టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సహజంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధమైన కార్యక్రమాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారుల మార్పులు.. గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దడం వరకే చంద్రబాబు పరిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు. అయితే.. చంద్రబాబు వచ్చీ రావడంతోనే.. …
Read More »అంగళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?
చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత …
Read More »ఇక, ఎస్టీల వంతు.. రిజర్వేషన్లపై పోరే!
ఇప్పటి వరకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసిన ఎస్సీలకు భారీ ఊరటే కలిగింది. ఎస్సీ వర్గీకరణకు.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఓకే చెప్పింది. ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చేసింది. అయితే.. రాజకీయ జోక్యం కూడదని తేల్చి చెప్పింది. దీనిపై చిన్న చిన్న విమర్శలు వస్తున్నా.. మొత్తానికి ఎస్సీలకు న్యాయం అయితే జరిగిందన్న వాదన ఇటు రాజకీయ వర్గాల నుంచి అటు సామాజిక వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది. ఇంత వరకు బాగానే …
Read More »బాబు లో ఏంత మార్పు!
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కొన్ని విషయాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరి స్తున్నారు. గతానికి ఇప్పటికీ.. పాలన విషయంలోనూ, రాజకీయాల విషయంలోనూ ఆయనలో చాలా మార్పు కనిపించింది. గతంలో ఎలా వ్యవహరించినా.. అప్పటి సంగతి వేరు. కానీ, ఇప్పుడు ఓడిపోయిన ప్పటికీ వైసీపీ బలంగా ఉండడం.. 40 శాతం ఓటు బ్యాంకుతో క్షేత్రస్థాయిలో నిలదొక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిని తక్కువగా అంచనా వేసేందుకు వీల్లేదు. అందుకే చంద్రబాబుకూడా …
Read More »ఈ ఒక్క పనైనా చేసి ఉంటే.. వైసీపీలో గుసగుస…!
వైసీపీ అధికారంలో ఉండగా.. చేస్తానని చెప్పిన వాటిలో రచ్చబండ కార్యక్రమం కీలకమైంది. సీఎంగా ఉన్న జగన్.. అప్పట్లో ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినాలని అనుకున్నారు. ఈ క్రమంలో నలుగురు కీలక నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి.. కార్యక్రమానికి రూపకల్పన చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. 2009లో ఇదే కార్యక్రమానికి బయలు దేరిన అప్పటి సీఎం వైఎస్ దురదృష్టవ శాత్తు మరణించారు. దీంతో ఆ కార్యక్రమం …
Read More »అమరావతికి విరాళాలు.. ఇంత సెంటిమెంటు వుందా
సెంటిమెంటు ఎలా ఉంటుందో.. అది ఏ రూపంలో ఉంటుందో పసిగట్టడం.. రాజకీయ నాయకులకు వెన్న తో పెట్టిన విద్య. అందుకే.. రాజకీయాల్లో ఉన్నన్ని సెంటిమెంట్లు ఎక్కడా ఉండవు. 2019లో జగన్ అధికా రంలోకివచ్చేందుకు సెంటిమెంటే కారణమైంది. ఆయన చేసిన పాదయాత్ర కారణంగానే వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మరి అలాంటిది కీలకమైన సెంటిమెంటును అంచనా వేయడంలో జగన్ ఎక్కడో తప్పు చేశారనే భావన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అదే.. రాజధాని …
Read More »మోడీ డబుల్ గేమ్ బయటపెట్టిన షర్మిల
ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీతో ఐదేళ్లపాటు అంటకాగిన జగన్ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీని బిజెపి ఉంచుకుందంటూ పరుష పదజాలంతో సైతం షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ పై …
Read More »మడకశిరతో కొత్త కల్చర్ కు తెర తీసిన చంద్రబాబు
ప్రభుత్వం ప్లాగ్ షిప్ గా తీసుకున్న కార్యక్రమాన్ని ఎంత భారీగా చేపడుతుందో.. అందుకు రెట్టింపు ప్రచారాన్ని కోరుకోవటం మామూలే. ఇందుకు మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు మొదలుకొని.. కవరేజ్ కోసం ప్రత్యేకంగా విన్నపాలు ఇస్తుంటారు. ఇవి సరిపోనట్లుగా.. తాము చేపట్టే కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యేలా చేయటం.. జనసమీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం.. అందుకు లక్షలాది రూపాయిల్ని ఖర్చు చేయటం చూస్తుంటాం. అందుకు భిన్నంగా చేయాల్సిన పనిని చేసుకుంటూ …
Read More »రేవంత్ ఫారిన్ ట్రిప్: 3 భేటీలు.. 6 ఒప్పందాలు
అసెంబ్లీ సమావేశాల్ని పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు విదేశాల బాట పట్టారు. ఈ రోజు (శనివారం) ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా.. దక్షిణ కొరియా దేశాల టూర్ కు వెళుతున్నారు. మొత్తం పన్నెండు రోజులు సాగనున్న ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట.. సీఎస్ శాంతకుమారి.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన …
Read More »వల్లభనేని వంశీ అరెస్టు కాలేదట
గన్నవరం టీడీపీ కార్యాలయం పై వల్లభనేని వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసులో వల్లభనేని వంశీనీ పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీ కారును పోలీసులు వెంబడించి ఆయనను అదుపులోకి తీసుకున్నారని పలు మీడియా చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రచారంపై పోలీసులు క్లారిటీనిచ్చారు. వంశీని అరెస్టు చేయలేదని …
Read More »అసెంబ్లీ : నీ అమ్మ తోలు తీస్తా .. బయట తిరగనియ్య !
‘నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా’ ఈ మాటలు ఎక్కడో కాదు. సాక్షాత్తూ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మాటలు శాసనసభలో ఉద్రిక్తతకు దారితీశాయి. బీఅర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం మీద స్పీకర్ వద్ద అనర్హత వేటు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో శాసనసభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …
Read More »రఘురామకు హైకోర్టు భారీ ఊరట
2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తో రఘురామకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలపై రఘురామకృష్ణరాజు గత నాలుగున్నరేళ్లుగా సంచలన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక, తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates