ఆర్. గాంధీ. దళిత నాయకుడిగా రాజకీయాల్లోనూ.. రాయలసీమలోనూ ప్రాచుర్యం పొందిన ఈయన.. టీడీపీ చెంతకు రానున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్. గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. వైసీపీకి చేరువయ్యారు. కొన్నాళ్లు కనుమరుగయ్యారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత.. దళితులకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఆయనను సలదారుల కమిటీకి సభ్యుడిగా తీసుకున్నారు. దీంతో ప్రాధాన్యం పెరిగింది. కానీ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, గాంధీకి మధ్య పొసగని కారణంగా.. …
Read More »జనసేనలో విచిత్ర పరిస్ధితి
జనసేన పార్టీలో విచిత్రమైన పరిస్ధితి కనబడుతోంది. దాదాపు పదేళ్ళుగా పార్టీ జెండా మోసిన నేతలు, కష్టనష్టాలను ఎదుర్కొన్న నేతల కన్నా కొత్తగా చేరిన వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది. విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుతో జనసేన పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని సీట్లలో జనసేన పోటీచేస్తుంది ? పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం అధికారికంగా ప్రకటనకాలేదు. అయితే మీడియాలో లీకుల రూపంలో కొన్ని నియోజకవర్గాలు జాబితా చక్కర్లు కొడుతోంది. అందులో జనసేన …
Read More »అఖిల ఒంటరైపోయిందా ?
భూమా ఫ్యామిలిలో జరుగుతున్న డెవలప్మెంట్ల కారణంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఒంటరిపోయారు. ఆమెకు పార్టీతో పాటు కుటుంబంలో కూడా మద్దతు దొరకటంలేదు. ఇక ప్రజామద్దతు అంటే ఎన్నికల్లో మాత్రమే తెలుస్తుంది. విషయం ఏమిటంటే మాజీమంత్రిది మొదటినుండి బాగా దూకుడుస్వాభావమే. దానికితోడు భర్త భార్గవరామ్ ది అఖిలకు మించిన దూకుడు స్వభావమట. అందుకనే ఇద్దరు కలిసిన దగ్గర నుండి అఖిల చాలా వివాదాల్లో ఇరుక్కునేశారు. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం, తన పరిస్ధితిపై …
Read More »మరో వికెట్ ఢమాల్.. సైకిలెక్కనున్న కందుకూరు ఎమ్మెల్యే
వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్ట కీలక నాయకుడు, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న మహీధర్ రెడ్డి.. అనేక పర్యాయాలు కందుకూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. పాతతరం నాయకుల్లో ఆయన ఒకరు. గతంలో మర్రి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లో వివాద …
Read More »సీఎం జగన్, చంద్రబాబుకు షర్మిల లేఖలు
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. గత నెలలో పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆమె.. ఒకవైపు పార్టీని పరుగులు పెట్టించడంతోపాటు, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధుల అంశాలను ప్రస్తావిస్తూ.. …
Read More »బీసీలకే టాప్ ప్రయారిటీనా ?
తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు కేటాయించాలని ప్రదేశ్ ఎలక్షన్ కమిటి(పీఇసీ) డిసైడ్ చేసింది. గాంధిభవన్లో జరిగిన పీఈసీ మీటింగులో తెలంగాణా ఇన్చార్జితో పాటు ఏఐసీసీ పరిశీలకులు, రేవంత్ రెడ్డి, మంత్రులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ మీటింగులో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పదించారట మిగిలిన సభ్యులు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అనుకున్నన్ని టికెట్లు ఇవ్వలేకపోయిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారట. …
Read More »భగీరథలో వేల కోట్ల అవినీతి జరిగిందా ?
మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుండి. మిషన్ భగీరథ పేరుతో కేసీయార్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు చాలా ప్రాంతాల నుండి ప్రభుత్వానికి పిర్యాదులు అందుతున్నట్లు సమాచారం. ఫిర్యాలన్నింటినీ రేవంత్ రెడ్డి ముందుంచారు ప్రభుత్వ అధికారులు. వీటిని పరిశీలించిన రేవంత్ వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఈ …
Read More »విరాళాలు చెక్కులు వెనక్కిస్తున్న పవన్
రాజకీయాలు అన్న తర్వాత ఖర్చులు సర్వసాధారణం. వాటిని భరించేందుకు వీలుగా విరాళాలు.. పార్టీ ఫండ్ ఇలా వేర్వేరు పేర్లతో నిధుల సమీకరణ ఉంటుంది. ఇదంతా కామన్. దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అంతేకాదు.. విరాళాల పేరుతో చెక్కులు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో టికెట్లకు గాలం వేసే వారికి దిమ్మ తిరిగేలా షాకిస్తున్న వైనం సంచలనంగా మారింది. తాజాగా తనను కలిసి పార్టీకి విరాళంగా ఇస్తున్నట్లుగా …
Read More »ఎస్సీల దిశగా జగన్ అడుగులు.. రెండు పెద్ద స్థానాలు వారికే!
ఎస్సీలకు మరింత పెద్దపీట వేసే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ చీఫ్ షర్మిల, మరోవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారంటూ.. ప్రచారం చేస్తున్న దరిమిలా.. ఆ ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకునే లక్ష్యంతో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ సీట్లలో నిన్న మొన్నటి వరకు ఒక స్థానాన్ని మాత్రమే ఎస్సీలకు కేటాయించిన ఆయన …
Read More »మీరు బటన్ నొక్కితే.. జగన్ మైండ్ బ్లాంక్ కావాలి: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఆయన బటన్ నొక్కుతున్నాను.. బటన్ నొక్కుతున్నాను. అంటున్నారు. కానీ, మీరు బటన్ నొక్కితే ఆయన మైండ్ బ్లాంక్ కావాలి. అలా నొక్కాలి” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలుపే ముఖ్యంగా చంద్రబాబు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రా..కదలిరా!పేరుతో నిర్వహిస్తున్న ఈ సభల్లో వైసీపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. విద్యుత్ …
Read More »సర్దుబాటు బాగుందే.. టీడీపీ-జనసేన స్ట్రాటజీ.. !
వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ నాయకులను బుజ్జగించే విషయంలో టీడీపీ-జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో దాదాపు నేతలు అందరికీ అవకాశం దక్కింది. అయితే.. ఇప్పుడు రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా.. ఓటు బ్యాంకు చీలకుండా చూసే లక్ష్యంతో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో రాజకీయంగా ఇది బాగానే ఉన్నా.. పార్టీల పరంగా ఇబ్బందిగా ఉంది. టికెట్లు ఆశించిన …
Read More »లోకేష్ ఏమయ్యారు… ఎక్కడున్నారు…!
టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ జాడ ఎక్కడ? ఆయన ఏం చేస్తున్నారు? రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. యువగళం పాదయాత్ర తర్వాత.. ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపు ఈ యాత్ర ముగిసి కూడా నెల రోజులు దాడిపోతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాత్రమే ప్రజల మధ్యకు వచ్చారు. పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి. కుటుంబ సమేతంగా పూజలు చేశారు. తర్వాత.. మంగళగిరి నియోజకవర్గంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates