టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రస్తుతం రా.. కదలిరా! సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రిలో పర్యటించిన ఆయన ఈ సభలో పాల్గొన్నారు. భారీ ఎత్తున జనాలు కూడా తరలి వచ్చారు. స్టేజ్పై కూడా స్థానిక నాయకులకు అవకాశం కల్పించారు. ఇక, ప్రసంగం అయిపోయి.. చంద్రబాబు స్టేజీ దిగుతున్న సమయంలో ఆయనకు ఎదురుగా వచ్చి.. కొందరు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలపబోయారు. …
Read More »షర్మిల నాలుగో కృష్ణుడు: రోజా
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలపై వైసీపీ నాయకురాలు, మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. షర్మిలను ఏపీకి వచ్చిన నాలుగో కృష్ణుడుగా ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో ఉంటూ.. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తు న్నారని.. ఎవరెన్ని చేసినా.. వైసీపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ రాజో వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని విభజించి, వైఎస్సార్ కుటుంబాన్ని …
Read More »సాక్షిలో నాకూ వాటా ఉంది: షర్మిల
సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఆ మాటకొస్తే సాక్షి మీడియాలో జగన్ తో పాటు తనకు కూడా సమానంగా భాగస్వామ్యం ఉందని షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం …
Read More »మా పొత్తును విచ్ఛిన్నం చేయలేరు: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలిరా! పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభ .. తాజాగా రాజమండ్రిలో జరిగింది. గత వారం నుంచి ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో రా..కదలిరా! బహిరంగ సభలు నిర్వహి స్తున్నారు. తాజాగా.. రాజమండ్రిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తమ పొత్తును విచ్చిన్నం చేయాల ని చూస్తున్నారని, కానీ.. వారి పప్పులు తన దగ్గర ఉడకవని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలిచి తీరుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. …
Read More »షర్మిలతో సునీత భేటీ లో చర్చ ఇదేనటగా
కడప రాజకీయాల్లో ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో సంచలన ఘట్టం చోటు చేసుకుంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆమె బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత భేటీ అయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాత్రలో ఉన్న షర్మిల.. జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సోమవా రం ఉదయం ఆమె కడపకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకంటే ముందుగానే ఆమెతో సునీత భేటీ అయ్యారు. …
Read More »కేటీయార్ కు సిరిసిల్ల షాక్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ముఖ్యనేతలకు కష్టాలు మొదలైపోయాయి. రిజల్ట్సు వచ్చిన రెండోరోజే బాత్ రూమ్ లో జారిపడటంతో కేసీయార్ తుంటిఎముక విరిగింది. దానికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకనే పార్టీ వ్యవహారాలను డైరెక్టుగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ తన చేతిలోకి తీసుకున్నారు. అయితే ఓటమి తాలూకు ప్రభావం కేటీయార్ నిర్వహిస్తున్న సమీక్షల్లో స్పష్టంగా తెలిసిపోతోంది. ఓటమికి పార్టీ ముఖ్యనేతలే కారణమని చాలామంది ద్వితీయ శ్రేణి …
Read More »పిచ్చిపిల్ల షర్మిల..ఓవర్ యాక్షన్ చేస్తోంది: అంబటి
గుండ్లకమ్మ ప్రాజెక్టును వైసీపీ నేతలు, నీటి పారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోవడం లేదంటూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది రోజులు క్రితం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు నీటిలో తేలుతున్నాయని, కానీ, సంబంధిత శాఖా మంత్రి మాత్రం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారని షర్మిల వేసిన సెటైర్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై అంబటి …
Read More »టీడీపీ లిస్టు ఫైనల్ అయ్యిందా ?
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. అన్నీ నియోజకవర్గాల్లోను రకరకాల పద్ధతుల్లో పార్టీ సర్వే చేయిస్తోంది. ఇందులో ఐవీఆర్ఎస్ పద్దతితో పాటు పార్టీ తరపున ఒకసర్వే అలాగే చంద్రబాబు తరపున వ్యక్తిగత టీమ్ మరోటి కూడా సర్వే చేస్తోంది. ఇలా రకరకాల పద్ధతుల్లో సర్వేలు చేయించి అందులో మెజారిటీ ఆమోదయోగ్యం లభించిన నేతలకు టికెట్లు ఫైనల్ చేస్తున్నారట. …
Read More »ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బిగ్ రిలీఫ్!
టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో చంద్రబాబుకు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులోనూ 17ఏ(రాజ్యాంగ బద్ధ పదవులు అనుభవించిన లేదా ఉన్న వారి అరెస్టు విషయంలో గవర్నర్కు చెప్పాలన్న/ అనుమతి తీసుకోవాలన్న నిబంధన) వర్తించేలా ఉందని పేర్కొంది. ఏపీలో …
Read More »ఒక్కొక్కళ్ళు మీటవుతున్నారు…ఏంటి విషయం ?
తెలంగాణా రాజకీయాల్లో రోజుకో డెవలప్మెంట్ జరుగుతోంది. రేవంత్ రెడ్డితో ఆదివారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. ఈమధ్యనే ప్రకాష్ తో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళిన మంత్రి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగిందన్నది ఇప్పటికీ సస్పెన్సుగా ఉండిపోయింది. ఇవ్వాళా రేపు అధికార, ప్రతిపక్షాల నేతలు కలిస్తే పార్టీ మారటమే ఉద్దేశ్యంగా …
Read More »షర్మిల వెంట సునీత.. జగన్ కు మరో తలనొప్పి
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు మరో రెండు నెలలకు వచ్చేసిన నేపథ్యంలో ఎవరి లెక్కలు వారివి అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అదే పనిగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇలాంటి …
Read More »టార్గెట్ చేసింది చాలు.. షర్మిలకు సీనియర్ల సూచన!
“వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేసింది చాలు. ఆయనను తిడితే మనం పుంజుకుంటామా? ప్రస్తుతం మీ వ్యాఖ్యలు.. వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయి. ప్రజల్లోకి వేరే కోణంలో వెళ్తున్నాయి. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెడితే మంచిది”- ఇదీ.. ఇతమిత్థంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నలుగురు తాజాగా అనంతపురంలో పీసీసీ చీఫ్ షర్మిలకు చేసిన ప్రతిపాదన. వీరిలో ప్రస్తుతం ఓ కీలక పార్టీలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates