Political News

అరస్ట్.. కేటీఆర్ అనుకున్నట్టు జరగలేదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి తనపై కేసు నమోదు కాగానే… తన అరెస్ట్ ఖాయమంటూ కేటీఆర్ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ కారణంగానే తన అరెస్ట్ గురించి ఆయన పదే పదే ప్రస్తావించారు. అంతేకాకుండా అరెస్ట్ చేస్తే తానేమీ భయపడిపోనంటూ కూడా కేటీఆర్ పదే పదే చెప్పడమూ కనిపించింది. …

Read More »

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

YS-Jagan-Chandrababu-Naidu

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ… రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా కీచులాడుకుంటున్న ఈ ఇద్దరు నేతలు కలిసే ఫారిన్ ట్రిప్ కు వెళుతున్నారా? అనుకోకండి. ఎందుకంటే… జగన్ పర్సనల్ పని మీద ఫారిన్ ట్రిప్ వెళుతుంటే… చంద్రబాబు మాత్రం సీఎం హోదాలో అదికారిక పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇక ఇద్దరూ ఒకే సమయంలో విదేశాలకు వెళుతున్నా…వారి …

Read More »

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. వారికి స‌ర్ది చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. కార్యాకార‌ణ సంబంధంతో నిమిత్తం లేకుండానే.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆయ‌న ప్రోగ్రామ్స్‌కు రావ‌డం.. చిరాకు తెప్పించ‌డం స‌హ‌జంగా మారిపోయింది. దీంతో ప‌లు సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాటలో బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు …

Read More »

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న కార‌ణంగానే పోలీసులను ముందు పెట్టి త‌న‌ను తిరుప‌తికి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారిని ఆయ‌న స్విమ్స్‌లో ప‌రామ‌ర్శించారు. సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. ఒక్కొక్క బాధితుడి వ‌ద్ద 5 నుంచి 10 నిమిషాల సేపు ఉన్నారు. అనంత‌రం.. జ‌గ‌న్ మీడియాతో …

Read More »

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు ఎదురు ప‌డితే ఎలా ఉంటుంది? ఏం జ‌రుగుతుంది? అదే గురువారం సాయంత్రం జ‌రిగింది. తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డి స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువారం సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో ప‌రామ‌ర్శిం చారు. వారి ఆవేద‌న‌ను పంచుకున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో …

Read More »

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన వైనం యావత్తు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ఎగబడిన నేపథ్యంలో బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోగా… 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఇద్దరిపై సస్పెన్షన్… ముగ్గురిపై బదిలీ వేటు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వచ్చి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు కారకులైన 2 మంది అధికారులపై చర్యలు తీసుకుంటూ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. భక్తుల రద్దీపై నియంత్రణ లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ కుమార్ సహా, బాధ్యత మరచి వ్యవహరించిన గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు …

Read More »

ఏసీబీ విచారణపై కేటీఆర్ హాట్ కామెంట్స్

ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు భయపడినట్టుగా ఈ కేసులో కేసీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు… ఆయనను అరెస్ట్ అయితే చేయలేదు. దాదాపుగా 7 గంటల పాటు ఏసీబీ విచారణ కొనసాగగా…మధ్యాహ్నం ఓ అరగంట పాటు కేటీఆర్ కు లంచ్ బ్రేక్ దొరికింది. సాయంత్రం దాకా విచారణ …

Read More »

తిరుపతి ఘటనపై నమోదైన కేసులు.. విచారణకు రంగం సిద్ధం

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని కలిచివేసింది. పద్మావతి పార్కు, విష్ణునివాసం వద్ద ఈ ఘటనలతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ఇప్పుడు పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. పద్మావతి పార్కు ఘటనపై నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా, విష్ణునివాసం వద్ద జరిగిన మరణంపై బాలయ్యపల్లె …

Read More »

తిరుపతి ఘటన.. గరికపాటి ప్రవచనం వైరల్

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సంఘటన నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గతంలో ఇచ్చిన ప్రవచనం వైరల్‌గా మారింది. ఆయన చెప్పిన సూత్రాలు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చకు దారి తీసాయి. గరికపాటి వ్యాఖ్యల ప్రకారం భగవంతుడి దర్శనానికి ప్రత్యేక రోజులు లేదా ముహూర్తాలు అవసరం లేదని …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్ శివ తాండవం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల పంపిణీ సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 40 మందికి గాయాలు కాగా… వారు తిరుపతిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరహా ప్రమాదం జరగడం, …

Read More »

తిరుపతిలో చంద్రబాబు.. హడలిపోయిన అధికారులు

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు… సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆపై గురువారం ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎవరి తప్పిదం వల్ల జరిగిందని కూడా …

Read More »