Political News

వలంటీర్లకు మంగళమేనా?

AP Volunteers

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉండగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థ గురించి గత నాలుగేళ్లలో ఎంత చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని భావించిన వలంటీర్ల గురించి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాల్లో ఎన్నో వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. చివరికి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. వలంటీర్ల గురించి ఎన్నికల సమయంలో సానుకూలంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే …

Read More »

జీతం ఇస్తామన్నారు.. తీసుకోలేదు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.4 వేలకు పెంచిన పింఛన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా జులై 1న పంపిణీ చేయడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంంలోని గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఐదేళ్లు అధికారంలో …

Read More »

1995నాటి బాబును చూస్తారు..బాబుగారి వార్నింగ్

జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజే 100% పెన్షన్ పంపిణీ లక్ష్యంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలో ఏర్పాటుచేసిన సభలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గత …

Read More »

జగన్ పై చంద్రబాబు, లోకేష్ ర్యాగింగ్..వైరల్

పరదాల ముఖ్యమంత్రి అంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పై గత ప్రభుత్వంలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం తిరుమల పర్యటన సందర్భంగా జగన్ పరదాలపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పరదాలు కట్టొద్దన్నా కడుతున్నారేంటి అని అధికారులను అడిగితే…అలవాటులో పొరపాటు అని అధికారులు సమాధానమిచ్చారు. ఇక, తాజాగా ఏపీలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల …

Read More »

తెలంగాణ ఎన్నిక‌ల‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీలో ఎన్నిక‌ల‌కు ఐదారు మాసాల ముందు చేసిన గ్రౌండ్ వ‌ర్క్ ఫ‌లించిన విష‌యం తెలిసిందే. బీజేపీ-టీడీపీల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. కూట‌మి క‌ట్టేలా చేసిన ఆయ‌న ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌త‌నాని కి నాంది పలికారు. త‌న పార్టీ 21 స్థానాలు తీసుకున్నా.. అన్నిచోట్లా గెలిపించుకున్నారు. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాలే ద‌క్కించుకున్నా.. వాటిని కూడా గెలిపించుకున్నారు. ఈ వ్యూహం ఏపీలో ఇప్ప‌టి …

Read More »

మాట‌కు మాట‌: వాళ్లు మూడేళ్లు ప‌డ్డారు.. బొత్స గారూ!

మాట‌కు మాట‌… సోష‌ల్ మీడియా ప్ర‌భావం రాజ‌కీయాల‌పై ఎక్కువ‌గానే ఉంది. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు ఇట్టే వైర‌ల్ అవుతుండ‌డం ఒక ఎత్త‌యితే.. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌పై మేదావులు, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా అంతే వేగంగా రియాక్ట్ అవుతున్నారు. వారు రాజ‌కీయ నేత‌లే కాన‌వ‌స‌రం లేదు..బుద్ధి జీవులు కావొచ్చు. వారు త‌ల‌లు పండిన నేతాశ్రీలే కాక‌పోవ‌చ్చు.. రాజ‌కీయాల పై అవ‌గాహ‌న ఉన్న‌వారు. దీంతో కొంద‌రు నేత‌లు చేసే కామెంట్ల‌కు నెటిజ‌న్లు కూడా …

Read More »

నితీష్‌కు వంత పాడిన మోడీ వీరాభిమాని!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు.. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌. ఈయ‌న ఒక‌ప్ప‌టి కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఈయ‌న మోడీకి ద‌గ్గ‌ర‌య్యారు. మోడీ ఎంత చెబితే అంత అంటూ.. పార్ల‌మెంటు ఎన్నికల స‌మ‌యంలో చెల‌రేగి మాట్లాడారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన ఎల్ జేపీ పార్టీకి ఇప్పుడు ఈయ‌న చీఫ్‌గా ఉన్నారు. బిహార్‌లోని పార్ల‌మెంటు స్థానాల్లో …

Read More »

ఈ పూరి గుడిసె.. ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది స్టేట్‌!’

పై ఫొటోలో క‌నిపిస్తున్న పూరి గుడెస‌.. ఇప్పుడు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్‌ది న్యూస్‌గా మారిపోయింది. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలోనూ ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. సాధార‌ణంగా పూరి గుడిసెల గురించి ఎవ‌రు మాత్రం ప‌ట్టించుకుం టారు? అవి ఎందుకు వార్త‌ల్లో నిలుస్తాయి? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌చ్చు. అయితే.. తాజాగా ఇటు సోష‌ల్ మీడియాలోనూ.. అటు ప్ర‌ధాన మీడియాలోనూ వైర‌ల్ అవుతున్న ఈ ఫొటో వ్య‌వ‌హారం …

Read More »

తెలంగాణ‌లో జంపింగులు..ఈ స్టోరీ ఇప్ప‌ట్లో అయిపోలేదా?

తెలంగాణ‌లో ఎమ్మెల్యేల జంపింగుల ప‌ర్వం గ‌త వారం నుంచి కొన‌సాగుతూనే ఉంది. గ‌త న‌వంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న‌వారు.. త‌ర్వాత‌.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార‌ణాలు ఏవైనా.. తొలుత ఇద్ద‌రు ముగ్గురుతో ప్రారంభ‌మైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవ‌ల కాలంలో మ‌రింత పెరిగాయి. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్‌, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు …

Read More »

సునాక్‌ పై పాకీ వ్యాఖ్య‌లు.. బ్రిట‌న్‌లో రాజ‌కీయ దుమారం!

బ్రిట‌న్‌లో రాజ‌కీయ దుమారం రేగింది. అధికార, విప‌క్షాల మ‌ధ్య మాట‌ల మంట‌లు ర‌గులుకున్నాయి. ప్ర‌ధాన మంత్రి రుషి సునాక్‌ను ఉద్దేశించి.. ప్ర‌తిప‌క్ష రిఫార్మ్ పార్టీ(ఆర్‌పీ) నాయ‌కుడు ఒక‌రు తీవ్ర అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు చేశారు. బ్రిట‌న్‌లో సునాక్ హ‌యాంలో తీసుకువచ్చిన‌.. మైగ్రేష‌న్ పాల‌సీ(వ‌ల‌స విధానం)పై స్పందిస్తూ.. ఇవి పాకీ నిర్ణ‌యాలు. ఆయ‌న ఓ పాకీ అంటూ.. స‌ద‌రు నేత విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా పెను దుమారం రేపాయి. …

Read More »

మోడీ గారు..కుదిరితే మరో కప్పు కాఫీ…: చంద్రబాబు

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన …

Read More »

దేశంలో న్యాయం మారుతోంది!

దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ మారుతోంది. జూలై 1(సోమ‌వారం) నుంచి దేశ‌వ్యాప్తంగా నూత‌న నేర న్యాయ చట్టాలు అమ‌ల్లోకి రానున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ నూత‌న నేర న్యాయ చ‌ట్టాల మేర‌కు.. తీర్పులు, కేసుల న‌మోదు, ఫిర్యాదుల న‌మోదు వంటివి అందుబాటులోకి వ‌స్తున్నాయి. 2023లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. మూడు నూత‌న నేర న్యాయ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. వీటికి డెడ్ లైన్ జూన్ …

Read More »