Political News

తెలంగాణ : ఆ రెండు మినహా అన్నింటి మీదా ఆశలు గల్లంతే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో మొత్తం 17 స్థానాలలో కేవలం రెండు చోట్ల మినహా మిగిలిన 15 స్థానాలలో బీఆర్ఎస్ ఆశలు వదులుకున్న పరిస్థితి నెలకొంది. సామాజిక సమతూకం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినా కూడా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదని అర్ధమవుతున్నది. ఈ ఎన్నికలలో నాగర్ కర్నూలు, మెదక్ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. మిగిలిన స్థానాలలో బాగా వెనకబడి …

Read More »

జాతీయ మీడియా స‌ర్వేలే నిజ‌మ‌య్యాయా?

ఏపీలో వ‌చ్చిన ఫ‌లితాన్ని గ‌మ‌నిస్తే…. ఏడో ద‌శ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్ల‌డించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు స‌క్సెస్ అయ్యాయ‌నే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్ల‌మెంటు స్థానాల్లో కూట‌మి 18-20 స్థానాల వ‌ర‌కు ద‌క్కించుకుంటాయ‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. అంతేకాదు.. వైసీపీ కేవ‌లం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఇదే విష‌యాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. రాష్ట్ర స్థాయిలో చేసిన స‌ర్వేల్లో.. …

Read More »

చంద్రబాబు వ్యూహం ఫలించిన తరుణం

దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చకు దారి తీసిన ఏపీ ఎన్నికల ఫలితాలు అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ అధికార వైసిపి మరీ ఇంత చేతులెత్తేసే స్థాయిలో వెనుకబడటం మాత్రం అధికార పార్టీ కార్యకర్తలు ఊహించలేదు. ఏదో టఫ్ ఫైట్ జరిగి ఉంటే పోరాడి ఓడామని సరిపెట్టుకోవచ్చు. కానీ పరిస్థితి అలా లేదు. జనంలో జగన్ సర్కారు మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో …

Read More »

రెండు చోట్లా దుమ్ము రేపుతున్న రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ లోక్ సభ ఎన్నికలలో సిట్టింగ్ స్థానం కేరళలోని వాయనాడ్, యూపీలోని రాయ్ బరేలీ స్థానాల నుండి పోటీ చేశారు. ప్రస్తుతం రాయ్ బరేలీలో సమీప బీజేపీ ప్రత్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్ పై 40,149 ఓట్ల ఆధిక్య ప్రదర్శిస్తున్నారు. ఇక కేరళలోని వయనాడ్ లో సీపీఐ అభ్యర్థి అన్నె రాజాపై ఏకంగా 91,421 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. 2019 ఎన్నికల్లో యూపీ అమేథి, …

Read More »

కూటమి నాకౌట్..కొడాలి నాని, వంశీ వాకౌట్

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. ఉదయం 10:30 వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఎన్డీఏ కూటమి మొత్తంగా 145 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో అధికార పార్టీ వైసీపీ కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 145 స్థానాల్లో టీడీపీ 122, జనసేన 18, బీజేపీ 5 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని టీడీపీ కార్యాలయం …

Read More »

పవన్ చెంతకు పిఠాపురం పీఠం

ఊహించినట్టే ఇవాళ జరుగుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోవడం అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తోంది. ఇంకో 14 రౌండ్లు ఉండగానే 20 వేల ఓట్ల ఆధిపత్యంతో అధికార పార్టీ వైసిపి అభ్యర్థి వంగ గీత మీద గెలుపు దిశగా స్వారీ చేయడం అప్పుడే ట్రెండ్ గా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఈ ధోరణి కనిపిస్తుండటంతో …

Read More »

జగన్, బొత్స మినహా ఓటమి బాటలో మంత్రులు

ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల వరకు ముగిసిన కౌంటింగ్ గణాంకాల ప్రకారం ఎన్డీఏ కూటమి 120 అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, వైసీపీ 20 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. టీడీపీ 100 స్థానాల్లో లీడ్ లో ఉండగా, జనసేన 16 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, ఏపీలో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సీఎం జగన్, …

Read More »

వెనుక‌బ‌డ్డ ప్ర‌ధాని మోడీ… దూసుకుపోతున్న రాహుల్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గెలుస్తార‌ని అనుకున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో ఆయ‌న భారీ స్థాయి లో వెనుక‌బ‌డ్డారు. తొలి ఐదు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి ప్ర‌ధాన‌ మంత్రి 6 వేల ఓట్ల‌కుపైగా వెనుక‌బ‌డి పోయారు. 2014 లో తొలిసారి ఇక్క‌డ నుంచి పోటీ చేసిన ప్ర‌ధాని మోడీ.. భారీ విజ‌యం న‌మోదు చేశారు. 80 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు. రెండో సారి 2019లో పోటీ చేసి కూడా.. 60 …

Read More »

షేకింగ్ : మేజిక్ ఫిగ‌ర్ చేరుకున్న టీడీపీ కూట‌మి!

ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ఓటింగ్ కౌంటింగ్ ప్ర‌క్రియలో తొలి మూడు రౌండ్లు ముగిసేనాటికి అద్భుతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అస‌వ‌రమైన‌.. మేజిక్ ఫిగ‌ర్ 88 స్థానాలు. వీటిలో తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి 96 స్థానాల్లో కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వీటిలో టీడీపీ ఒంటరిగా 81 స్థానాల్లోనూ.. జ‌న‌సేన 11, బీజేపీ 5 స్థానాల్లోనూ దూకుడుగా ఉన్నాయి. దీంతో కూట‌మి మేజిక్ ఫిగ‌ర్ దాటేసింది. …

Read More »

ఎగ్జిట్ పోల్స్ సైతం అంచనా వేయని సీన్ ఏపీలో

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి చూపు.. ఫోకస్ మొత్తం ఏపీ మీదనే ఉంది. అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? గెలిచిన పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? జనసేన ప్రభావం ఎంతమేర ఉంటుంది? లాంటి ప్రశ్నలే ఉన్నాయి. తెలుగుప్రజల ఆసక్తికి తగ్గట్లే.. ఎగ్జిట్ పోల్స్ సైతం …

Read More »

టీడీపీ ఆఫీసులో సంబ‌రాలు.. !

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో టీడీపీ కూట‌మి దూసుకుపోతుండ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిపార్టీ కార్యాల‌యంలో టీడీపీ నేత‌లు.. సంబ‌రాల‌కు దిగారు. ఒక‌వైపులీడ్స్ వ‌స్తుండ‌డం.. టీడీపీ కూట‌మి నేత‌లు.. ముందంజలో ఉండ‌డంతో త‌మ్ముళ్ల‌లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. తొలి రెండు రౌండ్లు ముగిసే స‌రికి.. లీడ్‌లు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తొలి రౌండ్ లో ఆధిక్యం 4300తో ఉండిలో రఘురామరాజు ఆధిక్యం లోఉన్నారు. మంగళగిరిలో …

Read More »

పిఠాపురంలో పవన్ .. గుడివాడలో నాని

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు చూపిస్తున్నారు. ఇక్కడ రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ 8500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. 1549 ఓట్లతో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకంజలో ఉన్నారు. పులివెందులలో జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 2004 నుండి గుడివాడ ఎమ్మెల్యేగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న కొడాలి నాని తాజాగా ఓట్ల లెక్కింపులో …

Read More »