కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అందరూ మాట్లాడుకునేలా మారటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం తీవ్రంగా తపించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం.. అవసరానికి మించి ఎక్కడా కనిపించకపోవటం.. మంత్రిగా తన భాధ్యతలతో పాటు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన …
Read More »ఏపీ ఎవరి జాగీరు కాదండి: ముద్రగడ
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబుతో తన స్నేహాన్ని, టీడీపీలో తాను కొనసాగిన విషయాన్ని. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు స్నేహాన్ని ప్రస్తావిస్తూ సాగిన ముద్రగడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై కూటమి సర్కారు కక్షపూరిత వైఖరితో సాగుతోందని ఆరోపించిన ముద్రగడ… ఆ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. అంతటితో …
Read More »తిరుమల మృతులకు రూ.25 లక్షల పరిహారం
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రావడంతో సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటుగా మంత్రులు, ఇతరత్రా కీలక అధికారులంతా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ పర్యటన నిర్దేశిత సమయంలోనే ప్రశాంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూ ఉండగానే… తిరుపతిలో …
Read More »ఆన్ లైన్ కోటా ఉండగా టోకెన్ల పంపిణీ ఎందుకూ…?
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమల వస్తున్నారు. స్వామి వారిని ఎంచక్కా దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందన్న సంతృప్తితో తిరిగి వెళుతున్నారు. అయితే తిరుమల చరిత్రలో ఇప్పటిదాకా తోపులాటలు జరిగి భక్తులు చనిపోయిన ఘటనలు లేవనే చెప్పాలి. ఏటికేడు తిరుమల వస్తున్న భక్తుల సఖ్య పెరుగుతున్నా… …
Read More »ఏసీబీ విచారణకు కేటీఆర్… వాట్ నెక్ట్స్..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేసులకు సంబంధించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ఏ 1గా ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ 2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. …
Read More »ఇంటర్ పరీక్షల రద్దు లేదు.. ఆ వార్తలు నమ్మొద్దు: ఏపీ ప్రభుత్వం
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం నుంచి పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇది విద్యార్థులకు ఊరటనిచ్చే అంశంగా కొందరు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన భారీ సంస్కరణగా కూడా ప్రచారంలోకివచ్చింది. ఇది క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే.. ఆ వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించింది. పరీక్షల రద్దు అనేది ఏమీ …
Read More »షార్ట్ అండ్ స్వీట్!… సాగదీత, భజనలకు నో ఛాన్స్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం టూర్ ప్రణాళికాబద్ధంగా సాగింది. మూడో దఫా ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఏపీ పర్యటనకు మోదీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా అటు మోదీతో పాటు ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు హాజరైన ఈ కార్యక్రమానికి అత్యంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు కలిసి రోడ్ షో కూడా …
Read More »మోదీని గ్లోబర్ లీడర్ ను చేసిన చంద్రబాబు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక పేరిట ఆంధ్రా వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక మీద ఏపీలో చేపట్టిన, చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు మోదీ …
Read More »తిరుపతి క్యూలైన్లో తోపులాట.. ఎంత మంది చనిపోయారు
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభించనుంది. అయితే.. వివిధ ప్రాంతాల నుంచి బుధవారం మధ్యాహ్నమే తిరుపతి చేరుకున్న భక్తులు లక్షల సంఖ్యలో గుమిగూడారు. ఇక, క్యూలైన్లలోకి వారిని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఒకేసారి అనుమతించడంతో తోపులాట, తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో …
Read More »నమో-నమో-నమో.. నారా లోకేష్ 21 సార్లు!
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని పలకడం అందరినీ ఆశ్చ ర్యానికి గురి చేసింది. ప్రతి వాక్యంలోనూ ఆయన నమో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారు. తాజాగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత సభలో నారా లోకేష్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన నరేంద్ర మోడీ …
Read More »మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత …
Read More »మోడీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్ కల్యాణ్
ఏపీ ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేను నమ్మారని.. అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో ఘన విజయం అందించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీకి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. విశాఖలో ప్రధాని మోడీ పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అయితే.. ఆయన ప్రసంగం క్లుప్తంగానే సాగింది. కేవలం 10 నిమిషాల్లోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates