వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై కేసు నమోదైంది. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. చెలరేగిపోయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నానీ. గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం దక్కించుకున్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యా రు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును తీవ్రస్థాయిలో …
Read More »తెలంగాణ రాజకీయాల్లో మూసీ మసి!
తెలంగాణ రాజకీయాలను మూసీ నది సుందరీకరణ వ్యవహారం కుదిపేస్తోంది. దేవుడే దిగి వచ్చినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది సుందరీకరణ పనులు కొనసాగించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాకు మరిన్ని పదునైన ఆయుధాలు అందించారు. అయితే.. మూసీ సుందరీకరణకు ఓకేగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా దూకుడుకు మాత్రం వ్యతిరే కంగా ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. …
Read More »వైసీపీ రాబందుల పనిపడతాం: మంత్రి అనగాని వార్నింగ్
ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల పనిపడతాం అని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్యకలాపాలు ప్రారంభం అవుతూనే జగన్ పాలనా కాలంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల వ్యవహారంపై చర్చ సాగింది. జగనన్న ఇళ్లు పేరుతో పేదలకు అప్పట్లో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో భారీ అవినీతి జరిగిందని.. ప్రభుత్వం …
Read More »పవన్ కోసం.. హైవే పై అఘోరి రచ్చ!
గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా అఘోరి వ్యవహారం మరింత ముదురుతోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఏ క్షణంలో ఆమె ఎక్కడ ప్రత్యక్ష మవుతుందో తెలియక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా.. కొద్దిపాటి బూడిద రాసుకుని.. సంచరిస్తున్న ఆమె వ్యవహార శైలితో సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి …
Read More »బొత్స వర్సెస్ అనిత మాటల యుద్ధం!
ఏపీ శాసన మండలి ఐదో రోజు సమావేశాలు హాట్ హాట్గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవుతూనే .. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ మోషేన్ రాజు శాంతి భద్రలపై చర్చకు ఓకే చెప్పారు. తొలుత మాట్లాడిన వైసీపీ మండలి పక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధికో రౌడీ తయారయ్యారని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని …
Read More »మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ
లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కేటీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దాడి చేయించేందుకు వెనుకనుండి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. అమాయకులను బలి చేసి తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడమే బీఆర్ఎస్ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు. అంతే కాకుండా లగచర్ల ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులను విదేశాలకు …
Read More »ఆదివారం కూడా.. కేసీఆర్ను వదిలిపెట్టవా రేవంత్!?
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం సండే అయినా మండే అయినా తగ్గేదేలే అన్నట్లుగా తమ తమ రాజకీయ అజెండాతో ముందుకు సాగుతుంటారు. అలా తాజాగా ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు తెలంగాణలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు …
Read More »కేజ్రీవాల్ కు మరో దెబ్బ..
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత నేతలే ఇప్పుడు అధినేత కేజ్రీవాల్ కు శత్రువులుగా మారుతున్నారు. ఈసారి ఏకంగా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాస్ గెహ్లాట్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పార్టీలో (ఆప్) కొత్త చర్చకు తెరలేపారు. ప్రభుత్వ అవినీతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ …
Read More »రేవంత్ మనసును తెలుసుకున్న అధికారులు…
ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో… కొన్ని సమస్యలు చాపకింద నీరులా మన పుట్టి ముంచేస్తున్నాయి. మొదట ఒకచోట ప్రారంభమై… తర్వాత స్వల్పకాలంలోనే అందరికీ చేరువై జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది డ్రగ్స్! ఆల్కహాల్ తీసుకోవడానికి అనుబంధంగా, అతి కొద్ది మంది ఫన్ కోసం తీసుకున్న ఇది ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వంటి మారుమూల …
Read More »ఏపీకి గోల్డెన్ ఛాన్స్.. ఒకేసారి 6 ఎయిర్పోర్టులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వైమానిక పరివహనానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ఆరు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిపాదనల కోసం రూ.1.92 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో సాధ్యత అధ్యయనం ప్రారంభించి, నివేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంతో పాటు, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్ …
Read More »కొత్త రాజధాని కోసం చంద్రబాబు పాట్లు చూశారా…!
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధానంగా మూడు విషయాలను ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతోనూ ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏపీలోనే చంద్రబాబు.. అనంతరం ఢిల్లీ వెళ్లి.. అక్కడ వారిని కలిశారు. ఈ క్రమంలో అమరావతి రాజధానికి సంబంధించిన కీలక విషయంపై జైశంకర్తో చర్చించారు. అమరావతి రాజధానిని నిర్మించేందుకు, ఈ ఐదేళ్ల …
Read More »‘బ్రిటీషర్ల మాదిరి ప్రపంచాన్ని భారతీయులు ఏలవచ్చు’
ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కొంతకాలంగా పాపులేషన్ మేనేజ్మెంట్ ఆవశ్యకత గురించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తాజాగా హెచ్ టీఎల్ ఎస్ లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల సమస్య మొదలైందని, ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జననాల రేటు బోర్డర్ లైన్ లో ఉందని, అది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates