తెలంగాణలో పేరొందిన చరిత్రాత్మక కట్టడాలు చరిత్రలో కలుస్తున్నాయి. వాటిస్థానంలో ప్రభుత్వాలు పోటీ పడి మరీ కొత్తవి నిర్మిస్తున్నాయి. దశాబ్దాలు, శతాబ్దాల నాటి కట్టడాలు కావడంతో కొంత మేరకు మార్పుల పేరుతో కొత్తవాటికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి చెందిన సచివాలయాన్ని పక్కన పెట్టి ఇంద్రభవనం వంటి నూతన సచివాలయాన్ని నిర్మించారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. ఆయన ముందుకే వెళ్లారు. ఇక, ఇప్పుడు రేవంత్ …
Read More »ఫుల్లు భరోసా!… రాష్ట్రపతి నోట పోలవరం మాట!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాలను ప్రస్తావించారు. అదే సమయంలో పలు కీలక రాష్ట్రాలకు చెందిన కీలక అంశాలను వరుసగా ప్రస్తావిస్తూ సాగారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏపీ అంశానికి వస్తూ.. …
Read More »‘స్టైల్’ చాల్లే!… ‘డ్రెస్ కోడ్’లోకి జగన్!
వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించారు. గురువారం రాత్రి లండన్ లో ఫ్లైట్ ఎక్కిన జగన్ దంపతులు… శుక్రవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండయ్యారు. దాదాపుగా 15 రోజులకు పైగా లండన్ లో సేదదీరిన జగన్… నిర్దేశిత గడువులోగానే తన పర్యటనను ముగించారు. ప్రస్తుతం బెంగళూరు చేరిన జగన్… విదేశీ ప్రయాణం బడలికను తీర్చుకుని ఫిబ్రవరి 3న నింపాదిగా తాడేపల్లి చేరుకుంటారట. …
Read More »జగన్ తో కానిది… బాబుతో సాకారం
రాయలసీమ ముఖద్వారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం… ఇవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానం. జగన్ మాటలను నమ్మిన సీమ జనం 2019 ఎన్నికల్లో తమ ఓట్లన్నీ వైసీపీకే గుద్దేశారు. ఫలితంగా జగన్ సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు దిలాసాగా కాలం వెళ్లదీశారు. కర్నూలుకు హైకోర్టు ఏదీ అంటే.. అదిగో, ఇదిగో అంటూ చెప్పారే తప్పించి… …
Read More »అదేందన్నా… నిప్పు లేనిదే పొగ రాదుగా
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయిన వైసీపీలో కొనసాగేందుకు ఆ పార్టీకి చెందిన మెజారిటీ నేతలు హడలిపోతున్నారు. ఇప్పటికే వైసీపీకే కాకుండా ఏకంగా వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటులుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభానులు వరుసబెట్టి ఎగ్జిట్ ఇచ్చేశారు. ఇక పార్టీలో జగన్ తర్వాత స్థానంలో ఉన్ననేతగా చెప్పుకున్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకుని… నేరుగా సాగులోకి …
Read More »‘అమ్మ’ ఆస్తులు రూ.4 వేల కోట్లు… ఏమేం ఉన్నాయంటే?
తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోమారు తెర మీదకు వచ్చి ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాలకు ముందు చాలాకాలం పాటు సినిమాల్లో నటించిన జయలలిత భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చకున్న జయ..సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేకు ముచ్చెమటలు పట్టించారు. తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ జయ తనదైన ముద్ర వేశారని చెప్పక …
Read More »జగన్, భారతి ఫొటోలతో రాజమండ్రి వారి పెళ్లి పిలుపు
వివాహ ఆహ్వాన పత్రిక అంటే…సామాన్యులకైనా, ధనికులకైనా చాలా ప్రత్యేకం. గతంలో అయితే ఏమో గానీ… సంపద పెరిగిన ప్రస్తుత కాలంలో అయితే వివాహ ఆహ్వాన పత్రికలకు లక్షల మేర ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు. అంబానీ లాంటి వారు అయితే పెళ్లి పత్రికలకే కోట్లు వ్యయం చేస్తున్నారు. ఇక రాజకీయ నేపథ్యం ఉన్న వారైతే తమ అభిమాన నేతల ఫొటోలు వేసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ తరహా పెళ్లిళ్లకు ఆయా …
Read More »పెద్దిరెడ్డిది ఎంత పెద్ద మనసబ్బా..
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకరు. పైకి సౌమ్యుడిలా కనిపిస్తారు కానీ.. చిత్తూరు జిల్లాలో ఆయన అరాచకాల గురించి కథలు కథలుగా చెబుతుంటారు. అధికారంలో ఉండగా పెద్దిరెడ్డిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కానీ వాటినేమీ పట్టించుకోకుండా.. ఏం చేయాలనుకుంటే అది చేసుకుపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, మీడియా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే …
Read More »టీడీపీ, వైసీపీ కలిస్తే?… ఊహకే అందట్లేదా?
టీడీపీ ఏంటీ… వైసీపీతో కలిసి పోటీ చేయడమేమిటి? వైసీపీ ఏంటీ…పోయిపోయి టీడీపీతో జత కట్టడేమేమిటి?. నిజమేనండోయ్.. ఈ ఈక్వేషన్ ఊహకే అందట్లేదు. అయితే ఖమ్మం జిల్లా సారపాక వెళితే… అక్కడ ఈ రెండు పార్టీలకు చెందిన జెడాలు కలిసిమెలిసి సాగుతున్న అరుదైన దృశ్యాలను చూడవచ్చు. అక్కడి ఐటీసీ కంపెనీలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీడీపీ కార్మిక సంఘం …
Read More »వరద ఆగట్లేదు!… ఏపీకి మరో 15 ప్రాజెక్టులు!
నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. …
Read More »విశాఖ ఉక్కు కోసం చంద్రబాబు, లోకేష్ కృషి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో విశాక ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానివ్వబోమని ఏపీతో పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి కూడా ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం అది అసత్యమంటూ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే …
Read More »గురువు బాటలో రేవంత్ ‘ఏఐ’ అడుగులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates