Political News

ధరణి వివాదంలో కేసీయార్ ఇరుక్కున్నారా ?

తెలంగాణా ఎన్నికల్లో పార్టీలు ప్రస్తావిస్తున్న అనేక అంశాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి. రైతుల వ్యవసాయ భూమితో పాటు మామూలు జనాలకు ఉండే ప్లాట్ల వివరాలు కూడా ధరణి పోర్టల్లో నమోదవుతున్నాయి. ధరణి పోర్టలంతా తప్పుల తడకని కాంగ్రెస్ గోల చేస్తోంది. ఈ పోర్టల్లో లక్షలాది మంది భూయజమానులకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని …

Read More »

‘ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌’

ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, స‌త్తెన‌ప‌ల్లి ఇంచార్జ్ క‌న్నా ల‌క్ష్మీనా రాయ‌ణ డిమాండ్ చేశారు. నిన్నెందుకు న‌మ్మాలి జ‌గ‌న్ అంటూ.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన క‌న్నా.. సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మండిప‌డ్డారు. 16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చో రీసెర్చి చేశారని దుయ్య‌బ‌ట్టారు. …

Read More »

కాంగ్రెస్ బీసీ మంత్రం పనిచేస్తుందా ?

Revanth Reddy

కామారెడ్డిలో నామినేషన్ వేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీ మంత్రాన్ని ప్రయోగించారు. అదేమిటంటే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఉన్న 24 శాతం రిజర్వేషన్లు 42 శాతంకు పెంచుతామని రేవంత్ ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉన్నట్లుగానే బీసీలకు కూడా జ్యోతిరావ్ పూలే పేరుతో సబ్ ప్లాన్ చట్టం తీసుకొస్తామని కూడా …

Read More »

మూడు రోజుల బ్రేక్..ఫాం హౌస్లో బిజీ

నిర్విరామంగా తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న కేసీయార్ మూడురోజులు బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ ఎందుకంటే వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ప్రచారసరళి ఎలాగుంది, పార్టీ గెలుపు అవకాశాలు ఎంతున్నాయి ? గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటనే విషయాలను పార్టీ ముఖ్యులతో చర్చించి సరికొత్త వ్యూహాలు రచించేందుకేనట. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పోటీపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందుకోసమే శుక్ర, శని, ఆదివారాలు పూర్తిగా ఫాం హౌస్ కే పరిమితమయ్యారు. పీసీసీ …

Read More »

కాంగ్రెస్ లీడర్లను టార్గెట్ చేసిన బీజేపీ

తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే ఐటి శాఖ దాడులు మొదలుపెట్టింది. జరుగుతున్న దాడులు కూడా ఏకపక్షంగా టార్గెట్ చేసి జరుగుతున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు జరిగిన దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదనే కాబట్టి. అదికూడా అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజే దాడులు జరిగాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, విక్రాంత్ రెడ్డితో పాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళు, …

Read More »

కాంగ్రెస్‌కు పాల్వాయి కుమార్తె గుడ్ బై.. రీజ‌న్ అదే!

తెలంగాణ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ‌త‌గిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్ర‌వంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గ‌త కొన్నాళ్లుగా పార్టీలో యాక్టివ్ గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఆమెకు తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆమె అల‌క‌బూనారు. ఈ క్ర‌మంలో కీల‌క నేత‌లు ఆమెను బుజ్జ‌గిస్తార‌నే చ‌ర్చ సాగింది. కానీ, ఎవ‌రూ పాల్వాయి స్ర‌వంతిని ప‌ట్టించుకోలేదు. దీంతో …

Read More »

కేసీయార్ కు షాకేనా ?

ముగిసిన నామినేషన్ల ఘట్టాన్ని చూస్తే రెండు ఇంట్రస్టింగ్ పాయింట్లు కనిపించాయి. ఈ రెండు కూడా కేసీయార్ కు షాకిచ్చేట్లుగానే ఉండటం మరింత ఇంట్రెస్టింగుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే 10వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగిసిన విషయం తెలిసిందే. దాఖలైన నామినేషన్లలో అత్యధికంగా గజ్వేలు, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే దాఖలయ్యాయి. ఈ రెండింటినే ఎందుకింత హైలైట్ చేస్తున్నారంటే ఈ రెండుచోట్ల కేసీయార్ పోటీ చేస్తున్నారు కాబట్టే. కేసీయార్ కు వ్యతిరేకంగా నామినేషన్లు …

Read More »

‘స‌బిత‌’కు సెంటిమెంటు దెబ్బ‌..!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎన్నిక‌ల్లో అయినా.. త‌ర్వాత రాజ‌కీయంగా అయినా.. సెంటిమెంటును న‌మ్ముకున్న‌వారే రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవుతున్నారు. ఇలానే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో సెంటిమెంటును న‌మ్ముకుని విజ‌య తీరం చేరుతున్నారు మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్న ఈ కుటుంబం.. అనేక ప‌దువులు కూడా చేప‌ట్టింది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు, ఇటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంద్రారెడ్డి చేసిన త్యాగాలు, చేసిన …

Read More »

లోకేష్ తమ్ముడు..పవన్ అన్నయ్య: కేటీఆర్

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని, డిసెంబర్ 3న ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి కూడా ఓడిస్తామని కేటీఆర్ అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ పై …

Read More »

రెండు చోట్లా ఆప‌శోపాలు.. కేసీఆర్ చెమ‌టోడుస్తున్నారే..!

తెలంగాణ ఉద్య‌మం ప్రారంభ‌మైన నాటి నుంచి కావొచ్చు.. లేదా బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన‌నాటి నుంచి కావొచ్చు.. ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న ఏ ఎన్నిక‌ల్లో అయినా కేవ‌లం ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా గ‌తంలో పోటీ చేసినా.. ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఆయ‌న ఏదో ఒక స్థానాన్ని మాత్ర‌మే ఎంచుకుని అక్క‌డ నుంచి త‌ల‌ప‌డుతున్నారు. కానీ, తెలంగాణ ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో …

Read More »

“గురువును విమ‌ర్శించ‌లేను “

రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు ఉంటాయి. భార్యాభ‌ర్త ఒకే పార్టీలో ఉండ‌డం స‌హజం. అన్న‌ద‌మ్ము లు కూడా ఒకే కండువా క‌ప్పుకోవ‌డం తెలిసిందే. ఇక‌, రాజ‌కీయ గురువులు-శిష్యులు కూడా ఒకే పార్టీలో ఉండ‌డం తెలిసిందే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా.. రాజ‌కీయాలు కూడా మారిపోయాయి. టికెట్ ద‌క్కితే చాలు.. అది ఎవ‌రైనా ఫ‌ర్వాలేదనే వాద‌న వినిపిస్తోంది. భార్య ఒక పార్టీలో భ‌ర్త మ‌రోపార్టీలో, అన్న ఒక పార్టీలో త‌మ్ముడు మ‌రో పార్టీలో, …

Read More »

పురందేశ్వరి చంద్రముఖిగా మారారు: అప్పలరాజు

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కొద్ది రోజులుగా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును పురంధేశ్వరి ఖండించిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తదితరులు…పురంధేశ్వరిపై జుగుప్సాకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అని అప్పలరాజు …

Read More »