Political News

తండ్రి వార‌స‌త్వం ఈ సారైనా నిల‌బెడ‌తారా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇస్తానని ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు. అయితే.. చంద్ర‌బాబు ఎంత కాద‌నుకున్నా.. ఎంత ఔన‌నుకున్నా.. కొంద‌రు వార‌సుల‌ను త‌ప్పించే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇది అవ‌స‌రం.. కూడా అనే టాక్ ఉంది. ఇలాంటి వారిలో శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బొజ్జ‌ల సుధీర్‌కుమార్‌, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గాలి ముద్దుకృష్ణ‌మ కుమారుడు గాలి భాను …

Read More »

ఏపీపైనే ప‌వ‌న్ దృష్టి.. తెలంగాణ‌ను వ‌దిలేసుకున్న‌ట్టేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు కేవ‌లం ఏపీపైనే దృష్టి పెట్టారు. మంచిదే. ఇక్క‌డ అధికారంలోకి రావాల‌ని, వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును కూడా చీల‌నివ్వ‌బోన‌ని ఆయ‌న చెబుతున్నారు. స‌రే.. ఒక రాజ‌కీయ పార్టీగా ఆయ‌న‌కు ఉన్న స్వేచ్ఛ‌ను ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. ఇదేస‌మ‌యంలో గ‌తంలో ఆయ‌న తెలంగాణ‌పై కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న పార్టీ కూడా పోటీ చేస్తుంద‌ని చెప్పారు. మ‌రో నాలుగు …

Read More »

బోస్ వ‌ర్సెస్ వేణు… తోట‌కు చాన్స్‌

ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల మ‌ధ్య రాజుకున్న అసంతృప్తి, అస‌హ‌న మంట‌లు ఎక్క‌డా ఆర‌డం లేదు. సాక్షాత్తూ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని.. ఇది త‌గ‌దు.. ఎన్నిక‌లకు ముందు మీరు ఇలా చేస్తారా? అని ప్ర‌శ్నించినా.. ఇది చేయొద్ద‌ని హెచ్చ‌రించినా నాయ‌కులు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఎవ‌రికి వారు త‌మ త‌మ బ‌ల నిరూప‌ణ‌లో ముందున్నారు. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిజిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌కవ ర్గం కేంద్రంగా సాగుతున్న …

Read More »

పవన్ కూడా అదేగా చెప్తున్నాడు జగన్

వాలంటీర్ల వ్యవహారంపై ఏపీలో జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు. ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పంపించి ప్రజలు ఆధార్ కార్డ్ డాటా, బ్యాంకు అకౌంట్ల డాటా సహా కీలకమైన, వ్యక్తిగత డాటా తీసుకుంటుండం పై కొద్దిరోజులుగా పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆ డాటా ఎవరి చేతుల్లో ఉందని అడుగుతున్నారు.. ఆ డాటాను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. పవన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలు, సోషల్ …

Read More »

అభ్యర్ధుల లిస్టుతో కలకలం

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్దుల లిస్టు ఇదే అంటు కాంగ్రెస్ పార్టీలో చక్కర్లు కొడుతున్న ఒక జాబితా సంచలనంగా మారింది. మొత్తం 119 నియోజకవర్గాల ప్రాబబల్స్ అన్న పేరుతో జాబితా ఫుల్లుగా సర్క్యులేషన్లో ఉంది. చాలామంది సీనియర్ నేతల మొబైల్ ఫోన్ల వాట్సప్ లో ఈ జాబితా చక్కర్లు కొడుతోందట. దీంతో కొంతమంది నేతలకు ఖుషీగాను, కొందరిలో మంటగాను మరికొందరు నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం …

Read More »

నినాదాలు కావ‌లెను.. ఆఫ‌ర్లు మామూలుగా లేవు బ్రో!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఏడాది చివ‌రిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదేవిధంగా వ‌చ్చే ఏడాది ఏపీలోనూ లేదా.. ముందస్తు అంటే.. ఈ ఏడాదే ఎన్నిక‌ల గంట మోగ‌నుంది. అయితే.. ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ఏ పార్టీ అధికార పీఠం ఎక్కాల‌న్నా.. ఖ‌చ్చితంగా కావాల్సింది..ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే. మ‌రి ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందు కు.. వారి చెంత‌కు చేరుకునేందుకు.. పార్టీల‌కు కావాల్సింది నినాదాలు. వ‌స్తున్నా …

Read More »

జగన్ గారూ.. ఇది చూశారా?

ప్రతిపక్ష నేతల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శల దాడి తీవ్రమవుతోంది. ఐతే ఆ విమర్శలు రాజకీయంగా ఉంటే బాగుండేది కానీ.. ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తారంటే చాలు.. ఆయన పెళ్లిళ్ల విషయం తప్ప మరోటి మాట్లాడట్లేదు జగన్. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పబ్లిక్ మీటింగ్‌ల్లో ఆయన అదుపు తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. గత నెలలో స్కూల్ పిల్లల ముందు పవన్ …

Read More »

ఎగ్గొట్టే ఉద్దేశ్యం లేదంటోన్న వైసీపీ ఎమ్మెల్యే

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం అంటూ సంచలన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు రెడీ అయిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కరోనా సమయంలో వ్యాపారాలు రన్ కాలేదని, అందుకే …

Read More »

గ్రూపు తగాదాలపై సీరియస్

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పార్టీలో గ్రూపు తగాదాలకు చెక్ చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లే ఉన్నారు. గ్రూపు రాజకీయాలపై బాగా సీరియస్ అయినట్లే ఉంది. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో కూడా నేతలు గ్రూపులు కట్టి గొడవ పడుతున్నట్లు అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు తాజా ఉదాహరణ కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గమే. ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఎంఎల్ఏ ఆర్థర్. అయితే ఇక్కడ పెత్తనమంతా తానే చేయాలన్నట్లుగా మరోనేత …

Read More »

సీబీఐ చార్జిషీటు గందరగోళంగా తయారైందా ?

హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి విషయంలో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీటు గందరగోళంగా తయారైంది. చార్జిషీటు ఒకటే కానీ దాన్ని మీడియా ప్రజెంట్ చేయటంలో భిన్న కోణాల్లో ఉంది. రాష్ట్రంలో మీడియా మొత్తం జగన్ అనుకూలంగా, వ్యతిరేకంగా చీలిపోయిన విషయం తెలిసిందే. అనుకూల మీడియా అంటే ఎక్కుగా సొంత మీడియాలో చార్ఝిషీటులో సీబీఐ దర్యాప్తునే తప్పుపడుతు కథనాలు వచ్చింది. దర్యాప్తులో కీలకమైన గూగుల్ టేక్ అవుట్ ను రీడ్ …

Read More »

బైజూస్ ట్యాబ్ ల తో జగన్ పై పవన్ దాడి

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ధిక్కరించిన బూత్ లెవల్ అధికారులు, వాలంటీర్లు ఇంటింటికి ఓటరు సర్వే ప్రక్రియలో భాగమవుతున్నారని పవన్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతం, పారదర్శకతతో జరగాలని అన్నారు. కానీ, ఏపీలో వైసీపీ ప్రభుత్వం …

Read More »

కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ సామాజికవర్గం ఓట్లే కీలకమన్న విషయం తేలిపోయింది. ఎందుకంటే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీల నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందని సమాచారం. పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో …

Read More »