గాజువాక రియల్ హీరోగా జగన్ మెప్పు పొంది జనం తీర్పుతో ఎమ్మెల్యే అయిన తిప్పల నాగిరెడ్డికి ఇదే మొదటి చివరి అవకాశం అంటున్నారు. ఆయన అంతకు ముందు 2009, 2014 ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడారు. ఆ సానుభూతి, జగన్ వేవ్ కలసి రావడంతో 2019 ఎన్నికల్లో ఆయన మూడవసారి పోటీ చేసినా జనం గెలిపించారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కేవలం రీల్ హీరో మాత్రమేనని, రియల్ …
Read More »రెండు దశాబ్దాల రాజకీయంలో గంటాకు తొలిసారి ఎంత కష్టం ?
గంటా శ్రీనివాసరావు… ఆయన ముందు విశాఖలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత వ్యాపార రంగంలోకి వచ్చారు. ఇక అక్కడ నుంచి రాజకీయ నాయకులతో పరిచయాలు కావడంతో ఆ వైపుగా ఆసక్తి మళ్ళింది. అయితే ఆయన మొదట ఎంచుకున్న పార్టీ బీజేపీ కావడం విశేషం. కానీ 1999 ఎన్నికల వేళ విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి లేకపోవడంతో చంద్రబాబు తటస్థులకు …
Read More »తాలిబన్లకు సవాలు విసురుతున్న పంజ్ షీర్
ఆఫ్ఘనిస్ధాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తాలిబన్లకు సవాలు విసురుతున్నారు. దేశంయావత్తు తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోయినా ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తానే అధ్యక్షడినని ప్రకటించుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీయే దేశం విడిచిపారిపోయిన తర్వాత దేశం మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సలేహ్ ఏమి ప్రకటించుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటి ? ఇపుడిదే అంశంపై అంతర్జాతీయస్ధాయిలో చర్చ మొదలైంది. తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షునిగా ప్రకటించుకున్న సలేహ్ ఇపుడెక్కడున్నారు ? …
Read More »బాబుకి షాక్.. టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో ఊహించని షాక్ ఎదురైంది. తెలుగు దేశం పార్టీకి.. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య… టీడీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనితీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోరంట్ల …
Read More »తాలిబాన్లతో మీరు మాట్లాడండి.. ఓవైసీకి రాములమ్మ కౌంటర్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై బీజేపీ మహిళా నేత విజయశాంతి కౌంటర్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న విషయమై.. ఓవైసీ చేసిన కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్ వేయడం గమనార్హం. బుధవారం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. భారత్ తాలిబన్లతో చర్చలు జరపాలని సూచించారు. దీనిపై స్పందించిన విజయశాంతి దీటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. “తాలిబన్లతో మీరే చర్చలు జరిపి రండి” అని సమాధానం ఇచ్చారు. “భారత్లోని …
Read More »తాలిబన్లపై తిరగబడుతున్న మహిళలు ?
ప్రపంచమంతా ఆశ్చర్యపోయే ఘటనలు ఆప్ఘనిస్థాన్లో మొదలయ్యాయా ? అవుననే అంటోంది ప్రపంచ మీడియా. తాలిబన్లకు భయపడిపోయి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఆయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, కీలక నేతలు కూడా దేశం నుంచి మాయమైపోయారు. దేశంలో మిగిలిన సైన్యంతో పాటు మగాళ్లు కూడా తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇలాంటి నేపధ్యంలోనే మహిళల్లో కొందరు తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేశారనే కారణంగా జలాలాబాద్ లో …
Read More »తెలంగాణా హైకోర్టు ఆదేశాలు ఏపీకీ వర్తించాలి
రెండు రాష్ట్రాల్లోను ఒక పద్ధతి జరుగుతోంది. ముందుగా ఈ విషయం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దాంతో కేసును విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. మరి కోర్టు చివాట్లతో జగన్మోహన్ రెడ్డి మేల్కొంటారా ? ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో మొదలైన దళిత బంధు పథకంపై కోర్టులో పిటీషన్ పడింది. పథకం విధి విధానాలు ఏమిటో వివరించకుండా, జీవో విడుదల చేయకుండానే పథకాన్ని ఎలా అమలు చేస్తారంటు కేసు …
Read More »డబ్బులతో పారిపోలేదు.. మళ్లీ వస్తా.. ఆప్ఘాన్ అధ్యక్షుడు
ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ చేరుకునే సమయానికే.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారయ్యారు. అయితే.. పరారయ్యే సమయంలో ఆయన డబ్బులు తీసుకోని పారరయ్యారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఆ ఆరోపణలపై ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దాంట్లో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 …
Read More »ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న తెలంగాణ యువకులు..!
ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ దేశాన్ని తాలిబాన్లు అక్రమించుకున్న సంగతి తెలిసిందే. కాగా… తాలిబన్లు రాజ్యమేలుతున్న ఆప్ఘానిస్థాన్లో ఇద్దరు తెలుగువాళ్లు చిక్కుకుపోయారు. ఉపాధి నిమిత్తం కాబుల్ వెళ్లిన మంచిర్యాల జిల్లాకు బొమ్మన రాజన్న.. గత 8 ఏళ్లుగా అక్కడే ఏసీసీఎల్ సంస్థలో పని చేస్తున్నారు. ఆప్ఘాన్లో రోజుల వ్యవధిలోనే పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో.. ఆయన ఆందోళనలో ఉన్నారు. జూన్ 28న మంచిర్యాల వచ్చిన రాజన్న.. ఆగస్టు 7నే …
Read More »జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్?
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి ఏకంగా తెలంగాణ హైకోర్టు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గానికి చెక్ పెట్టినట్టు అయింది. వెంటనే సొసైటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో వ్యవహారాలు అదుపుతప్పి నడుస్తున్నందున సొసైటీ పర్యవేక్షణకు, నియంత్రణకు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని తెలంగాణా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణా కో ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్-కమ్-కమిషనర్ …
Read More »దేశ చరిత్రలోనే తొలిసారిగా.. సీజేఐ గా మహిళ..?
దేశ చరిత్రలోనే తొలిసారిగా.. భారత న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులౌతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అదే నిజమైతే.. భారత న్యాయ వ్యవస్థలోనే ఇది అరుదైన సందర్భం అయ్యే అవకాశం ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫారసులు చేసింది. జాబితాలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా 9 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురిలో తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక …
Read More »మూడో సారి వ్యాక్సిన్ కుదరదు
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ముందుగా.. కోవాగ్జిన్, కోవీషీల్డ్… ఈ రెండు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో.. ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ నే తీసుకున్నారు. చాలా మందివి రెండు డోసులు తీసుకోవడం కూడా పూర్తైంది. కాగా.. ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదైనా ఒక వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్న వ్యక్తి.. మళ్లీ మరో వ్యాక్సిన్ను వేసుకోవచ్చా? అనే …
Read More »