బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజవకర్గంఅధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజుపై జరిగిన రాళ్ల దాడి ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలరాజును ఆయన పరామర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అంతు చూస్తాం.. ఇంత కింత తప్పదు అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా కుండబద్దలు …
Read More »కరీంనగర్ కాపులు ఎటువైపు? ఆసక్తి రేపుతున్న ఓటు బ్యాంకు!
కరీంనగర్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్న కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి బీజేపీ మాజీ సారథి, ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తుండడమే దీనికి కారణం. అయితే.. ఈయనతోపాటు కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల నుంచి కూడా బలమైన నాయకులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సర్పంచ్ పురమళ్ల శ్రీనివాస్, బీఆర్ ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ తలపడుతున్నారు. వీరంతా కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి …
Read More »14 నుంచి రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీస్తారట!
జనసేన మాస్ వార్నింగ్ ఇచ్చేసింది. ఏపీ ముఖ్యమంత్రి మొదలు రాష్ట్ర మంత్రుల వరకు రోజుకొకరి అవినీతి బట్టలు విప్పదీసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించింది. నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన పాపాల చిట్టాను బయట పెడతామని.. కుంభకోణాల్ని ఆధారాలతో సహా వెల్లడిస్తామంటూ హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల పద్నాలుగు నుంచి మొదలు పెట్టనున్నట్లుగా పేర్కొంది. ప్రజాకోర్టులో సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండాలన్న జనసేన.. తమ షెడ్యూల్ లో …
Read More »ఎమ్మెల్యే గువ్వలపై రాళ్ల దాడి.. తీవ్ర గాయాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీఆర్ ఎస్ ఎంపీ పై కత్తితో దాడి జరిగిన ఘటన మరువ క ముందే.. తాజాగా మరో ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడడం తో తొలుత జిల్లా ఆసుపత్రికి.. తర్వాత.. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వాహనం పూర్తిగా దెబ్బతిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ ఈ ఘటన అధికార, …
Read More »ఏపీ వద్దంది.. మేం తీసుకుంటున్నాం.. తప్పేంటి: కేటీఆర్
“ఏపీ వద్దంది. మేం తీసుకుంటున్నాం. తప్పేంటి?” అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి అమరరాజా బ్యాటరీ కంపెనీ తెలంగాణకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. “ఏపీ వద్దంది. మేం కూడా వదిలేస్తే.. ఆయన(గల్లా జయదేవ్) బెంగళూరుకో.. చెన్నైకో వెళ్లిపోతారు. అందుకే మేం ఆహ్వానించాం. ఇందులో తప్పేంటి? మేం బలవంతంగా లాక్కుంటే తప్పు” అని కేటీఆర్ అన్నారు. …
Read More »జనసేన-టీడీపీ పొత్తు… ఏపీ ఓటరు తీరు మారుతోంది..!
వచ్చే 2024 ఎన్నికల్లో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన జనసేన-టీడీపీల వ్యూహం ఫలించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ప్రత్యామ్నాయ రాజకీయాలు చేసేందుకు మరో పార్టీ లేకపోవడం.. రాష్ట్రంలో చర్చకు వచ్చింది. దీంతో జనసేన-టీడీపీల బంధంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారం నుంచి దింపేస్తామనే వాదననుజనసేన బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. ఈ విషయంలో …
Read More »‘రేటెంత రెడ్డి’పై రేవంత్ రెడ్డి రియాక్షన్
తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల సారథి రేవంత్ రెడ్డే బాగా హైలైట్ అవుతున్నారు. ఓవైపు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. మరోవైపు మీడియా చర్చల్లో పాల్గొంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. చాలా అగ్రెసివ్గా ఉండే రేవంత్.. ప్రత్యర్థులు తన మీద చేసే విమర్శలపై స్పందించే తీరే వేరుగా ఉంటుంది. ఈ …
Read More »ధరణి వివాదంలో కేసీయార్ ఇరుక్కున్నారా ?
తెలంగాణా ఎన్నికల్లో పార్టీలు ప్రస్తావిస్తున్న అనేక అంశాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి. రైతుల వ్యవసాయ భూమితో పాటు మామూలు జనాలకు ఉండే ప్లాట్ల వివరాలు కూడా ధరణి పోర్టల్లో నమోదవుతున్నాయి. ధరణి పోర్టలంతా తప్పుల తడకని కాంగ్రెస్ గోల చేస్తోంది. ఈ పోర్టల్లో లక్షలాది మంది భూయజమానులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని …
Read More »‘ఏపీలో రాష్ట్రపతి పాలన’
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, సత్తెనపల్లి ఇంచార్జ్ కన్నా లక్ష్మీనా రాయణ డిమాండ్ చేశారు. నిన్నెందుకు నమ్మాలి జగన్ అంటూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కన్నా.. సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపించారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మండిపడ్డారు. 16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చో రీసెర్చి చేశారని దుయ్యబట్టారు. …
Read More »కాంగ్రెస్ బీసీ మంత్రం పనిచేస్తుందా ?
కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ మంత్రాన్ని ప్రయోగించారు. అదేమిటంటే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఉన్న 24 శాతం రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని రేవంత్ ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉన్నట్లుగానే బీసీలకు కూడా జ్యోతిరావ్ పూలే పేరుతో సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తామని కూడా …
Read More »మూడు రోజుల బ్రేక్..ఫాం హౌస్లో బిజీ
నిర్విరామంగా తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కేసీయార్ మూడురోజులు బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రచారసరళి ఎలాగుంది, పార్టీ గెలుపు అవకాశాలు ఎంతున్నాయి ? గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటనే విషయాలను పార్టీ ముఖ్యులతో చర్చించి సరికొత్త వ్యూహాలు రచించేందుకేనట. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పోటీపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందుకోసమే శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. పీసీసీ …
Read More »కాంగ్రెస్ లీడర్లను టార్గెట్ చేసిన బీజేపీ
తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే ఐటి శాఖ దాడులు మొదలుపెట్టింది. జరుగుతున్న దాడులు కూడా ఏకపక్షంగా టార్గెట్ చేసి జరుగుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు జరిగిన దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదనే కాబట్టి. అదికూడా అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజే దాడులు జరిగాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, విక్రాంత్ రెడ్డితో పాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates