టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, వయసు, హోదా రీత్యా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆయన కుటుంబం, ముఖ్యంగా బాబు సతీమణి భువనేశ్వరి తీవ్ర ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారుకూడా. ఈ క్రమంలో తన భర్తను మరోసారి పరామర్శించేందుకు, ఆయనకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించేందుకు భువనేశ్వరి ప్రయత్నించారు. ఈ క్రమంలో …
Read More »జనసేన-టీడీపీ…”స్వీట్” షేరింగ్!!
ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీడీపీతో కలిసి పోటీ చేయనున్నామంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన దరిమిలా రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య బంధం ద్రుఢతరం కాబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. జనసేనాని ప్రకటనను ఇరు పార్టీల నాయకులు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా.. స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా.. ఇరు పార్టీల నేతలు కూడా స్వీట్లు పంచుకుని సంబరాలు …
Read More »చిన్నమ్మ రక్తం ఉడుకుతోంది కానీ…!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ కోపంతో రగిలిపోతున్నారట. ఆమె రక్తం 100 డిగ్రీల సెల్షియస్లో రగిలిపోతోందట. మాటల తూటాలు, విమర్శల శతఘ్నులతో వైసీపీ సర్కారుపై యుద్ధం చేయాలని ఉందట. కానీ, ఆమె అన్నింటినీ తమాయించుకుని.. పార్టీ అధిష్టానం గీసిన గీతలో తర్జన భర్జన పడుతున్నారట.- ఇదీ రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చ. ఏ ఇద్దరు కమలం పార్టీ నాయకులు కలిసినా.. ఇదే …
Read More »మ్యాజిక్ ఫిగరూ కష్టమేనా ?
బీఆర్ఎస్ అభ్యర్ధులపై పార్టీ జనాలతో పాటు మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. కేసీయార్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి నెల రోజులవుతోంది. దీనివల్ల ఒకవైపు అభ్యర్ధులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి మహాయితే పోలింగ్ వరకు 20 రోజులుంటే ఎక్కువ. కాబట్టి ఖర్చుల విషయంలో ఏదో మ్యానేజ్ చేసుకుంటారు. కానీ ఇపుడు నాలుగు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేశారు. దీనివల్ల ఏమైందంటే అభ్యర్థుల …
Read More »పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖచిత్రం ఏంటో అర్థమైపోయింది. అనుకున్నట్లే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయమై నిన్న క్రిస్టల్ క్లియర్గా ప్రకటన చేసేశాడు. ఐతే పొత్తును ప్రకటించే విషయంలో పవన్ తొందరపడ్డాడని.. ఇంకా సీట్ల పంపిణీ విషయమై చర్చలే మొదలుకాకముందే హడావుడిగా ఇప్పుడీ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జనసేనలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. దీని వల్ల సీట్ల పంపిణీలో పవన్ బార్గైనింగ్ …
Read More »కాగల కార్యం జగనే సాధించి పెట్టెను
తెలుగుదేశం, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయనే సంకేతాలు ఎప్పుడో వచ్చేశాయి. పొత్తు అనివార్యం అన్నది అందరికీ తెలుసు. కాకపోతే ఎన్నికలు మరింత దగ్గర పడ్డాక.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పలు దఫాలు సమావేశమై.. సీట్ల పంపిణీలో ఒక అంచనాకు వచ్చి.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొత్తును ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. …
Read More »నారా లోకేష్ ఢిల్లీ బాట
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, తన తండ్రి నారా చంద్రబాబుతో ములాఖత్ అయిన అనంతరం.. తీసుకున్న నిర్ణయంలో భాగంగా నారా లోకేష్.. ఢిల్లీకి పయనం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు అరెస్టు, స్కిల్ డెవలప్మెంటులో స్కాం వంటి అంశాలపై కొందరు జాతీయస్థాయి నాయకులు, చంద్రబాబు మిత్రులు …
Read More »పవన్ ప్రకటన.. చిన్నమ్మకు సవాల్గా మారిందా?
ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి పెను సవాలే ఎదురైందా? తాను లేదా తన పార్టీ పెద్దలు చేయాల్సిన ప్రకటనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆమె విషయం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. 2024 లేదా అంతకన్నా ముందే ఏపీ ఎన్నికలు వస్తే.. టీడీపీ-జనసేన కలిసి పోటీ …
Read More »కేసీఆర్ సైలెంట్ కానీ.. బాబుకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జాతీయ నేతలు స్పందిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని పార్టీలు కూడా బాబుకు మద్దతు ప్రకటించాయి. కానీ పక్క రాష్ట్రంలోనే ఉన్న సీఎం కేసీఆర్ మాత్రం బాబు అరెస్టుపై ఇంతవరకూ స్పందించలేదు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం బాబు అరెస్టును ఖండించడం విశేషం. ఆ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి …
Read More »సీఎం జగన్ దంపతులకు హై కోర్టు నోటీసులు.. రీజన్ ఇదే!
ఏపీ సీఎం జగన్కే కాకుండా.. ఆయన సతీమణి వైఎస్ భారతికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తక్షణమే రెండు వారాల్లో తమకు సమాధానం చెప్పాలని.. ఢిల్లీ హైకోర్టు సదరు నోటీసుల్లో పేర్కొంది. విషయంలోకి వెళ్తే.. సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ సమాచారం, పథకాలు, కీలక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, ఆయా అంశాలపై …
Read More »చంద్రబాబు అరెస్టుపై బండి సంజయ్ ఫైర్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై కక్ష కట్టిన వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అన్యాయంగా ఆయనను అరెస్టు చేసిందని జాతీయ స్థాయి నేతలు కూడా విమర్శలు గుప్పిం చారు. మరికొందరైతే, బీజేపీ ప్రోద్బలం లేకుండా కేంద్రంలోని పెద్దలకు సమాచారం లేకుండా చంద్రబాబు అరెస్టు జరగడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ …
Read More »బ్రేకింగ్: టీడీపీతో పొత్తుపై పవన్ షాకింగ్ ప్రకటన
రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కొంతకాలంగా ఆలోచిస్తున్నానని, ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలంటే సమిష్టిగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఇన్ని రోజులు టీడీపీతో కలిసి వెళ్లాలా, వద్దా అని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates