స్కిల్ స్కామ్ లో అరెస్టయి 48 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయా ? టీడీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. మొన్నటి జూన్లోనే చంద్రబాబు ఎడమ కంటికి శుక్లాల ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల్లోగా కుడికంటికి కూడా ఆపరేషన్ జరగాలని హైదరాబాద్ లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి ఒక బులెటిన్ జారీచేసింది. దీనికి అదనంగా ప్రభుత్వ వైద్యులు కూడా చంద్రబాబు అనారోగ్య …
Read More »షర్మిల బ్యాడ్ టైం కాకపోతే…ఇలా నవ్వులపాలవడం ఏంటి?
యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలకు కాలం ఏ మాత్రం కలిసిరావడం లేదని చర్చ జరుగుతోంది. బలమైన పార్టీగా ఎదగాలనే దశ నుంచి కాంగ్రెస్లో విలీనం చేసే వరకు పడిపోయిన షర్మిల పార్టీ గ్రాఫ్ అనంతరం ఎన్నికల్లో పోరాటం చేసేందుకు నేతలను వెతుక్కునే వరకూ …
Read More »తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి గుడ్ బై… కేసీఆర్ ప్లాన్
తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరో దుర్వార్త వినడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం, బెయిల్ విషయంలో బ్యాడ్ టైం కొనసాగుతున్న వేళ తెలంగాణలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఎదురుకానుందట. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం తెలంగాణ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో టీడీపీ బరిలో …
Read More »జగన్ పాలన నుంచి స్వాతంత్ర్యం కావాలి: భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక వందలాది మంది కార్యకర్తలు హఠాన్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి ‘నిజం గెలవాలి’ పేరుతో ఓదార్పు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో రోజు ఈ ఓదార్పు యాత్ర శ్రీకాళహస్తిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో భువనేశ్వరి ఏపీ …
Read More »కేసీఆర్ పై పోటీ చేసేందుకు సై అంటోన్న రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. మేడిగడ్డ బ్రిడ్జి కాదు…కేసీఆర్ ప్రభుత్వమే కుంగిపోయే పరిస్థితి వచ్చిందని రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు-కేటీఆర్ లు బిల్లా-రంగా వంటి వారని, కేసీఆర్ ఛార్లెస్ శోభరాజ్ వంటి వారని ఎద్దేవా …
Read More »క్యాటరాక్ట్ ఆపరేషన్..బాబు బెయిల్ కోసం పిటిషన్
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాజాగా చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని …
Read More »షో చేసేది వీళ్ళిద్దరేనా ?
తెలంగాణా ఎన్నికల్లో రోడ్డు షోల బాధ్యత ఎక్కువగా ఇద్దరు మంత్రుల మీదే ఉంది. కేసీయార్ తో భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లే ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరినే రోడ్డుషోలు చేయమని కేసీయార్ ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. బహిరంగసభల్లో తాను ప్రసంగించేట్లు, రోడ్డుషోలు మంత్రులిద్దరూ చూసుకునేట్లుగా కేసీయార్ డిసైడ్ చేశారట. రోడ్డుషోలు చేయటానికి వీలుగా అవసరమైన రోడ్డు మ్యాపును కూడా రెడీ చేసి …
Read More »నాదెండ్లపై ఆలపాటి మండిపోతున్నారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాదెండ్ల మనోహర్ పై సీనియర్ తమ్ముడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపోతున్నారు. దీనికి కారణం ఏమిటంటే తెనాలిలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు ఆలపాటిని పిలవకపోవటమే. ఇంతకీ విషయం ఏమిటంటే నాదెండ్లది, ఆలపాటిది ఇద్దరిదీ తెనాలి నియోజకవర్గమే. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి రెండు పార్టీల నుండి ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ-జనసేన మధ్య …
Read More »రెండు పార్టీల మధ్య పంచాయితి
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తు దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే ఒకే ఒక్క నియోజకవర్గంపైన రెండుపార్టీల మధ్య పంచాయితి నడుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎంకు పొత్తులు దాదాపు కుదిరినట్లే అనుకోవాలి. చెన్నూరు, కొత్తగూడెం సీట్లను సీపీఐకి కేటాయించటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించింది. కాబట్టి సీపీఐతో పంచాయితి లేదు. సమస్యల్లా సీపీఎంతోనే వస్తోంది. సీపీఎంకు కూడా రెండు నియోజకవర్గాలను కేటాయించటానికి కాంగ్రెస్ అంగీకరించింది. అయితే …
Read More »కింద పడేస్తే బలంగా లేచి పోరాడుతాం: భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన భువనేశ్వరి…వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. స్కిల్, రింగ్రోడ్, ఫైబర్నెట్ కేసుల్లో ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం కష్టపడినందుకు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంఘీభావంగా పుంగనూరులో సైకిల్ …
Read More »రేపటి నుంచి వైసీపీ ‘సామాజిక సాధికార యాత్ర’
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో వైసీపీ, టీడీపీలు వరుస యాత్రలతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ‘నిజం గెలవాలి’ యాత్రను టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రారంభించగా..రేపటి నుంచి వైసీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ మొదలుబెట్టనుంది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం అక్టోబరు 26 నుంచి రాష్ట్రంలోని …
Read More »కార్యకర్తలకు భరోసానివ్వడం మా బాధ్యత: భువనేశ్వరి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు షాక్ కి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వార్తలు తట్టుకోలేక కొంతమంది కార్యకర్తలు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రను చేపట్టారు. ఈ రోజు మొదలైన ఈ యాత్ర …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates