Political News

ఎగ్జిట్ ఫ‌లితంపై పీకే స్పైసీ రియాక్ష‌న్.. !

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తున్నారు? ఎవ‌రు ఓడుతున్నార‌నే విష‌యంపై తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాల‌పై రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిషోర్‌.. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గ‌తంలో ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మిఅధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని కూడా చెప్పారు. ఆయ‌న‌కు 400 సీట్లు రావ‌డం క‌ష్ట‌మేన‌ని.. 350 లోపు ఖ‌చ్చితంగా …

Read More »

విజ‌యం మ‌న‌దే: చంద్ర‌బాబు హ‌ర్షం

మ‌రికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కూట‌మి పార్టీల ముఖ్య నాయ‌కుల‌తో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. విజ‌యం మ‌న‌దే అని హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశారు. ఆదివారం .. ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసం నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. కూట‌మి పార్టీలైన‌.. జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లతో ఆయ‌న మాట్లాడారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో బీజేపీరాష్ట్ర చీఫ్ పురందేశ్వ‌రి, జ‌న‌సేన …

Read More »

విప‌క్షాన్ని  ఓ రేంజ్‌లో ఏకేసిన రేవంత్ రెడ్డి!

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స‌ర్కారు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో 40 నిమిషాల పాటు ప్ర‌సంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. విప‌క్షాన్ని ఓ రేంజ్‌లో ఏకేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స వానికి సోనియా గాంధీని ఆహ్వానించ‌డం నుంచి తెలంగాణ జాతీయ గీతాన్ని ఆవిష్క‌రించ‌డం వ‌ర‌కు వెల్లువెత్తిన అనేక విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న స‌భా వేదిక‌గా స‌మాధానం చెప్పేశారు. ఏ ఒక్క పాయింట్ ను కూడ ఆయ‌న వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సోనియా ఆహ్వానం …

Read More »

పవన్ పవరేంటో ఇప్పుడు గుర్తిస్తున్నారు

పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు.. రాష్ట్రమంతటా పోటీ చేస్తే ఆయన పార్టీ గెలిచింది ఒక్క సీటు.. ఆ ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకోలేకపోయాడు.. రాజకీయాల పట్ల సీరియస్‌నెస్ లేడు.. సొంత బలం మీద నమ్మకం లేక పొత్తు కోసం వెంపర్లాడతాడు.. బలానికి తగ్గట్లు సీట్లు ఇప్పించుకోలేడు.. ప్యాకేజీ తీసుకుని టీడీపీ కోసం పని చేస్తాడు.. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యర్థులు చేసే విమర్శలు, ఆరోపణలు ఎన్నెన్నో. …

Read More »

రేవంత్ లెక్క త‌ప్పిందా?

తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ క‌చ్చితంగా 14 సీట్లు గెలుస్తుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఇదే విష‌యాన్ని ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. కానీ ఇప్పుడు రేవంత్ లెక్క త‌ప్పింద‌ని, కాంగ్రెస్‌కు బీజేపీ షాక్ ఇచ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. తాజాగా వెలువ‌డ్డ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా ప్ర‌కారం తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు డ‌బుల్ డిజిట్ సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు …

Read More »

వైసీపీ ధీమా.. కౌంటింగ్ ఏజెంట్ల కోసమేనా?

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుకున్నట్లే ఎన్డీయే కూటమి గెలుస్తోందని దాదాపుగా అన్ని సర్వే సంస్థలూ తేల్చి చెప్పాయి. అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లే ఎన్డీయే కూటమి తెచ్చుకోబోతందని స్పష్టమైంది. ఇక అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారమని ప్రముఖ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ చరిత్రలోనే అత్యంత కచ్చితత్వం ఉన్న …

Read More »

ఆరా మస్తాన్ చరిత్ర తవ్వుతున్నారు

Aara Masthaan

ఆరా మస్తాన్.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. ఎన్నికల ఫలితాలపై సర్వేలు నిర్వహించే సంస్థలు చాలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో క్రెడిబిలిటీ సంపాదించుకున్న సర్వే సంస్థల్లో ‘ఆరా’ ఒకటి. దాన్ని నడిపించే మస్తాన్.. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రి పోల్, పోస్ట్ పోల్ సర్వేలు ప్రకటిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రకటించిన ఫలితాల్లో కచ్చితత్వం కనిపించింది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని …

Read More »

ఏపీలో ఏడుపు… తెలంగాణలో సంబ‌రాలు..

మాజీ ఎంపీ.. రాజ‌కీయ విశ్లేష‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుకలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ఈ సంబ‌రాల‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. “ఒక‌వైపు ఏపీ ఏడుస్తోంది.. మ‌రో వైపు తెలంగాణ‌లో సంబ‌రాలు చేసుకుంటున్నారు” అని చెప్పారు.. 2014, జూన్ రెండు నుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో రాష్ట్రాన్ని …

Read More »

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో పరాజయం పాలయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిగిన ఈ పోటీలో కాంగ్రెస్ పార్టీని విజయం వరించలేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనివార్యమయింది.  దీంతో ఎన్నికల కమీషన్ మార్చి 28న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది. రాష్ట్రంలో అధికార …

Read More »

ఔర్ ఏక‌బార్ ఓకే.. ‘చార్ సౌ’ పార‌లేదు!!

కేంద్రంలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు ఢిల్లీ గ‌ద్దెనెక్కుతారు? అనే విష‌యం కూడా ఈ సారి ఉత్కంఠ‌కు గురిచేసింది. అధికార పార్టీ బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌లు ఈ ద‌ఫా కూడా కూట‌మిగానే ముందుకు వ‌చ్చాయి. అంతేకాదు.. ప్ర‌చారాన్ని ప‌రుగు లు పెట్టించాయి. దీనిలో ప్ర‌ధానంగాపీఎం మోడీ ప‌రివారం అంతా కూడా.. “ఔర్ ఏక్‌బార్‌-4 సౌ.. పార్‌!” నినాదం వినిపించింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కూడా.. ఈ కూట‌మి ఇదే …

Read More »

కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందా ?

దేశవ్యాపితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హంగామా మొదలయింది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ అని మెజారిటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని, అశాస్త్రీయం అని ఇండియా కూటమి వర్గాలు వాదిస్తున్నాయి. ఇండియా కూటమి గరిష్టంగా 150 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతుండగా, 295 స్థానాలు గెలుచుకుంటామని అంటున్నాయి. ఎన్డీఎ కూటమికి సర్వే సంస్థలన్నీ 281 స్థానాల నుండి …

Read More »

లేనిపోని గొడ‌వ‌కు పోయి కేసీఆర్‌కు చిక్కులు!

అధికారం ఉంద‌నే అహంకారంతో.. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగేలేద‌నే అతి విశ్వాసంతోనే కేసీఆర్ ప‌రిస్థితి ఇలా మారిందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌గా ఉన్న బీఎల్ సంతోష్ జోలికి కేసీఆర్ వెళ్ల‌డ‌మే ఆ పార్టీ కొంప ముంచింద‌ని బీఆర్ఎస్ వ‌ర్గాలే మాట్లాడుకుంటున్నాయి. జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని చూసిన కేసీఆర్ బీజేపీని ఇబ్బందుల్లో పెడ‌దామ‌ని అనుకున్నారు. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో …

Read More »