ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకు తిరుగులేదని భావిస్తున్న వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ దఫా సెగలు మామూలుగా తగలడం లేదు. నిన్న మొన్నటి వరకు తనంతటి వాడు లేడని ఆయన ప్రచారం చేసుకున్నారు. ఇలానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. రాజంపేట నుంచి పార్లమెంటు కు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి, బీజేపీ నాయకుడు, మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి …
Read More »ఈ నియోజకవర్గాలు చాలా టఫ్ గురూ!
పార్టీ ఏదైనా.. కొన్ని నియోజకవర్గాలు చాలా చాలా టఫ్గా మారిపోయాయి. దీనికి కారణం.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేతలే.. తమను తాము అభ్యర్థులుగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ పొందిన వారికంటే. కూడా పార్టీల అధినేతలే ఎక్కువగా మధన పడుతున్నారు. ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడ అభ్యర్థుల పేర్లు టెక్నికల్ అయినా.. నిజమైన పోటీ పార్టీ అధినేతల మధ్యే ఉందనే …
Read More »ఖమ్మం సీటు.. నువ్వా-నేనా.. కాంగ్రెస్లో పంచాయతీ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు సీటు హాట్ కేక్గా మారిపోయింది. లెక్కకు మిక్కిలిగా నాయకులు ఇక్కడ పోటీకి రెడీ అయ్యారు. వీరిలో అన్నదమ్ములు కూడా ఉన్నారు. దీంతో దీనిపై కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఈ సీటులో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. అయితే.. ఈయనను ఓడించి.. పార్టీకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం కల్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. వాస్తవానికి ఎన్నికల …
Read More »మచిలీపట్నంపై ఎవరి సత్తా ఎంత? జోరుగా పందేలు!
కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఎవరి జెండా ఎగురుతుంది? ఇక్కడ ప్రస్తుత ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటారు? అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు.. ఇక్కడ గెలుపులపై అప్పుడే పందేలు కూడా కట్టినట్టు తెలుస్తోంది. మచిలీపట్నం స్థానం నుంచి మాజీ మంత్రి కాపు నాయకుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు) పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత, మాజీ మంత్రి, బీసీ నాయకుడు కొల్లు రవీంద్ర పోటీకి …
Read More »జంపింగుల వ్యూహం సక్సెస్ అయితే.. కష్టమే!
ఎన్నికలకు ముందు సహజంగానే అసంతృప్తులు జంప్ చేయడం..తమకు నచ్చిన పార్టీల్లో చేరడం సాధారణంగా జరిగేదే. ఏదో టికెట్లపై ఆశతో ఉన్నవారికి టికెట్లు రాకపోతే.. పార్టీని వీడడం సహజంగానే జరుగు తుంది. దీనిని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అయితే.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాయకుల పరిస్థితి వేరేగా ఉంది. వీరిని ఐదేళ్లు పనిచేయించుకుని.. వాడేసుకుని.. తీరా ఎన్నికలకు ముందు చేయివ్వడంతో వారంతా.. మానసికంగా రగిలిపోతున్నారనేది వాస్తవం. ఒంగోలు వైసీపీ ఎంపీ …
Read More »వచ్చేయ్ ఆ మాటలు మేం పట్టించుకోం!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు.. శాశ్వత మిత్రులు కూడా లేరు. అవకాశం-అవసరం ఈ రెండు చాలు. నాయకులు, పార్టీలు కూడా.. సర్దుకు పోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లోనూ ఇదే జరుగుతోంది. రెండు నెలల కిందట మాజీ మంత్రి , అగ్రనేత కేటీఆర్ను తిట్టిపోసిన నాయకుడికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. ఎస్సీలకు విలువ లేదు. కేటీఆర్ మాయలోడు. కనీసం నాకు …
Read More »ఇద్దరు మహిళలు తలపడుతున్న ఏకైక నియోజకవర్గం!
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వైసీపీ నుంచి మహిళలు పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక, టీడీపీ కూటమి నుంచి కూడా.. పలువురు మహిళలు మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఒకే నియోజకవర్గం లో అటు వైసీపీ నుంచి, ఇటు కూటమి నుంచి కేవలం ఇద్దరూ మహిళలే పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఇతర నియోజకవర్గాల్లో పురుష అభ్యర్థులపై మహిళలు, మహిళా అభ్యర్థులపై పురుషులు …
Read More »స్పీకర్ గారికి స్వతంత్ర అభ్యర్థి బెడద..
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నాయకుడు, ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు .. సొంత నేత నుంచి సెగ తగులుతోంది. వైసీపీకి చెందిన గాంధీ అనే వ్యక్తి.. టికెట్ ఆశించారు. అది రాకపోవడంతో ఆయన పార్టీకి దూరమై.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో ఆముదాల వలస రాజకీయం.. సెగ పుట్టిస్తోంది. గాంధీతోపాటు మరికొంత మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ తరపున …
Read More »ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్
వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అని వ్యాఖ్యానించారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన గత రెండు రోజులుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. ఈ …
Read More »రేవంత్ స్థానంపై బీఆర్ఎస్ కన్ను!!
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో అందరి దృష్టి ఇప్పుడు మల్కాజిగిరి స్థానంపైనే ఉంది. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. పైగా ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్తానం. దీంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. ఈ స్తానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అంతే తీవ్రంగా బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా.. తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొత్తంగా …
Read More »‘టీడీపీ-బీజేపీ బంధంపై దుష్ప్రచారం.. వెధవల్లారా’
ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈబంధంపై కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఈ పొత్తు ఉండేది కాదని చంద్రబాబే వ్యాఖ్యానించినట్టు ప్రచారం చేస్తున్నారు. దీనిని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు తాజాగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “పేరుతో లేఖ రాసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో మాది తాత్కాలిక పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. …
Read More »వలంటీర్ల నిషేధంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ప్రభుత్వ కార్యక్రమాలకు, పింఛన్ల పంపిణీ సహా ఇతర ఏ కార్యక్రమాలకైనా వలంటీర్లను వినియోగిం చరాదంటూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు తమ ఫోన్లను, వేలిముద్రలు తీసుకునే డివైజ్లను అధికారులకు అప్పగించేశారు. ఈ పరిణామాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates