Political News

రఘురామకు హైకోర్టు భారీ ఊరట

2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది నెలలకే వైసీపీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తో రఘురామకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్ తో పాటు వైసీపీ నేతలపై రఘురామకృష్ణరాజు గత నాలుగున్నరేళ్లుగా సంచలన విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక, తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉండి నియోజకవర్గం నుంచి …

Read More »

బండ్ల .. మళ్లీ రివర్స్ గేర్ .. ఏం జరుగుతుంది ?!

ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గత నెల 6 వ తేదీన బీఆర్ఎస్ పార్టీని వీడి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత నెల 30న శాసనసభలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ను కలిసి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పాడు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరో ఇద్దరు, ముగ్గురు కూడా …

Read More »

జగన్ టార్గెట్ చేసిన రమణ దీక్షితులకు కోర్టులో ఊరట

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు పేరు ఇరు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమే. తన వ్యాఖ్యలతో రమణ దీక్షితులు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం రమణదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడి బాధ్యతలు నుంచి హఠాత్తుగా తప్పించింది. జగన్ ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేయడంతో ఆయనపై వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే తనకు బాధ్యతలు తిరిగి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రమణ దీక్షితులు హైకోర్టులో …

Read More »

లక్ష్మీ పార్వతికి చంద్రబాబు బిగ్ షాక్

వైసీపీ పాలనలో జగన్ తన అనుయాయులకు, అనుచరులకు, తన మనుషులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతిని జగన్ నియమించారు. లక్ష్మీ పార్వతి కన్నా అర్హులు ఎందరో ఉన్నప్పటికీ కేవలం తమ పార్టీ నేత కాబట్టే ఆమెకు పదవి కట్టబెట్టారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్మీపార్వతికి షాక్ ఇచ్చింది. ఆంధ్రా …

Read More »

ఆప్పుడు బాబు చేసిందే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ సమంజసమని, అలా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చరిత్రాత్మక తీర్పుపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగంతో స్పందించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ …

Read More »

జ‌గ‌న్‌ ను రీప్లేస్ చేయడానికి షర్మిల ప్రయత్నం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల భారీ షాకిస్తున్నారా? అంటే.. ఇప్ప‌టికే అనేక షాకులు ఇస్తున్నారు క‌దా.. ఎందుకీ డౌటు? అని అంటారు. కానీ, మ‌రో కీల‌క నిజం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఓ జాతీయ మీడియాలో జ‌రిగిన‌ చ‌ర్చ‌లో ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్ విష‌యాలు వెలుగు చూశాయి. ఏపీలో 11 మందిని ప్ర‌జ‌లు ఇచ్చినా.. వైసీపీ సరైన రోల్ పోషించ‌డం లేద‌ని.. జాతీయ …

Read More »

ప్రతిపక్ష హోదా లేదని ఆయన రారు.. ఉన్నా ఈయన రారు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో అంశం అందరిని ఆకర్షించటమే కాదు.. మాట్లాడుకునేలా చేస్తోంది. వరుసగా జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికారపక్షాలు ఓటమిపాలు కావటం.. విపక్షాలు విజంయ సాధించి అధికారపక్షంగా అవతరించటం తెలిసిందే. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష అధినేతలు ఇద్దరు అసెంబ్లీకి రాని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ …

Read More »

చివ‌ర‌కు రోగుల భోజ‌నాల బిల్లులూ ఎగ్గొట్టారు!

ద‌మ్ముంటే అసెంబ్లీకి రా.. జ‌గ‌న్‌!! అంటూ వైసీపీ మాజీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి కొలుసు పార్థ‌సార‌థి స‌వాల్ రువ్వారు. “శ్వేత‌ప‌త్రాల‌ పై ఏమైనా చెప్పాల‌ని అనుకుంటే.. స‌భ‌కు వ‌చ్చి చెప్పాలి. మీడియా ముందు.. సొంత చానెళ్ల‌లోనూ త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డం ఎందుకు? అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గోబెల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం” అని ఆయ‌న హెచ్చ‌రించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొలుసు.. జ‌గ‌న్‌ పై తీవ్ర‌స్థాయిలో …

Read More »

అప్పుడు చేయంది ఇప్పుడు.. తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ఏర్పాట్లు!

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌న్నది సామెత‌. కానీ, దీపం ఆరిపోయిన త‌ర్వాత‌.. అంధ‌కారం చుట్టుముట్టిన త‌ర్వాత‌.. చ‌క్క‌బెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 11 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం ఫైట్ చేస్తున్నారు. ఇది వ‌చ్చేనా.. లేదా.. అనేది త‌ర్వాత తెలుస్తుంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఆయ‌న కీల‌క కార్య‌క్ర‌మానికి రెడీ అయ్యారు. అదే.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డం.. కార్య‌క‌ర్త‌ల‌కు క‌నిపించ‌డం.. …

Read More »

కుప్పంలో దెబ్బ‌కు దెబ్బ‌..

దెబ్బ‌కు దెబ్బ‌..! అన్న‌ట్టుగా మారిపోయింది వైసీపీ ప‌రిస్థితి. ఒక‌ప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబును దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నించిన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్యంగా వైసీపీకే దెబ్బ ప‌డిపోయింది. ఇక్క‌డ ఇప్పుడు జెండామోసేందుకు కూడా నాయ‌కుడు లేకుండా పోయారు. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన కేవ‌లం రెండు మాసాల్లోనే వైసీపీ ఖాళీ అయిపోవ‌డం.. కీల‌క నాయ‌కులు జారు కోవ‌డం.. అస‌లు ఇంచార్జ్ జాడ కూడా క‌నిపించ‌క పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కుప్పంలో …

Read More »

స‌బిత‌క్క.. రేవంత్‌.. అసలు ఏం జరిగింది?

తెలంగాణ అసెంబ్లీలో మాట‌కు మాట ఎలా ఉన్నా.. తాజాగా సెంటిమెంటు.. ఎమోష‌న్లు కూడా పండేశాయి. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తీవ్ర మ‌న‌స్తాపం చెందిన మాజీ మంత్రి స‌బిత ఏకంగా క‌న్నీరు పెట్టేసు కున్నారు. తానే ఏం పాపం చేశానంటూ ప్ర‌శ్నించారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం ఏర్ప‌డ‌డం.. అదుపు త‌ప్ప‌డంతో స‌భ‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు. అనంత‌రం 10 నిమిషాల‌కు స‌భ ప్రారంభ‌మ‌య్యాక సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స‌బిత‌ను …

Read More »

ఇది నిజంగా ‘ఎర్రిప‌ప్ప‌’ వ్యాఖ్య‌ అంటున్న నెట్టిజన్లు

కొంద‌రు రాజ‌కీయ నేత‌ల‌ను చూస్తే.. వారి వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. చాలా చిత్రంగా ఉంటుంది. గ‌తంలో వైసీపీ నాయ‌కులు చిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు చ‌ర్చించుకున్నారు. రైతుల‌ను ‘ఎర్రిప‌ప్ప‌’లంటూ ఓ మంత్రి వ‌ర్యులు(పేరు చెబితే ఇంకా ఎందుకు వెంట‌ప‌డ‌తార‌ని బాధ‌ప‌డ‌తారు) వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మ‌రొక‌రు న్యూడ్ యాంగిల్స్‌లో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశారు. ఇవ‌న్నీ అయిపోయాయిలే.. ఇప్పుడు బాగుంటుందిలే! అని అనుకున్నారు. …

Read More »