Political News

లెక్కలతో జగన్ ను దొరకబట్టిన లోకేశ్

అదేంటో గానీ.. అధికారంలో ఉన్నంత కాలం దర్జాగా ఎంజాయి చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారం నుంచి దిగిపోయినంతనే ప్రతి చిన్న విషయంలోనూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ దొరకడం కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేతికే ఆయన చిక్కిపోతున్నారు. వెరసి ఇలా జగన్ బుక్కైన ప్రతి సారి లోకేశ్ తనదైన శైలిలో వైసీపీ అధినేతపై …

Read More »

7 నెలల కోసం… ఏపీ డీజీపీగా గుప్తా

ఏపీలో కూటమి సర్కారు బుధవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎల్లుండి (జనవరి 31)న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు డీజీపీగా గుప్తా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ …

Read More »

10-15-30.. కుంభ‌మేళా మృతులు.. తెలుగు వారు ఉన్నారా?

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న ప‌విత్ర మ‌హాకుంభ‌మేళాలో బుధ‌వారం తెల్ల‌వారు జామున చోటు చేసుకున్న తొక్కి సలాట‌లో మౌని అమావాస్య సంద‌ర్భంగా పుణ్య స్నానం ఆచ‌రించేందుకు వ‌చ్చిన భ‌క్తుల్లో కొంద‌రు మృత్యువాత ప‌డ్డారు.  అయితే.. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. సుమారు 5-6 గంట‌ల పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌కు కూడా.. మౌనం వ‌హించాయి. అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది.. బాహ్య ప్ర‌పంచానికి తెలిసినా.. యూపీ స‌ర్కారు మాత్రం …

Read More »

మోదీకి చంద్రబాబే ఆదర్శం.. ఇదిగో సాక్ష్యం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. 74  వయసులోనూ యమా యాక్టివ్ గా కదులుతున్న చంద్రబాబు… ఇటీవలే నాలుగో పర్యాయం సీఎం పదవిని చేపట్టారు. అటు రాజకీయాల్లో, ఇటు వ్యక్తిగతంగానూ క్రమశిక్షణతో మెలిగే చంద్రబాబు… యువ రాజకీయవేత్తలకు ఆదర్శమనే చెప్పాలి. యువ నేతలకే కాదు… ప్రధాన మంత్రి పదవిలో పదేళ్లకు పైగా నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు ఆదర్శంగా నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ …

Read More »

మహా కుంభమేళాలో రోజా… అదే టైంలో తొక్కిసలాట

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా మహా కుంభమేళా కోట్లాది మంది భక్తి శ్రద్ధలతో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకుని కుంభమేళాలో పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివచ్చారు. వీరిలో వీవీఐపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు. …

Read More »

దేశంలోనే ఏపీ ఫస్ట్!… రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారంటే… అన్ని కొత్త కొత్త అంశాలపైనే చర్చ సాగుతుంది. నిత్యం నూతన పాలనా విధానాలను ప్రజలకు అందిస్తూ సాగుతున్న చంద్రబాబు… తాజాగా ఏపీ ప్రజలకు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ పేరిట సరికొత్త తరహాలో సేవలు అందించనున్నారు. ఈ చర్యతో ఏపీని ఆయన దేశంలోనే తొలి స్థానంలో నిలపన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర పాలనలోఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పక తప్పదు. …

Read More »

బీఆర్ నాయుడు మార్క్!… సప్తగిరులు స్వర్ణ శోభితం!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో …

Read More »

పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విచారణకు పవన్ ఆదేశం

వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ అండ చూసుకొని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మొదలు మంత్రుల వరకు అందరూ భూ ఆక్రమణలు, కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆఖరికి అటవీ భూములను కూడా వదలని వైనం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి అక్రమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే …

Read More »

జీవీ రెడ్డి ఇరగదీస్తున్నారుగా!

ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పదవిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన నేరాల విషయంలో నిష్షాతుడిగా పేరు సంపాదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఈయన యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి… టీడీపీతో కలిసి సాగుతున్నారు. రెడ్డిగారి చురుకుదనం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా …

Read More »

మరోసారి ఆర్జీవీ కి నోటీసులు

రాంగోపాల్ వర్మ.. ఓ దర్శకుడిగా తెరకెక్కించేది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే అయినా.. సహజంగా ఆయన చాలా భయస్తుడు. పోలీసులు, కేసులు, విచారణలు అంటే వర్మ విపరీతంగా భయపడిపోతారు. ఇందుకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పలు పరిణామాలే నిదర్శనం. వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై పలు కేసులు నమోదు …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ‘మండలి’ పోరు!… షెడ్యూల్ ఇదిగో!

తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాకముందే… రెండు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు రాజకీయంగా రంజుగా సాగుతోంది. ఫలితంగా శాసన మండలి ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా మరింత వేడిని రాజేయనుంది. ఇక ఎన్నికలు జరగనున్న స్థానాల విషయానికి వస్తే…ఏపీలో రెండు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) స్థానాలతో పాటుగా …

Read More »

దావోస్ లో బాబుది రహస్య వ్యూహం!.. ఇదిగో డీటెయిల్స్!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులు నారా లోకేశ్, టీజీ భరత్ లతో కలిసి దావోస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అక్కడికి వెళతాయని, చంద్రబాబు బృందం కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడిపోయిందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలను చంద్రబాబు అండ్ కో అంతగా పట్టించుకోవడం లేదు …

Read More »