కడపలో కొన్ని దశాబ్దాలుగా పెంచుకున్న వైఎస్ కుటుంబం పరువును ఆ ఇంటి ఆడపడుచులు.. వైఎస్ షర్మిల, సునీతలు రోడ్డున పడేస్తున్నారని.. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిల సోదరి వైఎస్ విమలారెడ్డి విమర్శించారు. వివేకానందరెడ్డి దారుణ హత్య విషయంపై తమ కుటుంబం చింతిస్తూనే ఉన్నదన్నారు. అయితే.. దీనిని చిన్నవాడైన ఎంపీ అవినాష్పైకి నెట్టేసి.. హంతకుడు.. హంతకుడు అని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల రాష్ట్రంలో వైసీపీ సహా సీఎం జగన్పైనా ప్రభావం పడుతోందని, …
Read More »గ్లాసును బకెట్ తన్నేస్తుందా ?
పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ …
Read More »ఆలు లేదు చూలు లేదు.. టెస్లాపై కామెడీ రాజకీయం
ప్రఖ్యాత కార్ల తయీరీ సంస్థ టెస్లా ఇండియాలో ఓ ప్లాంటు పెట్టాలని కొన్నేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలను ఇప్పుడు ముమ్మరం చేసిందని.. త్వరలోనే సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఓ బృందం ఇండియాకు వస్తుందని.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్లాంటు పెట్టే అవకాశాలను పరిశీలిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఐతే పరిశీలన కోసం ఏపీకి రావడం కూడా నిజమో కాదో తెలియదు. ఈలోపే టెస్లా …
Read More »రఘురామకు నరసాపురం టికెట్టే.. పట్టు బట్టిన బాబు
వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన రఘురామకృష్ణరాజు కోసం.. టీడీపీ అధినేత చంద్రబాబు త్యాగాల బాట పట్టారు. తాజాగా జరిగిన కూటమి(జనసేన-బీజేపీ-టీడీపీ) సమావేశంలోనూ రఘురామ కేంద్రంగానే చర్చలు జరిగాయి. ఆయనకు టికెట్ ఇచ్చితీరాలని చంద్రబాబు బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు.. నరసాపురం టికెట్ను బీజేపీకి కేటాయించింది కూడా.. కేవలం రఘురామను దృష్టిలో పెట్టుకునే చేశామని చెప్పినట్టు తెలిసింది. అయిందేదో అయిపోయిందని.. నరసాపురం టికెట్ను తమకు …
Read More »దేనికైనా రెడీ – కేటీఆర్
తెలంగాణలో చిన్నసారుగా ప్రచారంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్.. పెద్ద సవాలే రువ్వారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని, బీఆర్ ఎస్ పార్టీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. తాను ఈ విషయంలో నార్కో ఎనాలిసిస్ టెస్టుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు కిషన్రెడ్డి, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డిలు కూడా సిద్ధమేనా? అని గట్టి సవాల్ విసిరారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన …
Read More »జగన్కు సవాలుగా నెల్లూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తిరుగులేని రికార్డుంది. ఏపీ విభజన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించింది. కానీ ఈ సారి మాత్రం జగన్కు సవాలు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు కూటమి ఖాతాలోకి …
Read More »నారా లోకేష్ ఐఫోన్ ట్యాప్.. నిజమేనా?
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్కు గురైందంటూ.. వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్… ఈ మేరకు ఆయన ఫోన్కు సందేశాలు పంపించి నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అదేసమయంలో హ్యాకింగ్కు కూడా గురయ్యే ప్రమాదం ఉందని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్కు కూడా సందేశాలు అందాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హస్తం …
Read More »బాబు, పవన్ ప్రాధాన్యత ఇదే.!
సీట్ల పంపకం ఎప్పుడో ఓ కొలిక్కి వచ్చేసింది. చిన్నా చితకా మార్పులు చివరి నిమిషంలో వుంటాయా.? అంటే, అప్పటిదాకా సాగదీయాలన్న ఆలోచన టీడీపీ, జనసేన పార్టీల్లో అస్సలు కనిపించడం లేదు. బీజేపీ విషయంలోనే ఇంకా కొంత కన్ఫ్యూజన్ వుంది. బీజేపీ అభ్యర్థులు గ్రౌండ్ లెవల్లో ఆశించిన మేర, ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. ఇదిలా వుంటే, మూడు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్ఫర్ విషయమై మొదట్లో చాలా అనుమానాలుండేవి. అప్పటికి …
Read More »ఇంట్రెస్టింగ్: షర్మిల వైపుకు మహిళా ఓటర్లు.!
కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ కంటూ ప్రస్తుతం ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఏమీ లేదు. అదెప్పుడో వైసీపీకి బదిలీ అయిపోయింది. అలా బదిలీ అయిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కొంతైనా రాబట్టగలననే …
Read More »చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేటీఆర్
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, చాలా చాలా ఆలస్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి తప్పు తెలుసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడుంది.? ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి కదా.? మళ్ళీ ఆ భారత్ రాష్ట్ర సమితి పేరుని, తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే ఆలోచనలో వున్నట్లు ఇటీవల గులాబీ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించార్లెండి. అసలు విషయం అది కాదు.! మాజీ మంత్రి, భారత్ …
Read More »నిజామాబాద్ ఎవరికో జిందాబాద్?
లోక్సభ ఎన్నికలు తెలంగాణలోనూ కాక రేపుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ వీలైనన్నీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలున్న సంగతి తెలిసిందే. వీటిల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ కొడుతున్నాయి. కొన్ని చోట్ల మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇందులో నిజామాబాద్ కూడా ఒకటి. ఇక్కడ ఎంపీగా గెలవడం కోసం ముగ్గురు స్టార్ లీడర్లు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి …
Read More »సీనియర్ మంత్రి వర్సెస్ యువ సర్పంచ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న సీనియర్ మంత్రిని కేవలం సర్పంచ్గా మాత్రమే పని చేసిన జూనియర్ నాయకుడు ఢీ కొట్టడమే కారణం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయం.. మంత్రిగా కీలక బాధ్యతలు.. ఇలాంటి నేపథ్యం ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఎనిమిదో సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates