే లోటు తెలిసొచ్చిందా…!

ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి మోస్ట్ డిపెండ‌బుల్ లీడ‌ర్ విజ‌య‌సాయిరెడ్డేనా? అంటే..ఔన‌నే మాటే ప‌రిశీల‌కులు. విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన రెండు ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సాయిరెడ్డి ఎంత కీల‌క‌మో.. అర్ధ‌మ‌వుతుందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. ఢిల్లీలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం కావ‌డం. రెండు. ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీ ఘోరంగా విఫ‌లం కావ‌డం. ఈ రెండు అంశాల్లోనూ సాయిర్డెడ్డి ప్ర‌త్య‌క్షంగాను.. ప‌రోక్షంగాను …

Read More »

ఈసారీ డుమ్మా కొడితే.. ఈడీ అరెస్టే!

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత ఇప్ప‌టికి రెండు సార్లు ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఒక‌సారి హైద‌రాబాద్‌లో నేరుగా ఆమె ఇంట్లోనే విచార‌ణ జ‌రిపిన అధికారులు రెండో సారి ఢిల్లీలో విచారించారు. అయితే.. మూడోసారి కూడా విచారించాల్సి ఉంద‌ని పేర్కొంటూ.. నోటీసులు ఇచ్చారు. కానీ, క‌విత మూడో సారి విచార‌ణ‌కు డుమ్మా కొట్టారు. త‌న‌కు ఒంట్లో బాగోలేద‌ని, రాలేన‌ని త‌న …

Read More »

వైసీపీ అధికార మ‌దాన్ని దించేశారు: ప‌వ‌న్

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికార మ‌దాన్ని గ్రాడ్యుయేట్లు దించేశార‌ని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం మున్ముందు రానున్న ఎన్నిక‌ల్లో మార్పున‌కు సంకేత‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయని పవన్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్‌.. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలుగా …

Read More »

జ‌గ‌న్‌ను ఇవి కాపాడ‌లేవ‌ని ఇప్పుడు తెలిసిందా…!

రాష్ట్రంలో మొత్తం 9 శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో నాలుగు స్థానిక సంస్థ‌లకు జ‌రిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. స్థానిక సంస్థ‌లు అన్నీ కూడా గుండు గుత్త‌గా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి కాబ‌ట్టి.. ఇక‌, అదే స‌మ‌యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో రెండు స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. అయితే.. ఇది కూడా గాలికి కొట్టుకుపోయింది. దీనికి కార‌ణం.. ఉపాధ్యాయ సంఘాల్లో …

Read More »

టీడీపీ గెలుపులో పవన్ పాత్రెంత ?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానాన్ని టీడీపీ గెలుచుకోవటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రుందనే ప్రచారం మొదలైంది. ఎన్నికలు జరిగిన మిగిలిన స్ధానాలసంగతి పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుపులో మాత్రం పవన్ పాత్రుందని అర్ధమైపోతోంది. మామూలుగా అయితే జనసేన, పవన్ అభిమానుల ఓట్లు మిత్రపక్షం బీజేపీకి పడాలి. కానీ పవన్ పిలుపువల్ల ఆ ఓట్లలో ఎక్కువశాతం టీడీపీకి పడ్డాయనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీని ఓడించమని పవన్ …

Read More »

ఏం బ‌తుక‌య్యానీది..జ‌గ‌న్ రెడ్డీ: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. సీఎం జ‌గ‌న్ దూకుడుపై ఆయ‌న మండిప‌డ్డారు. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయ‌న‌కు డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌లేదు. అంతేకాదు.. అర్ధ‌రాత్రి అరెస్టులు చేయించారు. ఏకంగా ఎన్నిక‌ల్లో గెలిచిన‌ట్టుగా ప్ర‌క‌టించిన టీడీపీ అభ్య‌ర్థి రాంగోపాల్‌రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ ప‌రిణామాలు స్థానికంగా …

Read More »

లోకేష్ కొత్త నినాదం పులకేశి

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. రోజు వారిలో ఇరు పార్టీల నేతలు తిట్టుకుంటూనే ఉంటారు. మీరెంత అంటే మీరెంత అన్న రేంజ్ లో తిట్ల దండకం నడుస్తుంటుంది. గత మూడు నాలుగు నెలలుగా ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. చంద్రబాబు నాయుడు జనంలోకే వెళ్తూ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెడ్డటం మొదలు పెట్టిన తర్వాత ఆరోపణాస్త్రాలు వేగం పెరిగాయి. జగన్ …

Read More »

తప్పులో కాలేసిన ఐ ప్యాక్.. జగనన్న బండబూతులు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు అనూహ్య ఫలితాలనిచ్చాయి. వైసీపీని చావు దెబ్బ కొట్టాయి. ఫలితాలను చూసి అధికార పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మితిమీరిన ఆత్మవిశ్వాసమా.. లెక్క తప్పిందా అర్థం కాక నేతలు తల పట్టుకుంటున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలో మూడింటికి మూడు ఓడిపోవడం దేనికి సంకేతమన్న విశ్లేషణ కూడా మొదలైంది. అంచనా ఎక్కడ తప్పిందో వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.. వైసీపీకి వ్యూహకర్తగా ఉండే ఐ ప్యాక్ కూడా తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. …

Read More »

ఇక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌.. వైసీపీ ఏం చేస్తుంది?

స్థానిక‌సంస్థ‌లు, ఉపాధ్యాయులు, ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కీల‌క‌మైన ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర ప‌రాజయం చ‌వి చూసింది. ఇక‌, శాస‌న మండ‌లిలో టీడీపీ గ‌ళం వినిపించ‌దు.. అని భావించిన వైసీపీ.. ఇప్పుడు మూడు స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. వైసీపీ నేత‌లు భారీ ఎత్తున చ‌తికిల ప‌డిన ద‌రిమిలా.. ఈ నెల 23న నిర్వ‌హించ‌నున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కోటా …

Read More »