స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా ఎంఎల్ఏలు, ఎంపీలను టార్గెట్ చేస్తు కూడా మాట్లాడారు. పనిలోపనిగా జనాలందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములకు వ్యతిరేకంగా జనాలు ఉద్యమించాలని పిలుపిచ్చారు. పవన్ పిలుపు ప్రకారం జనాలు ఉద్యమాలు చేసేదుండదు, ప్రభుత్వం స్కీములను ఆపేదుండదని అందరికీ తెలుసు. స్కీములకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ తాను …
Read More »నిలకడ లేని నేతతో ఏ పార్టీకి ప్రయోజనం?
ఆయన సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి కూడా. కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు కూడా ఉంది. అయితే.. ఇవన్నీ.. నిన్నటి నిజాలు. కానీ..ఇప్పుడు ఆయన చుట్టూ.. నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనే వాదన హల్చల్ చేస్తోంది. అంతేకాదు.. ఆయన వల్ల ఏ పార్టీకి ప్రయోజనం? అంటూ.. నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి .. కొత్తపల్లి సుబ్బారాయుడు. ప్రస్తుతం ఆయన రాజకీయంగా సంధి …
Read More »3 రాజధానులను విడిచిపెట్టని జగన్
మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టినట్లులేదు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మాట్లాడుతు రాజధాని స్ధాయిలో పరిపాలనా వికేంద్రీకరణే తమ విధానంగా చెప్పారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతాల ఆత్మగౌరవానికి మూడురాజధానుల ఏర్పాటే పునాదిగా జగన్ గట్టిగా నమ్ముతున్నట్లున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి చాలాకాలంగా పక్కనపెట్టేశారు. ఎప్పుడైతే హైకోర్టు జగన్ ప్రతిపాదనను అడ్డుకుందో అప్పటినుండి ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా పట్టించుకున్నట్లు కనబడలేదు. హైకోర్టు జగన్ ప్రతిపాదనను కొట్టేసిన తర్వాత …
Read More »రాజ్ భవన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం?
రాజ్ భవన్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒక విషయం అర్ధమవుతోంది. అదేమిటంటే రాజ్ భవన్ను కేసీయార్ బహిష్కరించినట్లు. గవర్నర్ నివాసముండే రాజ్ భవన్లో ఏ కార్యక్రమం జరిగినా దానికి హాజరు కాకూడదని కేసీయార్ నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకనే ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారు. స్వాతంత్ర వేడుకలు అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం రాజభవన్లో …
Read More »పవన్ ఎందుకు ఆ అవకాశాలను వాడుకోలేదు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెద్ద జోక్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ తాను అనుకుంటే 2009లోనే ఎంపీ అయిపోయేవాడనన్నారు. తనకు పదవే ముఖ్యమని అనకుంటే ప్రధానమంత్రిని పదవి కావాలని అడిగే చొరవ తనకుందని చెప్పటమే పెద్ద జోక్. ఎంఎల్ఏగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ తాను ఎంపీగా అయిపోయేవాడనని చెబితే ఎవరైనా నమ్ముతారా ? ఒక్కసారైనా ఎంఎల్ఏగా …
Read More »చంద్రబాబు విజన్ 2047.. కీలక అంశాలివే
అప్పుడెప్పుడో విజన్ 2020 అంటూ నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు.. భవిష్యత్తును ఎలా చూడాలన్న దానిపై ఆయనకున్న విజన్ ను బయటపెట్టింది. నిజానికి చాలా దూరంగా ఆలోచించి.. రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసిన చంద్రబాబును అప్పట్లో చాలామంది ఎక్కెసం చేసేవారు. కానీ.. ఆయన అప్పటి విజన్ 2020ను ఫాలో అయి ఉంటే.. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు మరో లెవల్ లో ఉండేవి. ఫ్యూచర్ …
Read More »తిరుమలలో ఏపీ మంత్రి హల్చల్
తిరుమలలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్ హల్చల్ చేశారు. సామాన్య భక్తులు.. శ్రీవారి దర్శనం కోసం.. రోజుల తరబడి ఎదురు చూస్తున్నా.. ఆమె ఏమాత్రం వారిని పట్టించుకోకుండా.. తన వెంట వచ్చిన 50 మంది అనుచరులకు దర్శనం కల్పించి తీరాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో విధిలేక.. సామాన్యులను క్యూలైన్లకే వదిలేసిన.. అధికారులు.. మంత్రికి, ఆమె అనుచరులకు దర్శనం కల్పించారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీయడం …
Read More »అలా చేసుంటే.. 40 స్థానాల్లో గెలిచేవాళ్లం: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం, మతం చూసుకుని తాము గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ఉంటే.. 40కిపైగా స్థానాల్లో విజయం సాధించి ఉండేవారమని అన్నారు. అంతేకాదు.. వైసీపీ నాయకులు.. ఢిల్లీ ఎప్పుడు వెళ్లనా.. ఏం చేస్తారో.. తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం …
Read More »సొంత పెళ్లాం ఉండొద్దా?.. వైసీపీ నేతకు సామాన్యుడి షాక్
గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఏమో కానీ.. ఏపీ అధికార పార్టీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి చేదు అనుభవం ఒకటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎదురైంది. రాయచోటిలో తాజాగా ఆయన నిర్వహించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఒక వ్యక్తి నవ్వుతూ ఎదురురావటం.. దీంతో అతనికి సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ రెడ్డికి.. అనూహ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను ఏదో అనుకుంటే మరేదో అయిన …
Read More »మునుగోడుకు ఒక్కసారిగా పెరిగిపోయిన డిమాండ్
ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. అయినప్పటికి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. పెరుగుతున్న డిమాండ్ ఏమిటంటే ఇళ్ళకు, పంటపొలాలకు, ప్రచార రథాలకు, ఎన్నికల ప్రచారంలో పాల్గొనే జనాలకు, ప్రింటింగ్ ప్రెస్సులకు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉపఎన్నిక నవంబర్ లేదా డిసెంబర్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే మహా అయితే ఉపఎన్నికకు మరో నాలుగు నెలల వ్యవధి ఉంది. ఉపఎన్నికలో గెలవటం టీఆర్ఎస్, బీజేపీ, …
Read More »కేసీఆర్కు మరో షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి?
తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు.. అధికార పార్టీ టీఆర్ఎస్ వేస్తున్న అడుగులు.. కలిసివచ్చేలా చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే.. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కొందరు.. కాంగ్రెస్లోకి జంప్ చేశారు. ఇంకా.. మరికొందరు రెడీ అవు తున్నారు. ఇక, బీజేపీలోకి చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే.. కాంగ్రెస్లోకి చిన్నా చితకా నాయకులు చేరుతుంటే.. బీజేపీలోకి పెద్ద నేతలు జంప్ చేస్తున్నారు.. …
Read More »చంద్రబాబు.. కొత్త రూల్?
వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీచేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొత్త రూల్ అమలు చేయబోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చెప్పారట. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏమిటయ్యా అంటే ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అట. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబంలోని వాళ్ళల్లో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తానని స్పష్టంగా చెప్పారు. వీలైనంతమందికి టికెట్ల కేటాయింపులో అవకాశం ఇవ్వటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయ్యుండచ్చు. …
Read More »