Political News

అనుభ‌వం తెచ్చిన అభివృద్ది.. ఏపీలో ఎంత తేడా!

ఏపీ విష‌యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు, ప్ర‌స్తుత ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఉన్న తేడా ఏంటి? ఇద్ద‌రూ ఏపీ ప్ర‌జ‌లు ఎంచుకున్న‌వారే.. ఘ‌న విజ‌యం అందించిన వారే. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్రం విష‌యంలో ఎక్క‌డో తేడా .. ఇద్ద‌రి ఆలోచ‌న‌ల మ‌ధ్య చాలా వ్య‌త్యాసం.. ఇదే ఇప్పుడు రాజ‌కీయంగానే కాకుండా.. అభివృద్ది ప‌రంగా కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. రాష్ట్రాన్ని ఆదాయ‌వ‌న‌రుగా మార్చుకోవాలన్న‌ది.. చంద్ర‌బాబు ఆలోచ‌న‌. ఇది భేష్ అయిన ఆలోచ‌న‌. …

Read More »

అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం …

Read More »

ఇకపై జగన్ కేసుల రోజువారీ విచారణ

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని 2024 ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి హరి రామ జోగయ్య వేసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే జగన్ కేసుల్లో రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ …

Read More »

వైఎస్ జయంతి .. షర్మిల టార్గెట్ ఏంటి ?

జులై 8. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో విబేధాల నేపథ్యంలో ఆయన కుమారుడు జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ఆ తరువాతి పరిణామాల్లో ఆక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు …

Read More »

  రేవంత్‌-బాబు చ‌ర్చ‌లు.. హీటెక్కిన పాలిటిక్స్‌

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయాలు వేడెక్కాయి. విభ‌జ‌న హామీల ప‌రిష్కారం కోసం.. ఏపీ, తెలం గాణ ముఖ్య‌మంత్రులు ఈ నెల 6న భేటీ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. భేటీ వ‌ర‌కు కామ‌నే అయినా.. రాజ‌కీయంగా ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యం మాత్రం అంత ఈజీకాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ స‌మాజంలో గూడుక‌ట్టుకున్న సెంటిమెంటును కాద‌ని.. అక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేసే …

Read More »

టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారి అరెస్టు

జగన్ హయాంలో టీడీపీ నేతలు మొదలు టీడీపీ ఆఫీసుల వరకు అన్నింటిపై దాడులు చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. నాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక అదే రీతిలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా గతంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్, …

Read More »

  ప్ర‌క్షాళ‌న పూర్తి.. ఇక‌, బాబు మార్కు పాల‌నే!

ఏపీలో వ్య‌వ‌స్థ‌లు ధ్వంస మ‌య్యాయ‌ని, గాడిత‌ప్పాయ‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌చారం చేసిన చంద్ర‌బా బు.. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వాటిని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న విష‌యం తెలిసిం దే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌ను మార్పు చేశారు. కీల‌క పోస్టుల్లో ఉండి.. అవినీతి, అక్ర మాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అధికారుల‌ను ప‌క్క‌కు పెట్టి.. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించే వారికి అవకా శం క‌ల్పించారు. అదేవిధంగా ఉద్యోగుల విష‌యంలోనూ.. …

Read More »

త్యాగానికి పెద్దపీట వేసిన చంద్రబాబు

1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమి తులయ్యారు. ఉమేష్ చంద్ర హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న …

Read More »

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా లడ్హా నియామకం

ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిబద్ధత గలిగిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఏపీకి వస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమర్థులైన అధికారుల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ అధికారి మహేశ్‌ చంద్ర లడ్హా నియమితులయ్యారు. లడ్హాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ …

Read More »

వైసీపీ నేతలతో ‘ఆడుదాం ఆంధ్రా’

Chandrababu

అధికారం ఉందని అడ్డగోలుగా అక్రమాలకు, దాడులకు, వేధింపులకు గురిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తెలుగుదేశం ప్రభుత్వం గురిపెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు కేసులను తిరగదోడేందుకు విచారణకు ఆదేశించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగింది. కానీ ఇప్పటివరకు నిందితులు ఎవరో తేల్చలేదు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీ ఓపెన్‌ చేసిన పోలీసులు అప్పటి …

Read More »

ఇలాంటి రోజు ఒక‌టి వ‌స్తుంద‌ని.. ఊహించ‌లేదా.. ద్వారంపూడీ!

ఎంత అధికారం ఉన్నా.. ఎంత అంగ‌బ‌లం, అర్థ‌బ‌లం ఉన్నా.. ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకోవాలి. ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉన్న వారు.. నోరు జారేందుకు.. కాలు విసిరేందుకు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచ‌న చేసుకోవాలి. లేక‌పోతే.. ఇలాంటి ప‌రిస్థితే వ‌స్తుంది. వైసీపీ కీల‌క నాయ‌కుడు, జ‌గ‌న్ వ్యాపార భాగ‌స్వామి.. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వ్య‌వ‌హారం.. తూర్పుగోదావ‌రిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌న‌కంటూ ఎదురులేద‌న్న‌ట్టుగా ఆయ‌న …

Read More »

ఢిల్లీ ట్రిప్: బాబు ఫోకస్ మొత్తం నిధుల మీదే!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దేశ రాజధానికి వెళుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కలిసే కేంద్ర మంత్రులందరితోనూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకురావటమే లక్ష్యమని చెబుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఏఏ ప్రాజెక్టు.. స్కీంల కింద కేంద్రం నుంచి …

Read More »