రాష్ట్రంలోని కూటమిసర్కారు మరింత దూకుడు పెంచనుంది. ఇప్పటి వరకు జరిగిన పాలన ఒక ఎత్తయితే.. ఇక నుంచి మరింత దూకుడు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఆరు మాసాలు అయిపోయింది. అయితే.. చంద్రబాబు అనుకున్న విధంగా అయితే.. ప్రజల్లో చర్చ రావడం లేదు. దీంతో ఆయన జనవరి నుంచి పాలన పరంగా దూకుడు పెంచాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులతో స్పష్టం చేశారు. …
Read More »కలెక్టర్లకు పవన్ క్లాస్
వైసీపీ పాలనలో ఐఏఎస్ అధికారులపై వైసీపీ నేతలు అధికారం చలాయించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మరికొందరు అధికారులేమో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో సినిమా టికెట్ల మొదలు ఇసుక దోపిడీ వరకు ఎన్నో అక్రమాలు జరిగాయని, ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు …
Read More »‘పరువు నష్టం’.. జగన్ సాధించేదేంటి ..!
తన పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ నుంచి జగన్ రూ.1750 కోట్ల మేరకు లంచాలు తీసుకున్నారంటూ.. రెండు ప్రధాన పత్రికలు రాసిన వార్తలను ఖండిస్తూ.. ఈ పిటిసన్ను ఆయన దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు ఆయా పత్రికలకు నోటీసులు జారీ చేసింది. ఇదేసమయంలో గూగుల్ …
Read More »కుక్కలు కూడా మీకు ఓటేయవు: అగ్గిరాజేసిన అరవింద్
బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఎంపీ ధర్మపురి అరవింద్ రాజకీయంగా అగ్గి రాజేశారు. ‘కుక్కులు కూడా మీకు ఓటేయవు’ అంటూ.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కీలక నాయకులపై ఆయన నోరు చేసుకున్నారు. తాజాగా ‘తెలంగాణ తల్లి’ విగ్రహం రేపిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కవితలు.. కాంగ్రెస్ సహా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని వారు దుయ్యబట్టారు. ఉద్యమం జరిగినప్పుడు ఏ …
Read More »ఏ ఎండకు ఆ గొడుగు.. కృష్ణ కృష్ణా.. కృష్ణయ్య!
‘ఒక ఉద్యమం కోసం పోరాడిన వాళ్లు ఆ ఉద్యమానికే కట్టుబడాలి. అప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుంది’- లోక్పాల్ కోసం.. ఉద్యమించిన సమయంలో ప్రముఖ సంఘ సంస్కర్త.. ఉద్యమ మేధావి అన్నా హజారే చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇవేవో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలు కావు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలే. కానీ, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. అలాంటి నాయకులు కనుమరుగు అవుతున్నారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన …
Read More »మాట విరుపు-లౌక్యం.. బాబు కేబినెట్లో నాగబాబు స్పెషల్
జనసేన నాయకుడు, నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబుకు ఊహించని గౌరవమే దక్కుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలోకి నాగబాబు ప్రవేశించడం ఖాయమైంది. అయితే.. ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు… కాబోయే మంత్రిగా నాగబాబుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మాట విరుపు-లౌక్యం.. నాగబాబు సొంతమేనని చెప్పాలి. విషయం ఏదైనా.. నాగబాబు చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. ఆయన చేసే కామెంట్లు కూడా ఆలోచింపజేస్తాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ ప్రముఖ ప్రవచన …
Read More »అప్రూవర్గా బోరుగడ్డ.. వైసీపీకి ఇబ్బందేనా ..!
బోరుగడ్డ అనిల్ కుమార్. వైసీపీ సానుభూతి పరుడుగా పేరు తెచ్చుకున్న ఆయన గతంలో టీడీపీ అధినే త చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేసమయంలో అప్పటి సీఎం జగన్ను ఎవరైనా విమర్శించినా.. ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదికగా.. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా నానా బూతులతో విమర్శలు గుప్పించారు. ఇక, ఈయనపై వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూకబ్జాలకు …
Read More »తాను మారాల్సింది పోయి.. ఇల్లు మారుస్తున్న జగన్!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లో మార్పు రావాలంటూ.. పెద్ద ఎత్తున సొంత పార్టీ నాయకులే కోరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక మంది నాయకులు బయటకు చెబుతున్న, అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్న విషయం కూడా.. ఇదే! జగన్ మారాలి.. మా పార్టీ మారాలి! అనే!! కానీ, జగన్ మాత్రం మారడం లేదు. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. తను నవరత్నాలు …
Read More »పది నెలల కాంగ్రెస్ బాధ్యతలు.. షర్మిల ప్లస్సా.. మైనస్సా.. !
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. ప్రజల సమస్యల కంటే.. తన అన్న సమస్యతో నే ఎక్కువగా ఆమె సతమతం అవుతున్నారు. ఎక్కడ ఏం జరిగినా.. దానిని జగన్ కు ముడి పెట్టి ముచ్చట తీర్చుకుంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టి.. నేటికి పది మాసాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఢిల్లీలో కాంగ్రెస్ నేతల సమావేశంలో షర్మిలను.. ఏపీ చీఫ్గా నియమిస్తూ.. కాంగ్రెస్ పెద్దలు …
Read More »రెండు జిల్లాల్లో ఆ ‘ఎంపీ ‘ మాటే రైట్ రైట్.. !
రెండు జిల్లాలను ఒకే ఎంపీ శాసిస్తున్నారా? తన ఆధిపత్య పోరులో రాజకీయాలను వేడెక్కిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కడప నుంచి ఉత్తరాంధ్రకు వచ్చి విజయం దక్కించుకున్న ఎంపీ సీఎం రమేష్. ఆయన సొంత జిల్లా కడప. కానీ, రాజకీయంగా వచ్చిన అవకాశంతో ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో ఇప్పుడు అటు కడపలోను, ఇటు అనకాపల్లిలోనూ.. తనదైన రాజకీయాలకు తెరదీశారు. అయితే.. ఈ రాజకీయాలు …
Read More »వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. ఈసారైనా ?
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై చాలా కాలంగా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయితే ప్రతీసారి ఏదో ఒక కారణంగా దీనిపై కేంద్రం రిస్క్ తీసుకోలేకపోతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) గురించి చర్చ నెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనతో బిల్లును ప్రవేశపెట్టే …
Read More »సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం
ఏపీలో మహిళలంతా ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు గురించి ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలని ఆయన ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ హామీ అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates