గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర వైజాగ్ లో ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో భాగంగా పవన్ రాత్రి జగదాంబ సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి విరుచుకుపడ్డారు.తెలంగాణ రావడానికి ముఖ్య కారణం జగనే అని విమర్శించారు. జగన్ తో పాటు ఆయన అనుచరులు అందరూ తెలంగాణలోని భూములు దోచుకు …
Read More »ఆ 42 స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్కు ఛాన్స్!
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి, అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్కు గట్టి పోటీనిచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కాంగ్రెస్ విజయం అంత సులభం కాదన్నది మాత్రం వాస్తవం. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు గెలవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. తెలంగాణలో 119 అసెంబ్లీ …
Read More »పేదరికం నుంచి బయటపడటానికి ఇదే ఆయుధం: జగన్!
కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేశారు. ఆయన మాట్లాడుతూ కోటీ 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుందని చెప్పారు. రూ.1,353.76 కోట్ల వడ్డీని రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా 4,969.05 కోట్లను మహిళల ఖాతాలకు బదిలీ చేసినట్లు …
Read More »చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారు: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పాల్.. రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి కూడా జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ పేర్కొన్నారు. బీజేపీతో జనసేన పార్టీ ఎందుకు పొత్తు …
Read More »ముఖ్య నేతలతో అంతర్గత భేటీ!
పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఎక్కడికీ వెళ్ల …
Read More »రేణు మద్దతుతో జనసేనకు ఆ ఓటింగ్ ఫ్లస్ అవుతుందా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో సంచలనమే చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన కుటుంబానికి చెందిన వారు ఎవరూ కూడా నేరుగా బయటకు మద్దతు ప్రకటించింది లేదు. ఒక్క నాగబాబు మాత్రం పార్టీలో నాయకుడిగా ఉండడం, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన మహిళలు ఎవరూ కూడా బయటకు రాలేదు. అయితే, తాజాగా పవన్ మాజీ సతీమని రేణూ దేశాయ్.. …
Read More »బయటపడిన మోడీ డొల్లతనం
ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నరేంద్రమోడీ డొల్లతనం బయటపడింది. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో నిరసనగా ఇండియా కూటమి, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దాని ప్రకారమే 8,9,10 తేదీల్లో పార్లమెంటులో చర్చలు కూడా జరిగాయి. మూడురోజులు మణిపూర్ అల్లర్ల విషయంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యాయో ప్రతిపక్షాలు తీవ్రంగా ఎండగట్టాయి. మణిపూర్లో జరిగిన అల్లర్లను దేశం మొత్తానికి తెలియజేయటానికే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని మార్గంగా ఎంచుకున్నాయి. ప్రతిపక్షాలన్నీ …
Read More »ఉత్తరాంధ్రలో జనసేనకు బలం పెరుగుతోందా ?
ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతున్నదా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పడాల అరుణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈమె జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. మూడుసార్లు కూడా టీడీపీ తరపునే గెలిచారు. అలాగే ఈ మధ్యనే పంచకర్ల రమేష్ కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే. రమేష్ కూడా రెండు …
Read More »కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా ?
షెడ్యూల్ ఎన్నికలకు తగ్గట్లుగా కేసీయార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. పోయిన ఎన్నికల డేట్ ప్రకారమైతే డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సుంటుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారమైతే జనవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఏదైనా నెలరోజుల వ్యవధిలో ఎన్నికలు జరగటమైతే ఖాయమన్నట్లే. అందుకనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ మంత్రులు, ఎంఎల్ఏల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేశారట. అదేమిటంటే రాబోయే మూడు నెలలు మంత్రులు, ఎంఎల్ఏలు అందరు జనాల్లోనే …
Read More »కేసీయార్ కు షాకిచ్చిన గద్దర్ కొడుకు
కేసీయార్ కు ప్రాజగాయకుడు గద్దర్ కొడుకు సూర్యం పెద్దద షాకిచ్చారు. మీడియాతో మాట్లాడుతు కేసీయార్ పై మండిపోయారు. తన తండ్రిని కేసీయార్ ప్రభుత్వం బాగా టార్చర్ పెట్టిందన్నారు. ప్రత్యేక తెలంగాణా రాకముందు తన తండ్రి ఒక రకమైన టార్చర్ అనుభవిస్తే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో రకమైన టార్చర్ అనుభవించినట్లు చెప్పారు. అంటే కేసీయార్ ప్రభుత్వం కూడా తన తండ్రిని బాగా టార్చర్ చేసిందని డైరెక్టుగా చెప్పకనే సూర్యం …
Read More »కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆదుకున్నారు..: ఉండవల్లి శ్రీదేవి
వైసీపీ నుంచి కొన్నాళ్ల కిందట సస్పెన్షన్కు గురైన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తాడికొండ ఎమ్మెల్యే, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాజాగా హాట్ కామెంట్లు చేశారు. కష్టంలో ఉన్నప్పుడు.. వైసీపీ గూండాలు తనపై దాడికి దిగినప్పుడు.. కన్న కూతురు మాదిరిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదరించారని చెప్పారు. తనకు నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ దన్నుగా నిలిచి, ధైర్యం చెప్పారని అన్నారు. వైసీపీ గూండాల దాడి నుంచి తప్పించుకునేందుకు …
Read More »కాంగ్రెస్ కోసం.. పొంగులేటితో జగన్!
తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి. వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కస్సున లేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates