Political News

సొంత పెళ్లాం ఉండొద్దా?.. వైసీపీ నేతకు సామాన్యుడి షాక్

గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఏమో కానీ.. ఏపీ అధికార పార్టీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎదురైంది. రాయచోటిలో తాజాగా ఆయన నిర్వహించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఒక వ్యక్తి నవ్వుతూ ఎదురురావటం.. దీంతో అతనికి సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డికి.. అనూహ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను ఏదో అనుకుంటే మరేదో అయిన …

Read More »

మునుగోడుకు ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్

ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే ఇళ్ళకు, పంటపొలాలకు, ప్రచార రథాలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే జనాలకు, ప్రింటింగ్ ప్రెస్సులకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మహా అయితే ఉపఎన్నికకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది. ఉపఎన్నికలో గెలవటం టీఆర్ఎస్, బీజేపీ, …

Read More »

కేసీఆర్‌కు మ‌రో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి?

తెలంగాణ‌లో ప‌ట్టు సాధించాల‌ని బీజేపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలకు.. అధికార పార్టీ టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు.. క‌లిసివ‌చ్చేలా చేస్తున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే.. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు ప‌క్క చూపులు చూస్తున్నారు. కొంద‌రు.. కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఇంకా.. మ‌రికొంద‌రు రెడీ అవు తున్నారు. ఇక‌, బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే.. కాంగ్రెస్‌లోకి చిన్నా చిత‌కా నాయ‌కులు చేరుతుంటే.. బీజేపీలోకి పెద్ద నేత‌లు జంప్ చేస్తున్నారు.. …

Read More »

చంద్రబాబు.. కొత్త రూల్?

వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీచేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొత్త రూల్ అమలు చేయబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారట. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటయ్యా అంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అట. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబంలోని వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తానని స్పష్టంగా చెప్పారు. వీలైనంతమందికి టికెట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండచ్చు. …

Read More »

టీడీపీ.. వైసీపీ సాధించింది ఏంటంటే..!

ఔను.. అప్ప‌ట్లో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. రెండు పార్టీలు కూడా.. ఇబ్బందులు ప‌డుతున్నాయి. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాల‌ను రాజ‌కీయంగా అంతం చేయాల‌నే ల‌క్ష్యం కావొచ్చు.. త‌మ‌కు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎవ‌రికీ జై కొట్ట‌రు.. అనే దూకుడు కావొచ్చు. ఎలా చూసుకున్నా.. ఈ రెండు పార్టీలు కూడా.. అధికారంలో ఉండ‌గా.. ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకునేందుకు చాలానే ఉత్సాహం చూపించారు. అయితే.. దీనివ‌ల్ల సాధించింది ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో …

Read More »

బీహార్లో మారిపోతున్న సమీకరణలు

బీహార్లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ తో జతకట్టి మళ్ళీ ముఖ్యమంత్రయిపోయారు. మహాఘట్ బంధన్ అంటే ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాలు + ఎంఐఎం+ స్వతంత్ర ఎంఎల్ఏలు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్లో ఎవరు అధికారంలోకి రావవాలన్నా మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎంఎల్ఏలు. ప్రస్తుతం కొత్తకూటమికి 164 మంది ఎంఎల్ఏల బలముంది. అవసరానికి మించిన బలమే ఉందికాబట్టి నితీష్ కుమార్ …

Read More »

యాత్రపై జనసేనాని కీలక ప్రకటన

ఇప్పటికే ఏపీ రాజకీయం హాట్ హాట్ గా ఉండటం తెలిసిందే. తెల్లారింది మొదలు ఏదో రచ్చ ఏపీ అధికారపక్షానికి సరిపోతుంది. దీనికి తోడు.. పాలన మీద కంటే పంచాయితీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే జగన్ సర్కారు పుణ్యమా అని.. ఏదో ఒక వివాదం.. మరేదో ఒక ఇష్యూతోనే సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఏపీ రాజకీయాల్ని మరింత వేడెక్కించేలా జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 5 నుంచి …

Read More »

దెబ్బకు వెనక్కు తగ్గిన కేసీయార్?

