Political News

మూడో సారి వ్యాక్సిన్ కుదరదు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ముందుగా.. కోవాగ్జిన్, కోవీషీల్డ్… ఈ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. చాలా మందివి రెండు డోసులు తీసుకోవడం కూడా పూర్తైంది. కాగా.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేసుకున్న వ్యక్తి.. మళ్లీ మరో వ్యాక్సిన్‌ను వేసుకోవచ్చా? అనే …

Read More »

సునంద మృతి కేసు.. నిర్దోషిగా శశిథరూర్..!

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కి భారీ ఊరట లభించింది. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసులో ఆయన నిర్దోషిగా తేలారు. సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిని …

Read More »

విశాఖ ఉక్కు టాటా స్టీల్స్ అయిపోతుందా ?

Vizag Steel Plant

విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీని టాటా స్టీల్ కొనుగోలు చేయబోతోందా ? కొనుగోలు విషయంలో తమకు ఆసక్తి ఉందని కంపెనీ సీఈవో, ఎండి టీవీ నరేంద్రన్ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ను నూరుశాతం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నూరుశాతం ప్రైవేటీకరణ చేయడం. లేకపోతే సంస్ధను మూసేయాలని కేంద్రం డిసైడ్ చేసింది. కేంద్రం …

Read More »

తాలిబన్లకు అమెరికా ట్విస్ట్

దేశం నుంచి వెళుతున్న అగ్రరాజ్యం అమెరికా తాలిబన్లకు పెద్ద షాకే ఇచ్చింది. తమ బ్యాంకుల్లో ఉన్న తాలిబన్ల ఖాతాలను అమెరికా ఫ్రీజ్ చేసేసింది. నాలుగు రోజుల క్రితమే మొత్తం ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి దేశంలో అరాచక పాలన మొదలైంది. ఈనెల 31వ తేదీ ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికాతో పాటు నాటో సైన్యం దేశం నుంచి వెళిపోవాలన్న విషయం తెలిసిందే. …

Read More »

జగన్ పాపులారిటీ ఇలా పడిపోయిందేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి ఎన్నో అంచనాల మధ్య, 27 నెలల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు.. తొలి రెండేళ్లు ఎదురు లేదన్నట్లే సాగిపోయింది. ఆరంభం నుంచి అనాలోచిత నిర్ణయాల కారణంగా విమర్శలు, వివాదాలు, కోర్టు మొట్టికాయలు కామన్‌యే అయినప్పటికీ.. ప్రజాదరణ విషయంలో జగన్‌కు తిరుగులేదన్నట్లే సాగింది. పాలన గురించి ప్రతిపక్షాలు, విమర్శకులు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. సంక్షేమ కార్యక్రమాలను పట్టుబట్టి అమలు …

Read More »

మహిళల పట్ల తాలిబన్ల అరాచకం ఎలా ఉంటుందంటే..

మొత్తానికి చాలా ఏళ్ల నుంచి భయపడుతున్నదే జరిగింది. అఫ్గానిస్థాన్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా అండతో ఎన్నో ఏళ్ల నుంచి తాలిబన్లను ఎదుర్కొంటూ వచ్చిన అక్కడి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది. అఫ్గాన్ అధీనంలో ఉన్న సైన్యం సంఖ్య 3 లక్షలు. తాలిబన్ల సైన్యం 87 వేలే. ఇంత అంతరం ఉన్నా సరే.. తమ అరాచకత్వం, స్థానికుల మద్దతుతో తాలిబన్లు ప్రభుత్వాన్ని పడగొట్టగలిగారు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. తాలిబన్ల అరాచకత్వం …

Read More »

వైసీపీకి ర‌ఘురామ మ‌రో పంచ్‌..

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. అధికారంలో ఉన్నార‌నే కానీ.. ఆ పార్టీ నేత‌ల‌కు అన్ని వైపుల నుంచి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీనికి ఆపార్టీ నేత‌లు చేసుకుంటున్న నిర్వాక‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉంది క‌దా.. అని నోటికి అడ్డు అదుపు లేకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు.. దూష‌ణ‌లు.. అనుచిత కామెంట్లు.. వంటివి ఆ పార్టీ కీల‌క నేత‌ల‌ను పోలీస్ స్టేష‌న్ల బాట ప‌ట్టిస్తున్నాయి. కోర్టుల్లో …

Read More »

ఫ‌స్ట్ టైమ్‌: కేసీఆర్ పేషీలోకి ద‌ళిత అధికారి.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌?

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం.. సీఎం కేసీఆర్‌.. కొన్నాళ్లుగా ద‌ళిత జ‌పం చేస్తున్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌ను త‌న ప‌క్షానికి తిప్పుకోవ‌డం.. త‌ను దూరం చేసిన ఈట‌ల రాజేందర్ ను ఘోరంగా ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ద‌ళిత బంధు.. ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయ‌ల‌ను అభివృద్ధి కోసం కేటాయించారు. …

Read More »

పెగాసస్ పై కేంద్రం దొరికిపోయిందా ?

‘పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందా ? లేదా’ ? అన్న ప్రశ్నతో నరేంద్రమోడి సర్కార్ దొరికిపోయింది. పెగాసస్ స్పైవేర్ ఉపయోగించటం ద్వారా ప్రతిపక్ష నేతలు, దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై పార్లమెంటు ఉభయసభల్లో ఎంత గందరగోళం రేగిందో అందరు చూసిందే. ప్రతిపక్షాలు, ప్రముఖులు ఎంత గోల చేసినా కేంద్రం పెద్దగా స్పందించలేదు. తమ ఆరోపణలపై స్వయంగా నరేంద్రమోడినే …

Read More »

ఉనికి కోసం అవస్తలు పడుతున్నదా ?

తెలంగాణా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయిన విషయం తెలిసిందే. తొందరలో జరగబోయే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీయార్ మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి. ప్రధాన పార్టీలు …

Read More »

జీవోల విష‌యంలో ర‌చ్చ‌…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చి బ్లాంక్ జీవోల వివాదంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జీవోలు ఇకపై ఆన్ లైన్లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన …

Read More »

ఆఫ్ఘన్లో మొదలైన అరాచకాలు

గడచిన వారం రోజులుగా ఆఫ్ఘనిస్ధాన్ దేశంలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి. ఆగస్టు మూడో వారంలో యావత్ దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళిపోతుందని అందరు అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా 15వ తేదీకే దేశంలో నాయకత్వం మారిపోయింది. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పదవికి రాజీనామా చేసి అధికారాన్ని తాలిబన్లకు అప్పగించేసి దేశంవదిలి పారిపోయారు. ఈయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, ముఖ్యనేతలు కూడా దేశంనుండి పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. …

Read More »