Political News

ఎగ్జిట్ పోల్ నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ..!

దేశంలో ఐదు రాష్ట్రాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. దాదాపు మూడు మాసాల కింద‌ట ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నిక‌ల క్ర‌తువు ఫైన‌ల్ స్టేజ్‌కు వ‌చ్చేసింది. డిసెంబ‌రు 3న ఎన్నిక‌ల ఫ‌లితం రానుంది. అయితే.. దీనికి ముందుగా.. ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చేశాయి. ఈ ఫలితాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే..చాలా చోట్ల ఈ ఫ‌లితాల‌పై భిన్నాభిప్రాయాలు వ‌చ్చాయి. ఒక‌వేళ అభిప్రాయాల‌ను ప‌క్క‌న పెట్టి అవే క‌నుక నిజ‌మైతే.. దేశంలో కొత్త హిస్ట‌రీ …

Read More »

బీజేపీకి పెద్ద పరీక్షేనా ?

తాజాగా జరిగిన పోలింగులో మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా బీజేపీకి మాత్రం పెద్ద పరీక్షే ఎదురయ్యింది. అందులోను పోటీచేసిన అభ్యర్ధులందరిలో ఆరుగురి పరిస్ధితి మరీ ప్రత్యేకం. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు చాలా ప్రత్యేకం. ఎలాగంటే ఇపుడు పోటీచేసిన వారిలో ముగ్గురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల హోదాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కూడా పోటీచేసిన వాళ్ళున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చేయటం …

Read More »

2018 ఎగ్జిట్ పోల్‌.. కేటీఆర్ కామెంట్స్‌తో వెతికేసిన నెటిజ‌న్లు

తెలంగాణ స‌హా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది. ఈ క్ర‌మంలో ఆయా రాష్ట్రాల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? అనే విష‌యాల‌పై తాజాగా అనేక సర్వేలు వ‌చ్చాయి. కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్య మూడు రాష్ట్రాల్లో పోటాపోటీగా ఉంటుంద‌ని స‌ర్వేలు చెప్ప‌గా.. ఒక రాష్ట్రం మిజోరాంలో కాంగ్రెస్‌-అక్క‌డి స్థానిక పార్టీ ఎంఎన్‌పీల మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశాయి. అయితే.. తెలంగాణ‌లో కూడా ఇంతే పోటీ ఉంటుంద‌ని చెప్పినా.. …

Read More »

రెండు చోట్ల కుస్తీ.. ఒక్క‌చోటే విజ‌యం.. అగ్ర‌నేతలకు షాక్‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన అగ్ర‌నాయ‌కుల‌కు.. ఓట‌ర్లు షాకిచ్చారు. పార్టీల‌కు అతీతంగా నాయ‌కుల‌ను ఓడించేందుకు రెడీ అయిన‌ట్టు స‌ర్వేలు చెబుతున్నాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ప్ర‌జ‌లు రెండేసి స్థానాల్లో పోటీచేసిన నాయ‌కుల‌ను ఒక్క స్థానానికే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్‌: రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తెలంగాణ‌కు ముందు.. త‌ర్వాత కూడా.. కేసీఆర్ ఇలా రెండు చోట్ల …

Read More »

ఎగ్జిట్ పోల్ సర్వే తప్పు…70 సీట్లు పక్కా: కేటీఆర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ పోయడంతో సర్వత్రా ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలో చేపట్టిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడైంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎగ్జిట్ పోల్ సర్వేలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పోలింగ్ పూర్తవ్వకుండానే ఎగ్జిట్ పోల్ …

Read More »

కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడిపై దాడి

తెలంగాణ ఎన్నికలలో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరు, నర్సాపూర్ లో ఘర్షణలు జరిగాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో లింగంపల్లి బిట్ల తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం …

Read More »

కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్!

తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా..క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం నిబంధనలు మార్పు చేయడంతో తాజాగా సాయంత్రం 5.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. గతంలో ఈ సమయం 6.30గా ఉంది. తాజాగా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతుండడంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండి …

Read More »

రేప‌టి నుంచి బాబు యాక్టివ్‌.. షెడ్యూల్ ఇదే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు డిసెంబ‌రు 1 నుంచి యాక్టివ్ కానున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఈ రోజు ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న త‌ర్వాత‌.. విజ‌య‌వాడ‌కు చేరుకుని శుక్ర‌వారం నుంచి యాధావిధిగా అన్నికార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటార‌ని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గురువారం సాయంత్రం చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు రానున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. సంప్రదాయం …

Read More »

ఇది ఘోరం.. సాగ‌ర్ వివాదంపై పురందేశ్వ‌రి ఫైర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఉద్దేశ పూర్వ‌కంగానే వివాదం రేగిందో.. లేక నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే రాజుకుందో తెలియ‌దు కానీ.. సాగ‌ర్ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఏపీ పోలీసులు.. అక్క‌డ మోహ‌రించ‌డం, ఇటు తెలంగాణ పోలీసులు కూడా రావ‌డం ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వివాదం రేగింది. మొత్తానికి ఈ విష‌యం తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భావం చూపుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ విష‌యంలో బీజేపీ ఏపీ చీఫ్ …

Read More »

హైద‌రాబాద్ ఓట‌రు అస్స‌లు మార‌లేదుగా!

హైద‌రాబాద్ ఓట‌రు అస్స‌లు మార‌లేదు. నేత‌లు గొంతు చించుకున్నా.. మీడియా చైత‌న్యం చేసినా.. ఎన్ని క‌ల సంఘం రండి బాబూ రండ‌ని ఆహ్వానించినా.. హైద‌రాబాద్ ఓట‌రు మాత్రం కిమ్మ‌న‌లేదు. కిక్కురుమన‌లేదు. త‌న మానాన త‌ను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయ‌క‌లు ప్ర‌చారంతో ఊరూవాడా ద‌ద్దరిల్లింది. ఇక‌, పోలింగ్ కూడా గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. వీధి చ‌వ‌ర్లోనో.. రోడ్డు మ‌ధ్య‌లోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా …

Read More »

ఉమ్మ‌డి మేనిఫెస్టోపై టీడీపీ- జ‌న‌సేన.. అంత‌ర్గ‌త పోరు..!

టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఏర్ప‌డ్డాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపుడే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించాయి. అయితే.. దీనిని కొంద‌రు టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నేత‌లు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. వీరిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు స‌మ‌న్వ‌య క‌మిటీలు కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా.. కొన్ని జిల్లాల్లో స‌క్సెస్ అయి.. మ‌రికొన్ని జిల్లాల్లో వివాదంగా మారాయి. ఈ త‌తంగం కొన‌సాగుతుండ‌గానే.. ఇప్పుడు జ‌న‌సేన నేత‌లు మ‌రో కొత్త‌వాదన తెర‌మీద‌కి …

Read More »

పోలింగ్ వేళ‌.. ‘సాగ‌ర్’ గోల‌.. వ్యూహాత్మ‌క‌మా?

ఒక‌వైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కే ఈ పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. దీంతో సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నేత‌లు ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. అయితే.. ఇంత‌లోనే సాగునీటి ప్రాజెక్టుల వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద‌.. ఏపీ, తెలంగాణ పోలీసులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఏపీ స‌రిహ‌ద్దుల్లోని అన్ని గేట్ల‌ను వైసీపీ ప్ర‌భుత్వం మూసేసింది. అంతేకాదు..ఈ రోజు(గురువారం) ఉద‌యం 5 గంట‌ల నుంచి …

Read More »