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీయార్ వెనక్కు తగ్గినట్లే ఉంది. మొన్నటివరకు కూసుకుంట్ల ప్రభాకరరెడ్డే అభ్యర్ధిగా పార్టీలో బాగా ప్రచారమైంది. ముందు మంత్రి జగదీశ్వరరెడ్డి, తర్వాత కేసీయార్ కూడా నేతలతో జరిపిన సమావేశంలో కూసుకుంట్లే అభ్యర్ధి అన్నట్లుగా మాట్లాడారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా కూసుకుంట్లకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని సుమారు 40 మంది నేతలు ఎదురుతిరిగారు. వీళ్ళని కన్వీన్స్ చేయటానికి ఎంత ప్రయత్నించినా కేసీయార్ వల్లకాలేదు. దాంతో తాజాగా …

Read More »

కాంగ్రెస్ రాత మారుతుందా?

దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ప్రయాంకగాంధి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిలుగా ఉన్నవారి వల్ల ఎలాంటి ఉపయోగం కనబడలేదు. మిగిలిన రాష్ట్రాల సంగతి వదిలేసినా ఏపీకి ఊమెన్ చాంది, తెలంగాణాకు మాణిక్కం ఠాగూర్ ఇన్చార్జిలుగా ఉన్నారు. అయితే వీరిద్దరి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం కనబడలేదు. తెలంగాణాలో పార్టీకి కొద్దొగొప్పో నేతలున్నారు కానీ ఏపీలో అయితే ఇంకా సమాధిస్ధితిలోనే ఉంది పార్టీ. నిజానికి మెజారిటి జనాల అభిమతానికి విరుద్ధంగా కాంగ్రెస్ …

Read More »

వచ్చే ఎన్నికల బరిలో జీవిత

టాలీవుడ్ కు చెందిన ఏదో ఒక అంశంలో జీవితా రాజశేఖర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఆమె బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఆమె.. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించేవారు. ఆయన తరఫున మాట్లాడుతుండేవారు. రాజకీయంగా ఆయన నుంచి సాయం కోరినట్లు చెబుతారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత కాంగ్రెస్ …

Read More »

పెద్దలసభలో ఇంతమంది నేరచరితులా?

రాజకీయాల్లో నేరచరితులు ఉండకూడదని ఒకవైపు జనాలు నానా గోలచేస్తుంటే మరోవైపు రాజకీయపార్టీలు ఎక్కువగా నేరచరితులకు ప్రాధాన్యతిస్తున్నాయి. దేశంలోని అన్నీపార్టీలు దాదాపు ఇదే పద్దతిలో ముందుకు వెళుతున్నాయి. బహిరంగసభల్లో పార్టీలు చెప్పేదొకటి, అవసరానికి చేస్తున్నదొకటిగా ఇప్పటికే చాలాసార్లు బయటపడింది. అసోసియేష్ ఫర్ డమొక్రటికి రిఫార్స్మ్ (ఏడీఆర్) అనే సంస్ధ మన రాజకీయాల్లోని నేరచరితుల చిట్టాను ఎప్పటికప్పుడు బయటపెడుతునే ఉంది. ఇపుడిదంతా ఎందుకంటే ఏపీలోని పెద్దలసభగా చెప్పుకునే శాసనమండలిలోని నేరచరితుల బండారం బయటపెట్టింది. …

Read More »

ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడు లోకేశ్

ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల విషయంపై ఒక సంస్థ తాజాగా జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది ఉండగా.. 48 మంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 10 మంది ఎమ్మెల్సీల వివరాలు తమకు అందలేదని చెబుతోందిన సదరు సంస్థ. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీల వివరాల్లో అధికార వైసీపీకి 22 మంది ఉంటే.. విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు …

Read More »