Political News

రాజ్యసభలో ఎన్డీఏకు చిక్కులే !

ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ అధికారం అందుకోవడం కోసం ఎన్డీఎ పక్షాల మద్దతు అవసరం అయింది. సొంతంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ, జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమితో కలిపి కూడా బీజేపీకి తగినంత మంది సభ్యుల బలం లేకపోవడంతో ఎన్డీఏతర పక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉన్నాయి. …

Read More »

ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఖాళీగా ఉన్న భూములు మొదలు భూమి లోపల ఉన్న సహజ వనరుల వరకు వేటినీ వదలకుండా వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలు అర్జించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో వైసీపీ పాలలో జరిగిన సహజ వనరుల దోపిడీపై ఏపీ సీఎం …

Read More »

జనసేన నాయకులకు పవన్ వార్నింగ్

ఆంధ్రప్రదేవ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడక్కడా కొంచెం హద్దుదాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇలాగే కొనసాగితే వైసీపీకి.. ఈ రెండు పార్టీలకు తేడా ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుందని.. కాబట్టి ఆ పార్టీల అధినేతలు జోక్యం చేసుకుని, హద్దులు దాటి ప్రవర్తించే వారిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా …

Read More »

సుప్రీం కోర్టులో కోడికత్తి శీనుకు ఊరట

కోడి కత్తి శీను…ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. రాజకీయాలలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2019లో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై కోడి కత్తితో శీను దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ దాడి సింపతీతో జగన్ సీఎం అయ్యారని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 5 సంవత్సరాల వరకు శీను జైల్లో మగ్గిపోయాడు. ఎట్టకేలకు 2024 ఎన్నికలకు కొద్ది …

Read More »

నేను మోదీ గుండెల్లో ఉన్నా..ఫొటో అక్కర్లేదు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు, నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితులుండేవని, ఆఖరికి ఇళ్లలోని మహిళలపై కూడా దుర్భాషలాడిన …

Read More »

ఇక‌, ‘ప్రైవేటు’ బాదుడు.. జ‌నాల జేబులకు చిల్లే!

మ‌రికొన్ని రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. అయితే.. దీనిలో ఎలాంటి బాదుళ్లు ఉంటాయి? ఎయే ప‌న్నులు వ‌డ్డిస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇంత‌లోనే ప్ర‌జ‌ల‌కు చేరువైన కొన్ని ప్రైవేటు కంపెనీలు త‌మ‌దైన శైలిలో బాదుడు ప్రారంభించాయి. పోనీ.. వీటి సేవ‌ల‌ను వ‌దులుకుందామా? అంటే.. సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. ఎందుకంటే.. ఆయా సంస్థ‌ల‌తో.. ఆయ‌న సేవ‌ల‌తో మ‌న జీవితాల‌ను మ‌న‌మే.. మ‌న‌కు తెలియ‌కుండా ముడివేసుకుపోయాం!! దీంతో స‌ద‌రు ప్రైవేటు …

Read More »

త్వ‌ర‌లోనే ‘ఛానెల్’ పెడ‌తా: సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అంతేకాదు.. అర్థం ప‌ర్థం లేకుండా చేసిన ప్ర‌చారం.. త‌న‌ను హ‌ర్ట్ అయ్యేలా చేసింద‌న్నారు. మీడియాకు ఎందుకంత తొంద‌ర‌? అని వ్యాఖ్యానించారు. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌నర్‌.. శాంతి భ‌ర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోప‌ణ‌లు …

Read More »

ఉచితం అనుచిత‌మైతే.. వీటి సంగ‌తేంటి.. కేటీఆర్‌?

ఉచిత ప‌థ‌కాలు అనుచిత‌మంటూ.. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉచితాల రూపంలో ఇచ్చేవాటి వెనుక పెను ఆర్థిక భారం ఉంటుంది అని ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాన్ని అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చిన కొన్నాళ్ల‌కే రేవంత్ ఈ ప‌థ‌కాన్ని మ‌హిళ‌ల‌కు చేరువ చేశారు. అయితే.. పొరుగున …

Read More »

సుప్రీం గడపతొక్కిన కేసీఆర్

“విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఈఆర్ సీ నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీని మీద విచారణ కమీషన్ వేయకూడదు. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ 1952, విద్యుత్తు చట్టం-2003కి ఇది విరుద్దం” అంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని అధికారంలోకి వచ్చిన …

Read More »

కేటీఆర్ సెటైర్లేనా.. చేసేది ఏమైనా ఉందా?

ఎంత‌సేపు సెటైర్లు వేయ‌డం.. ఎక్స్ వేదిక‌గా స్పందించ‌డం త‌ప్ప బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు ఆ పార్టీ వ‌ర్గాల నుంచే వ‌స్తున్నాయి. ఓ వైపు ఎన్నిక‌ల్లో పార్టీకి దారుణ ప‌రాభ‌వం. మ‌రోవైపు గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అవినీతి, అక్ర‌మాల‌పై ఆరోప‌ణ‌లు. ఇంకోవైపు ఒక్కొక్క‌రిగా పార్టీ నుంచి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు. కానీ కేటీఆర్ మాత్రం రేవంత్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, సెటైర్లు వేయ‌డంలోనే బిజీ అయిపోయార‌నే …

Read More »

కేసీఆర్ మాట వినేవాళ్లెవ‌రు?

ఒక‌ప్పుడు ఆయ‌న మాట అంటే శాస‌నం. పార్టీలో, ప్ర‌భుత్వంలో ఆయ‌న మాట‌కు ఎదురే లేదు. వ‌రుస‌గా రెండు సార్లు సీఎం పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నార‌నే చెప్పాలి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా. అధికారం ఉంద‌ని ఎగిరెగిరి ప‌డితే ప్ర‌జ‌లు ఓటుతో త‌గిన బుద్ధి చెబుతార‌న్న‌ది కాద‌న‌లేని నిజం. ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఆ నాయ‌కుడి ప‌వ‌ర్ పోయింది. మాట‌లు వినేవాళ్లే లేరు. ఆ నేత ఎవ‌రో …

Read More »

జనసేన మంత్రుల్లో ఈయన సూపర్ ఫాస్ట్..!

“జనసేన మంత్రుల్లో ఈయన సూపర్ ఫాస్ట్!” అనే పేరు తెచ్చుకున్నారు నాదెండ్ల మనోహర్. జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో మొత్తం ముగ్గురు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయం పక్కనపెడితే మిగిలిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్‌ ఉన్నారు. వీరిలో నాదెండ్ల మనోహర్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు …

Read More »